అన్నమయ్య జిల్లా మీడియా

అన్నమయ్య జిల్లా మీడియా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from అన్నమయ్య జిల్లా మీడియా, Media, Rayachoti.

కడప జిల్లా..చక్రాయపేట..చక్రాయపేట మండలం కల్లూరుపల్లి గ్రామ సమీపంలో.. విద్యుత్ షాక్ కు గురై 15 గొర్రెలు మృతి..నరసింహనాయుడు...
06/11/2024

కడప జిల్లా..
చక్రాయపేట..

చక్రాయపేట మండలం కల్లూరుపల్లి గ్రామ సమీపంలో..

విద్యుత్ షాక్ కు గురై 15 గొర్రెలు మృతి..

నరసింహనాయుడు కు చెందిన గొర్రెలుగా గుర్తింపు..

గొర్ల యజమాని కి కూడా విద్యుత్ షాక్ తగలడంతో స్పృహ తప్పి పడిపోయిన గొర్ల యజమాని నరసింహనాయుడు..

విద్యుత్ వైరు తెగి కింద పడడంతో జరిగిన ప్రమాదం..

దాదాపు 2 లక్షల రూపాయలు పైన నష్టం వాటిల్లిందని వెల్లడించిన గొర్ల యజమాని బంధువులు.

*అన్నమయ్య జిల్లా*4️⃣/1️⃣1️⃣/2️⃣0️⃣2️⃣4️⃣*జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేధిక" కార్యక్రమం..**మీకోస...
04/11/2024

*అన్నమయ్య జిల్లా*
4️⃣/1️⃣1️⃣/2️⃣0️⃣2️⃣4️⃣

*జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేధిక" కార్యక్రమం..*

*మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత-జిల్లా ఎస్పీ.శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు..*

🪀రాయచోటి, నవంబర్ 4: ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు అన్నారు,ఈరోజు మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని, సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు,అంతేకాక సబ్ డివిజన్ పరిధిలో సర్కిల్ పరిధిలో మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించాలని, వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా విని చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని, సదరు ఫిర్యాదులను "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయాలని, జిల్లా ఎస్పీ శ్రీ.వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు, వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు,సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేసి ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. సమస్య తీవ్రత ఎలా ఉన్నా చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువు లోపల పరిష్కారం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని, సమస్యను గూర్చి చింతించకుండా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని ఎస్పీ గారు ఫిర్యాదుదారులకు భరోసా కల్పించారు..

*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*


🟣🟢🔵🔴

🌸 *రాజధాని నిర్మాణానికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ₹10 లక్షల రూపాయల విరాళం.*  *సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెక్ అందజేసిన...
04/11/2024

🌸 *రాజధాని నిర్మాణానికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ₹10 లక్షల రూపాయల విరాళం.*

*సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెక్ అందజేసిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.*

అమరావతి, నవంబర్ 04
రాజధాని నిర్మాణానికి,
అన్న క్యాంటీన్ నిర్వహణకు, రాయచోటి నియోజకవర్గ వ్యాపారస్తులు, వర్తకుల వారు *₹10 లక్షల రూపాయల* విరాళాన్ని అందజేశారు. సంబంధిత చెక్ లను అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అందజేశారు.

*IMPORTANT**స్క్రోలింగ్/ప్రెస్**3.11.2024 - రాయచోటి, అన్నమయ్య జిల్లా**జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ...
04/11/2024

*IMPORTANT*
*స్క్రోలింగ్/ప్రెస్*
*3.11.2024 - రాయచోటి, అన్నమయ్య జిల్లా*

*జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేయాలి: రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి*

*ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో... రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం*

*ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్ కుమార్ రెడ్డి, షాజహాన్ భాష, అరవ శ్రీధర్, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జేసి ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్వో మధుసూదన్ రావు, ఆర్డీఓలు శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.*

*ఈ సమీక్ష సమావేశంలో రెవిన్యూ, పిజిఆర్ఎస్, సామాజిక పింఛన్లు, పౌరసరఫరాలు-దీపం 2, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక విధానం అమలు, రోడ్లు భవనాలు, రవాణా, వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఐసిడిఎస్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయాలు, సంక్షేమం తదితర అంశాలపై చర్చించనున్నారు.*

*సమగ్ర అభివృద్ధి సాధనకు కృషి చేద్దాం*

*జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ప్రారంభంలో జిల్లా కలెక్టరు శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ... నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇంఛార్జి మంత్రి గారి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. జిల్లా మంత్రివర్యులు గారితోపాటు శాసనసభ్యులు, ఎంఎల్సీలు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకున్న చర్యల కార్యాచరణ నివేదికను సభ్యులకు అందజేశామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో అందరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

*జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి*

సమావేశం ప్రారంభంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు, అందరికీ నా నమస్కారాలు.

> గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాకు నన్ను ఇన్చార్జి మంత్రిగా నియమించడం జరిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పై 32 వేల కీర్తనలు రచించిన అన్నమాచార్యులు జన్మించిన ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నన్ను నియమించినందుకు చాలా ఆనంద పడుతున్నాను, అదే సమయంలో ముఖ్యమంత్రివర్యులు నా మీద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.

> అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో అన్నమయ్య జిల్లా కీలకపాత్ర పోషించింది.

> అందుకు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

> అన్నమయ్య జిల్లాకు నేను రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ నేను, నా మంత్రివర్గ కార్యాలయ సిబ్బంది సహాయంతో, అన్నమయ్య జిల్లాలోని ఎన్డీఏ కూటమి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తూనే ఉన్నాను.

>మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన భూ కుంభకోణం, ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ, జాతీయ రహదారుల పనులు, ఉచిత ఇసుక విధానం, ఇతర సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, కార్యకర్తల సమస్యలు.... వీటన్నిటిపై ఎప్పటికప్పుడు నేను సమీక్షిస్తూనే ఉన్నాను.

> ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా మొదటి మూడు స్థానాలలో నిలుస్తోంది. జిల్లాను ముందు వరసలో నిలబెట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా యంత్రంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

> అదేవిధంగా పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అవార్డులను పొందిన విషయం మనకు అందరికీ తెలిసిందే.

> అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ అభిప్రాయాల సేకరణ చేపట్టిన విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే.

> ఇన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా జిల్లాను ముందుకు నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు.

> ఉచిత ఇసుక పాలసీ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని తెలుస్తోంది.

> అలాగే జిల్లాలో పలుచోట్ల అన్నా క్యాంటీన్లను జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

> రెండు రోజుల క్రితమే జిల్లాలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలైన దీపం 2.0, మిషన్ పాట్ హెూల్ ఫ్రీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

> దీపం 2 పథకం ద్వారా జిల్లాలోని ఎంతోమంది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను.

> అలాగే గత ప్రభుత్వంలో పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేసి గుంతలు లేని రోడ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.

> అన్నమయ్య జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి.

> అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులను చేపట్టడం జరిగింది.

> ఈ పనులపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను.

> "సంపద సృష్టి" ఈ ప్రభుత్వ లక్ష్యం. సంపద సృష్టి కోసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో అవసరం. అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారు పలు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనితోపాటు యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఇప్పటికే చాలాసార్లు జాబ్ మేళాలు విజయవంతంగా నిర్వహించారు.

> త్వరలో జిల్లాలో స్కిల్ సెన్సెస్ జరగబోతోంది. స్కిల్ సెన్సెస్ కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలోని యువతకు నైపుణ్యాన్ని పెంచి, వారికి ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తామని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

> ఇక జిల్లాలోని ముఖ్యమైన సమస్యల విషయానికొస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ భూకుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గారితో నేను చర్చించడం జరిగింది. దీనిపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.

> ఇతర భూ సమస్యలపై జిల్లాలో పలు రెవెన్యూ సదస్సులను, ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్ కార్యక్రమాలను, విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

> అలాగే జిల్లాలో చేపట్టిన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యము, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి అన్నమయ్య జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను.

> అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాలను ఎన్డీఏ కూటమికి అందించిన కార్యకర్తల సంక్షేమము ఈ ప్రభుత్వ ప్రాధాన్యత లలో ముందు వరుసలో ఉంటుంది.

> కార్యకర్తలను కలవడానికి నేనెప్పుడూ ముందుంటాననే విషయం అందరికీ తెలుసు. ఏ విషయంపైనైనా కార్యకర్తలను నా వద్దకు వచ్చి చర్చించవచ్చు.

అందరూ కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు.

*సమావేశంలో మంత్ర మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ*...... ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు నెలల కొద్దికాలంలోనే ఏవైతే ప్రజలకు అందాలో మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో వాడవాడలో ప్రజల వద్దకు వెళ్ళాం. వారందరూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని నిరాజనాలు పలికారు. గ్రామసీమల్లో వెలుగులు నింపడానికి పల్లె పండుగ కార్యక్రమంలో రోడ్లు డ్రైనేజీలు త్రాగునీటి సౌకర్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వంద రోజుల్లో చెప్పిన ప్రతి పని చేయడమైంది. జిల్లాలో సుమారు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తున్నాం. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే నిరుద్యోగుల కోసం డీఎస్సీ ని ప్రకటించి ప్రజల ప్రభుత్వంగా నిరూపించుకున్నాం. మనకు కరువుతో ఉన్న మండలాల్లో రైతులకు కర్షకులకు ప్రజలకు ఇన్చార్జి మంత్రివర్యులు ఆధ్వర్యంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడానికి కృషి చేస్తాం. రాయచోటి నియోజకవర్గం లో వర్షాభావంతో నీటి సమస్యలు ఉన్నాయి. ఆరు మండలాల్లో నీటి సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో టమోటా మామిడి ఎక్కువ. ప్రాసెసింగ్ కౌల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ అబ్బుగా చేయడానికి మీ సూచనలు సలహాలు సహకారం కోరుతున్నాను. లోకేష్ బాబు నేతృత్వంలో విద్య ఐటీ రంగాల అభివృద్ధి చెందడంతో పాటు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

*అనంతరం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని ఇన్చార్జి మంత్రి ప్రారంభించారు.*
-----------------///----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా*

ప్రకటన...SB కోచింగ్ సెంటర్...TET & DSC..ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, YSR IT కంప్యూటర్స్ ప్రక్కన..కొత్తపేట..రాయచోటి..అన్న...
04/11/2024

ప్రకటన...

SB కోచింగ్ సెంటర్...

TET & DSC..

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, YSR IT కంప్యూటర్స్ ప్రక్కన..

కొత్తపేట..

రాయచోటి..

అన్నమయ్య జిల్లా...

కారు ఢీ కొని ఒకరు మృతి _----------------------------------అన్నమయ్య జిల్లా...సిబ్యాల గ్రామం మోడల్ స్కూల్ వద్ద రాత్రి జరిగ...
04/11/2024

కారు ఢీ కొని ఒకరు మృతి
_----------------------------------
అన్నమయ్య జిల్లా...

సిబ్యాల గ్రామం మోడల్ స్కూల్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు.సిబ్యాల గ్రామం గోళ్ళావాండ్ల పల్లెకు చెందిన జబ్బు రామాంజులు రాత్రి 7 గంటల సమయం లో మోడల్ స్కూల్ వద్దవున్న జగనన్న కాలనీలో తన పనిముగించుకుని రోడ్డు మీదకొచ్చి బస్సుకోసం మోడల్ స్కూల్ వద్దనున్న కు నడుచుకుంటూ వెళుతుండగా సుండుపల్లి నుండి రాయచోటి వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో రామాంజులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ రామాంజులు ను తన బంధువులు అంబులెన్సు ద్వారా కడప రూయాకు తరలించారు.చికిత్స పొందుతూ రామాంజులు మృతి చెందినట్లు రామాంజులు బంధువులు తెలిపారు.మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. సంఘటన పట్ల పోలీస్ లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

అన్నమయ్య జిల్లా....సంబేపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే చెన్నకేశవ అనే వ్యక్తి మృతి..మృతుడు బద్వేల్  పెద్ద గోప...
03/11/2024

అన్నమయ్య జిల్లా....

సంబేపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే చెన్నకేశవ అనే వ్యక్తి మృతి..

మృతుడు బద్వేల్ పెద్ద గోపవరం గ్రామానికి చెందిన కోడూరు చెన్నకేశవగా గుర్తింపు...

తన సొంత పనుల మీద అన్నమయ్య జిల్లా పీలేరుకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం...

సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .....

*పత్రికా ప్రకటన:తేదీ 2/11/2024**అన్నమయ్య జిల్లా*👉గంజాయి కేసులో నలుగురు అంతరాష్ట్ర ముద్దాయిలు అరెస్ట్..👉ఒక సుమో, ఒక కారు,...
02/11/2024

*పత్రికా ప్రకటన:తేదీ 2/11/2024*

*అన్నమయ్య జిల్లా*

👉గంజాయి కేసులో నలుగురు అంతరాష్ట్ర ముద్దాయిలు అరెస్ట్..

👉ఒక సుమో, ఒక కారు,దాదాపు 50 కేజీల గంజాయి స్వాధీనం..

*💠మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు..*

❇️రాయచోటి, నవంబర్ 2 : అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్వాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాజంపేట డిఎస్పీ శీ.ఎన్. సుధాకర్ గారి అద్యర్యంలో, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. పి.వెంకటశ్యర్లు, కోడూరు అర్చన్ ఇన్స్పెక్టర్ శ్రీ .హేమసుందర్ రావు మరియు రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ.బి.వి రమణ గారు, ఓబులవారిపల్లి తహసీల్దార్ శ్రీ.బి.శ్రీధర్ రావు మరియు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బిందితో కలిసి, కోడూరు రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారికి గంజాయి రవాణా గురించి రాబడిన సమాచారము పై, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట, చెన్నకేశవగుడి సమీపంలో NH-716 రేడ్ లో వాహనాలు తనిఖీ" చేస్తూ ఉండగా, మంగళంపల్లి దారిగుండా నలుగురు వ్యక్తులు ఒక సుమో మరియు ఒక కారు లో ముగ్గురు మగవారు, ఒక ఆడ వ్యక్తి, తిరుపతికి తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేనుకోవడమైనది. నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేయడమైనది.

*👉అరెస్ట్ కాబడిన, మరియు స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు..*

1. కల్లపల్లి నాగేంద్ర @ కీల, వయస్సు:40 సంవత్సరాలు, తండ్రి. కృష్ణమూర్తి, రంగంపల్లి, పుల్లంపేట మండలం.
(4 ఎర్రచందనం కేసులు, 4 గంజాయి కేసులు, APO4 AW 9662 సుమో,APO4 DL 5992 కారు, 30 కేజీల గంజాయి స్వాధీనం)

2. కె. కుమారి, 38 సంలు. భర్త: అన్నామలై ఆచారి, గాంధీ నగర్, తిరుపతి.

3. బాపురాజన్ శ్రీని, 43 సం.లు, తండ్రి: బాపురాజన్, కేరళ రాష్ట్రం.
(2 గంజాయి కేసులు, 10 కేజీల గంజాయి స్వాధీనం)

4. షేక్ సలీం బాషా, 47 సం.లు, తండ్రి, షఫీ ఉల్ల కాకతోపు వీధి, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా.
(6 గంజాయి కేసులు, 10 కేజీల గంజాయి స్వాధీనం)

🌈మొత్తం సుమారు 10 లక్షల విలువ చేసి సుమారు 50 కేజీల గంజాయి మరియు ఒక సుమో, ఒక కారు, స్వాధీనం చేసుకోవడమైనదని, వీరితో పాటు ఇంకొంతమంది ప్రమేయం ఉందని తెలిపారు. పై వారి మీద ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు. వీరిని కోర్ట్ లో హాజరు పరుస్తామని ఎస్పీ గారు తెలిపారు.

