55news karimnagar

55news karimnagar 55news karimnagar

05/05/2025

దంపు యార్డుకు తరలిస్తున్న చెత్త వాహనాలను అడ్డుకున్న వరసిద్ధి కాలనీవాసులు.

డంపు యార్డ్ హటావో... కోతి రాంపూర్ బచావో నినాదంతో ఆందోళన....

*డంపు యార్డ్ సమస్య పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తాం...

డంపు యార్డ్ హటావో , కోతి రాంపూర్ బచావో నినాదంతో స్థానిక వరసిద్ధి కాలనీ ప్రజలు , నాయకులు శనివారం రోజున రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు వరసిద్ధి నగర్ కాలనీవాసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి , డంప్ యార్డ్ వద్ద చెత్త తరలింపు వాహనాలను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వరసిద్ధి కాలనీ వాసులు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో డంపు యార్డ్ వద్ద నిత్యం మంటలు చెలరేగుతున్నాయని, దట్టమైన పొగతో స్థానిక చుట్టుపక్కల ప్రజలు, కాలనీవాసులు చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నామని తెలిపారు. సరిగా ఊపిరి తీసుకోలేక అనేకమంది అస్వస్థత గురవుతున్నారని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల తో అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా వేసవి సెలవుల్లో పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి లేదని , పొగతో లేని వ్యాధుల బారిన పిల్లలు పడితే వారి భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపు యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం, అధికారులు , ప్రజా ప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోకపోతే , కోతి రాంపూర్ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు, వివిధ పార్టీల నేతల తో డంపు యార్డ్ సమస్య పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి తగిన కార్యాచరణతో ఆందోళన, పోరాట కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

04/05/2025

Mass Protest in Karimnagar Against Waqf Board | March from Telangana Chowrasta to Collector Office

04/05/2025

Mass Protest in Karimnagar Against Waqf Board | March from Telangana Chowrasta to Collector Office

28/02/2025

కరీంనగర్ లో ఆటో కూల్ కార్ డెక్కర్ జనరల్ ట్రేడింగ్ స్పేర్ పార్ట్స్ షాప్ ను ప్రారంభించారు హోల్సేల్ అండ్ రిటైల్ వాహనాలకు సంబంధించిన అన్ని పార్సులు మా వద్ద లభించును కరీంనగర్ అశోక్ నగర్ .ఎన్ .ఎన్ గార్డెన్ రోడ్ లో నూతనంగా ప్రారంభించారు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ రీబ్బన్ కట్ చేసి ఆటో కూల్ కేర్ టెక్కర్స్ షాప్ ను ప్రారంభించారు షాప్ యజమాని మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ మా వద్ద కార్లకు సంబంధించిన అన్ని రకాల డెక్కర్స్ వస్తువులు లభించును స్వచ్ఛమైన ధరలకు ఇవ్వగలం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాం హమ్మద్ హుస్సేన్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ మొహమ్మద్ సలీం పాషా బర్కత్వలి. ఆతిన. అలీబాబా మేరాజ్. సాజిత్ శీను మాజీ కార్పొరేటర్ సయ్యద్ షోయల్. షేక్ బిలాల్ షాపు ఓపెనింగ్ తర్వాత షాప్ కు సందర్శించిన ముఖ్య అతిథులు ఏసీబీ విజయ సారధి మరియు అబ్దుల్ గఫార్ లయన్ పాల్గొని మీడియాతో మాట్లాడారు

24/02/2025

సెంటర్,, కరీంనగర్

యాంకర్
కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలను చిన్నచూపు చూస్తుంది, అప్పర్ పాష

వాయిస్ ఓవర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు , టీచర్స్ కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదని , మైనార్టీలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు ఈ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు, టీచర్స్ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి మైనార్టీ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా తెలిపారు. ఆదివారం కరింనగర్ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్సర్ పాషా మాట్లాడుతూ పట్టభద్రులు , టీచర్స్ తో పెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మనవడ సాధించలేదన్నారు.బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి , మల్క కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీపరవేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మొహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజ్, సిద్ధిక్ షాదాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్, కార్యదర్శి సాబీర్, ఉపాధ్యక్షుడు సైద్, ఫయాజ్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.

20/02/2025

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC.*

JAC విజ్ఞప్తి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా(కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి జిల్లా,జగిత్యాల జిల్లా,సిరిసిల్ల జిల్లా,హుస్నాబాద్ జోన్) ల వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులకు,ఇంజనీర్లకు,బిల్డర్స్,ఆర్కిటెచ్చర్స్ లకు మరియు భవననిర్మాణ కార్మిక అన్ని సంఘాల సబ్యులకు నమస్కరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC తెలియజేయునది ఏమనగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము బిల్డింగ్ పెయింటర్ లము దాదాపుగా 50 వేల మందికి పైగా ఉన్నాము..ఇతర రాష్ట్రాల వలసలతో స్థానికంగా ఉన్న మాకు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..బిల్డింగ్ పెయింటింగ్ పనులు లేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది లారీ క్లీనర్లుగా,బంగ్లా లల్లో వాచ్మెన్లుగా, హోటలల్లో,పబ్బులల్లో, హాస్పటల్లో చిన్న చిన్న జీతాలకే పనులు చేసుకొని కుటుంబాలను వెళ్లదీస్తున్నారు..ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దొరకక మనస్తాపానికి గురై ఎంతో మంది బిల్డింగ్ పెయింటర్లు తనువు చాలిస్తున్నారు వారి కుటుంబాలు రోడ్డున పడి అనాధాలుగా మారుతున్నారు
మనమీద ఆంధ్రావాళ్ళ పెత్తనమేంది నీళ్లు,నిధులు,నియమాకాల కోసం శాతబ్దాల తరబడి ఆంధ్రావాళ్ళతో పెద్ద యుద్ధమే చేశాము అందులో మా కార్మికుల పాత్ర లేదా సకలజనుల సమ్మె-ధర్నాలు-రాస్తోరోకాలు-ర్యాలీలలో మేము పనులు బందు చేసి పాల్గొనలేదా..? రెక్కాడితే డొక్కాడని మేము పస్తులుండి తెలంగాణ ఉద్యమం లో పాల్గింటే అందరి పోరాటాల వలన తెలంగాణ వస్తే ఇక మా కార్మికుల బతుకులు బాగుపడతాయి అనుకున్నాము.. తెలంగాణా రాకముందు మా కార్మిక వ్యవస్థకు ఒక ఆంధ్రావాళ్ళతోనే ముప్పు ఉండేది కానీ ఇప్పుడు UP, బీహార్,మహారాష్ట ఇలా పలు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా కార్మికులు వచ్చి స్థానికంగా ఉన్న మా భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టుచున్నారు ఇది మమ్ముటికి రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే.. తెలంగాణ కు నీళ్లు వస్తే మాకు భూములు లేవు,నిదులు వస్తే మాకిచ్చే నాథుడు లేడు, నియామకాల జాడే లేదు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేక పై చదువులు మేము చదువలేదు..మరి మా భవన నిర్మాణ కార్మికులు ఎలా బ్రతకాలి..తెలంగాణ వచ్చాక మన నీళ్ల వాటా మనకి వచ్చింది..తెలంగాణ అందరి ప్రజల స్థూలకాయ ఆదాయం తో చెక్ డ్యామ్ లు నిర్మిస్తే ఇట్టి నీళ్లతో భూస్వాములు అందరూ పాడి పంటలు పండించి బాగుపడి కొత్తగా ఇళ్ళు నిర్మించుకుని స్థానికంగా ఉన్న బిల్డింగ్ పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్తగా ఇల్లు కడితే స్థానికంగా ఉన్న పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు.. తెలంగాణ వచ్చాక అత్యంత లబ్ది పొందినది రాజకీయనాయకులే వాళ్ళు ఇల్లు కట్టిన కూడా స్థానికంగా ఉన్న పెయింటర్లకి పనులు ఇవ్వడం లేదు ఇది ఎంతటి దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి..మీకోసం భవననిర్మాణ కార్మికులమైన మేము తెలంగాణ ఉద్యమం లో మా కార్మిక కుటుంబాలు ప్రాణాలర్పించి-తెగించి-కొట్లాడి-పోరాడి ఉద్యమాలు చేస్తే మీ ఇంటి నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న మాకు ఇచ్చి మమ్మల్ని మీరు ఆదుకోవడం లేదు..మీమేమి మీ భూములు అడగడం లేదు, మీ ఉద్యోగాలు గుంజుకోవడం లేదు, మీ రాజకీయ పదవులు మాకివ్వమని అడగడం లేదు..జెర మాకు పని కల్పించండి అని మాత్రమే అడుగుతున్నాము...మా పనులు ఇతర రాష్ట్రాల వారు లాక్కున్నట్లే మీ భూములు-మీ ప్రభుత్వ ఉద్యోగాలు-మీ రాజకీయ పదవులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి లాక్కుంటే మా బాధ మీకు అర్థం అయ్యేది..మీకు కొన్ని జి.ఓ లు ఉండి లోకల్ క్యాన్డేట్స్ మాత్రమే అర్హులు అని చట్టబద్దత ఉంది కదా ఇంకా తెలంగాణ వచ్చి మీకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పడ్డది..మా కార్మికులకు అలా లేదు..అందుకే ఇకనుండి ఆ దిశగా మా పోరాటాలు కూడా కొనసాగిస్తాము... లేకపోతే మా బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి.. మా కార్మిక కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ..మా కార్మికుల కోసం మీరు మీ-మీ సొంత ఇళ్ల పెయింటింగ్ పనులు స్థానికంగా ఉన్న వారికి ఇవ్వలేరా..ఒక్కసారి ఆలోచించండి
ఇతర రాష్ట్రాల పెయింటర్లు ఉదయం ఒక గంట ముందుగా పనికి వచ్చి సాయంత్రం ఒక అరగంట ఎక్కువ పని చేస్తారు..అంతే తప్ప వారు చేసే పని నీట్ గా ఉండదు ఇతర రాష్ట్రాల వారు ఒక లేబర్ రెండు రోజులు చేసే పనిని మన లోకల్ పెయింటర్ ఒక రోజులో చేస్తాడు మళ్ళీ వర్క్ నీట్ గా ఉంటుంది టచ్చాప్ వర్క్ ఉండదు..ఇతర రాష్ట్రాల వారికి ఉడ్ పాలిష్ పని సరిగా రాదు,గోవా కట్టెల మీద పని చేయరు,జూలా తాడు దిగరు..స్ప్రే వర్కు సరిగ రాదు..ఇతర రాష్ట్రాల పెయింటర్లు 20 సంవత్సరాల లోపు ఉన్నవారే 80% శాతం ఉంటారు వీరికి పని అనుభవం ఉండదు వీరి మైండ్ మెచ్యురై ఉండదు వీరివల్ల ఇంట్లో ఆడవారికి చాలా ప్రమాదం అక్కడక్కడ అవాంఛిత సంఘటనలు కూడా జరుగుతున్నాయి..వీళ్ళు టెర్రరిష్టా,లంగా,దొంగా తెలియదు..ఇవ్వాళ్ళ ఈ జిల్లా, రేపు ఏ జిల్లో లేక ఏ రాష్ట్రంలో ఉంటారో ఎవరికి తెలియదు సిమ్ మార్చితే వాళ్ళు మీకు దొరుకరు..ఇతర రాష్ట్రాల వారు చేసే పనులన్నీ కమీషన్ల దందానే కమిషన్ లు గుప్పించి మీ వర్క్ నాణ్యతను పోగొడుతున్నారు..ఇవన్నీ మీకు తెలియాలంటే కొన్ని సంవత్సరాల టైమ్ పడుతుంది అంతలోపు మీకు జరిగే నష్టం జరుగుతుంది..మా స్థానిక పెయింటర్ల కు ఉపాధి లేకుండా పోతుంది
తెలంగాణ ఉద్యమం ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మా స్థానిక బిల్డింగ్ పెయింటర్ల కి పనులు కల్పించండి..ఈ ప్రభుత్వాల మీద మాకు ఎలాగూ నమ్మకం లేదు..ఈ ప్రభుత్వం మాకు పని కల్పించదు-ఇతర రాష్ట్రాల వారిని అరికట్టదు ..జర మా గోస ఆలకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులు,ఇంజనీర్లు,బిల్డర్లు,ఆర్కిటెచర్స్ భవన నిర్మాణ అన్ని సంఘాల అన్నలు స్థానికంగా ఉన్న మా బిల్డింగ్ పెయింటర్లకే పనులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నాము

