ప్రలోభాలకు లొంగి పోయారు.. వైసీపీకి తీరని ద్రోహం చేశారు..!
ప్రలోభాలకు లొంగి పోయారు..
వైసీపీకి తీరని ద్రోహం చేశారు..!
==================
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరిగిన వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక.. ఎక్కడా జరగని విధంగా విచిత్రంగా జరిగిందన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లను పక్కన పెట్టి, వైయస్సార్ బీఫామ్ మీద గెలిచిన కౌన్సిలర్లను వైస్ చైర్ పర్సన్ లుగా నియమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సముచిత గౌరవం కల్పించినా.. కొంతమంది కౌన్సిలర్లు కూడా ప్రలోభాలకు లొంగి పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ పక్కన నిలబడ్డ ఆరు మంది కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక.. నైతికతకు, అనైతికతకు మధ్య జరిగిన పోరాటమే..!
నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక..
నైతికతకు, అనైతికతకు మధ్య జరిగిన పోరాటమే..!
===========================
నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక నైతికతకు, వెన్నుపోటుకు మధ్య జరిగిన పోరాటమేనని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నైతికంగా వైసీపీదే విజయమని తెలిపారు. వైసీపీ తరపున గెలిచి.. తమకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై అనర్హత వేటు వేస్తామని అన్నారు.
500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యక్షం..!
500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం.
జీర్ణోదారణ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యక్షం..!
==============================
నెల్లూరు జిల్లా, నర్రవాడ శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో జీర్ణోదారణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రెండవ రోజు పూర్ణ కుంభాభిషేకం, స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అధ్యక్షత వహించారు. వేదమంత్ర ఘోషల నడుమ పూర్ణాహుతి, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు ఆలయ జీర్ణోదారణలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్
లేఔట్ వేయడం.. పబ్లిక్ స్థలం చూపించడం.. అమ్మేయడం.. అధికారులు ఏం చేస్తున్నారు..?
లేఔట్ వేయడం.. పబ్లిక్ స్థలం చూపించడం..
ఆ తర్వాత అమ్మేయడం.. అధికారులు ఏం చేస్తున్నారు..?
==============================
పొదలకూరులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాస నగర్లో 20లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, గేట్ సెంటర్లోని బాలికల బీసీ హాస్టల్లో శ్రీ యస్ ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ డిజిటల్ క్లాస్ రూమ్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. ప్రైవేట్ లేఔట్లలో పార్కుల కోసం ఉంచిన స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏయ్.. కూర్చో.. కూర్చో.. కార్పొరేషన్ లో చిన్న రచ్చ..!
ఏయ్.. కూర్చో.. కూర్చో..
కార్పొరేషన్ లో చిన్న రచ్చ..!
================
నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలకు వివాదం నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కి, రూప్ కుమార్ యాదవ్ కి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే అధికారులు, ఇతర కార్పొరేటర్లు సర్దిచెప్పడంతో వివాదం అక్కడితో ఆగిపోయింది.
డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్.. అభినందనలు తెలిపిన కోటంరెడ్డి..!
డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్..
అభినందనలు తెలిపిన కోటంరెడ్డి..!
=====================
నెల్లూరు డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్ కు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు. మంత్రి నారాయణ సూచనలతో.. 41 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారని.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. డిప్యూటీ మేయర్ ఎంపిక అనంతరం ఆయన మేడీఐతో మాట్లాడారు. నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా డిప్యూటీ మేయర్ కు అభినందనలు తెలిపారు.
గెలిచిన వారికి అభినందనలు.. మిగిలిన వారికి న్యాయం చేస్తాం..
గెలిచిన వారికి అభినందనలు..
మిగిలిన వారికి న్యాయం చేస్తాం..
===================
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించిన రెండు వైస్ చైర్పర్సన్ పదవుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 9వ వార్డు కౌన్సిలర్ శివయ్య, 8వ వార్డు కౌన్సిలర్ నస్రిన్ లను టీడీపీ తరఫున 15 ఓట్లతో మెజారిటీతో వైస్ చైర్పర్సన్ లుగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. గెలుపొందిన వారికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా.. ఎన్నికైన సయ్యద్ తహసీన్..
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా..
ఎన్నికైన సయ్యద్ తహసీన్..
====================
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్ ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. స్వతంత్ర అభ్యర్థి తహసిన్ కి 41 ఓట్లు, వైసీపీ కి 12 ఓట్లు వచ్చాయి. దీంతో సయ్యద్ తహసీన్ ని నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తహసీన్ కు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు.. కార్పోరేటర్లకు కూటమినేతల దిశానిర్దేశం..!
డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు..
కార్పోరేటర్లకు కూటమినేతల దిశానిర్దేశం..!
=========================
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియపై, వ్యవహరించాల్సిన వ్యూహంపై కూటమి నేతలు కార్పోరేటర్లకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడు క్యాపిటల్స్ పేరుతో.. రాష్ట్రాన్ని నాశనం చేసేశారు..!
మూడు క్యాపిటల్స్ పేరుతో..
రాష్ట్రాన్ని నాశనం చేసేశారు..!
===============
బుచ్చి మున్సిపాలిటీ నుండి 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వర్క్ఫ్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో వీరంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. కోవూరు మండల పరిధిలో లేగుంటపాడు వీపీఆర్ అతిథి గృహంలో వీరంతా టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు కౌన్సిలర్లు ముందుకు వస్తున్నారని అజీజ్ తెలిపారు. గత వైసీపీ పాలనలో మూడు క్యాపిటల్స్ పేరుతో.. మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు ఇళ్ళు కట్టిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పేదలకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత క
కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.
కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో
జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.
======================
జగన్నాథ రధ చక్రాలు కదిలాయి..భక్తుల భజన కనువిందు చేసింది.. ఇలా ఊరువాడా కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.
జగన్నాథ రధ చక్రాలు కదిలాయి.. భక్తుల భజన కనువిందు చేసింది..
జగన్నాథ రధ చక్రాలు కదిలాయి..
భక్తుల భజన కనువిందు చేసింది..
=======================
జగన్నాథ రధ చక్రాలు కదిలాయి..భక్తుల భజన కనువిందు చేసింది.. ఇలా ఊరువాడా కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.