16/05/2024
*పత్రికా ప్రకటన*
*రైతులకు సబ్సిడీ వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు పంపిణీ*
*జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్*
*రాయచోటి, మే 16:-*
జిల్లాలోని రైతులకు సబ్సిడీపై వేరుశనగ మరియు పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య జిల్లాలోని రైతులందరికీ 40% సబ్సిడీపై వేరుశనగ, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని జనుము 2578 క్వింటాళ్లు, జీలుగ 2492 క్వింటాళ్లు, పిల్లిపెసర 76 క్వింటాళ్లు మంజూరయ్యాయన్నారు. వేరుశనగ కె-6 రకం 35323 క్వింటాళ్లు, నారాయణీ 18046 క్వింటాళ్లు, టిసిజిఎస్900 క్వింటాళ్లు, కదిరి లేపాక్షి 1114 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయన్నారు. రైతులందరూ తమ పరిధిలోని రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి కావాల్సిన విత్తనాలు ఎంపిక చేసుకొని తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని మండల వ్యవసాయాధికారులు మరియు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి రైతుల పేర్లు నమోదు చేయాలన్నారు.
-------------------////-----------------
*డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా*