Ravuri ramesh babu

Ravuri ramesh babu Right to information act

21/04/2024

ప్రయోక్త : నెల్లూరు పట్టణం లోని శ్రీ వివేకానంద కళాశాల లో ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ యూనియన్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి వివిధ ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న టీచర్స్ మరియు లెక్చరర్స్ హాజరు అయ్యారు.ఈ సందర్భంగా ఆ సంస్థ సిటీ ప్రసిడెంట్ కాటు బోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ
ఐకమత్యంగా అందరూ సమస్యల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆ సంస్థ నెల్లూరు రూరల్ అధ్యక్షులు
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆలస్యంగా జీతాలు ఇచ్చే సంస్థ ల ను గుర్తించి అధికారుల ద్వారా న్యాయం
పొందాలని కోరారు.కమిటీ సభ్యులు
మెంబర్లు మాట్లాడుతూ ఒరిజినల్
సర్టిఫికేట్ లు తీసుకునే విద్యాసంస్థ ల
పై ఫిర్యాదు లు చేయాలని ,ఎనిమిది
గంటలు నిలబడి బోధన చేయాలని
విద్యా సంస్థలు చెబుతున్నాయని
అలా చెప్పడం సరికాదని అవకాశం
వచ్చినప్పుడు కూర్చోవడానికి కుర్చీలు
ఇవ్వాలని తెలిపారు. చాలీ చాలని జీతాలు,పని గంటలు ఎక్కువ,నిలబడి
టీచింగ్ చెప్పడం,సకాలం లో జీతాలు
ఇవ్వక పోవడం,వేసవి సెలవులలో
జీతాలు ఇవ్వక పోవడం,అడ్మిషన్లకు
తిప్పడం,సొసైటీ యాక్ట్ ను అమలు
చేయక పోవడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయని వాటి అమలు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.కాలానికి
అనుగుణంగా అనేక మార్గాలలో ఉపాధి మార్గాలను అన్వేషించాలని
అప్పుడే నూతన శక్తిని పొందుతారని,మార్పు అవసరమని అభిప్రాయం ను వ్యక్త పరిచారు. ఈ సమావేశం లో నెల్లూరు జిల్లా అధ్యక్షులు రావూరి.రమేష్ బాబు,సిటీ అద్యక్షులు కాటుబొయిన శ్రీనివాసులు,రూరల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు ,సభ్యులు
పాల్గొని సభను విజయవంతం చేసారు.

20/04/2024

ఈ విషయం చాలా ముఖ్యమైనది
పని చేసే వారికే ఓటు వేయాలి,కులం,మతం చూడకూడదు.
ఆ పని చేసే వ్యక్తి అన్నీ పనులు చేయలేడు
వారి నియోజక వర్గానికి
వంద మంది టీచర్లు ను నియమించుకోవాలి
వారితో పని చేపించుకోవాలి.....ఒక గ్రామం లో
పని చేస్తున్న ఉపాధ్యాయునికి 20 మార్కులు వచ్చినా
రిజర్వేషన్ వలన ఉద్యోగం వచ్చింది.ఆ గ్రామం లో
ఆ ఉద్యోగి వలన విద్యార్థులకు చదువు ఆశించిన
స్థాయి లో అందలేదు.ఇలా ఆ నియోజక వర్గం లో
పది శాతం ఉంటే ......ఆ ఏం.ఎల్. ఏ ఆ గ్రామానికి
పని చేసినట్లా,మంచి చెసినట్లా.....ఆ ఏం.ఎల్. ఏ
మంచి వాడు అయినా ఆ పది గ్రామాల 500 మంది
విద్యార్దులు ఆ సబ్జెక్ట్ లో వెనుక పడుతారు కదా??
అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు కులం చూడాలి
మతం చూడాలి....మెరిట్ చూడ కూడదు.
రాజకీయాలకు కేవలం మెరిట్ చూసి ఉపయోగం ఏమిటి
అధ్యక్షా ???

20/04/2024

రాజ్యాంగంలో ఉండే వాక్ స్వాతంత్ర్యం
కు......
ఎన్నికల కోడ్ కు తేడా ?????

19/04/2024

గత ఎన్నికల లో ఓటరు కు
వెయ్యి దండాలు పెట్టాలని
అభ్యర్థి వాళ్ళ అనుచరులకు చెబితే
వాళ్ళు ....మూడు వందల దండాలు మాత్రమే పెట్టారట.

17/04/2024

శ్రీ రామ నవమి శుభాాంక్షలు

13/04/2024

జగన్ మీద
రాళ్ళ
దాడి........

12/04/2024

ప్రతి రోజూ ప్రధానమంత్రి ప్రతి
రాష్ట్రం గురించి ఆలోచన చేసే
పరిస్థితి ఉందా??? ఉంటే రోజూ ఒక అర గంట
ఒక్కొక్క రాష్ట్రానికి సమయం ఇవ్వగలరా ఆ సమయం సరిపోద్దా....?????

అలాగే రాష్ట్రపతి సమయం ఇవ్వగలరా...???
అలాంటప్పుడు ఎలా అనే చర్చ జరగడం లేదు.

మన దేశం లో ఉన్న అన్నీ రకాల కేంద్ర మంత్రులు మన
జిల్లా లకు ఒక్క సారి అయినా వచ్చారా??

