Mark TV Telugu

Mark TV Telugu MARK Media Telugu provides complete information about the Telugu News, Film News/Interviews and Polit

26/05/2024

ఆస్తికోసం వృద్ధురాలు కిడ్నాప్ ..
Follow Us : https://www.youtube.com/
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు రామాలయం సమీపంలో గత ఆదివారం ఆస్తికోసం తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వృద్ధురాలు అని కూడా చూడకుండా తనపై భౌతిక దాడికి పాల్పడి స్వర్ణాభరణాలు అపహరించి ఆస్తి కాజేసేందుకు కుట్రలు పన్నారంటూ ఆరోపిస్తూ మన్నూరు రామాలయం సమీపంలో నివసిస్తున్న కుడుమల లక్ష్మీనరసమ్మ శనివారం తన నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బోరున విలపించింది. మీడియాతో లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ తనకు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని ఇద్దరు కుమారులు సంతానమని, వీరిలో చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి మంటపం పల్లె వాసి అయిన రేవతి తో సుమారు తొమ్మిది ఏళ్ల క్రితం వివాహం జరిపించామని తెలిపారు. వివాహం అవ్వగానే నూతన దంపతులు కడపలో వేరు కాపురం ఉంటూ వివాహమైన ఒక మాసానికే ఇద్దరూ కువైట్ కు వెళ్ళారని, అక్కడ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు రావడంతో కొడుకు, కోడలు విడిపోయారని తెలిపారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన కోడలు రేవతి తనతో తరచూ గొడవ పడుతూ కోడలిపై హత్యాయత్నం చేశానని అభాండం వేసి తనను సెంట్రల్ జైలులో వేయించి నేటికి వాయిదాలకు తిప్పుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం తన కోడలు రేవతి బంధువులను తీసుకొచ్చి మన్నూరు లోని తన నివాసం ఎదుట తనను కిడ్నాప్ చేసి ముసుగు తొడిగి రాయచోటికి తీసుకెళ్లి నాలుగు రోజులు పాటు చిత్రహింసలు చేసి బుధవారం విడిచిపెట్టారాని విలపించారు. వృద్ధురాలని కూడా చూడకుండా తనపై చేయి చేసుకోవడమే కాక, నాలుగు తులాల సరుడు, ఐదు గ్రాముల కమ్మలు, ఒక సెల్ ఫోన్ ను దౌర్జన్యంగా అపహరించారని ఆరోపించారు. కువైట్ లో ఉన్న తన చిన్న కుమారుడిని స్వదేశానికి పిలిపించి ఆస్తి తన పేరిట రాయించాలని, లేకపోతే చంపుతామని బెదిరించారని, భర్త మరణించి మన్నూరులో ఒంటరిగా ఉన్న తనపై హత్యాయత్నం చేసేందుకు కోడలు కుట్ర పన్నుతోందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తనపై జరిగిన కిడ్నాప్ పై తన కుమారుడు శ్రీనివాసులు రెడ్డి ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు స్పందించి తన కోడలి నుంచి తనకు రక్షణ కల్పించి, కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు కూడా ఈ కిడ్నాప్ కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.

19/05/2024

టిడ్కో గృహల వద్ద కార్డెన్ సెర్చ్..
Follow Us : https://www.youtube.com/
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాల వద్ద ఆళ్లగడ్డ డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత నాయక్ సిరివెళ్ల సిఐ చంద్రబాబు, ఎస్ఐలు నగీన, నరసింహులు, రామాంజనేయరెడ్డి, మరియు పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి కార్డెన్ సెర్చ్ ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు. అలాగే నూతన వ్యక్తుల సంచారం ఉంటే పోలీసు వాళ్లకి తెలిపాలని అక్కడి డిఎస్పి షర్ఫుద్దీన్ ప్రజలకు సూచించారు.

13/05/2024

ఎన్నికలకు సర్వం సిద్ధం ..
Follow Us : https://www.youtube.com/MarkTVTelugu
ఆళ్ళగడ్డ నియోజకవర్గం మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో రేపు జరిగే ఎన్నికలకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు EVM యంత్రాలు, బ్యాలెట్ పత్రాలను ఎన్నికల అధికారులు సిబ్బందికి అందజేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది.అదే విధంగా చాగలమర్రి మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య : 40,627 , పురుషుల ఓటర్ల సంఖ్య : 20,186 , మహిళ ఓటర్ల సంఖ్య : 20,439 .స్థానిక ఎస్ ఐ రమణయ్య ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో రేపు జరగబోయే ఎన్నికలకు మార్కెట్ నిర్వహించరాదని తెలియజేశారు.

03/05/2024

గ్రామాల్లో అమిలినేని రోడ్ షో..
Follow Us : https://www.youtube.com/Mark TV Telugu
సెట్టూరు మండలం చింతలపల్లి, ముచ్చర్లపల్లి, కనుకూరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు హారతులు పట్టి సురేంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఐదేళ్లు పాలకులుగా ఉండి కూడా మంత్రి కనీసం రోడ్లు వేయించలేదని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు వైకాపా అభ్యర్థి రంగయ్య తాను మంచి వాడిని, ఉద్యోగస్తుడని కళ్లి బుల్లి మాటలు చెప్పే ఓట్లు అభ్యర్థిస్తున్నాడని అన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉండే ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు ఓటేస్తారా అభివృద్ధి అజెండాగా పెట్టుకుని పల్లె పల్లె తిరుగుతున్న తనకు ఓటేస్తారా ఆలోచించుకోవాలని ప్రజలకు విన్నవించారు. 13వ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తనని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.

01/05/2024

అమిలినేని రోడ్ షో అదుర్స్..
Follow Us : https://www.youtube.com/Mark TV Telugu
ప్రజాదరణ పొందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు హర్షం వ్యక్తం చేశారు. టిడిపి మ్యానిఫెస్టో, సొంత అజెండాతో తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి,పోలేపల్లి, బైరావానితిప్ప, పలు గ్రామాల్లో టీడీపీ రోడ్ షో నిర్వహించారు. గ్రామస్తులు , పార్టీ శ్రేణులు టిడిపి కు అపూర్వస్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిలినేని సురేంద్రబాబు బిటిపి ప్రాజెక్టును సందర్శించారు.

01/05/2024

కురువ ఆత్మీయ సమ్మేళనం..
Follow Us : https://www.youtube.com/
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా బీసీలను అణగదొక్కుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కర్నూలు టిడిపి ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం ఆదోనిలో కురువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు, ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, జనసేన ఇన్చార్జ్ మల్లప్ప తదితర టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు ,పార్థసారథి మాట్లాడుతూ.... రాష్ట్రంలో బీసీలను ఎదగనీయకుండా సీఎం జగన్ కుట్రలు చేశారని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని, బీసీలను అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించకుండా అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ బీసీ, వర్గాలకు సమన్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం, బిజెపి, పార్టీలని కొనియాడారు. బీసీలంతా ఏకమై ఈ ఎన్నికల్లో తమ ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కురువ సంఘం నాయకులు, బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

01/05/2024

ప్రచారంలో అంబటి దూకుడు..
Follow Us : https://www.youtube.com/
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తు ప్రభంజనం సృష్టించడం ఖాయమని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు , వైయస్సార్సీపీ నియోజకవర్గ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు . సోమవారం నకరికల్లు మండలంలోని కండ్లకుంట, చాగల్లు గ్రామాలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చాగల్లు గ్రామంలో స్థానిక మహిళలు ఆయనకు విశేషంగా ఎదురేగి హారతులు ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చారు. వీధి వీధినా ప్రచార రథంపై అంబటిని ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు జేజేలు పలికారు. ప్రార్ధన మందిరాలకు అంబటి వెళ్లి ప్రత్యేక పూజలు,ప్రార్ధనలు చేశారు. డిజె డప్పుల సవ్వడితో5 గ్రామమంతా పండుగ వాతావరణ నెలకొంది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నానని, ఈ ఐదేళ్ల కాలంలో ధర్మబద్ధంగా నడుచుకుని సుపరిపాలనను అందించానన్నారు. అక్రమాలు చేయలేదని, దౌర్జన్యాలను సహించలేదని, రౌడీయిజాన్ని అణచి వేసి ప్రశాంతమైన వాతావరణాన్ని అందించానన్నారు. ఈ 48 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాలు , ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా చాగల్లు గ్రామానికి రూ. 15.73 నిధుల లబ్ధి చేకూరిందన్నారు. నియోజకవర్గంలో కూటమిగా వచ్చినా, కట్టకట్టకు వచ్చిన విజయం మనదేనన్నారు. ఈ సంక్షేమాభివృద్ధి లక్ష్యం ముందుకు సాగాలి అంటే మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నియోజవర్గములో నన్ను , పార్లమెంటులో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని అంబటి అభ్యర్థించారు. ప్రచారంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి , స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు , వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు

01/05/2024

పార్టీ గుడ్. లీడర్స్ వేస్ట్..
Follow Us : https://www.youtube.com/
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో వైకాపా నాయకులు గడికోట సుబ్బారెడ్డి నాగిరెడ్డిపల్లె పంచాయతీ వార్డ్ మెంబర్లని సమావేశ పరిచి తమ పైన ఆరోపణలు చేస్తున్నారని ఆ వ్యాఖ్యలను ఖండించిన మాజీ నాగిరెడిపల్లె పంచాయతీ సర్పంచ్ జంబూ సూర్య నారాయణ మరియు మాజీ వక్స్ బోర్డు చైర్మన్ సయ్యద్ అమీర్. ఇరువురు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మేము పార్టీ నచ్చక మారలేదని రాజంపేటలో ఉన్న వైకాపా నాయకుల తీరు నచ్చక మారామని అన్నారు. మేము ఎవ్వరికీ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయమని అడగలేదు. సర్పంచ్ గా నేను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి అందరూ వార్డు మెంబర్ ల నుంచి కరపత్రాల వరకు ప్రతి పైసా నేనే పెట్టుకున్న అని అలాగే మా తోనే వైకాపా లో ఉన్నప్పుడు సర్పంచిగా ప్రచారం చేస్తున్నప్పుడు మా వెనుక తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయమని చెప్పారు అని జంబూ సూర్య నారాయణ ఉద్ఘాటించారు. ఇలా చేస్తున్న మీతో కలిసి ఎలా ప్రయాణం చేయాలన్నారు. కాబట్టి నాగిరెడ్డి పల్లె ప్రజలు మీరు అన్నీ గమనించి ఎవరి మాటలకు లోబడకుండ మీ ఓటు హక్కును సరైన పద్ధతిలో వాదమన్నారు.

01/05/2024

జోష్ లో అమిలినేని
Follow Us : https://www.youtube.com/
అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో చిన్నంపల్లి, బొచ్చుపల్లి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి హారతులు పట్టి గజమాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా టిడిపి కూటమి అభ్యర్థి సురేంద్రబాబు
మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగారు. అంతేకాకుండా కళ్యాణదుర్గం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలకు నాణ్యమైన రోడ్లు వేయిస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. వైసిపి అభ్యర్థి తలారి రంగయ్య ప్రస్తుత పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఆయన కళ్యాణదుర్గాన్ని పట్టించుకోని పాపాన పోలేదన్నారు.
ఉమామహేశ్వర నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపి అరాచకాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కావున మే 13 వ తారీఖున అసెంబ్లీ అభ్యర్థి అయిన నేను అలాగే పార్లమెంటు అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణ బలపర్చాలని ఆయా గ్రామ ప్రజలను కోరారు.

24/04/2024

జగ్గంపేట బరిలో బీఎస్పీ..
Follow Us : https://www.youtube.com/
జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి జుత్తుక నాగేశ్వరావు (BSP)నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఉదయం 11 .17 నిమిషములకు తన నామినేషన్ పత్రాలను జగ్గంపేట ఎన్నికల అధికారి యం. శ్రీనివాస్ కు అందజేశారు.

20/04/2024

రాజంపేట టిక్కెట్ నాకివ్వాల్సిందే..
Follow Us : https://www.youtube.com/
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో గల బత్యాల భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు మీడియా మిత్రులతో మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ని కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాను.కుప్పంలో నాకే రాజంపేట సీట్ అని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు . ఆఖరికి సీటును రాయచోటి వాస్తవ్యుడు అయిన సుగవాసి బాల సుబ్రమణ్యంకు కేటాయించారు.
ఆదివారం నాడు కలవమని అధిష్ఠానం నుండి పిలుపు.
నాకు జరిగిన అన్యాయం గుర్తించి ఇప్పటికైనా నాకు సీటు ఇచ్చి నన్ను ఆదరించండి అని అడగడానికి వెళ్తున్నాను.
నేను వైకాపాలో కానీ,కాంగ్రెస్ లో కానీ చేరుతానని లేకపోతే ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేస్తానని చాలా పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి.నేను ఒక వ్యక్తిని అగౌరవంగా మాట్లాడను అని అన్నారు. నేను అగౌరవంగా మాట్లాడలేదు నేను ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళని మందలిస్తాను.మా కార్యకర్తల అభిప్రాయాలను కనుక్కుంటే చాలా మంది నన్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయమన్నారు.ఇంకొంత మంది మేము ఈ పార్టీ లో ఉండలేము అన్నారు.కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రేపు చంద్ర బాబు నాయుడుతో మాట్లాడి ఆయన మనుసు మార్చుకొని నాకు సీటు కేటాయిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

20/04/2024

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి విశేష పూజలు
Follow Us: https://www.youtube.com/Mark TV Telugu
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన ప్రతి శుక్రవార పూజ .పూజారి పుల్లేటికుర్తి రాధాక్రిష్ణ ఆధ్వర్యములో విశేష పూజలు జరిపారు.మహిళల ఆధ్వర్యములో శ్రీ లలిత సహస్రనామం మరియు అమ్మవారికి వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు.అదే విధంగా ఉభయదారులు కూరపాటి లక్ష్మీనారాయణ ధర్మపత్ని సునితాలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ , కమిటీ సభ్యులు , భక్తులు , తదితరులు పాల్గొన్నారు.

19/04/2024

హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్
Follow Us : https://www.youtube.com/
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఉదయం శ్రీ సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
అనంతరం సాయంత్రం సుగురు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుండి వాల్మీకి సర్కిల్, చిన్న మార్కెట్, గాంధీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు
ర్యాలీ ఆద్యంతం జై బాలయ్య జై జై బాలయ్య మీ నాన్నగారితో పురం మారుమ్రోగింది ర్యాలీ కొనసాగినంతసేపు ప్రజలకు బాలకృష్ణ అభివాదం చేశారు .తెలుగుదేశం భారత జనతా పార్టీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య ర్యాలీ అట్టహాసంగా జరిగింది.

19/04/2024

ప్రచారంలో సుగవాసి దూకుడు
Follow Us: https://www.youtube.com/Mark TV Telugu
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. నందలూరు మండలంలోని పాటూరు గ్రామంలో రాజంపేట నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పాటూరు గ్రామానికి విచ్చేసిన బాలసుబ్రమణ్యంకు జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య బాణాసంచాలు పేలుస్తూ పూలతో ఘనంగా స్వాగతం పలికారు. సీతారాముల ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడినుంచి సుబ్రమణ్యం ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో జరిగిన అరాచకాలు, ప్రజల పట్ల ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య విధానాలకు ప్రజలు వ్యతిరేకిస్తూ మాకు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో మా కూటమి ఘనవిజయం సాధిస్తుందని రాజంపేటలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఎద్దల సుబ్బరాయుడు, దుర్గాప్రసాద్, శివరామరాజు, సమ్మెట శివప్రసాద్, షబ్బీర్ అహ్మద్, పోలి సుబ్బారెడ్డి, అరిగె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