🎯ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. గంజాయి అమ్మినా, కొన్నా, దాచి ఉంచినా, అక్రమ రవాణా చేసినా, అందుకు ఏవిధంగా సహకరించినా అట్టివారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, వారిపై హిస్టరీ షీట్లు తెరుస్తామని, పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై "పీడీ"యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలెవరైనా, మీ దృష్టికి ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం వస్తే మాకు తెలియపరచండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. పై వ్యక్తులను పట్టుకోవడంలో ఓబులవారిపల్లి ఎస్ఐ శ్రీ. మహేష్ నాయుడు క్రింద పడి చేతికి గాయాలు అయినట్లు, అయినా వెరవకుండా ముద్దాయిలను అరెస్ట్ చేసిన ఎస్ఐ ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ..

*పోలీసు ప్రధాన కార్యాలయం,*
*అన్నమయ్య జిల్లా-రాయచోటి*

*పత్రికా ప్రకటన**ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం**నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్...
30/10/2024

*పత్రికా ప్రకటన*

*ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం*

*నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు*

*రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

*రాయచోటి, అక్టోబర్ 30:-*

ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ.... గత ఎన్నో ఏళ్లుగా రాయచోటి ప్రాంతంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారని నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్య అధికంగా ఉందని నీటి సమస్య పరిష్కారానికి గ్రామాలలో బోర్లు వేసి మోటార్ల గురించి ప్రజలకు నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీరు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ మంత్రి ఆదేశాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————////—————

పత్రికా ప్రకటన*ప్రతి అంగన్వాడీ కేంద్రంలో హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించిన పోస్టర్ ఏర్పాటు....**......జిల్లా కలెక్టర్ శ్ర...
29/10/2024

పత్రికా ప్రకటన

*ప్రతి అంగన్వాడీ కేంద్రంలో హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించిన పోస్టర్ ఏర్పాటు....*

*......జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*

రాయచోటి, అక్టోబర్ 29:

ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్ నందు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్లు అన్ని ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ప్రతి ఒక అంగన్వాడీ కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్లకు సంబంధించిన పోస్టర్ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, జిల్లా అటవీశాఖ అధికారి, పిడిఐసిడిఎస్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు

---- Issued by DIPRO, Annamayya District ----

పత్రికా ప్రకటన*అన్నమయ్య జిల్లాను అడ్వెంచర్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి....**......జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*రాయ...
29/10/2024

పత్రికా ప్రకటన

*అన్నమయ్య జిల్లాను అడ్వెంచర్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి....*

*......జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*

రాయచోటి, అక్టోబర్ 29:

అన్నమయ్య జిల్లాలో హార్సిలీ హిల్స్, గుర్రంకొండ వంటి ప్రాంతాలలో అడ్వెంచర్ పర్యాటకానికి మంచి అవకాశాలు ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లాను అడ్వెంచర్ టూరిజం హాబుగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధ్యక్షతన జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం.... జిల్లాలో పర్యాటక రంగానికి ఉన్న మంచి అవకాశాలు మరియు సవాళ్ల గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. అన్నమయ్య జిల్లాలో హార్సిలీ హిల్స్ లో అడ్వెంచర్ టూరిజం కు మంచి అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం, రెడ్డమ్మ తల్లి దేవాలయం, వంటి ఎన్నో దేవాలయాలు ఉండడం వల్ల టెంపుల్ టూరిజంకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గుర్రంకొండ ఫోర్ట్ వంటి చారిత్రక కట్టడాలు మన జిల్లాలో ఉండడం వల్ల హెరిటేజ్ టూరిజంకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం అన్నమయ్య జిల్లాలో వివిధ పర్యాటక కేంద్రాలలో చేపడుతున్న వివిధ రకాల పనుల గురించి జిల్లా కలెక్టర్కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ.... అన్నమయ్య జిల్లాను అడ్వెంచర్ టూరిజం హబ్ గా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా పర్యాటకశాఖాధికారిని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మంది పర్యాటకులు జిల్లాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక కౌన్సిల్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