న్యాయం..........కేంద్ర మంత్రి
ఒక్క రోజులో ఒక అరగంట ఒక్క హై కోర్టు గురించి
ఆలోచన చేయగలరా....ఆ సమయం సరిపోద్దా ???
సుప్రీం కోర్టు లో
కేస్ లో సంఖ్య ఎంత ??? జడ్జీల సంఖ్య ఎంత???
సకాలంలో లో న్యాయం సాధ్యమేనా???
చర్చలు లేవు.
విద్య.....కేంద్ర మంత్రి
ఒక్క రోజులో ఒక అరగంట ఒక్క రాష్ట్రం గురించి
ఆలోచన చేయగలరా....ఆ సమయం సరిపోద్దా ???
డబ్బులు ఉంటే చదువుకో
డబ్బులు లేక పోతే చడవమాకు
అనే విధంగా విద్యా వ్యవస్థ.
ఎక్కువ మంది కి పరీక్షలు పెడుతాం కానీ ఎక్కువ
మందికి చదువు చెప్పలేం అనే పరిస్థితి.
యూనివర్సిటీ ల లో దాని అనుబంధ కాలేజీలలో అనుకున్నన్ని ప్రభుత్వ
సీట్లు లేవు.
చర్చలు లేవు.
ఇలా అన్నీ రకాల కేంద్ర మంత్రుల పరిస్థితి
ఆలోచిస్తే
దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం.
వాళ్ళు మన జిల్లాలకు రారు
వాళ్లకు వెబ్ సైట్లు ఉండవు... ఉన్నా డేటా
పూర్తిగా ఉండదు.
ఆసియా ఖండం లోనే
మనం ఎంతో వెనుక పడి ఉన్నాం...
సింగపూరు.......ఇండియా...... విద్య,వైద్యం,కూడు,గూడు
జపాన్.............ఇండియా
ఆస్ట్రేలియా.......ఇండియా
చైనా..............ఇండియా

మన దేశం అభివృద్ధికి మనం ఆలోచించాలి
చర్చలు జరగాలి........మనల్ని మనం మోసం
చేసుకుని ఎన్ని రోజులు బ్రతుకుతాం.
రాజకీయ నాయకులు
ప్రతి జిల్లాకు సమ న్యాయం చేయాలి.
రాజకీయ ల లోకి ఎందుకు వస్తున్నావ్
అంటే....త్వరగా ఆస్తులు సంపాదించుకోవచ్చు,
ఇప్పటికే ఉన్న ఆస్తుల జోలికి ఎవరూ రారు.
సొంత కంపెనీ పని మీద డిల్లీ వెళ్లాలంటే
లక్షలు కోట్లు చార్జీలు ,అక్కడ లంచాలు
లేకుండా చూసుకోవచ్చు అని అంటున్నారు.
మార్పు రావాలి
చర్చలు జరపాలి
సమయాన్ని కేటాయించాలి
మోసపు మాటలు మానుకోవాలి
అన్నీ రాజకీయ నాయకులకు ,అందరి ప్రజలకు
భారత దేశం మీద నిజమైన ప్రేమ ఉండాలి.
స్వాతంత్రం వచ్చాక దేశం లో చేసిన కనీసం 77 పనులు
ప్రపంచం లోనే పేరు తెచ్చుకునే విధంగా
చేయాలి.

09/04/2024

చెరువుల ఆక్రమణలు తొలగించి
ఆ చెరువులను నీటితో
నింపాలి.
ప్రతి పదివేల గృహాలకు ఒక
చెరువు ఉండాలి.
రాజులు అప్పట్లో
చెరువులు,దేవాలయంలు,కోనేరు లు
కట్టించారు....ప్రాజెక్టు లు
కట్టవలసిన అవసరం రాలేదు.
కాబట్టి పాలకులు
ఆలోచన చేయాలి....లేదా ప్రజలు
ఆలోచించాలి.

07/04/2024

ప్రయోక్త : మన దేశం లో ప్రభుత్వ లక్షల కోట్ల విలువైన
పథకాల అమలు కోసం
ఒక స్మార్ట్ ఫోన్ ,ఒక యాప్ ఉంటే చాలు.
కాబట్టి
ప్రజలు ఓటు వేయడానికి ఒక స్మార్ట్ ఫోన్
ఒక యాప్ సరిపోదా ????
ప్రభుత్వ ధనం మిగులుతుంది.
డేటా త్వరగా వస్తుంది.
ఎవరు లాగిన్ చేయాలో వాళ్ళు చేయవచ్చు.
ఆఫ్ లైన్,ఆన్ లైన్ కూడా పనిచేస్తాయి.

07/04/2024

కుర్చీలు...తేడా......దాని పేరే.....సమన్యాయం
తాగే నీరు...తేడా....సమన్యాయం
విద్య లో తేడా.......సమన్యాయం
వైద్యం లో తేడా .....సమన్యాయం
గృహాలలో తేడా....సమన్యాయం
రోడ్ల లో తేడా .......సమన్యాయం
TA,DA,HRA ల లో తేడా....సమన్యాయం

మనం రాజులమా,ప్రజా సేవకులమా
అనేది స్వాతంత్రం వచ్చిన రోజునుండి
ఆలోచన చేయడం లేదు.
ప్రజా సేవకులం అయితే
ఈ తేడా ఏమిటి
ప్రజాస్వామ్యం అయితే ఈ తేడా ఏమిటి??????