ఇట్లు
*అంబాల ప్రభాకర్*
అధ్యక్షులు
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల JAC*

- *బిజెపికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు* - *కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యల పరిష్కారం*- *పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
19/02/2025

- *బిజెపికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు*

- *కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యల పరిష్కారం*

- *పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్*

*కామారెడ్డి* : ఈనెల 27న జరిగే కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్స్పష్టం చేశారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడారు..

ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కా రమవుతాయని పేర్కొన్నారు. కరీంనగర్- మెదక్ - ఆదిలాబాద్- నిజా మాబాద్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఆదరించి గెలిపిస్తే అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అంది స్తుందన్నారు. నరేందర్ రెడ్డి స్థానికుడని, పట్టభద్రులంతా ఈ విషయాన్ని గమ నించి అందుబాటు లో ఉన్న వారిని ఎన్నుకోవాలని కోరారు. స్థానికేతరులకు ఓటు వేసి వృథా చేసు కోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ వస్తుందని, విద్యావంతులంతా ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తుందన్నారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.విద్యావేత్త నరేందర్ రెడ్డి కి ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లి పరిష్కరించే సత్తా ఆయనకే ఉందని అధికార కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని అబద్దాలు,అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఓట్ల కోసం వస్తున్న నాయకుల మాటలు నమ్మవద్దని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

- *సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు*

- *స్థానికంగా అందుబాటులో ఉండి సేవ చేస్తా*

- *ఓట్ల కోసం వచ్చి పారాచుట్ లీడర్లను నమ్మవద్దు*

- *ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి*

పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమ విద్యాసంస్థలు ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువులు అందించామని, రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు రాయితీ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించా రు. దాదాపు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గిట్టని వాళ్ళు చేసే అసత్య ఆరోపణలు పట్టభద్రులు నమ్మవద్దని కోరారు...ఈకార్యక్ర మంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు

*తేదీ : 22-12-2024,* *కరీంనగర్.* *కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్షన్ సెంటర్ మరి...
22/12/2024

*తేదీ : 22-12-2024,*
*కరీంనగర్.*

*కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్షన్ సెంటర్ మరియు ది కాప్ కెఫె లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్.*

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్షన్ సెంటర్ మరియు ది కాప్ కెఫె లను ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ప్రారంభించారు. కరీంనగర్ పోలీసుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన అస్త్ర ఏ సి కన్వెన్షన్ సెంటర్ మరియు ది కాప్ కెఫెలు అధికారులకు మరియు సిబ్బందికి అత్యంత తక్కువ ధరల్లో అందించేలా చర్యలు తీసుకున్నందుకుగాను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ అస్త్ర కన్వెన్షన్ సెంటర్ నగరం నడిబొడ్డున గల కమిషనరేట్ కేంద్రంలో 1100 గజాల స్థలంలో 6500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణం లో నిర్మిచామన్నారు.ఈ హాలును సిబ్బంది యొక్క కుటుంబ శుభకార్యాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా రోజు వారి విధుల్లో నిత్యం బిజీగా వుండే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి అత్యంత నాణ్యతతో కూడిన ఆహరం, స్నాక్స్ , అల్పాహారం అందించేలా 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ది కాప్ కేఫ్ ని నిర్మించామన్నారు. ఈ రెండింటిని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నిర్మించామని తెలిపారు. సోమవారం నుండి ఈ రెండు కరీంనగర్ పోలీసులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి ఐ జి రమా రాజేశ్వరి, ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మి నారాయణ , కమిషనరేట్ లోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, అన్ని విభాగాల అధికారులతో పాటు సీపీఓ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

