Express News 24X7 Telugu HD

Express News 24X7 Telugu HD Express News 24x7 is Web based News Channel under the Spoorthy Media Group Private Limited, Flat No: https://www.youtube.com/channel/UC-YASiF_7eQMvreUvSlOVKg

13/10/2024

జనసేనలోకి రాపాక వరప్రసాద్..?
ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జనసేన నేతలు నిర్వహించిన ఓ కార్యక్రమానికి సమావేశానికి రాపాక వరప్రసాదరావు కూడా హాజరయ్యారు. గతంలో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆయనకు అక్కడ గుర్తింపు లభించకపోవడంతో మళ్లీ జనసేన గూటికి చేరుతున్నారట?

13/10/2024

ముగిసిన మద్యం టెండర్ల ధరఖాస్తు ప్రక్రియ. విదేశాలనుంచి కూడా ఆన్లైన్లో ధరఖాస్తులు. 3396 మద్యం షాపులకు గాను రికార్డ్ స్థాయిలో 89,882 దరఖాస్తులు. దాఖలైన దరఖాస్తుల ప్రకారం ప్రతి షాపునకు సగటున 25నుంచి 26 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ధరఖాస్తులలోనే ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం.

fake account Again Report the Profile, Block & Dont Donate
11/10/2024

fake account Again
Report the Profile, Block & Dont Donate

Life doesn't get easier, you just get stronger.
05/10/2024

Life doesn't get easier, you just get stronger.

సనాతనుడి నాటి మాట?
04/10/2024

సనాతనుడి నాటి మాట?

04/10/2024
Very Happy Birthday wishes from Andhra Pradesh to the Beloved Leader, Dynamic Professional, Simplest Personality, but a ...
28/09/2024

Very Happy Birthday wishes from Andhra Pradesh to the Beloved Leader, Dynamic Professional, Simplest Personality, but a Super Mentor - IPGA NATIONAL PRESIDENT - Dr. Atul Kumar Nasa ji - Warmest wishes to you on your very special day

ఈరోజు బీఆర్కె స్హానల్ లో నా డిబేట్... మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి. రాజకీయాల్లో లేను... వదిలేసాను. అని కూడా చెప్పా!
25/09/2024

ఈరోజు బీఆర్కె స్హానల్ లో నా డిబేట్... మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి. రాజకీయాల్లో లేను... వదిలేసాను. అని కూడా చెప్పా!

YCP Leader Annapureddy Vijay | Tirumala Laddu Issue | BRK NewsBRK News, BRK LIVE, BRK News live,BRK breaking news,ap bre...

21/09/2024

జగన్ పాలనపై సచ్చిదానంద సంచలన వ్యాఖ్యలు Sri Ganapati Sachidananda Comments On AP CM YS Jagan Ruling

Express News 24x7 Video 2 years Ago:  జగన్ పాలనపై సచ్చిదానంద సంచలన వ్యాఖ్యలు Sri Ganapati Sachidananda Comments On then ...
21/09/2024

Express News 24x7 Video 2 years Ago: జగన్ పాలనపై సచ్చిదానంద సంచలన వ్యాఖ్యలు Sri Ganapati Sachidananda Comments On then AP CM YS Jagan Ruling:

జగన్ పాలనపై సచ్చిదానంద సంచలన వ్యాఖ్యలు Sri Ganapati Sachidananda Comments On AP CM YS Jagan Ruling

27/11/2023

Good Morning! Wars and armed conflicts not only claim human lives but also inflict substantial harm on the environment. Water, soil, and other natural resources suffer severe damage, jeopardizing the secure livelihood of future generations.

Read my article in today’s Eenadu: https://www.eenadu.net/telugu-news/vyakyanam/general/1302/123219593

భద్రమైన జీవనం... యుద్ధాలతో ఛిద్రం

By Srinivas Ganjivarapu

యుద్ధాలు, సాయుధ ఘర్షణలు ప్రజల ఆయువులను హరించడంతో పాటు ప్రకృతికీ తీరని నష్టం కలిగిస్తున్నాయి. నీరు, నేల, ఇతర సహజ వనరులు వాటివల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా, భవిష్యత్తు తరాల భద్రమైన జీవనం ప్రమాదంలో పడుతోంది. నవ చరిత్రలో వివిధ తెగలు, సమూహాలు, ప్రాంతాలు, దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత సాయుధ మిగిల్చాయి. నిరుడు మొదలైన రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇజ్రాయెల్-హమాస్ పోరు సైతం వాటిని కళ్లకు కడుతున్నాయి. యుద్ధాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనోపాధులు ఛిన్నాభిన్నమై ఎందరో నిరాశ్రయులుగా మిగులుతున్నారు. యుద్ధాలు, సాయుధ ఘర్షణల వల్ల ప్రకృతి వనరులకు, జీవవైవిధ్యానికీ అపార నష్టం వాటిల్లుతోంది.