30/03/2024

టీచర్స్ మరియు లెక్చరర్ లు పైకి
చెప్పుకోలేక ...బాధ పడుతున్నారు.
ఉదయం 7.30 కు వెళ్లి రాత్రి 7 గంటలకు
ఇంటికి పంపుతున్నారు. ఇంటి బడ్జెట్ కు పోను డబ్బులు ఉన్న
ఉపాధ్యాయులు ,అధ్యాపకులు కాంటీన్ లో ఏదో ఒకటి
తిని బ్రతుకుతున్నారు.క్యారేజీ మీదనే ఆధార పడిన
వాళ్ళు సాయింత్రం ,రాత్రి ఏడు వరకు ఏమీ తినలేక పోతున్నారు.దీని వలన అటు విశ్రాంతి లేక,తగిన తిండి
లేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
మెదడు తో పని చేసే వారికి
వేసవి సెలవులు,ఎండాకాలం సెలవులు ఇస్తారు.
లక్ష కు పైగా జీతం తీసుకునే
హై కోర్ట్ జడ్జీల కు కూడా వేసవి సెలవులు ఉన్నాయి
యాబై వేల కు పైగా జీతం తీసుకునే
ప్రభుత్వ టీచర్స్ కు కూడా వేసవి సెలవులు ఉన్నాయి.
10000₹ తీసుకునే ప్రైవేట్ టీచర్స్ కు ఒంటి పూట
బడి ఉండదు.వేసవి సెలవులు ఉండవు.8 గంటల
పని గంటలు పాటించరు......
దీని వలన టీచింగ్ అంటే గౌరవం లేని ఉద్యోగాలు గా
బావించి అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు
వెళుతున్నారు.
కొన్ని వృత్తు లను కాపాడుకోవాలి.
ఆటో తొలి తే 40000₹ వస్తున్నాయని ప్రైవేట్
టీచర్స్ ను సమాజం ఎగతాళి చేస్తున్నా కూడా
వృత్తికి అలవాటు పడి చాలి చాలని
జీతాలతో సహజీవనం చేస్తున్నారు.
జీవిత చివరి దశలో ,బాధ్యతలు నెత్తిన పడిన
దశలో వారికి మిగిలేది
ప్రభుత్వం ఇచ్చే ఇల్లు,
3000₹ పింఛను.

70 శాతం మందికి ఈ పరిస్థితి ఉంది.
25 శాతం మందికి మంచి జీతాలు ఉన్నాయి.
5 శాతం మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు,అధ్యాపకులకు
నెల్లూరు లో సంవత్సరానికి కోటి రూపాయలు
జీతం తీసుకునే పరిస్థితి ఉంది.
వాస్తవానికి ఇదే శాతం లో సమస్యలు
యాజమాన్యానికి కూడా ఉన్నాయి .
నెల్లూరు ప్రభుత్వ B.Ed college లో
చేరే వాళ్ళు లేక స్పాట్ అడ్మిషన్లు
ఇస్తున్నారు అంటే
పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

30/03/2024

*ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అందరికి మనవి 🙏*

హాఫ్ డే స్కూల్స్ ఇవ్వని స్కూల్స్ వివరాలు...

మరియు...

సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న జూనియర్ కాలేజ్ వివరాలు....

Admissions పేరుతో కాంపైన్నింగ్ చేయిస్తున్న యాజమాన్యం వివరాలు..

Address తో సహా వివారులు మాకు వాట్స్ అప్ చెయ్యండి.

దిద్దే అంబేద్కర్-9182865478
గెడ్డం రాజు- 6300691719.
బట్టు శ్యామ్ ప్రసాద్ -9177241089.

30/03/2024

ఉద్యోగస్తులు వారు తెలిపిన
అద్దె ఇంట్లో నివసించ కుండా
HRA తీసుకోవడాన్ని ....incomtax వాళ్ళు
కనిపెట్టారట.

29/03/2024

నెల్లూరు లో 400 పార్కులు వాటి స్థలాలు మాయం....గత 20 సంవత్సరాలుగా....ఎవరిది లోపం
ఏ పార్టీ ది వాస్తవం.

28/03/2024


గ్రూప్
రాజకీయాల విమర్శలకు
అతీతంగా
ఉండాలి....

ప్రతి ఒక్కరికీ వారి వారి
ప్రత్యేక ఆలోచనలు
ఉంటాయి. ఏ ఒక్క పార్టీ
వైపు విమర్శలు లేకుండా
రాజకీయ పోస్ట్ లు
ఉంటే మంచిది.
మన గ్రూప్ సభ్యులకు
మంచి వ్యాపార సమాచారం
మంచి ఆరోగ్య సమాచారం
మంచి విద్యా సమాచారం
మంచి విజ్ఞాన సమాచారం
మంచి భక్తి సమాచారం
మంచి ప్రభుత్వ సేవలు,నిబంధనల
సమాచారం.
మంచి గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర,కేంద్ర,అంతర్జాతీయ సమాచారం ఇస్తే
అర్థం ఉంటుంది.