---- Issued by DIPRO, Annamayya District ----

పత్రికా ప్రకటన  తేదీ: 29-10-2024                            ఇటివల అన్నమయ్య జిల్లా, పీలేరులో 5 రోజుల క్రితం ఇంటర్ చదువుకొ...
29/10/2024

పత్రికా ప్రకటన
తేదీ: 29-10-2024

ఇటివల అన్నమయ్య జిల్లా, పీలేరులో 5 రోజుల క్రితం ఇంటర్ చదువుకొనే ఇద్దరు యువకులు గంజాయి మత్తులో వుండగా రైలు క్రిందపడి అనుకోని విధముగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. భాధిత కుటుంబ సభ్యులను అన్నమయ్య జిల్లా SP శ్రీ విద్యా సాగర్ నాయుడు స్వయంగా పరామర్సించగా, వారు తెలిపిన విషయము బట్టి ఎక్కడెక్కడ గంజాయి తాగుతున్నారు, కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడి స్థానికంగా గంజాయి అమ్ముతున్నవారి వివరాలు తెలపగా సదరు వారిని తీసుకు వచ్చి విచారించగా షేక్ మహబూబ్ బాష, పీలేరు అనునతను సుమారు 20 మందికి పైగా పీలేరు టౌనులో ఉన్న యువతకు గంజాయి అమ్ముచున్నట్లు తెలిసి, వారిని పిలిచి విచారించి, షేక్ మహబూబ్ బాష, వయస్సు 45 సం.లు తండ్రి లేట్ ఖాదర్ బాష, రాజీవ్ నగర్ కాలని, పీలేరు అనునతనిని అదుపులో తీసుకోవడం జరిగింది , ఇతను ప్రధానంగా పీలేరు లో గంజాయి అమ్ముతున్నాడు, సదరు గంజాయి తాగితే, ప్రజల ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసి అమ్ముతున్నందున, పై చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఇతను అమ్మిన గంజాయి కొనినట్లు, పైవారి చావుకు ఇతనే భాధ్యుడు అయినందున ఇతనిని కఠినంగా శిక్షించాలని వచ్చిన కంప్లైంట్ ఆదారంగా ఈదినం అనగా 29.10.2024 వతేది ఉదయం 11.30 గంటకు, పీలేరు టౌన్, గోరీలతోపు వెనక వైపు, రాజీవ్ నగర్ వద్ద పీలేరు C.I గారు అరెస్టు చేసి, ఇతని వద్దనుండి సుమారు 20 కేజీల గంజాయిని స్వాధీనము చేసుకోని పీలేరు పి.యస్. క్రైం.నెం.391/2024 లో భాగంగా 105 BNS act 2023 (Culpable Homicide not amounting to Murder), మరియు సెక్షన్ 20(b)(ii)(C) r/w Sec.8(c) of NDPS Act 1985 వర్తింపు చేయడమైనది. ఇతనిని ఈదినము కోర్టులో హాజరు పరుస్తాము. ఇతను విచారణలో ఇతను ఎవరెవరి దగ్గర గంజాయి కొన్నాడు, ఎవరికీ అమ్ముచున్నాడు అన్న విషయము మీదా ఆరాతీయడం జరిగింది, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తాం అని జిల్లా యస్.పి గారు తెలిపినారు. గత 5 సం.ల కాలములో 2019 సం,. నుండి ఇప్పటివరకు అన్నమయ్య జిల్లాల్లో 44 గంజాయి కేసులు నమోదు అయివున్నవి. సుమారు 810 కిలోలు స్వాధీనము చేసుకోని 172 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ సం. 2024 జూన్ నుండి అక్టోబర్ వరకు 9 కేసులు నమోదు కాగా, అందులో 51 మంది ముద్దాయిలు గుర్తించడం జరిగింది, వారిలో 43 మందిని అరెస్టు చేయడం జరిగింది.