19/04/2024

సుగవాసికి మలిశెట్టి మద్దతు
Follow Us: https://www.youtube.com/
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మల్లిశెట్టి భవన్ లో మల్లిశెట్టి వెంకట రమణ ఆహ్వానం మేరకు రాజంపేట ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రమణ్యం ఆత్మీయ సమావేశానికి హాజరు అయ్యారు. మొదటగా మల్లిశెట్టి వెంకట రమణ మీడియా తో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న నాయకులు రాజంపేటని జిల్లా కేంద్రం చేయలేకపోయారు, మెడికల్ కాలేజీ ని పోగొట్టుకున్నారు. కావున ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజంపేట ని అభివృధి చేయాలని కోరారు. అలాగే జనసేన ప్రతి కార్యకర్త సుగవాసి వెన్నంటే ఉంటారని మాట ఇచ్చారు. సుగవాసి బాల సుబ్రమణ్యం మీడియా తో మాట్లాడుతూ ఇప్పుడు రాజంపేట లో తను జరుపుతున్న ప్రచారంలో ప్రజల ఆదరణ చూస్తుంటే వైకాపా పరిపాలన పైన జనాలు ఎంత అసమతి తో ఉన్నారో తెలుస్తుంది. తనను అధిక మెజారిటీ తో గెలిపిస్తే మెడికల్ కాలేజీ వచ్చే విధంగా చూస్తానన్నారు. మొదటి లేకా రెండవ వార్షిక సంవత్సరాలలో అన్నమయ్య ప్రాజెక్టు ని త్వరిత గతిన పూర్తి చేయటానికి తనవంతు కృషి చేస్తామన్నారు. అలాగే ప్రజల కోరిక అయినటువంటి రాజంపేట జిల్లా కేంద్రంగా మార్చటానికి అసెంబ్లీ లో తన గొంతుకనిస్తానన్నారు.

19/04/2024

రాష్ట్రంలో మార్పు రాబోతోంది..
Follow Us : https://www.youtube.com/
జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన, బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నామినేషన్ నిరాడంబరంగా వేశారు.

ముందుగా జగ్గంపేట గ్రామదేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడే నామినేషన్ పత్రం పై సంతకం పెట్టి అక్కడనుండి ఐదుగురు సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షత న 4000 మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రానున్న 24 రోజులు అత్యంత కీలకమని ఈనెల చివరిదాకా గ్రామాల్లో యువ గళం, దళిత గళం, మహిళా శక్తి, బీసీ గళం, నవీన్, లక్ష్మీదేవి, తోట సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకు చరమ గీతం పాడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు. జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూను, నన్ను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు అభివృద్ధికి సహకరించాలని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనేక పరిశ్రమలు తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, నాలుగు మండలాల టిడిపి,జనసేన పార్టీ అధ్యక్షులు, టిడిపి జనసేన బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

19/04/2024

రాక్షసపాలన అంతం కావాలి
Follow Us : https://www.youtube.com/
జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సైకిల్ రోజురోజుకు స్పీడు అందుకుంటుంది. గత 6 నెలల కాలంగా జ్యోతుల నెహ్రూకు మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది. అందులో భాగంగా గురువారం కిర్లంపూడి మండలం గోనేడ సర్పంచ్ అల్లు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ లో చేరారు. వీరందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీ కండువలను కప్పి టీడీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సంధర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గోనేడ సర్పంచ్ అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో 1000 మంది పార్టీలో చేరడం ఈ వైసిపి చేస్తున్న రాక్షస పరిపాలనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని రేపు రాబోయే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ నేతృత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు, మహిళా శక్తి పథకాలు, బీసీ డిక్లరేషన్, అవ్వ తాతలకు 4000 పెన్షన్, వికలాంగులు 6000పెన్షన్, రైతులకు కౌలు రైతులకు 20,000 ఆర్థిక భరోసా వంటి సంక్షేమ పథకముతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ నికి కట్టుబడి పరిపాలన అందిస్తుందని తెలుగుదేశంపార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఎప్పుడూ అండగా ఉండి అభివృద్దికి సేవకుడిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. ఈ 25 రోజులు సమిష్టిగా పనిచేసి ఈ రాక్షస పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. నాలుగు అంశాల ప్రామాణికంగా విద్యా వైద్యం, సాగునీరు త్రాగునీరు, ఉద్యోగ ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తాను అన్నారు. ఏలేరు ఆధునీకరణ చేసి ఏటిపట్టి గ్రామాలన్నిటికీ సాగునీరు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, తోట రవి, తోట గాంధీ, నీలం శ్రీనివాస్, పోతుల మోహనరావు, అడబాల వెంకటేశ్వరరావు, అరట పోలీస్, కంచు మూర్తి రాఘవ, అధిక సంఖ్యలో టిడిపి, జనసేన, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Address

Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when Mark TV Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mark TV Telugu:

Videos

Share