వ్యవసాయ రంగం
ఉద్యోగ రంగం
పరిశ్రమల రంగం
సాప్ట్ వేర్ రంగం
రోబో రంగం
లు
మనకు ఉన్నాయి.
వాటి ఉత్పత్తులు ,హోల్ సేల్ ధరలు,
రిటైల్ ధరలు .....ఇలా సమాచారాన్ని
తెలుసుకోవాలి.
ఆయా రంగాల లో ఒక్కో రంగం లో
వెయ్యి రకాలు ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుని
వ్యాపారం లేదా ఉద్యోగం,లేదా సేవ,
ఆనందాన్ని పొందవచ్చు.
రాజకీయ నాయకులు
వ్యవసాయ రంగం గురించి
మాట్లాడితే ....నిజాలు బయట పడుతాయి.....మాట్లాడరు.
ఉద్యోగ రంగం గురించి
మాట్లాడరు.
పరిశ్రమ ల రంగం మాట్లాడరు.
సాప్ట్ వేర్ రంగం గురించి మాట్లాడరు.
రోబో రంగం గురించి మాట్లాడరు.
మన రూపాయి ని అమెరికాతో
సమానం గా తెగలరా ???

మన దేశం లో ఇంటర్ నెట్ ను
ఉత్పత్తి చేయగలరా ????

నెల్లూరు లో అభివృద్ధి
అంటే
పాదచారులు నడవడానికి
ఫుట్ పాత్ లు ఏర్పాటు
చేయగలరా???
రోడ్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వేపించ గలరా??
గుంటలు లేని,అవినీతి లేని
రోడ్లు వేయగలరా???
ఇరిగేషన్ కాలువలు పూడికలు,ఆక్రమణలు
తీయగలారా ???
దేవాలయాల ఆస్తులు
ఇంటర్ నెట్ లో పెట్టగలారా ????
విద్యాలయాలలో అన్నీ సబ్జెక్ట్ లకు
ఉపాధ్యాయులను పెట్టగాలరా???
జిల్లా కు ఒక్క హాస్పిటల్ లో
అయినా ఏం.ఆర్. ఐ
స్కాన్ ను పెట్టగాలరా ??
ప్రభుత్వ గృహాలను
అవినీతి లేకుండా నిర్మించి
సంవత్సరం లో ఇవ్వగలరా???
ప్రతి ప్రభుత్వ కార్యాలయం
లో రోజు వారే పనిని,ఖర్చులను,ఆదాయాలను
వెబ్ సైట్ లో పెట్టగలరా ???
ఏం.ఎల్. ఏ
ఏం.పి
నిధులతో అవినీతి లేకుండా
చేయగలరా ???
ఉపాధి హామీ లో అవినీతి
లేకుండా చేయగలరా??
నెల్లూరు టౌన్ లో ప్రభుత్వ
టౌన్ బస్ లు నడపగలరా???
పాల లో కల్తీ లేకుండా ఇవ్వగలరా??
నకిలీ మందులు లేకుండా చూడగలరా???
నెల్లూరు లో అంతర్జాతీయ సేవలు
ఇవ్వగలరా ???
నెల్లూరు లో వాహనాల పార్కింగ్
ఇవ్వగలరా ??
పల్లెలకు ఎక్స్ ప్రెస్ బస్ లు వేయగలరా ??
ఇలా చాలా ఉన్నాయి....
వాటికి రాజకీయ నాయకుల
నుండి మనకు హామీ లు
రావాలి.
అది ఏ పార్టీ అయినా ???
నీ ముందు వెయ్యి మంది
తాతలు నీ
భవిష్యత్ కోసం ఆలోచన చేసి ఉంటే
నీ భవిష్యత్ ఎలా ఉంటుందో...
అలాగే రాజకీయ నాయకుల
పరిస్థితి కూడా...
కాబట్టి
కుటుంబాలలో కుట్రలు తగ్గాలి
రాజకీయాలలో కుట్రలు
తగ్గాలి.
అప్పుడే
కుటుంబం,సమాజం బాగు పడుతుంది.
కాబట్టి
ప్రశ్నించండి
నిజాలు తెలుసుకోండి
బజనలు ఆపండి.
రావూరి.రమేష్ బాబు
ప్రయోక్త మాసపత్రిక ఎడిటర్
9866103591

27/03/2024

ప్రయోక్త :
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా
ప్రత్యేక కార్యాచరణ
- మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ముందస్తు చర్యలు
- ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరి నారాయణన్
నెల్లూరు, మార్చి 26 : రానున్న వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణను ముందుగానే రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో వేసవికాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, కందుకూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో రానున్న మూడు నెలల వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీటి నిల్వలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని నిల్వ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లకు సూచించారు. గ్రామాల్లో పనిచేయని బోర్లను మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ఉన్న నీటి నిల్వల్లో జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు సరిపడ నీటి నిల్వలు ఉంచుకోవాలని, అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీ శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు సకాలంలో చేపట్టాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మరమ్మత్, ట్రైనీ కలెక్టర్ సంజన సింహ, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, ఇరిగేషన్, తెలుగు గంగ ప్రాజెక్టు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు కృష్ణమోహన్, రమణారెడ్డి, ఎస్.కె మర్దన్ అలీ, సోమశిల ప్రాజెక్టు ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ ఈఈ సంజయ్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