ఇక ముందు ఎవరైనా జిల్లాలో గంజాయి తాగి చనిపోతే, అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, వారిని బాధ్యులను చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ, వి. విద్యసాగర్ నాయుడు ఐపీఎస్ గారు తెలిపారు .గంజాయి వ్యసనం హానికరం, మత్తుకు బానిసలు కావద్దు...జీవితాన్నీ నాశనం చేసుకోవద్దు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి, మాదక ద్రవ్యాలు అరికట్టుట లో యువత భాగ్వామ్యం కావాలి, గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా ఎస్పీ శ్రీ.వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పత్రిక ముఖముగా తెలిపినారు.

పోలీసు ప్రధాన కార్యాలయం,
అన్నమయ్య జిల్లా-రాయచోటి.

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం**29-అక్టోబర్-2024* *మంగళవారం* 🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*🕉️ నిన్న  *28...
29/10/2024

🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*29-అక్టోబర్-2024*
*మంగళవారం*

🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*

🕉️ నిన్న *28-10-2024* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *63,729* మంది...

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *20,957* మంది...

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం *3.85* కోట్లు ...


🕉️ ఉచిత సర్వ దర్శనానికి *4* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు...

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *6* గంటల సమయం...

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *2* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు....

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి *4* గంటల సమయం...

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం...

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

*పత్రికా ప్రకటన* *ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ**మంత్రి నివాసానికి భారీగా తరలి వచ్చిన బాధితులు* *సమస్యల పరిష్కారమే ధ్య...
28/10/2024

*పత్రికా ప్రకటన*

*ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ*

*మంత్రి నివాసానికి భారీగా తరలి వచ్చిన బాధితులు*

*సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న మంత్రి*

*చిన్నమండెం, అక్టోబర్ 28:-*

రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం
బోరెడ్డిగారిపల్లె లోని తమ నివాసం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వినతిపత్రా లు సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దీంతో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరు కూడా సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాయచోటి నియోజకవర్గం లో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు పకడ్బందీగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గతంలో భూ దోపిడీకి పాల్పడిన వారందరి నుంచి తిరిగి భూములు స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లాలోని అధికారులందరూ బాధితుల సమస్యలను సీరియస్ గా తీసుకుని వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి ఆప్యాయంగా పలుకరిస్తూ వారి నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి సమస్య పరిష్కరిస్తామని వారికి భరోసానిచ్చారు.
-------------------////---------------
*డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా*

*పత్రికా ప్రకటన**తేదీ:27-10-2024**అన్నమయ్య జిల్లా* *➡️దీపావళి బాణాసంచా విక్రయించే దుకాణాలు, తయారీ కేంద్రాలు, నిల్వ చేసే ...
27/10/2024

*పత్రికా ప్రకటన*
*తేదీ:27-10-2024*

*అన్నమయ్య జిల్లా*

*➡️దీపావళి బాణాసంచా విక్రయించే దుకాణాలు, తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలి*

*➡️నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటించాలి*

*➡️నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం*

*💠జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు*

🪀రాయచోటి, అక్టోబర్ 27: దీపావళి బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్స్, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలని, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ .వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు హెచ్చరించారు. రాబోయే దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విక్రయదారులు, గోడౌన్స్, తయారీ కేంద్రాల యజమానులు పాటించవలసిన నిబంధనల గురించి వివరించారు.

🪀గతంలో వివిధ ప్రదేశాలలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సును ఉద్దేశించి బాణాసంచా తయారీ కేంద్రాలకు, నిల్వ చేసే గోడౌన్లకు, విక్రయించే దుకాణాలకు పలు నియమ నిబంధనలు సూచించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

🎯టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

👉బాణాసంచా నిల్వచేసే నిర్వాహకులు, తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందాలి.

👉నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలి.

👉అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి.

👉ఆ ప్రదేశాలలో ప్రమాదం జరగడానికి అవకాశం వుండే చోట, సిగరెట్లు తాగడం వంటి చర్యలు చెయ్యరాదు.

👉మండే స్వభావం వున్న పెట్రోల్, అగ్గి పెట్టెలు ఇతర వస్తువులు అనుమతించరాదన్నారు.