ఆహార భద్రతకు తూట్లు

భూభాగం, నీరు, చమురు, బంగారం, వజ్రాలు, కలప వంటి అతి విలువైన సహజ వనరులపై ఆధిపత్యం, హక్కుల చుట్టూనే అత్యధిక వివాదాలు ముడివడి ఉంటాయి. ఇవి ఘర్షణలు, సాయుధ తిరుగు బాట్లు, యుద్ధాలకు దారితీస్తున్నాయి. వాటివల్ల స్థానిక ప్రకృతి వనరులు పెద్దయెత్తున నాశనమవుతున్నాయి. యుద్ధాల్లో ఆయా దేశాలు ప్రత్యర్ధి భూభాగంపై భారీగా ఆయుధాలు ప్రయోగిస్తాయి. ఇలాంటి వాటిలో పేలని మందుపాతరలు, ఇతర ఆయుధాలు అనంతర కాలంలోనూ మనుషులతో పాటు వన్యప్రాణులను బలితీసు కుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2010-2020 మధ్య కాలంలో ఉష్ణమండల అరణ్యాలు అంతరించిన ప్రదేశాల్లోని 43శాతం అటవీ భూములు యుద్ధ ప్రభావ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సాయుధ పోరాటాల వల్ల చాలాచోట్ల తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దానివల్ల నీటి సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న 200 ప్రదేశాల్లోని 90శాతం ప్రాంతాలపై యుద్ధాలు, సాయుధ ఘర్షణలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల వల్ల చాలా చోట్ల ఆహార పంటలు, దాన్యం నిల్వలు నాశనం అవుతున్నాయి. మందుగుండు దాడుల వల్ల భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా ఆహారం అభద్రత ముమ్మరిస్తోంది. ఐరాస నిర్వాసితుల విభాగం అంచనాలు ప్రకారం సాయుధ ఘర్షణల మూలంగా 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.24 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. ప్రపంచ దేశాల మద్య తలెత్తే యుద్ధ విద్వంసం వాటి సన్నాహక దశ నుంచి ముగిసే వరకు కొనసాగుతూనే ఉంటుంది. సైనిక వాహనాలు, విమానాలు, నౌకలు, భవనాల నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ చమురు, ఖనిజ వనరులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 5.5శాతానికి సైనిక కార్యకలాపాలే కారణమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. యుద్ధ ప్రాంతాల్లో సైన్యాల మోహరింపు, వారి కోసం ఏర్పాట్లు, ఆయుధాలు పేలుళ్లు, దాడులు.. ఇలా అన్ని దశల్లో అడవులు, నీరు వంటి సహజ వనరులు తీవ్ర విధ్వంసానికి గురవుతాయి. దాడుల మూలంగా ఏర్పడే వాయు కాలుష్యం. కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పుల దుష్పరిణామాలను పెంచు తున్నాయి.
పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, దాని నుంచి దాడులు, యుద్ధం ముప్పును ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు పెద్దయెత్తున ఆయుధ సంపత్తిని కూడబెట్టుకుంటున్నాయి. సైనిక శక్తిని పెంచు కుంటున్నాయి. కేవలం యుద్ధ సందర్భాల్లోనే కాకుండా మిగిలిన సమయాల్లోనూ సైనికుల రవాణా, వారికి శిక్షణ, మారణాయుధాల తయారీ, పరీక్షల దశల్లోనూ మితిమీరిన పర్యావరణ నష్టం వాటిల్లు తోంది. ముడిపదార్థాల తవ్వకు, ఆయుధాల తయారీ, వాటి పరీక్షల మూలంగా ప్రకృతి వ్యవస్థలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. అణ్వా యుధాల తయారీలో ఈ నష్ట ప్రభావం రెట్టింపు ఉంటుంది. రసాయన, జీవ ఆయుధాల మూలంగా తలెత్తే కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువ! ఇటువంటి పర్యావరణ నష్టాలను ఆయా దేశాలు అంతగా పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ పరి రక్షణ నిబంధనల పటిష్ట అమలులో అనేక దేశాలు చిత్తశుద్ధి కనబర చడం లేదు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో వివిధ పర్యావరణ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పాలకుల చెవికెక్కడం లేదు