21/03/2024

ప్రయోక్త: ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ హరి నారాయణన్
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సంభందిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నోడల్ అధికారులతో ఫిర్యాదులు,కోడ్ ఉల్లంఘన, శిక్షణ ,మాన్ పవర్, ఎంసీఎంసి, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాలంటీర్లు గాని, ప్రభుత్వ ఉద్యోగులు గాని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ పార్టీలతో ప్రచారంలో పాల్గొంటే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కొంతమందిపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు, వాహనాల ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని , అనుమతి తీసుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రచార కార్య క్రమాలు నిర్వ హిస్తే తగిన చర్యలు తీసుకోవాలని ,వాహనాలను సీజ్ చెయ్యాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు కేటాయించబడిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. శిక్షణ కార్యక్రమాలకు హాజరు గాని సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని సూచించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్వీప్ నోడల్ అధికారికి సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు శిక్షణ తో పాటు పోస్టల్ బ్యాలెట్ ను సక్రమంగా వినియోగించుకునే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల కోసం వినియోగించే అధికారుల బృందాలను మరింత బలోపేతం చేయాలని నోడల్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, నోడల్ అధికారులు నుడా విసి బాపిరెడ్డి, ఏఎస్సీ సౌజన్య, సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిపిఓ సుస్మిత, డీఈవో రామారావు తదితరులు పాల్గొన్నారు.

19/03/2024

ప్రయోక్త :జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలు దాటిన నగదు లావాదేవీలపై బ్యాంక్ అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నారాయణన్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల సందర్భంగా బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటినుండి తరచుగా వారి ఖాతాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలన్నారు. అలాగే 10 లక్షల రూపాయలపై బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు ఇవ్వాలన్నారు.ఒకే ఖాతా నుండి పలుసార్లు నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను పరిశీలించాలన్నారు. బ్యాంకుల నుండి ఏ.టీ.ఎం కు రవాణా చేసే నగదు వాహనాల కు క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నారు. అనుమానస్పద లావాదేవిలపై బ్యాంకు అధికారులు ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

16/03/2024

ప్రయోక్త : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పటిష్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందని, ఈ మేరకు జిల్లాలో పటిష్టంగా ఎన్నికల ప్రవర్తన నియమాలని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమయాత్తమైనట్లు ఆయన స్పష్టం చేశారు.

భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ మేరకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, మన రాష్ట్రంలో నాలుగో విడతలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 25 నామినేషన్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్ర్కూటీని, నామినేషన్ల విత్ డ్రాకు ఏప్రిల్ 29 చివరి తేదీగా చెప్పారు. మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. జూన్ 6 తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ వెల్లడించారు.

ఏప్రిల్ 18న ఫామ్-1 విడుదల చేస్తూ ఏ ఏ ప్రాంతాల్లో నామినేషన్లు స్వీకరిస్తామో తెలియజేస్తామన్నారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారని, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సబ్ కలెక్టర్, కావలి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్డీవోలు, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీవో నెల్లూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ కలెక్టర్ తెలుగు గంగ, ఉదయగిరి నియోజకవర్గానికి ఆత్మకూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వెంకటగిరి నియోజకవర్గానికి తిరుపతి సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు సెలవు దినాల్లో మినహా అన్ని రోజుల్లో నామినేషన్లను స్వీకరించనన్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సెక్యూరిటీ డిపాజిట్ గా 25 వేలు, అసెంబ్లీ నియోజకవర్గానికి రూ 10 వేలు చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మినహాయింపు ఉంటుందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను అభ్యర్థులు ఫామ్ 26 ద్వారా అందజేయాల్సి ఉంటుందని, రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసే సమయంలో 100 మీటర్ల దూరం వరకే మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని, ఆర్ వో చాంబర్లో అభ్యర్థితోపాటు మరో నలుగురికి ప్రవేశం ఉంటుందని చెప్పారు.

జిల్లాలో 2460 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, నెల్లూరు రూరల్ సంబంధించి 10 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లో ఏర్పాటుకు ఈసీఐ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం ఓటర్లు
2039215 మంది కాగా, పురుషులు 997908 మంది అని, స్త్రీలు 1041096, ఇతరులు 211 మంది అని కలెక్టర్ వెల్లడించారు.

జిల్లాలో 53 ఎంసిసి బృందాలు, 78 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 81 ఎస్ ఎస్ టి బృందాలు, 20 వి ఎస్ టి బృందాలు నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై తమ విధులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సెక్షన్ 127 ఏ ప్రకారం అన్ని ప్రింటింగ్ ప్రెస్ ల నిర్వాహకులు తాము ప్రచురిస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలు, ఇతర ప్రచార ముద్రణపై ముందస్తుగా తమ అనుమతి పొందేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రకటనలు, హోర్డింగులు ఈసీఐ నిబంధనల మేరకు తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ మొదలైన ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన మాధ్యమాలు ప్రసారం చేసే అభ్యర్థుల ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లను ప్రసారం చేసే ముందు ఎం సి ఎం సి కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లోని డిఆర్డిఏ కార్యాలయం మిద్దె పైన సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పాత్రికేయులు ఎటువంటి ఫేక్ వార్తలను ప్రసారం చేయవద్దని, ప్రసారం చేసే ముందు వార్తలకు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నచో మీడియా సెంటర్లో 24 గంటలు సమాచార శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని, వారి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని వార్తలు ప్రచురించాలన్నారు. అలాగే పత్రికల్లో చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) ప్రచురించవద్దని, పెయిడ్ న్యూస్ పై ఎం సి ఎం సి ప్రత్యేక నిఘా పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు.

