Karimnagar Pulse

Karimnagar Pulse it beats with the rhythm of Karimnagar, delivering the citys latest news, events, n community stories

16/06/2024
28/05/2024

ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా: రష్మిక

‘గం గం గణేశా' ప్రీరిలీజ్ ఈవెంట్లో రష్మిక, ఆనంద్ దేవరకొండ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఫేవరెట్ కోస్టార్ ఎవరని ఆనంద్ అడగ్గా.. 'ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా స్పాట్లో పెడితే ఎట్ల. ఫేవరెట్ హీరో రౌడీ బాయ్(విజయ్)' అని సరదాగా చెప్పారు. దీంతో అభిమానులు విజయ్ పేరుతో ఈవెంట్ను హోరెత్తించారు. కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

30/04/2024

ఐదేళ్లలో కరీంనగర్కు నువ్వు ఏం తీసుకొచ్చావ్ బండి: సీఎం రేవంత్

ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో బండి సంజయ్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.‘అయ్యో పాపమని ఓటేస్తే అక్కడ గుండు (ఎంపీ అర్వింద్), ఇక్కడ అరగుండు (బండి సంజయ్) ఏం చేశారని నిలదీశారు. తెలంగాణకు మీరు తెచ్చింది, కేంద్ర బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు' అని జమ్మికుంట జనజాతర సభలో విమర్శించారు.

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) నేడు కన్నుమూశారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన శుక...
05/04/2024

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) నేడు కన్నుమూశారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 2011 వరకు దూరదర్శన్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసిన ఆయన జీవితంలోని అనుభవాలను గతంలో పంచుకున్నారు. ఒకసారి వాటిని గుర్తుచేసుకుందాం.

తెలుగు న్యూస్ రీడింగ్ రంగానికి శాంతి స్వరూప్ ఒక విశిష్ట గుర్తింపు తెచ్చారు. 1983 నుండి 2011 వరకు దూరదర్శన్‌లో మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న అద్భుతమైన పట్టు, స్పష్టమైన ఉచ్చారణ ప్రజలను ముగ్ధులను చేశాయి. టెలిప్రాంప్టర్ లేని కాలంలో కూడా స్క్రిప్ట్‌ పేపర్లను చూడకుండా వార్తలు చెప్పడం ఆయన ప్రతిభకు నిదర్శనం. వార్తలను కేవలం చదవడమే కాకుండా, వాటిలోని భావాన్ని ప్రేక్షకులకు అందించే విధంగా సందర్భోచితంగా మాట్లాడేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇంగ్లీష్ నివేదికలను తెలుగులోకి అనువదించి చెప్పే బాధ్యత ఆయనకు ఉండేది. టెలిప్రాంప్టర్ లేకపోవడం వల్ల తప్పులు జరగకుండా చదివే ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆయన అద్భుతమైన ప్రతిభతో వార్తలు చెప్పేవారు. ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య వంటి దేశం దుఃఖించిన క్షణాల్లో కూడా శాంతి స్వరూప్ గొంతు ప్రజలకు వినిపించింది. ఆయన చెప్పిన వార్తల ద్వారా ప్రజలు ప్రపంచ విశేషాలను తెలుసుకునే అవకాశం పొందారు. తెలుగు న్యూస్ రీడింగ్‌ను కొత్త పుంతలకు తీసుకువెళ్లిన లెజెండ్ శాంతి స్వరూప్. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన గొంతు, ఆయన శైలి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగకుండా ఉంటాయి.

02/04/2024

జగిత్యాల జిల్లాలో లేగ దూడకు బారసాల

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరగోని సత్యనారాయణ అనే వ్యక్తి సోమవారం తన ఇంట్లోని లేగ దూడకు బారసాల నిర్వహించి, నామకరణం చేశారు. 21 రోజుల క్రితం తనకు ఇష్టమైన ఆవుల్లో ఒకటి లేగ దూడకు జన్మనిచ్చింది. సోమవారం దానికి మహాలక్ష్మి రేణుక అని నామకరణం చేసి, కొత్త బట్టలు తొడిగి, స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ తతంగాన్ని వారు ఆసక్తిగా తిలకించారు.

20/03/2024
19/03/2024

See comments..

టాటా AIA రైజింగ్ ఇండియా ఫండ్‌ను ప్రారంభించింది (Tata AIA Launches Tata AIA Rising India Fund)టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ (...
19/03/2024

టాటా AIA రైజింగ్ ఇండియా ఫండ్‌ను ప్రారంభించింది (Tata AIA Launches Tata AIA Rising India Fund)

టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ (Tata AIA) సంస్థ సోమవారం నాడు టాటా AIA రైజింగ్ ఇండియా ఫండ్‌ను (Tata AIA Rising India Fund) ప్రారంభించింది.

ఈ న్యూ ఫండ్ ఆఫరింగ్ (NFO) మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. NFO కాలంలో యూనిట్ ధర ₹10.

“రైజింగ్ ఇండియా ఫండ్ ముఖ్యమైన రంగాలు మరియు కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది... వీటిలో మౌలిక సదుపాయాలు, తయారీ, బ్యాంకింగ్, డిజిటల్ మరియు రక్షణ రంగాలు ఉన్నాయి," అని టాటా AIA ఒక ప్రకటనలో తెలిపింది.

“ఈ ఫండ్ వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లు కలిగిన కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది మరియు రంగ-ఆధారిత పరిమితులు లేకుండా ఉంటుంది, ఫండ్ మేనేజర్‌లు భారతదేశ వృద్ధిని నడిపించే వైవిధ్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది."

మూలధన గుణాంకం పెంచడానికి, 70%-100% పెట్టుబడులు ఈక్విటీ మరియు సంబంధిత సాధనాల్లో ఉంటాయి, 0% - 30% రుణ మరియు డబ్బు మార్కెట్ సాధనాల్లో ఉంటాయి.

