Namaste Janasakti Telugu Daily

Namaste Janasakti Telugu Daily *నమస్తే జనశక్తి* జాతీయ తెలుగు దినపత్రిక

ఆంధ్రప్రదేశ్ ప్రచురణ కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, మరియు అనంతపురం

తెలంగాణ ప్రచురణ కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మరియు ఖమ్మం

https://www.facebook.com/share/p/YMYVZxVmLhK65SYW/?mibextid=CDWPTG
28/03/2024

https://www.facebook.com/share/p/YMYVZxVmLhK65SYW/?mibextid=CDWPTG

ఎలాక్టోరల్ బాండ్లు కరెక్టయితే?, జగన్ పై కేసులు తప్పే!
March 21, 2024; (అడుసుమిల్లి జయప్రకాశ్)

*అమిత్ షా వ్యాఖ్యే దీనికి సాక్ష్యం!
*కార్పొరేట్ల రహస్య లంచాలు క్విడ్ప్రోకో క్రిందకు రాదా?

ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడి కావడంతో ఒక విషయం సుస్పష్టంగా తెలిసివచ్చింది. అదేమిటంటే, కొన్ని వాణిజ్య సంస్థలు తమకు నచ్చిన పార్టీలకు పెద్ద మొత్తంలో నగదును బాండ్ల రూపంలో అందజేశాయని. అలా ఇవ్వడానికి కారణం మాత్రం తెలియరాలేదు. దీని వెనుక ఏదైనా ఇచ్చి పుచ్చుకునే(క్విడ్ ప్రో కో) ఉద్దేశం ఉందా? బహుశా ఇది ఎప్పటికీ వెల్లడి కాదు కూడా. పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, ఎఫ్.సి.ఆర్.ఏ. నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలలో ప్రభుత్వాలు తమకు రక్షణ కవచంగా నిలుస్తాయని, కేసులు, విచారణ లేకుండా తప్పించుకోవచ్చని ఆలోచన ఆయా సంస్థలకు ఉండవచ్చు. కేరళ, కర్ణాటక, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో లాటరీలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా పార్టీలకు ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో నగదును సమకూర్చాయి. ఇలాంటి సంస్థలు తమకు వచ్చిన లాభాలను కానీ, ఈక్విటీని గాని వెల్లడించవు. అనేక సంస్థలు తమకు వచ్చిన లాభాలకు మించి పది నుంచి వంద శాతం వరకూ నగదును బాండ్ల రూపంలో చెల్లించాయి. తమకు వచ్చిన లాభాలను నకిలీ కంపెనీల పేరుతో రాజకీయ పార్టీలకు చేర్చాయి. ప్రస్తుత భారత రాజకీయం ఎలా మారిపోయిందో బాండ్ల వివరాల వెల్లడి ద్వారా తెలుస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో కొన్ని దర్యాప్తు సంస్థల చర్యలతో కేవలం కొన్ని వందల కోట్ల లాభాలను గడించిన ఒక ప్రముఖ సంస్థ అత్యధికంగా 1 , 368 కోట్ల రూపాయల ఎలెక్టోరల్ బాండ్లను కొనుగోలుచేయడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ సంస్థ ఆస్తులు, ఆ సంస్థ కొన్న బాండ్ల మొత్తాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపింది. ఇలా కొనుగోలు చేయడం వెనుక పార్టీలు, ఆయా సంస్థల మధ్య క్విడ్ ప్రో కోను, సంబంధాలను వెల్లడిస్తోంది. పవర్ సెక్టార్ లో ఉన్న అనేక సంస్థలు బాండ్లను ఎడాపెడా కొనుగోలు చేశాయి. మైనింగ్, సోలార్ పవర్, విండ్ పవర్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హైడ్రో పవర్ కంపెనీలు 3600 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి. నష్టాలను చూపించిన సంస్థలు కూడా బాండ్లను కొన్నాయి. ఇది డొనేషనా లేక మరేదైనానా?

ఇప్పుడు ఒక్కసారి ఇరవై ఏళ్ల క్రితం ఏమైందో చూద్దాం. ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న క్విడ్ ప్రో కో ఆరోపణలు కూడా ఇలాంటివేనా? అనేక పెద్ద సంస్థలు ఆయన కంపెనీలలో పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అప్పట్లో పెట్టాయి. వీటి గురించే ప్రతిపక్షాలు క్విడ్ ప్రో కో అంటూ గగ్గోలు పెట్టాయి.

ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎలెక్టోరల్ బాండ్ల స్కీం సమస్య పరిష్కారానికి ఒక ప్రారంభం అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎలెక్టోరల్ బాండ్స్ బ్లాక్ మనీని నిర్మూలించడానికి ఉపకరిస్తాయని, ఈ అంశంపై ఎవరితోనైనా, ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని షా ప్రకటించారు. కేంద్ర వైఖరి ఇదే అయితే, మనం జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకు రావాల్సిందే. 2012 లో ఆయనపై క్విడ్ ప్రో కో కేసులు బనాయించి, 16 నెలల పాటు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై సి.బి.ఐ. అనేక కేసులు నమోదు చేసింది. జగన్ క్విడ్ ప్రో కో కు పాల్పడ్డారనేదే ఈ కేసుల అన్నిటి లక్ష్యమూ.

భారత రాజకీయాలలో నల్ల ధనాన్ని అంతరింపజేయడానికే ఎలెక్టోరల్ బాండ్స్ అన్న అమిత్ షా వ్యాఖ్యను జగన్ మోహన్ రెడ్డి కేసులతో పోల్చి చూస్తే ఆయన పదహారు నెలల పాటు జైలులో ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జగన్ పై పెట్టిన కేసులన్నీ అప్పటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే బనాయించారని స్పష్టమవుతోంది. వైస్ హయాంలో పనిచేసిన అనేక మంది మంత్రులు సైతం సి.బి.ఐ. విచారణను ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఎలెక్టోరల్ బాండ్స్ వ్యవహారాన్ని నిశితంగా విచారించాల్సిందే. లేదా అమిత్ షా వ్యాఖ్య నిజమైతే జగన్ కూడా తప్పు చేసినట్టు కాదు.

గుంటూరు, రాజమండ్రి కేంద్రంగా పని చేయడానికి మంచి న్యూస్ పేపర్ సబ్-ఎడిటర్ కావాలి. ఆఫీసులో పని చేయగలిగిన వారికి ప్రాధాన్యత!...
24/03/2024

గుంటూరు, రాజమండ్రి కేంద్రంగా పని చేయడానికి మంచి న్యూస్ పేపర్ సబ్-ఎడిటర్ కావాలి. ఆఫీసులో పని చేయగలిగిన వారికి ప్రాధాన్యత! వార్తల్లో పదును.. సరళమైన భాషలో వార్తలను విశ్లేషణాత్మకంగా మలచగలిగిన అనుభవజ్ఞులకు ప్రాధాన్యత! అన్ లైన్ లో పని చేయగలిగిన వారు కూడా సంప్రదించవచ్చు! . నమస్తే జనశక్తి తెలుగు దినపత్రిక...9703883885

09/06/2023
దస్తగిరి కా దాదాగిరి?నమస్తే జనశక్తి: రైల్వే కోడూరు:తరచూ సెటిల్మెంట్లు చేస్తున్న ఈ అప్రూవర్... దస్తగిరి దందాలకు సీబీఐ అప్...
30/05/2023

దస్తగిరి కా దాదాగిరి?
నమస్తే జనశక్తి: రైల్వే కోడూరు:

తరచూ సెటిల్మెంట్లు చేస్తున్న ఈ అప్రూవర్... దస్తగిరి దందాలకు సీబీఐ అప్రూవల్ ఉందా?

మంది మార్బలంతో 2+2 గన్ మెన్లతో హల్ చల్!
తన మాట వినకపోతే వివేకనంద రెడ్డి దగ్గరకే పంపిస్తా నంటున్న దస్తగిరి?

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వివాదాస్పద స్థలం విషయంలో 14వ తేదీ లోపు సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే పులివెందుల తడాఖా ఏంటో చూపిస్తా?

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ4 గా ఉన్న దస్తగిరి 4 సెటిల్మెంట్లు 6 దాదాగిర్లు అంటూ అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న వైనం?

తనకున్న పోలీస్ బలగాలతో వివాదాస్పద స్థలాలలో మీసం మేలే స్తున్న ఈ పులివెందులలో ఓ సాదాసీదా మనిషి.. వివేకాని చంపేసి.. ఆ తర్వాత సీబీఐ అప్రూవర్ గా మారిన దస్తగిరి... డా. సునీతకు సన్నిహితుడా?

తోపుడు బండి పై ఐస్ క్రీమ్ అమ్ముకునే వాడు వైయస్ వివేకానంద రెడ్డి వద్ద కొద్దిరోజులు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి 2019 మార్చి 15న జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వద్ద అప్రూవర్ గా మారి, బెయిల్ పై ఉన్న దస్తగిరి తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పైన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సైతం ఆరోపణల వర్షం గుప్పించి అదే ప్రభుత్వం నుండి భారీ భద్రత పొందిన దస్తగిరి.

పలు.మార్లు దస్తగోరిని కల్సిన వివేకా కూతురు సునీతకు కూడా దస్తగిరి దందాలతో సంబంధాలు ఉన్నాయా? అప్రూవర్ గా మారిన నిందితుడి ని డాన్ చేస్తున్న సీబీఐ అంటూ విమర్శలు?

*ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలు....**తమ్మినేని సీతారాంగారు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ...
27/04/2023

*ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలు....*

*తమ్మినేని సీతారాంగారు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదవకుండానే సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి?*

★ డిగ్రీ డిస్ కంటిన్యూడ్... తమ్మినేని సీతారాం గారు.. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కి ఎలా అడ్మిషన్ పొందారని సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటే అనేక విషయాలు నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి....

★ హైదరాబాద్ మహాత్మాగాంధీ లా కాలేజీలో తన మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్స్ ఆడ్మిషన్కు సంబంధించి తమ్మినేని సీతారాం గారు సమర్పించిన సర్టిఫికేట్ల కాపీలను సమాచార హక్కు చట్టం క్రింద తాము డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీ సేకరించాం....

★ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం తమ్మినేని సీతారాం గారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుండి 2015-18 మద్య (హాల్ టికెట్ నెం. 1791548430) బికాం పూర్తి చేసినట్లు సర్టిఫికేట్లు సమర్పించారు...

★ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారిని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్లో 2015 సంవత్సరంలో చదివిన మొత్తం విద్యార్థుల వివరాలు (పేర్లు, హల్టికెట్ నెంబర్, కోర్స్) సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది.

★ నాగర్ కర్నూల్ స్టడీ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) సెంటర్ లో చదవిన మొత్తం 839 మంది విద్యార్థుల పేర్ల లిస్టులో తమ్మినేని సీతారాం పేరు లేదు. *తమ్మినేని సీతారాం తనదిగా చెబుతున్న హాల్టికెట్ నెం. 1791548430 మాత్రం డి. భగవంత్ రెడ్డి తండ్రి బి. స్వామి రెడ్డి పేరు మీద ఉన్నది....* దీనిని బట్టి తమ్మినేను సీతారాం గారివి నకిలీ సర్టిఫికెట్ అని స్పష్టంగా అర్థం అవుతున్నది.

★ 28.07.2021 రోజున మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు కోసం తమ్మినేని సీతారాం సమర్పించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్ పత్రులు నిజమైనావా? కావా తేల్చమని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి ఇచ్చి రికార్డులు పరిశీలించి తెలపమని సమాచార హక్కు చట్టం ద్వారా సర్టిఫికేట్ను సబ్మట్ చేసి సమాచారం అడగడం జరిగింది.

★ తమ్మినేని సీతారాం సర్టిఫికేట్లను రికార్డులలో పరిశీలించి తమ రికార్డులతో మ్యాచ్ కావడం లేదని మా రికార్డులో లేవని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారికంగా ధృవీకరించింది...

★ తమ్మినేని సీతారాం గారు బికాం డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ అన్ని కూడా నకిలీ వని స్పష్టంగా అర్థం అవుతోంది.

★ తమ్మినేని సీతారాం గారికి నకిలీ సర్టిఫికేట్స్ ఎలా వచ్చాయి? నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం....

_*టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నన్నూరి నర్సిరెడ్డి విలేఖరుల సమావేశంలో... వెల్లడించిన వివరాలు...*_

*నిన్నొదల..రాంబాబూ?* *త్వరలో ప్రెస్మీట్ రూపంలో మీడియా ముందుకు వస్తానంటూ  అంబటికి సుకన్య వార్నింగ్?*- సుకన్య ఎవరో తెలీదన్...
16/01/2023

*నిన్నొదల..రాంబాబూ?*
*త్వరలో ప్రెస్మీట్ రూపంలో మీడియా ముందుకు వస్తానంటూ అంబటికి సుకన్య వార్నింగ్?*
- సుకన్య ఎవరో తెలీదన్న రాంబాబూ.. నీవు నార్కో టెస్టుకు సిద్ధమా?
- మహిళా కమిషన్ నుండి పోలీసుల వరకు అందరూ నాకు అన్యాయమే చేశారు!
- దిక్కుతోచక నేనుంటే.. మీడియా... సోషల్ మీడియా, రాజకీయ నాయకులు ప్రతొక్కడూ నా పేరు వాడేసుకొని ట్రోలింగ్ చేయటం ఇక సహించబోను?
- ఐటీ యాక్ట్ క్రింద అన్ని సాక్ష్యాలతో అందరిపై హైకోర్టులో కేసు నమోదు చేస్తానంటున్న సుకన్య!
*గుంటూరు, నమస్తే జనశక్తి, సోమవారం:*
లైంగిక వేధింపుల వ్యవహారంలో నాటి సత్తెనపల్లి వైసీపీ యంయల్యే, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు బాధితురాలైన సుకన్య మీడియాకు ఎక్కనుందా? ఇది నిజమే! అంబటి వేధింపులు జరిగి ఏడాది దాటినా.. ప్రజలు రాంబాబు సుకన్యలను మర్చిపోలేక పోతున్నారు.మహిళల పట్ల రాష్ట్రంలో ఏ చిన్న అనుచిత సంఘటన జరిగిన ప్రతి సారీ ఆ విషయంతో అంబటి సుకన్యల వ్యవహారాన్ని కలిపి ప్రస్తావించడం అన్ని మీడియాలకు పరిపాటి అయ్యింది.
వాస్తవానికి అంబటి రాసలీల విషయంలో తన వద్ద ఉన్న సమాచార బాండాఘారంలోని ఓక చిన్న వీడియో నే ఇంతటి ప్రకంపనలు సృష్టించిదంటున్న సుకన్య, అంబటితో పాటు మరో ఇద్దరి ప్రముఖుల జాతకాలు కూడా తనవద్ద ఉన్నాయంటున్నారు.
తనతో పాటు ఎందరో మహిళల జీవితాలతో ఆదుకున్న మంత్రి అంబటి ప్రజల్లో ఎంతలా అభాసు పాలైనప్పటికీ, యంయల్యే అయిన అంబటి ని ప్రముఖ శాఖకు మంత్రిని చేసి ముఖ్యమంత్రి తలాంటి మహిళలకు మరింత అన్యాయం చేశారని సుకన్య పేర్కొనడం విశేషం. బాధితురాలైన సుకన్య విషయంలో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ కూడా భిన్నంగా స్పందించకపోవడం విశేషం. సదరు నాయకులు తమకు అవసరమైనప్పుడల్లా... సుకన్య అంబటి విషయాన్ని ట్రోల్ చేసి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్దిపొందారే తప్ప తనకు ఏ న్యాయం జరగలేదన్నారామే.
అంబటికి టీడీపీ నాయకులకు లేదా పవన్ కళ్యాణ్ కు అంబటికి ఏదన్నా ఘర్షణ జరిగిన ప్రతిసారీ తనను తెర మీదకు తీసుకు వచ్చి రాంబాబు ను రసికుడిగా చిత్రీకరిస్తూనే... తన వ్యక్తిత్వాన్ని మాత్రం హననం చేస్తున్నారని సుకన్య వాపోయారు.
ఐటీ యాక్ట్ లోని నిబంధనల మేరకు తనను ట్రోల్ చేస్తున్న అన్ని పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, వ్యక్తులు, మీడియా సంస్థలతో పాటుగా అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు సుకన్య తెలిపారు. తనవద్దనున్న ఫోటోలు, కాల్ రికార్డింగ్స్, వీడియోల సాక్ష్యంతో మరొక్కసారి మహిళా కమీషన్ ను, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తానని సుకన్య పేర్కొన్నారు.
తాజాగా జనసేన న్యాయవాదిగా చెప్పుకునే దిలీప్ సుంకర తన వీడియో విశ్లేహణలో తన పేరు తీసుకొని రాంబాబు రసికుందంటూ పేర్కొంటూనే, అతని 10000 ప్రేమికులలో తనను ఒకదానిగా సంభోదించిన వ్యాఖ్యలపై కూడా త్రీవ్ర మనస్తాపం చెందినట్లు.. రాంబాబుతో రాజకీయంగా ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలని, తన పేరు మధ్యలో తేవడం అభ్యంతరకరమని సుకన్య చెప్పుకొచ్చారు.
తాను కూడా ఒక కాపు మహిళనే అని చేపలుకొచ్చిన ఆమె, పవన్ కళ్యాణ్ కువనిజమైన శత్రువుగా అంబటిని భావించి నేరుగా జనసేన కార్యాలయనికి వెళ్లి అదనపు సమాచారం ఇద్దామని చూస్తే తనను పట్టించుకున్నోళ్లు లేరని, నిజానికి జనసేన పార్టీ కార్యాలయం ఒక పిచ్చోళ్ళ సంత అంటూ సుకన్య అభివర్ణించడం విశేషం.
అంబటిపై తనలాంటి మహిళల ఫిర్యాదులను అటు వైసీపీ, టీడీపీ జనసేన పార్టీలు ఏమాత్రం సీరియస్ గా తీసుకోకపోగా అతని అరాచకాలు ఆనందిస్తూ, కామెంట్లతో ప్రోత్సహిస్తూన్నారని ఆమె అన్నారు. మాటిమాటికి జగన్ పై విరుచుకు పడే పచ్చ మీడియాలో వెంకట కృష్ణ, సాంబశివ రావులతో అంబటికీ రహస్య వ్యాపారాలు ఉన్నాయని సుకన్య ఆరోపించారు. ఒక వేళ అంబటి కి జగన్ తో విభేదాలు వస్తే... రాజకీయంగా వారికి పనికొస్తాడన్న కోణంలోనే బాధితురాలైన తనకు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా అన్యాయం చేశారని సుకన్య ఆరోపిస్తున్నారు.
అంబటి తో పాటుగా మరో ఇద్దరి ప్రముఖుల జాతకాలను కూడా బయటపెడతానంటున్న సుకన్య, అంబటి విషయంలో మోపిదేవి వెంకటరమణకు అత్యంత సన్నిహితురాలైన మహిళ తన ఇంటికి వచ్చి బెదిరించి ఫుటేజీలు కూడా ఉన్నాయన్నారు. మోపిదేవి కూడా అంబటి కంటే తక్కువేమీ కాదని సుకన్య పేర్కొనడం విశేషం.
మహిళా కమిషన్ పై తనకు నమ్మకం లేదన్న సుకన్య, అయినా వారికి ఒక సారి పిర్యాదు చేసి, ఆ తరువాత నేరుగా హైకోర్టుని ఆశ్రయించి తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలతో పాటుగా తనను లైంగీకంగా వేధించిన అంబటి రాంబాబు పై కూడా కేసువేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈమేరకు ఒక ప్రెస్మీట్ కూడా త్వరలో నిర్వహించనున్నట్లు సుకన్య తెలిపారు.

అంబటి రాంబాబు నన్ను వేదిస్తున్నాడు🙄 వీడియో రిలీజ్ చేసిన మహిళ

31/12/2022

*మీడియా vs మాఫియా*
గుంటూరులో లా అండ్ ఆర్డర్ మొద్దు నిద్ర?
ఆభరణాల పేరున స్కామ్ ఒకడిది! వాడిని బెదిరిస్తూ డబ్బు గుంజుతున్న నకిలీ టీవీ మరొకడిది?
ప్రముఖ కంపెనీ సురక్ష పేరుతో నకిలీ రిజిస్టరేషన్ బోర్డులు?
రెండువందల కోట్లు కొట్టేసారంటున్న మీడియా వర్గాలు?
కేసుకు దొరకని పాస్టర్? రంగంలోకి పెద్దలు?
విజిలెన్స్ ఎస్పీ ఆరా!

ఆరోగ్య మంత్రి ఇలాఖాలో భూరికార్డులకు త్రీవ్ర అనారోగ్యం?*మంత్రి రజని నియోజక వర్గంలోఅడ్డూ, ఆపులేని భూకబ్జాలు! అంటున్న అచ్చె...
27/12/2022

ఆరోగ్య మంత్రి ఇలాఖాలో భూరికార్డులకు త్రీవ్ర అనారోగ్యం?

*మంత్రి రజని నియోజక వర్గంలోఅడ్డూ, ఆపులేని
భూకబ్జాలు! అంటున్న అచ్చెన్నాయుడు..
*దశాబ్దాలనుంచి రైతులసాగులో ఉన్నభూమిని దేవాదాయభూముల జాబితాలో?
*250 మంది రైతులు సాగుచేసుకుంటున్న 260 ఎకరాల భూమి రికార్డులు తారుమారు?
*-ఒక్కదారిగా దేవాదాయశాఖ పరిధిలోకి చంఘిజ్ ఖాన్ పేట గ్రామరైతుల భూమి?
ఎలావెళ్తుంది?
నమస్తే జనశక్తి, అమరావతి:
రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూ, ఆపు లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు నిత్యం మూడు కబ్జాలు, ఆరు దోపిడీలతో సాగుతున్న పాలనలో, దశాబ్దాలనుంచి రైతుల సాగులో ఉన్న భూములు ఒక్కసారిగా దేవాదాయ శాఖ భూములుగా మారిన వైనం ఆరోగ్యశాఖమంత్రి ఇలాఖాలో జరిగిం ది. స్వాతంత్ర్యానికి పూర్వం (1946) నుంచి యడ్లపాడుమండలం కొండవీడు గ్రామ శివారు, చంఘీజ్ ఖాన్ పేటకు చెందిన రైతుల స్వాధీనంలో ఉన్న 260ఎకరాలకుపైగా భూమి, ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రి దేవాదాయశాఖ పరం కావడం గమనార్హం. జమీందార్ల నుంచి రైతులకు సంక్రమించిన భూమి కొన్ని దశాబ్దాల నుంచి వారి సాగులోనే ఉంది. రైతులకు ఇచ్చిన భూమి తిరిగి తమకుచెందాలని జమీందార్ వారసులు కొందరు కోర్టులను ఆశ్రయించినా, వారి కి నిరాశే ఎదురైంది. రైతులు దావా ఐ.ఏ.30/1961 నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారివారిపై వేయగా, ఇరువర్గాల వాదనలువిన్న న్యాయస్థానం సదరు భూమి సాగు చేసుకుంటున్న రైతులకే చెందుతుందని చెప్పింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి, తరువాత సదరు భూములపై రైతుల పేర్లతో రైత్వారీ పట్టాలుకూడా నాటి అధికారులు మంజూరు చేశారు. రైత్వారీ పట్టాలతో పాటు, ఆర్.ఎస్.ఆర్ నందు, ఫామ్-8, ఇనాం-బీ రిజిస్టర్ల లో కూడా భూముల్ని రైతుల పేర్లతోనే నమోదుచేశారు. అయితే ఆ భూములపై కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు కొందరు అధికారులతో చేతులు కలిపి, కొట్టేయడానికి పథకం వేశారని రైతులు బావురు మంటున్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న భూదోపిడీ గురించి ఆరోగ్యశా ఖ మంత్రికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నాం అం8 అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.. దశాబ్దాలనుంచి భూములు సాగుచేసుకుంటూన్న రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు!

24/12/2022

Sanitizer ెలంగాణ గిరిజన ఉత్పత్తులు వినూత్నంగా అందరినీ ఆకట్టుకొని,...

21/12/2022

చతుర్ముఖంలో త్రికోణ ప్రేమాయణం!
ఆ నలుగురిలో ముగ్గురికి ప్రతి ఒక్కరికి మరో ఇద్దరు బాహ్య ప్రేమికులు? కానీ ఇద్దరిని ప్రేమిస్తూన్న ఆ ఒక్కరికి మాత్రం ఒకరిపై ఉన్న ప్రేమ మాత్రమే నిజమా? లేక అవసరమా? వెరసి మొత్తం చతుర్ముఖంలో ఒకే ఒక్కడు మాత్రమే ప్రత్యేకం? అదెలా సాధ్యం!... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనశక్తిలో నా కథనం!... శుక్రవారం

నమస్తే జనశక్తి 17 డిసెంబర్హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ రేసులో డా. రాధికా రెడ్డి
18/12/2022

నమస్తే జనశక్తి 17 డిసెంబర్
హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ రేసులో డా. రాధికా రెడ్డి

శ్వేతామహంతీయం? గాంధీ డైట్ లో ఆరోపణలున్నా.. అస్మదీయులే ముద్దు అంటున్న ఉన్నతాధికారిణి.*కోర్టు వద్దన్న డయట్ కాంట్రక్టర్ నే ...
15/12/2022

శ్వేతామహంతీయం?
గాంధీ డైట్ లో ఆరోపణలున్నా.. అస్మదీయులే ముద్దు అంటున్న ఉన్నతాధికారిణి.

*కోర్టు వద్దన్న డయట్ కాంట్రక్టర్ నే కొనసాగించడమే
శ్వేతామహంతీయం?
హైదరాబాద్, నమస్తే జనశక్తి: 15 డిసెంబర్

రోజురోజుకీ గాంధీ ఆస్పత్రి ఆహార కాంట్రాక్టు వ్యవహారం ముదిరి పాకాన బడి ఎంతరచ్చ అవుతున్నా? ప్రభుత్వ ఉన్నతాధికారుల ధోరణి మారటంలేదు. నిలోఫర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఒక వైద్యుడి బినామీ కంపెనీ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ డైట్ కాంట్రకును ఏడాది క్రితం పొందింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరింత మెరుగైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించే దిశగా ప్రభుత్వం పాత రేట్లను, ఆహార మెనూను మారుస్తూ ఓ జీవో జారీ చేయడంతో పాటు అప్పటివరకు ఉన్న అన్ని టెండర్లను రద్దుచేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానిని వ్యతిరేకించిన గుత్తేదారులు హైకోర్టును పలుమార్లు ఆశ్రయించిన నేపథ్యంలో, తాత్కాలిక మధ్యంతర ఉపశమనాలు పొందినా, కడకు ప్రభుత్వ ఏకీకృత పాలసీని అడ్డుకోజాలమని సృష్టీకరించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టెండర్లు ద్వారా నూతన మెనూతో ఆహార గుత్తేదార్లను ప్రభుత్వం నియమించేసింది.
కానీ గాంధీ గుత్తేదారు ఒక వైద్యుడి కి చెందిన కంపెనీ కావటం, అతనోకి ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయి పలుకుబడి ఉండటం... అతని కంపెనీ సహస్రా పై ఎన్ని ఆరోపణలున్నా... నిబంధనలను సైతం కాలరాసి, చివారాఖరుకు సుప్రీంకోర్టు నిర్దేశిత ఉత్తర్వ్యూలను సైతం ప్రక్కన పెట్టేసిన స్టేట్ డైట్ కమిటీ చైర్పర్సన్ శ్వేతా మహంతి వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తుందనటంలో సందేహంలేదు.
ప్రభుత్వ పాలసీకి ఉన్నత న్యాయస్థానం ఓటేసినా, పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని వేసుకొని తిరిగినట్లుగా, ఎక్కని కోర్టు వేయని పిటీషన్ లేదన్నట్లుగా అధికారులను గందరగోళానికి గురిచేసి, అసలు టెండరు పొందిన శివనెరీ క్యాంటీన్ సర్వీసు వారిని టెండరు పొందినా వ్యాపారం మొదలు పెట్టనీయకుండా చేయడంలో సఫలీకృతుడైన డా.జగదీష్ ఇంకా అతడి బినామీ కంపెనీల విషయంలో తాత్సార్యం లేకుండా స్టేట్ కమిటీ నిర్ణయం తీసుకొని తేల్చాయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వ్యూలను సైతం ప్రక్కన పెట్టేసారు ఈ ఉన్నతాధికారిణి. మరో ప్రక్క డిపాజిట్లు కట్టి, నిబంధనల మేరకు టెండర్లు పొందిన శివనెరీ కంపెనీ వారికి.. న్యాయపరంగా అన్ని అర్హతలున్నా, న్యాయస్థానం సహస్త్రా కంపెనీని ప్రక్కన పెట్టేసినా?... టెండరు ప్రక్రియ పూర్తయి ఏడూ నెలలు కావస్తున్నా? ఇంకా కోర్టు వద్దన్న సహస్రా వారికే టెండరు కోససాగిస్తూ, తమను నిర్లక్ష్యం చేస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్వేతా మహంతీ మరియు ఆమె కమిటీ సభ్యుల చర్యల పట్ల నిస్సహాయులై చూస్తున్నారు కొత్త టెండర్లు పొంది వ్యాపారంలోకి అనుమతిపొందని శివనెరీ క్యాఆంటీన్ సర్వీసెస్ నిర్వాహకులు.

అసలెవరిదీ సహస్రా? ఎందుకంత ప్రేమ!
అనుభవ లేమి, ఆడిట్ రిపోర్టులు అబద్ధం, దొంగ సర్టిఫికెట్లు. జిల్లా డైట్ మేనేజ్మెంట్ సభ్యుల విశ్లేషణ పత్రాల్లో వారికి తెలీకుండా మార్పులు. వెరసి అంతా తానొక్కడై చక్రం తిప్పిన 2021లో నాటి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ మరియు డీడీఎంసి చైర్మన్. ఈ వ్యవహారంలో ఆయన సహస్రా బినామీ అధిపతి డా. జగదీష్ (నిలోఫర్ ప్రభుత్వ వైద్యుడు) వద్దనుండి సుమారు ముప్పై లక్షలు కొట్టేసారని వినికిడి. అసలు సహస్రా అనే కొత్తగా పుట్టుకొచ్చిన డైట్ కంపెనీకి ఆహార పదార్ధాల సరఫరా నిర్వహణలో ఎటువంటి అనుభవం లేదు. టెండరు సమయంలో ఇచ్చినవాన్ని తప్పుడు పత్రాలే. అసలు సహస్రా నిజమైన అధిపతి డా. జగదీష్ సతీమణి దీపిక. ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త. అదే సమయంలో డా. జగదీష్ కు ఇన్స్పైర్ పేరుతొ ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది. కోట్ల రూపాయల టర్నోవర్ ఈ కోచింగ్ సెంటర్ సొంతం. అదే సమయంలో ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక కన్ఫర్డ్ ఐఎఎస్ అధికారులకు జగదీష్ అకాడమీలో నేరుగా అనుభందం ఉంది. దీన్ని అవకాశంగా భావించిన డా. జగదీష్ సదరు అధికారులను లోబరచుకుని, తప్పుడు పత్రాలతో గాంధీ హాస్పిటల్ కాంట్రాక్ట్ 2021 లో కొట్టేసాడు. అప్పట్లో జిల్లా డైట్ క్షమిటీ చైర్మైన్ అయిన అడిషనల్ కలెక్టర్ వ్యవహార శైలి నచ్చని అదే కమిటీలోని సభ్యులైన ఇతర అధికారులు తమ టెండర్ ఎవాల్యుయేషన్ పత్రాల్లో, సహస్రాకు అనుకూలంగా మార్పులు చేసి ఉండటాన్ని గమనించారు. ఏడాదిపైగా సదరు అసలు పత్రాలను తమకు అప్పగించసాలని పలు మార్లు కోరినా అడిషనల్ కలెక్టర్ స్పందించకపోవడం వెనుక కారణం అతనికి డా.జగదీష్ కు ఉన్న లంచానుబంధమే. ఇదిలావుంటే జగదీష్ బినామీ సంస్థ సహస్రా గాంధీ ఆసుపత్రిలో రోగులకు తయారు చేస్తున్న ఆహారాపదార్ధాల నిర్వహణ, వాటి తయారీకి వాడే నూనె ఇతర సరుకులు కల్తీవి ఇలా నిర్దేశిత ప్రమాణాల స్థాయిలో లేవంటూ ఇచ్చిన లాబ్ రిపోర్టులు సైతం స్టేట్ డైట్ కమిటీ చావు పర్సన్ శ్వేతా మహంతి పట్టిచుకోవడం లేదన్న నిజం వెనుక వత్తిడులేమిటో ఆమే సమాధానం చెప్పాలి.
సహస్రా కంపెనీని వేయి నాలుకనున్న విషనాగుగా ఇతర కాంట్రాక్టర్లు అధికారులు పొలుస్తున్నారంటేనే డా.జగదీష్ ఈ అవినీతి వ్యాపారంలో ఎంతగా రాటు తెలారో అర్థం అవుతుంది. వేయి అబద్దాలు సాక్షిగా తప్పుడు పత్రాల సమర్పణతో కాంట్రాక్ట్ కొట్టేసి, కోర్టుల్లో ఓడిపోయినా తమకున్న పలుకుబడితో ఇప్పటికి కొనసాగుతున్న సహస్రా కంపెనీ ని తొలగించి, 2022 ఏప్రిల్ లో చట్టపరంగా డైట్ కాంట్రాక్ట్ పొందిన శివనెరీ క్యాంటీన్ సర్వీసెస్ వారికి అధికారులు టెండర్ అమలు చేస్తారా? లేదా? లేక ఒక బినామీదారుడికి అండగా నిలిచి కోర్టు ధిక్కరణ పర్యవసానాలు ఎదుర్కొంటారా? స్టేట్ డైట్ కమిటీ చైర్మన్ శ్వేతా మహంతి, ఆమె సహచర సభ్య అధికారులు తేల్చుకోవాసిందే. అలాగే నిలోఫర్ ఆసుపత్రిలో సీనియర్ వైద్యుడైన డా.జగదీష్ కు ఒక బినామీ ఫార్మా కంపెనీ కూడా ఉందని, సహస్రా ఇంకా నక్షత్ర లాంటి పేర్లతో అతనికున్న వ్యాపారాలపై సీబీఐ విచారణ జరిపిస్తే అతని అవినీతి సామ్రాజ్యం బట్టబయలవుతుందని అతని సహచర వైద్యులే పేర్కొనడం గమనార్హం. ఇప్పుడిప్పుడే అందుతున్న డా.జగదీష్ సహస్రా-నక్షత్ర గ్రూప్ అవినీతి పై మరింత లోతుగా విశ్లేషణ చేసి వివరాలు అందిస్తామంటున్న ఆయన బాధితులు.