ఓటర్లందరూ సెల్ ఫోన్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఎపిక్ నెంబర్ ఆధారంగా తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చు అన్నారు. తమ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు కూడా నో యువర్ కాండేట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.

ఓటరు జాబితా కి సంబంధించిన ఓటరు తొలగింపులు ఇక ఉండవని, కొత్త ఓట్లు మాత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు, ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పాత్రికేయులు జిల్లా అధికార యంత్రాంగం తో సమన్వయంతో పని చేయాలని, మీడియా భాగస్వామ్యం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమని కలెక్టర్ చెప్పారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా దృఢ సంకల్పంతో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావు, డి పి ఆర్ ఓ మోహన్ రాజు, ఇంజనీర్ కిషోర్, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

15/03/2024

ప్రయోక్త :
గ్రూప్ - 1 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
- పరీక్షా కేంద్రాల్లో అన్ని ముందస్తు చర్యలు
- ఏపీపీఎస్సీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
- అధికారులకు దిశా నిర్దేశం చేసిన డిఆర్ఓ లవన్న
- జిల్లాలో 13 కేంద్రాల్లో ఈనెల 17న పరీక్ష
- హాజరుకానున్న 6954 మంది అభ్యర్థులు
- హాల్ టికెట్ తో పాటు, ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి
- విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో 0861-2331261 కాల్ సెంటర్ ఏర్పాటు

నెల్లూరు, మార్చి 15 : జిల్లా వ్యాప్తంగా ఈనెల 17న జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని డిఆర్ఓ లవన్న అధికారులను ఆదేశించారు.

గురువారం నెల్లూరు కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహణపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డిఆర్ఓ లవన్న, ఏఎస్పీ సౌజన్య, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, ఆర్ సునీత అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 17న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 6954 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు మొదలగు అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా ముందుగా పరిశీలించాలని సూచించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు అనుమతించవద్దని, విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని, ఏపీపీఎస్సీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని చెప్పారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లయజనింగ్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..............................
గ్రూప్ 1 పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థుల సందేహాల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డిఆర్వో తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నచో 0861-2331261 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

ఈ సమావేశంలో సమన్వయ అధికారులు కన్నమ నాయుడు, సుస్మిత, సాంబశివారెడ్డి, సత్యవాణి, నాగరాజు, వెంకట్రావు, చిరంజీవి, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

13/03/2024

ప్రయోక్త :
సమాజంలో వెనుకబడిన వర్గాలైన సఫాయీ కర్మచారీ లబ్ధి దారులకు ఎన్ ఎస్ ఎఫ్ డి సి, స్త్రీ నిధి, ఎన్ ఎస్ కే ఎఫ్ డి సి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పి పి ఈ కిట్లు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ అందజేశారు. బుధవారం స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రధానమంత్రి సూరజ్ జాతీయ పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ప్రధానమంత్రి జరిపిన ఇంటర్ యాక్షన్ ను గవర్నర్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి , జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాల్లోని లబ్ధిదారులతో ప్రధానమంత్రి వారికి అందుతున్న పథకాలు వారి జీవితాల్లో కలిగిన మార్పును తెలుసుకున్నారు. మన రాష్ట్రం లోని గుంటూరు జిల్లా నుండి ఒక సఫాయి కార్మికురాలు మోడీతో మాట్లాడారు. రోడ్ల పక్కన ఉండే మాకు ప్రభుత్వం గ్యాస్,health కార్డుల తో పాటు అనేక పదకాలు అందజేసిందని, వృత్తి చేసుకోవడం కోసం 17 లక్షల విలువచేసే యంత్రం అందజేసిందని ఇప్పుడు దానికి నేను యజమానురాలనయ్యానని ఆమె ప్రధానికి వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని ప్రభుత్వం సెప్టిక్ ట్యాంక్ క్లీన్ మిషన్ అందజేసినందు వల్ల తన కుటుంబ పోషణకు భరోసా లభించిందని అందుకు ఆమె ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఎం .హరి నారాయణన్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రకారం పేద ,అణ గారిన వర్గాలకు ఉద్ధరణ, సాధికారికత కోసం ప్రధానమంత్రి పీఎం సూరజ్ పథకం పేదల పట్ల ఉన్న ప్రత్యేక దృష్టిని తెలియజేస్తున్నదని అన్నారు. ఈ పథకంలో జిల్లాలో766 మంది కి ఈ పథకం అందజేయబడుతున్నదన్నారు .
ఎన్ ఎస్ ఎఫ్ డి సి 296మంది, ఎన్ ఎస్ కే ఎఫ్ డి సి లు 25 మంది ,ఎన్ బి సి ఎఫ్ డి సి పథకంలో 356 మంది ,నమస్తే పథకంలో 89 మంది పొందుతున్నారని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు 50 మందికి, మరో 50 మందికి పిపిఏ కిట్లు చేయడం జరుగుతుందన్నారు.
NScFDC పధకం కింద 5కోట్ల 20 లక్షల మెగా చెక్కు ను గవర్నరు లబ్ధి దారులకు అంద జేశారు.
ఉదయగిరి ఉడ్డెన్ కట్లెరీ జ్ఞాపికను వేదిక పై గవర్నరు కు అంద జేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం ఆరునమ్మ , మేయర్ స్రవంతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయకృష్ణన్ ఇతరులు పాల్గొన్నారు.