👉విధులు నిర్వహించే సిబ్బందికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన ఉండాలి.

👉బాణాసంచా విక్రయ దుకాణాలు అధికారులు సూచించిన ప్రదేశాలలోనే ఏర్పాటు చేసుకోవాలి.

👉జనవాసాలకు, విద్యాసంస్థలకు, వైద్యశాలలకు దూరంగా బాణాసంచా విక్రయాలు జరగాలి.

👉బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

👉ప్రతీ దుకాణం వద్ద రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలి.

👉పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన నిలబడి జాగ్రత్తలు తీసుకోవాలి.

👉గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్ బంక్‌ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పటాకులు కాల్చొద్దు.

👉టపాసులను కాల్చిన తర్వాత చేతులను ముక్కులో, నోట్లో పెట్టుకోవద్దు.

👉పటాకులు కాల్చేటప్పుడు కాటన్ డ్రెస్‌లను మాత్రమే వేసుకోవాలి.

🪀జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా విక్రయించాలన్నారు. లైసెన్సులు లేకుండా ఎవరైనా మందుగుండు సామగ్రి తయారుచేసిన, నిల్వ చేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్ అధికారులు వారి పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలను, విక్రయ దుకాణాలను, నిల్వ ఉంచిన గోడౌన్ లను సందర్శించి లైసెన్స్ లు తనిఖీ చేయాలన్నారు. భద్రత ప్రమాణాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను పాటించని ఎడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బాణాసంచా సామగ్రి అక్రమ విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 100, 112 నెంబర్ లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు పేర్కొన్నారు.
👇
పోలీసు ప్రధాన కార్యాలయం,
అన్నమయ్య జిల్లా-రాయచోటి

*పత్రికా ప్రకటన**ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం**త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం**నూతన ...
27/10/2024

*పత్రికా ప్రకటన*

*ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం*

*త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం*

*నూతన బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

*రాయచోటి, అక్టోబర్ 27:-*

ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశమని
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు 10 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశమని రాబోయే రోజులలో మరిన్ని నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు సులభతరమైన రవాణా సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రయాణికుల సంక్షేమమే ముఖ్యంగా భావిస్తోందని ఇకనుంచి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం జరుగుతుందన్నారు.
గత ఐదేళ్లలో ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమయిందని రాబోయే రోజులలో ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

గతంలో గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సు సేవలు కల్పించడం జరిగిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ నూతన బస్సులు రాయచోటి ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ కు 2 ఇంద్ర బస్సులు,
మదనపల్లె ఒకటవ డిపో నుంచి ఒక సూపర్ లగ్జరీ, ఒక ఎక్స్ప్రెస్,
మదనపల్లె రెండవ డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీలు, ఒక ఎక్స్ప్రెస్,
పీలేరు డిపో నుంచి ఒక ఎక్స్ప్రెస్,
పుంగనూరు డిపో నుంచి రెండు పల్లెవెలుగు బస్సులను నడపడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు బెలూన్లతో అలంకరించిన 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
-------------////--------------
*డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా*

అన్నమయ్య జిల్లా...గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో నాయనవారిపల్లి సంబంధించిన రైతు గొర్రెలు రామప్ప నాయుడు పిడుగుపాటుకు 18 ...
20/10/2024

అన్నమయ్య జిల్లా...

గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో నాయనవారిపల్లి సంబంధించిన రైతు గొర్రెలు రామప్ప నాయుడు పిడుగుపాటుకు 18 గొర్రెలు మరణించడం జరిగింది మరణించడం జరిగింది...

పత్రికా ప్రకటన *అక్టోబర్ 16వ తేది బుధవారం జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వా...
15/10/2024

పత్రికా ప్రకటన

*అక్టోబర్ 16వ తేది బుధవారం జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు*

*......జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*

రాయచోటి, అక్టోబర్ 15:

అక్టోబర్ 16వ తేది బుధవారం అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ 16 న ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.

Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when అన్నమయ్య జిల్లా మీడియా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category