04/12/2022

మలమార్పిడి చికిత్సా విధానానికి అనుమతి:
(పూర్తి కథనం జనసక్తిలో..మంగళవారం.)

తీవ్రమైన మరియు ప్రాణాంతక విరేచనాల వల్ల ఒక్క అమెరికాలోనే ఏటా 15,000-30,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌లకుకారణమయ్యే సూపర్‌బగ్ లక్షంగా అభివృద్ధి చేసిన రెబయోటా మలమార్పిడి చికిత్సా విధానానికి ఎప్ డి ఏ అనుమతి ఇచ్చింది. మల మైక్రోబయోటా మార్పిడి ఆధారంగా సేకరించిన పదార్థంతో తయారు చేసిన నోటి ద్వారా తీసుకునే మాత్రలను ఫెర్రింగ్ కంపెనీ తయారుచేసయనుంది.

13/11/2022

కుప్పం లో ఇంతుందా?
మరో ఓ(బా)బులోపురం!
వందలకోట్ల ఫైన్ పై వెనక్కి! నమస్తే జనశక్తిలో... వచ్చే వారం!

ఆపరేటర్లు కాదంటే .. కేబుల్ టీవీ ఇక కార్పొరేటర్లదే?- గుంటూర్లో తాజా కేబుల్ వార్? - తెలీకుండానే ఉచ్చులోకి కార్పొరేటర్లు? -...
25/08/2022

ఆపరేటర్లు కాదంటే .. కేబుల్ టీవీ ఇక కార్పొరేటర్లదే?
- గుంటూర్లో తాజా కేబుల్ వార్? - తెలీకుండానే ఉచ్చులోకి కార్పొరేటర్లు?

- నగరంలో తాజా కేబుల్ వార్? మళ్లీ మళ్లీ కేబుల్ లొల్లి!
- సగం సగం’ ఆయన గళం! ... ఆపరేటర్ల గరం గరం?
- ఆపరేటర్లు కాదంటే .. కేబుల్ టీవీ ఇక కార్పొరేటర్లదే.. డిప్యుటే మేయర్?
- లెక్క తేలాల్సిందేనన్నఆయన బాల వజ్ర సంకల్పం సఫలమయ్యేనా?
- నాడు చంద్రన్న కేబుల్ ... నేడు రాజన్న వారసులమంటున్న టీడీపీ ఎం‌ఎస్‌ఓ’ లకు ఓ వర్గం వైసీపీ అండ?
- తిలా పాపం తలా పిడికెడు? – అన్నీ ఎం‌ఎస్‌ఓ లకు వాటాలు ఇవ్వాలంటున్న అడ్రసు లేని సంక్షేమ సంఘం నాయకులు