12/03/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నేడు నెల్లూరు నగరానికి విచ్చేయనున్నారు.బుధవారం మధ్యాహ్నం 1.40 కు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.55 కు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని హెలీపాడ్ కు చేరుకుంటారు.3.35 గంటలకు మినర్వా హోటల్ నుంచి బయలుదేరి 3.40 నుంచి 5.10 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో జరిగే పీఎం సూరజ్ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
అనంతరం హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

07/03/2024

ప్రయోక్త:
ఈనెల 20 నుండి తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
- భక్తుల సౌకర్యార్థం పకడ్బందీగా ఏర్పాట్లు
- 25న బంగారు గరుడ సేవ
- 26న కళ్యాణోత్సవం
- 27న రథోత్సవం
- సమష్టి భాగస్వామ్యంతో బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి
ఆర్డీఓ మలోల, ఆలయ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు
ఈ నెల 20 నుండి 31వ తేదీ వరకు జరగనున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అధికారులందరూ కలిసికట్టుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. మలోల సూచించారు.

గురువారం నగరంలోని రంగనాయకులపేటలో వెలసివున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నగరంలో పినాకిని నదీ తీరాన వెలసి ఉన్న ఉత్తర శ్రీరంగ క్షేత్రం గా కీర్తించబడే క్షేత్రాదీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు.

ఈ ఉత్సవాలను అన్ని ప్రభుత్వ శాఖలు వారికి అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఉత్సవాలను వేద, దివ్య, ప్రబంధ గోష్టి యుక్తంగా విద్యుత్ దీపాలంకరణతో, విశేష పుష్పాలంకరణతో భాగవతజన నయనానందకరంగా లోక కళ్యాణార్థమై అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే మార్చి 20 వ తేదీ అంకురార్పణ జరుగుతుందని, ఉత్సవాల్లో ముఖ్యంగా 24న హనుమంత వాహనం, 25న బంగారు గరుడ సేవ, 26 కల్యాణోత్సవం, 27 రథోత్సవం, 31న తెప్పోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని చెప్పారు.
జిల్లా నుండే కాక వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విరివిగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.

ముఖ్యంగా వేసవికాలం కాబట్టి ఆలయంలో చలువ పందిళ్లు మంచినీటి సరఫరా పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు.
అంతే కాకుండా క్యూ లైన్లు, విద్యుత్ అలంకరణ, ప్రత్యేక దర్శనమునకు క్యూలైన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశుధ్యం,ఉచిత ప్రసాదాల వితరణ ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్ల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని ముందుగా నియమించుకోవాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ను, మహిళ పోలీసులను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యంగా రథోత్సవం, తెప్పోత్సవం రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రైల్వే గేటు వద్ద నుండి సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు ప్రమాదాలు నివారించేందు కోసం పోలీస్ బందోబస్తు, రోప్ పార్టీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దారులు మళ్ళించాలన్నారు.
రైల్వే గేటు నుండి నాలుగు కాళ్ళ మండపం వరకు, దేవస్థానం నుండి పెన్నా నది వారధి వరకు రహదారులు అన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు బ్లీచింగ్ చేయాలన్నారు.
వీధి దీపాలు, దేవస్థానం వెనుకవైపు, పెన్నా నది వారధి దగ్గర ఫ్లడ్ లైట్లు, మంచినీటి సరఫరా కోసం ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని తాత్కాలిక స్నాన గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని రధం తిరుగు రహదారుల్లో ఆక్రమణలు, వేగనిరోధకాలను తొలగించాలని గుంతలను పూడ్చాలని సూచించారు.
విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరంగా అందించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. రథోత్సవం రోజున రధం తిరిగే ప్రాంతంలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, టెలిఫోన్ తీగలను తొలగించాలన్నారు. అవసరమైనంత విద్యుత్ శాఖ సిబ్బందిని దేవాలయం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు.
పెన్నా నది స్నాన ఘట్టం వద్ద గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలన్నారు.
రధము, తెప్ప సజావుగా ఉన్నవో లేదో పరిశీలించి ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలన్నారు.
బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటినుండి ముగిసేంతవరకు ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక చికిత్స మందులతో పాటు దేవస్థానం వద్ద ఒక అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని ఆర్డిఓ కోరారు

ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను ఆర్డిఓ ఆవిష్కరించారు.