18/03/2024

మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను అన్యాయంగా డిటైన్ చేశారంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు.. వారికి మద్దతు తెలిపారు. ముందస్తుగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీ...
15/03/2024

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని.. ఆందోళన చేస్తున్నారు. మోదీకి , ఈడీ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే.. కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ప్రీప్లాన్డ్‌గానే.. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంటును కూడా వెంట తీసుకొచ్చిన అధికారులు.. ముందుగానే 8:45 ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఈడీ అధికారులతో హరీశ్ రావు, కేటీఆర్.. వాగ్వాదానికి దిగారు.

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరిలో.. మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయటం, ఐదు గంటల సోదాల అనంతరం అరెస్ట్ చేయటం సర్వత్రా సంచలనంగా మారింది.

10/03/2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి.. మరో 4 రోజులే గడువు: బండి సంజయ్

కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మల్యాలలో ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. కోటిన్నర మంది మహిళల అకౌంట్స్లో రూ.2500 జమ చేయాలన్నారు. 50లక్షల మందికి రూ. 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మంది కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. ఇళ్లు లేని 25 లక్షల మందికి స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు సాయం చేయాలని సూచించారు. 6గ్యారంటీల అమలుకు 4 రోజులే గడువన్నారు.

కరీంనగర్ : వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి పొలం వద్ద పురుగుల మందు త్రాగాడు…పొలాల ‌వద్ద రైతులు గమన...
29/02/2024

కరీంనగర్ : వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి పొలం వద్ద పురుగుల మందు త్రాగాడు…పొలాల ‌వద్ద రైతులు గమనించి 100కి‌ సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్‌ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి రెండు కిలోమీటర్ల మోసుకొని జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్‌కి ‌ చికిత్స అందించి కాపాడారు…

29/02/2024

ఆప్యాయంగా స్వీట్లు వడ్డించిన రాధిక మర్చంట్

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లో అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక నివాసితులకు గుజరాతీ వంటకాలతో అన్నసేవ చేస్తున్నారు. అయితే గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ రాధిక వారికి స్వీట్లు వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బిలియనీర్లు అయినప్పటికీ అంబానీ కుటుంబసభ్యులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

28/02/2024

బండి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం

ఉదయం లేస్తే మద్యం, మాంసం లేనిదే బండి సంజయ్కి పొద్దు గడవదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తన దయ, దక్షిణ్యాల పైన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా బండి గెలిచారని వివరించారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి.. ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

*🔊తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్..**🍥హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల ...
27/02/2024

*🔊తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్..*

*🍥హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి*

*🌀ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.*

*💥పదో తరగతి పరీక్షల షెడ్యూల్:*

*♦️మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్*

*♦️మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్*

*♦️మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్*

*♦️మార్చి 23 - గణితం*

*♦️మార్చి 26 - ఫిజిక్స్*

*♦️మార్చి 28 - బయాలజీ*

*♦️మార్చి 30 - సోషల్ స్టడీస్*

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులుచెన్నై - భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండ...
26/02/2024

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై - భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.

ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.

26/02/2024

డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు

లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది.

అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది.

చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.

ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

*ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన తేనె “వైల్డ్ ఫ్లేవర్స్”ను ఆవిష్కరించిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు...
26/02/2024

*ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన తేనె “వైల్డ్ ఫ్లేవర్స్”ను ఆవిష్కరించిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు*
అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నది. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ది చేసిన తేనెను “వైల్డ్ ఫ్లేవర్స్” బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షవాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్షఆయా శ...
26/02/2024

ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష

ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం

వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం

ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి.. పన్నుల వసూళ్లు పెరిగేలా చూడాలన్న సీఎం

డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

బాటిల్‌ ట్రాకింగ్‌ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం

*జూన్ 9న తెలంగాణ గ్రూప్-1 పరీక్ష*
26/02/2024

*జూన్ 9న తెలంగాణ గ్రూప్-1 పరీక్ష*

23/02/2024

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న ఆమె సోదరి నివేదిత గుండెలవిసేలా రోదించారు. 'సారీ రా' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అటు సికింద్రాబాద్లోని ఆమె నివాసంలోనూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అక్కడికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

 # # కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!**హైదరాబాద్:** సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల...
23/02/2024

# # కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!

**హైదరాబాద్:** సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఒక దారుణమైన కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

**ఇటీవలే ఓ ప్రమాదం:**

ఇటీవలే ఎమ్మెల్యే లాస్య నందిత ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద అమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి.

**రాజకీయ ప్రస్థానం:**

దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

**సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి:**

నందిత ఆకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

**మాజీ సీఎం కేసీఆర్ సంతాపం:**

లాస్య నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.

**ఎమ్మెల్యే లాస్య నందిత మృతి రాష్ట్ర రాజకీయాల్లో ఒక లోటును సృష్టించింది. ఆమె కుటుంబానికి ఈ దుఃఖ సమయంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.**

Cantonment MLA Lasya Nanditha dies.. Lasya Nanditha's car met with an accident on ORR.. The car lost control and hit the divider.. Driver suffers severe injuries in the accident..

22/02/2024

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)కు మహిళా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. తొలి మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్తో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ముచ్చటించారు. మైదానంలో వారితో సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో షారుఖ్ సిగ్నేచర్ మూమెంట్ను క్రికెటర్ మెగ్ లానింగ్ అనుకరించారు. ఈ వీడియో వైరల్ అవుతోండగా.. 'వీడియో ఆఫ్ ది డే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Karimnagar Pulse posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other News & Media Websites in Karimnagar

Show All