*ఈరోజు మంత్రి ప్రభాకర్ అన్న గారి తో సాయంత్రపు నడక హుస్నాబాద్ లో నేను. మహమ్మద్ తాజోద్దీన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ మైనారి...
10/12/2024

*ఈరోజు మంత్రి ప్రభాకర్ అన్న గారి తో సాయంత్రపు నడక హుస్నాబాద్ లో నేను. మహమ్మద్ తాజోద్దీన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ కరీంనగర్*

05/10/2024

*ముస్లింల అభివృద్ధికై కార్యాచరణ ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.*

*మైనారిటీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై స్పందించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా మైనారిటీల పక్షాన ధన్యవాదాలు*

*ఇటీవల హైదరాబాద్ సచివాలయం వేదికగా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కరీంనగర్ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్. ఏ. మోసీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్. ఏ. మూసిన్ గారు మాట్లాడుతూ..*

ఈనెల, అక్టోబర్ 1న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన హైదరాబాద్ లోని సచివాలయంలో ముస్లిం ప్రముఖులు కరీంనగర్ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్.ఏ. మోసీన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మజర్ మొహియుద్దీన్, అబూబకర్ ఖాలీ, ఫసియుద్దిన్ నవాబ్, తదితర నేతలు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మైనారిటీల సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని మైనారిటీ సమస్యలపై స్పందించడంతో పాటు ఇతర జిల్లాల నుంచి రాజధాని నగరానికి వచ్చి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ముస్లిం విద్యార్థులకు ఆధునిక వసతులతో హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి నగరంలో మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఒక బోర్డు కు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ భవన నిర్మాణం, ఆక్రమణకు గురైన ఖాజీపూర్ లోని 55 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములపై విచారణ చేపట్టి తిరిగిఆ భూములను వక్ఫ్ బోర్డ్ కు అప్పగించి పర్యవేక్షించడం తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చిన ఇచ్చినందుకు కరీంనగర్ జిల్లా ముస్లిం మైనారిటీల పక్షాన, మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు హాజీ భాయ్, నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హైమద్, కరీంనగర్ రూరల్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు శబాజ్ ఖాన్, బొమ్మకల్ ఎంపీటీసీ పాషా, తదితరులు పాల్గొన్నారు.

04/10/2024

పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ పండితుల అభినందన సభ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ తెలంగాణ ఈరోజు పెద్దపల్లిలో . సిరి ఫంక్షన్ హాల్ లో ఉపాధ్యాయ పండితుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎం రామ్ రెడ్డి ఏ సి జి ఈ వి హనుమంతరావు డాక్టర్ బి ఎం పి ఎం .షేక్ ఏ ఎం ఓ పెద్దపల్లి గారు సభ అధ్యక్షులు కనకయ్య సార్టుటు . కనకయ్య ఆర్ యు పి పి టి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రెటరీ ఎండి సమీయుల్లా ఖాన్ ప్రత్యేక ఆహ్వానితులు ఎండి అబ్దుల్లా గారు ఆర్ యు పి పి టి రాష్ట్ర అధ్యక్షులు టీ . కాంత కృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆగయ్య.మండల నోడల్ ఆఫీసర్ పెద్దపెల్లి జిల్లా ఆహ్వానితులు శ్రీమతి డి సునీత గారు ఎం ఈ ఓ బెజ్జూర్ కె . రామచంద్రం జిహెచ్ఎం పెద్దపెల్లి శ్రీమతి నరేండ్ల సునీత గారు జిహెచ్ఎం కాల్వ శ్రీరాంపూర్ ఈ కార్యక్రమంలో తెలుగు హిందీ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి యాంకరింగ్ గా అభినందన సభను ముందుకు నడిపించిన హిందీ పండిత్ ఉపాధ్యాయులు ఎండి హఫీజ్ గారు పాల్గొన్నారు

*కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అలకాపురి వాకర్స్ ను కలిసి* *ఓటర్ నమోదు చ...
04/10/2024

*కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అలకాపురి వాకర్స్ ను కలిసి* *ఓటర్ నమోదు చేసుకుని తనకు* *మద్దతు తెలుపవలసిందిగా*
*విజ్ఞప్తి చేశారు*

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when 55news karimnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 55news karimnagar:

Share