పటిష్ఠ చర్యలు కీలకం

ఇజ్రాయెల్-హమాస్ పోరు వల్ల గాజులోని 95 శాతం తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అనేక పరిశ్రమలు నాశనమై ప్రమాదకర రసాయనాలు భూగర్భ జలాల్లో కలిశాయి. ఏడున్నర దశాబ్దాల క్రితం హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల దాడి ఘటనల నుంచి నేటికీ ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోలేదు. దేశాలు సుస్థిరాభివృద్ధి సాధించాలంటే యుద్ధాలకు స్వస్తి పలకాలి. సాయుధ ఘర్షణలను నిరోధించాలి. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు నడుంకట్టాలి. సమాజ పురోగతిలో ప్రకృతి వనరుల సుస్థిర యాజమాన్యం కీలకమైన అంశం ఈ క్రమంలో పర్యావరణ వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాల్సిన బాధ్యతలను ఆయా దేశాలు గుర్తెరగాలి. తద్వారా భవి ష్యతు తరాల ఆశలు చిదిమేయకుండా మసలుకోవాలి.

21/05/2023
https://www.facebook.com/100063862013612/posts/572083488263713/?sfnsn=wiwspmo&mibextid=6aamW6
27/12/2022

https://www.facebook.com/100063862013612/posts/572083488263713/?sfnsn=wiwspmo&mibextid=6aamW6

ఆరోగ్య మంత్రి ఇలాఖాలో భూరికార్డులకు త్రీవ్ర అనారోగ్యం?

*మంత్రి రజని నియోజక వర్గంలోఅడ్డూ, ఆపులేని
భూకబ్జాలు! అంటున్న అచ్చెన్నాయుడు..
*దశాబ్దాలనుంచి రైతులసాగులో ఉన్నభూమిని దేవాదాయభూముల జాబితాలో?
*250 మంది రైతులు సాగుచేసుకుంటున్న 260 ఎకరాల భూమి రికార్డులు తారుమారు?
*-ఒక్కదారిగా దేవాదాయశాఖ పరిధిలోకి చంఘిజ్ ఖాన్ పేట గ్రామరైతుల భూమి?
ఎలావెళ్తుంది?
నమస్తే జనశక్తి, అమరావతి:
రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూ, ఆపు లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు నిత్యం మూడు కబ్జాలు, ఆరు దోపిడీలతో సాగుతున్న పాలనలో, దశాబ్దాలనుంచి రైతుల సాగులో ఉన్న భూములు ఒక్కసారిగా దేవాదాయ శాఖ భూములుగా మారిన వైనం ఆరోగ్యశాఖమంత్రి ఇలాఖాలో జరిగిం ది. స్వాతంత్ర్యానికి పూర్వం (1946) నుంచి యడ్లపాడుమండలం కొండవీడు గ్రామ శివారు, చంఘీజ్ ఖాన్ పేటకు చెందిన రైతుల స్వాధీనంలో ఉన్న 260ఎకరాలకుపైగా భూమి, ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రి దేవాదాయశాఖ పరం కావడం గమనార్హం. జమీందార్ల నుంచి రైతులకు సంక్రమించిన భూమి కొన్ని దశాబ్దాల నుంచి వారి సాగులోనే ఉంది. రైతులకు ఇచ్చిన భూమి తిరిగి తమకుచెందాలని జమీందార్ వారసులు కొందరు కోర్టులను ఆశ్రయించినా, వారి కి నిరాశే ఎదురైంది. రైతులు దావా ఐ.ఏ.30/1961 నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారివారిపై వేయగా, ఇరువర్గాల వాదనలువిన్న న్యాయస్థానం సదరు భూమి సాగు చేసుకుంటున్న రైతులకే చెందుతుందని చెప్పింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి, తరువాత సదరు భూములపై రైతుల పేర్లతో రైత్వారీ పట్టాలుకూడా నాటి అధికారులు మంజూరు చేశారు. రైత్వారీ పట్టాలతో పాటు, ఆర్.ఎస్.ఆర్ నందు, ఫామ్-8, ఇనాం-బీ రిజిస్టర్ల లో కూడా భూముల్ని రైతుల పేర్లతోనే నమోదుచేశారు. అయితే ఆ భూములపై కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు కొందరు అధికారులతో చేతులు కలిపి, కొట్టేయడానికి పథకం వేశారని రైతులు బావురు మంటున్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న భూదోపిడీ గురించి ఆరోగ్యశా ఖ మంత్రికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నాం అం8 అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.. దశాబ్దాలనుంచి భూములు సాగుచేసుకుంటూన్న రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు!

Address

MIG 147 HOUSING BOARD COLONY
Guntur
522005

Alerts

Be the first to know and let us send you an email when Express News 24X7 Telugu HD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Express News 24X7 Telugu HD:

Share