తొలుత ఆర్డిఓ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సమావేశంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు పాల్గొన్నారు.

07/03/2024

ఎన్నికలు నియమాలు

ప్రయోక్త : ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా
అందరూ ఎన్నికల సందర్భంగా పాటించవలసిన నియమ
నిబంధనలను నోడల్ అధికారి బాబురెడ్డి వివరించారు.
మీడియా కు నోడల్ అధికారి గా సమాచార శాఖ డిడి
ఉన్నారు.ఏం.పి అభ్యర్థి కి 95 లక్షలు,ఏం.ఎల్. ఏ అభ్యర్థికి
40 లక్షల పరిమితి ఉండే అవకాశం.

ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థికి కర్చు చేసే పద్దతిలో
నియమ నిబంధనలు ఉన్నాయి.ప్రతి యాడ్ లెక్కించబడుతుంది.
మీడియా మొనటరింగ్ టీమ్ ఏర్పాటు చేసి ఉన్నారు.
యాడ్ వేయాలి అంటే ముందుగా టీమ్ అనుమతి
తీసుకుని వేయాలి.అలా కాకుండా యాడ్ వేస్తే నోటీస్
వస్తుంది.చర్యలు కూడా ఉంటాయి. పెయిడ్ న్యూస్
ను కూడా పరిశీలించడం జరుగుతుంది.
డైరెక్ట్ పెయిడ్ న్యూస్,ఇన్ డైరెక్ట్ పెయిడ్ న్యూస్
ను కూడా పరిశీలిస్తారు.
జిల్లా లో మీడియా సంబందించి
డి.ఆర్.డి. ఏ కార్యాలయం లో ఏర్పాటు చేసి ఉన్నారు.
ఒక దేశాన్ని విమర్శిస్తూ వార్త వ్రాయకూడదు
కోర్ట్ ఉత్తర్వులు మీద వార్తలు
న్యాయ వ్యవస్థ మీద,రాష్ట్రపతి మీద వార్తలను
పరిశీలిస్తారు.
ప్రింట్ మీడియా వాళ్ళు పోలింగ్ రోజు లేదా
ఒక రోజు ముందు అనుమతి తీసుకోవాలి.
సోషల్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా
వాళ్ళు ప్రతి రోజు అనుమతి తీసుకోవాలి.
ఎలక్షన్ కమీషన్ వాళ్ళు అనేక రకాల
అప్లికేషన్స్ తీసుకువచ్చి ఉన్నారు.
సమాచార శాఖ డిడి మాట్లాడుతూ
మీడియా సెంటర్ మొనటరింగ్ మెంబర్
రాష్ట్ర స్థాయి లో ,జిల్లా స్థాయి లో
ఉంటారు.
జిల్లాలో ఆరు మంది మోనటరింగ్ కమిటీ లో ఉన్నారు.
ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఎన్నికల కోసం ప్రత్యేక
ఐడి కార్డులు కలిగి ఉండాలి.ఆ కార్డు పోలింగ్ కు
ఓటింగ్ కు ఉపయోగ పడుతుందని తెలిపారు.
పెయిడ్ న్యూస్ పబ్లిష్ చేస్తే నోటీస్ ఇచ్చాక
48 గంటల లో వివరణ ఇవ్వాలి.సమాధానం
చెప్పక పోతే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.తరువాత
అప్పీల్ కు వెళ్ళే అవకాశం ఉంది.
నామినేషన్ లు జరిగే రోజు నుండి కర్చులను పరిశీలిస్తారు.
రేట్ కార్డు లు ముందుగా నిర్ణయించిన విధంగా
ఉంటాయి.
మీడియాకు,రాజకీయ నాయకులకు
ఈ విషయాల మీద ముందుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
దేశం లో 388 కి పైగా ఎలక్ట్రానిక్ చానల్స్ ఉన్నాయి.

పబ్లిక్ మీటిం గ్ కు ,అన్నీ రకాల రేట్ చార్ట్ లు ఇవ్వడం
జరుగుతుందని తెలిపారు.

ప్రజలు కూడా ఏది పడితే అది మాట్లాడ కూడదు.
మానిఫెస్టో ల కు కూడా నియమాలు పెట్టారు.
ప్రతి ఒక్కరూ మీటింగ్ లు పెట్టుకోవచ్చు.
ఎవరు ముందు ధరకాస్తు చేసుకుంటే
వారికి మీటింగ్ లకు ఊరేగింపు లకు అనుమతి
ఉంటుంది.
వాహనాలకు కూడా అనుమతి తప్పనిసరి అని తెలిపారు.
జెండాలు పెట్ట డానికి కూడా అనుమతి అవసరం.
పార్టీ కార్యాలయాల కు కూడా అనుమతి తీసుకోవాలి.
48 గంటల ముందు ఏ ఓటరు ఏ నియోజక వర్గమో
ఆ నియోజక వర్గం లో ఉండాలి.

Eci.website లో అన్నీ విషయాలు ఉంటాయి.

Address

PRAYOKTHA MONTHLY NEWS PAPER , Tipparaju Vari Street, Nellore
Nellore
524001

Telephone

+919866103591

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravuri ramesh babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravuri ramesh babu:

Videos

Share

Category