సామాన్యుడి వినోదమైన కేబుల్ టీవీ పై నాయకుడి కన్ను పడింది. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా గతంలో పార్టీలపరంగా నడిచే కేబుల్ వార్ ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయకుల పలు కేబుల్ టీవీల నెట్’వర్క్ ల మద్య జరుగు తుంది. ఐతే ఈ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలితో అదే వృత్తిగా జీవిస్తున్న సగటు కేబుల్ ఆపరేటర్ అడ్డంగా నలిగిపోతున్నాడు. వాస్తవానికి నగర కేబుల్ ఆపరేటర్లలో అత్యధికులు వైసీపీ మద్దతుదారులే. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న కేబుల్ పేరిట ఏపీ ఫైబర్నెట్ అంటూ ఇదే ఆపరేటర్లపై ప్రచ్చన్న యుద్దం చేసిన నాటి టీడీపీ నాయకులు, వారి మద్దత్తు దారులు ఒక పధకం ప్రకారం అప్పట్లో నగరంలో సిటీ కేబుల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి మరీ దెబ్బ కొట్టారు. వాళ్ళల్లోని ముఖ్యులు ఎన్నికల అనంతరం వైసీపీలోకి వచ్చేసి తొలిఏడాదిలోనే ఏకంగా రాజన్న కేబుల్ అంటూ ఓ సంస్థ స్టాపించామంటూ, మళ్ళీ అదే ఆపరేటర్లపై జులుం ప్రదర్శించారు. వైసీపీ పెద్దలదే ఈ సంస్థ అంటూ ప్రచారం చేసిన శ్రీనివాస రెడ్డి అలియాస్ పొట్టి రెడ్డి కేబుల్ ఆపరేటర్లపై పోలీసుల వత్తిడితెచ్చి మరీ కనెక్షన్స్ వేయించారని ప్రచారం. ఐతే పొట్టి రెడ్డి గత కేబుల్ వ్యాపార చరిత్ర అంతా మోసపూరితమే కావటం, ఇంకా సదరు కంపెనీ నాణ్యమైన ప్రసారాలు ఇవ్వలేకపోవటంతో ఎస్‌ఎస్‌సి అనే పొట్టి రెడ్డి సంస్థ చతికిల పడింది. ఊపిరిపీల్చుకుంటున్న నగర ఆపరేటర్లపై మాజీ హోమ్ మంత్రి పేరు చెప్పుకుని మరో టీడీపీ నేత జియో హాత్’వే అంటూ మళ్ళీ దాడి మొదలెట్టారు. కనీసం 40 శాతం పైబడి కేబుల్ కనెక్షన్లను తమ సంస్థకే అప్పచెప్పాలనటం ఇవ్వాలనటం, హోమ్ మంత్రి సొంత కేబుల్ వ్యాపారం అంటూ చేసిన ప్రచారం వల్ల తొలిదశలో కొంత మేర వ్యాపారం పొందగలిగినా ఈ సంస్థ వినియోగదారుడి మన్ననలు పొందలేకపోవడంతో, వేసిన కేబుల్ కనెక్షన్లు క్రమేపీ తగ్గిపోయాయి. ఆతర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలుగురు ఎం‌ఎల్‌ఏ లు నేరుగా రంగంలోకి దిగినా వారికి కేబుల్ వ్యాపారం పెద్దగా ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ఆతరువాత వై‌ఎస్ కుటుంబానికి నేరుగా సన్నిహితులున్నారని చెప్పుకోస్తున్న ఓ స్టానిక ఎం‌ఎస్‌ఓ జి‌టి‌పి‌ఎల్ అంటూ హడావిడిచేసినా లోకల్ చానల్స్, ప్రసార నాణ్యతాలోపం అన్నిటికి మించి వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేని వైనంతో ఆ సంస్థ కూడా అరకొరగానే మిగిలిపోయింది.
ఇక గత చరిత్రలోకి వెళితే గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి ఆలపాటి నేతృత్వంలో ఓ వర్గం హెచ్‌సి‌వి/ ఏ‌సి‌టి కంపెనీలు విడివిడిగా కలివిడిగా వ్యాపారం చేసి, ప్రభుత్వ జులుం ప్రదర్శించి సగటు కేబుల్ ఆపరేటర్ జీవితాన్ని దెబ్బకొట్టింది. ఐతే వారేమీ వ్యాపారంలో స్తిరపడ్డ ధాఖలాలు కూడా లేవు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా ఎదోవిధంగా కేబుల్ ఆపరేటర్ జీవనం మీద అధికారంలో ఉన్న ప్రభుత్వం పేరు చెప్పుకుని దెబ్బ కొట్టడం అలవాటైపోయిన కొంతమంది వ్యక్తులే కంపెనీలు మార్చుకొని, మరలా మరలా సగటు కేబుల్ ఆపరేటర్ ను నాశనం చేస్తున్నారు. కరోనా సమయంలో రోద్దు ప్రక్కన దొర్కే టీ’ కూడా రూ. 5/- నుంచి రూ.10/- కి మారిపోగా – మోసపూరిత ఎం‌ఎస్‌ఓ కేబుల్ క్రీడలో సగటు ఆపరేటర్ బలైపోతున్నాడు. గత పదేళ్లుగా కేబుల్ టీవీ వినోదపు బిల్లు గరిష్టం రూ. 300/- దాటి వసూలు చేయలేక, కొత్త టెక్నాలజీ, కొత్త ఎం‌ఎస్‌ఓ నెట్వర్కులను అందిపుచ్చుకోలేక నలిగిపోతున్నాడు.
తాజాగా నగరంలో వై‌సి‌పి పేరుమీద 6 లేదా 7 నెట్వర్కులు తమ కేబుల్ అంటే తమ కేబుల్ వేయాలంటూ మాజీ మంత్రుల నుండి డిప్యూటీ మేయర్ వరకు చేస్తున్న హడావిడి ఆపరేటర్లను గందరగోళానికి గురిచేస్తుంది. వాస్తవానికి వై‌సి‌పి ప్రభుత్వం గాని, అధిస్థానం నాయకులుగానీ నేరుగా ఏ కేబుల్ నెట్వర్క్ కు మదత్తు తెలిపిన ధాఖలాలు లేకపోయినా, ఏకంగా పార్టీలోని అతిముఖ్యుల పేర్లతోనే స్థానిక నాయకులు ఆ పెద్దల పేర్లతో నేరుగా ఆపరేటర్లపై వత్తిడి తేవడం, వీరికి తోడుగా అడ్రసు లేని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అంటూ కొంతమంది ఫలానా నెట్వర్క్ కు ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందానా పర్సెంటేజ్ ప్రకారం ఉన్న వ్యాపారంలో వాటాలు ఇవ్వాల్సిందే అంటూ వ్యవహారం నెరపడం సర్వసాధారణం అయ్యింది.
- బాలవజ్ర సంకల్పం నెరవేరెనా?
ఐతే గతానికి భిన్నంగా నేడు నగరంలో కొత్త కేబుల్ లొల్లి నడుస్తుంది. నగర డిప్యూటీ మేయర్ బాల వజ్ర బాబు నగరానికి తాజాగా తీసుకొని వచ్చిన ఎన్‌ఎక్స్‌టి’ నెట్వర్క్ ఇటీవలే వేరే నిర్వహణలో మూతబడిన సంస్థ కావడం, దాని నూతన సారధులుగా వున్నవారు టి‌డి‌పి మద్దతుదారులు కావడం, వెరసి అన్నిటికి మించి ప్రస్తుతం కేబుల్ వ్యాపారం చేస్తున్న అందరూ ఆపరేటర్లూ సగం వాటా లో తన కేబుల్ నెట్వర్క్ వెయ్యల్సిందేనన్న ఆయన వ్యవహారశైలి ఒక నాటి ఆయన సహచర కేబుల్ ఆపరేటర్లను సైతం ఒకింత అసహనానికి గురిచేస్తుందన్నది వాస్తవం. డిప్యూటీ మేయర్ కూడా గత పాతికేళ్లుగా ఒక కేబుల్ ఆపరేటర్ అవ్వడం, గత ప్రభుత్వంలో టి‌డి‌పి పెద్దల కేబుల్ విషయాల్లో ప్రత్యక్ష భాదితుడైవుండికూడా ఇలా ఆపరేటర్లపై వత్తిడి తెస్తున్న ఆయన నినాదం’ సగం’ సగం’ పై ఆపరేటర్లు గరం గరం అవుతున్నారనటంలో సందేహం లేదు. పైకెవరూ నోరెత్తకపోయినా డిప్యూటీ మేయర్ తన సొంత వ్యాపారంలో సిటీ డిజిటల్ నెట్వర్క్ నడుపుకొంటూ, తన కొత్త వ్యాపార ప్రయోగాన్ని ఆపరేటర్లపై విసిరెయ్యడం ఏమిటన్నది పలువురు ఆపరేటర్ల ప్రశ్న?
- తెలీకుండానే రొచ్చులోకి మేయర్? అత్యుస్తాహంలో కార్పొరేటర్లు?
ఏ వ్యాపారానికైనా రాజకీయ అండ సహజం. కేబుల్ టీవీ వంటి వాటికైతే పార్టీలు మారినప్పుడల్లా పంచాయితీ కొత్తేమీ కాదు. గతంలో నరసరావుపేటలో కోడెల పుత్రుడి అరాచకాల మొదలు, చిలకలూరిపేటలో ఇద్దరు వైసీపీ పత్యర్ధులవరకు, ఇంకా టీడీపీ ఆలపాటి మొదలు చంద్ర కేబులంటూ జరిగిన ఏపీ ఫైబర్లో పొట్టి రెడ్డి వరకు ఇప్పటి ఈ నెట్వర్క్ కు మద్దతు గా నిలిచారని చెప్పుకోవడం నిర్వాహకుల వటు అయితే నివ్వెరపోవడం వైసీపీ మద్దతుదారులైన ఆపరేటర్ల వైనం గా మారటం వెనుక పెద్ద ప్రహసనమే ఉన్నదన్నది నిర్వివాదాంశం. అయితే డిప్యూటీ మేయర్ వ్యాపారం ఇంతగా ప్రాచుర్యం పొందటం వెనుక, ఆయన చాతుర్యం ఉందని నగర కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. ఆయన తన నెట్వర్క్ ప్రారంభ సభలో స్టానిక కేబుల్ ఆపరేటర్లతో పాటుగా గుంటూర్ నగర ఎం‌ఎల్‌ఏ లు, మేయర్, కార్పొరేటర్లను అందరితో ఒకే సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేటర్లు తన నేయ్వర్క్ కాదంటే నగర కార్పొరేటర్లకే అన్న నినాదం వాడటం వివాదాస్పదం అవ్వడమే కాదు, తనకు తెలీకుండానే కేబుల్ రంగం తో ఏ సంభందం లేని నగర మేయర్ ను ఈ రొచ్చులోకి దింపితే, ఇదేదో లాభసాటి వ్యవహారమనుకుని కార్పొరేటర్లు కొంతమంది, ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లుగా మారిపోయారు.
- ప్రభుత్వం పరువుపోతుంది? ... వైసీపీ ఆపరేటర్ల ఆవేదన!
జగన్నపధకాలు వాలంటీర్లనడగండి! కేబుల్ టీవీ సీరియల్ రాకపోతే నన్నడగండి అని నిన్నిటి నాడు నగరంలో ఓ కార్పొరేటర్ చేసిన వాఖ్య వివాదానికి తెర తీస్తుంది. పాత గుంటూర్ ప్రాంతంలో తన కేబుల్ తీసుకోకపోతే పధకాలు కట్ చేస్తానన్న కార్పొతెరర్ పై ఓ మహిళా గుస్సు మని లేచిందని, తనకు పధకాలు లేవు, నీ కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకుంటే ఏం పఢాకాలు ఇప్పిస్తావో ఇప్పుడే చెప్పు అంటూ అక్కడి కార్పొరేటర్ ను నిలదీసిన తీరును ఆపరేటర్లు హాస్యాస్పదంగా చర్చించు కోవడం గమనార్హం. ఇదిలా వుండగా అదే వేదిక మీద వున్న ఓ ఎం‌ఎల్‌ఏ అప్పటికి మిన్నకున్నా, ఒకింత ఆలస్యంగా కళ్ళు తెరిసి తనకు ఒక కేబూల్ తీవే వుందని, మొత్తం 50% డిప్యూటీ మేయర్ ఎత్తుకెళితే తన వాటా తెచ్చాల్సిందేనని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంగ నాయకుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ వ్యవహారాల నేపద్యంలో తొలుత ఒక్కటిగా కనిపించిన నగర వై‌సి‌పి నాయకులు ఒక్కరోక్కరుగా ఈ వివాదం తాలూకు రొచ్చు తమకు అంటకుండా కేవలం డిప్యూటీ మేయర్ వ్యవహారంగానే ప్రచారం చేస్తుండటం ప్రస్తుత పరిణామం. ఐతే అధిష్టానానిని అత్యంత సన్నిహితంగా మెలిగే సీనియర్ ఎం‌ఎల్‌సి తో పాటుగా, ఎన్నికల్లో ఓడిన పార్టీ కన్వీనర్ గా తన పట్టు కోల్పోని నాయకుడు మరోకరు, మొదటి నుంచి ఈ వివాదానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పటికే వారిరువూరు తమ మార్గాల ద్వారా పార్టీ అధిష్టానానికి గుంటూరు నగర కేబుల్ రొచ్చుతో వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరగనున్న, జరుగుతున్న నష్టాలపై ఒక నివేదిక విడివిడిగా ఇచ్చారనే భావిస్తున్నారు. చివరగా ఒక్కసారిగా అయిదారుగురు అధికార పార్టీ వారే! తమ కేబుల్ అంటే తమకేబుల్ విస్తరించాలని వత్తిడి తెస్తుంటే ఎవరి నెట్వర్క్ కు వ్యాపారం చేయాలో తెలీని అయోమయంలో ఆపరేటర్ల విషయంలో పార్టీ అధిష్టానం ఒకింత చొరవ తీసుకొని సమస్యను జటిలం కాకుండా ఆశిస్తున్నామని ఆపరేటర్ల అభిలాష. ప్రసార నాణ్యత, సమాచార సంపుటి వుంటే సహజంగానే వినియోగదారులు ఆకర్షితులవుతారని, కొత్తగా కేబుల్ నెట్వర్కు లతో వ్యాపారం చేయాలనుకుంటున్న నాయకులు ఇది గమనించాలని, ఎవరో వచ్చి అధికార పార్టీల నాయకులను ముందుపెట్టి బెదరింపుల వ్యాపారం చేయాలని చూస్తే అటు వ్యాపారాల్లో డబ్బులతో పాటుగా పార్టీ పరుపు తీసే నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారని వైసీపీకి చెందిన కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. సమస్య మరింత జటిలం ఐతే జర్నలిస్టు సంఘాల సాయంతో ప్రభుత్వ మీడియా మరియు ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి గుంటూరు కేబులు ఇబ్బందులను వివరించాలని నగర సీనియర్ ఆపరేటర్ల మనోగతాలకు ధీటుగా సగం’సగం నాదేనంటున్న ఆయన బాలవజ్ర సంకల్పం నెరవేరెరేనా? అన్నది వేచి చూడాల్సిందే!

17/07/2022

Soon-*Namaste Janasakti Telugu Daily* is being launching @ New York based USA Headquarters. For Queries/ Reporter/ Marketing Enquiries - whatsapp +91-7382349000

*సచీవాలయ వాలంటరీ వ్యవస్థ!**ప్రభుత్వానికి బలం! పార్టీకి నష్టమా?*విశ్లేషణాత్మక సంపాదకీయం...గురువారం నమస్తే జనశక్తి లో!చదవం...
11/07/2022

*సచీవాలయ వాలంటరీ వ్యవస్థ!*
*ప్రభుత్వానికి బలం! పార్టీకి నష్టమా?*
విశ్లేషణాత్మక సంపాదకీయం...
గురువారం నమస్తే జనశక్తి లో!
చదవండి. సబ్'స్క్రయిబ్ చేయండి!
www.epaper.janasakti.com

11/07/2022

*సచీవాలయ వాలంటరీ వ్యవస్థ!*
*ప్రభుత్వానికి బలం! పార్టీకి నష్టమా?*
విశ్లేషణాత్మక సంపాదకీయం..... గురువారం నమస్తే జనశక్తి లో!
చదవండి. సబ్'స్క్రయిబ్ చేయండి!
www.epaper.janasakti.com

అందరికీ అల్లూరి ఆదర్శం - కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నమస్తే జనశక్తి 06 జులై 2022http://epaper.janasakti.com/c/690237...
06/07/2022

అందరికీ అల్లూరి ఆదర్శం - కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నమస్తే జనశక్తి 06 జులై 2022
http://epaper.janasakti.com/c/69023718

Dated 05 Jul 2022

ఆరటి ధరహాసం నమస్తే జనశక్తి - గురువారం 07 జులై 2022http://epaper.janasakti.com/c/69023443
06/07/2022

ఆరటి ధరహాసం
నమస్తే జనశక్తి - గురువారం 07 జులై 2022

http://epaper.janasakti.com/c/69023443

Dated 06 Jul 2022

విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు - హోమ్ మంత్రి తానేటి వనిత నమస్తే జనశక్తి - గురువారం 07-జులై 2022http://epaper.j...
06/07/2022

విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు - హోమ్ మంత్రి తానేటి వనిత
నమస్తే జనశక్తి - గురువారం 07-జులై 2022
http://epaper.janasakti.com/c/69023338

Dated 06 Jul 2022

అల్లూరి విగ్రహావిష్కరణ రచ్చచేయబోయి, చతికిలపడ్డ టి‌డి‌పి:http://epaper.janasakti.com/c/69023309
06/07/2022

అల్లూరి విగ్రహావిష్కరణ రచ్చచేయబోయి, చతికిలపడ్డ టి‌డి‌పి:
http://epaper.janasakti.com/c/69023309

Dated 06 Jul 2022

Address

MIG 147 HOUSING BOARD COLONY, , NALLAPADU Road
Guntur
522005

Alerts

Be the first to know and let us send you an email when Namaste Janasakti Telugu Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Namaste Janasakti Telugu Daily:

Share

Category


Other Publishers in Guntur

Show All

You may also like