Bapatla District News

Bapatla District News | News |
Sharing the latest news and business updates from Bapatla District and beyond. Stay tuned for all-India news and insightful reviews.

Follow us to stay connected and informed.

*నేవీలో 270 ఉద్యోగాలు*కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (NCC) కో...
18/02/2025

*నేవీలో 270 ఉద్యోగాలు*

కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (NCC) కోర్సులో 270 ఖాళీలకు అవివాహిత యువతీ, యువకుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://www.joinindiannavy.gov.in వెబ్సైట్ చూడవచ్చు.

హైకోర్టులో వాదిస్తూ తుది శ్వాస విడిచిన న్యాయవాది పసునూరి వేణుగోపాల్... ఏపీ హైలెట్స్ న్యూస్...ఈరోజు తెలంగాణ హైకోర్టులో న్...
18/02/2025

హైకోర్టులో వాదిస్తూ తుది శ్వాస విడిచిన న్యాయవాది పసునూరి వేణుగోపాల్...

ఏపీ హైలెట్స్ న్యూస్...

ఈరోజు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తుండగా అకస్మాత్తుగా
గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలారు...
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

18/02/2025

బెంగుళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైయస్ జగన్

గన్నవరం విమనాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు

అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి వెళ్లిన జగన్

రేపు ఉదయం విజయవాడ సబ్ జైల్లో వంశీతో ములాఖత్ అవునున్న జగన్.....

ఏపీలో ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ టెండర్లు..905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు అనుమతి..గ్రేడుల వారీగా మూడు...
18/02/2025

ఏపీలో ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ టెండర్లు..

905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు అనుమతి..

గ్రేడుల వారీగా మూడు దశల్లో వేలం వేయాలని నిర్ణయం..

ఈనెల 28, మార్చి 6, 13 తేదీల్లో మూడు దఫాలుగా వేలం..

ప్రారంభ ధర నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు..

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ అటవీశాఖ..

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహంఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చ...
18/02/2025

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

ఎన్ని సార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?

సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డ హైకోర్టు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు

విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పై మండిపడ్డ జస్టిస్ కె.లక్ష్మణ్

దీంతో సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాకు మొట్టికాయలు వేసిన జస్టిస్ కె.లక్ష్మణ్

*ఏపీలో ఎస్సై పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం* విజయవాడ :ఏపీలో పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింద...
18/02/2025

*ఏపీలో ఎస్సై పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం*

విజయవాడ :

ఏపీలో పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. SI(సివిల్) పోస్టులను 65%(గతంలో 55%) డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది.

*కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే*ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే సరికొత్త ఫీచర్ను అందుబాటు లోకి తెచ్చ...
18/02/2025

*కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే*

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే సరికొత్త ఫీచర్ను అందుబాటు లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్ను ప్రారంభించింది. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సినఅవసరం ఉండదని తెలిపింది.

🔥శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో పట్టుబడిన విదేశీ కరెన్సీ.హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికల...
18/02/2025

🔥శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో పట్టుబడిన విదేశీ కరెన్సీ.

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం.

దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసిన అధికారులు.

ప్రయాణికుడిని అమీర్‌ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న అధికారులు..

*సత్తా చాటిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు* *రెండు గంటల్లో చైన్ స్నాచర్లను పట్టుకున్న చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోల...
18/02/2025

*సత్తా చాటిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు*

*రెండు గంటల్లో చైన్ స్నాచర్లను పట్టుకున్న చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు. తిమ్మాపురంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన చోరీ ఘటన. దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు. వెంటనే రంగంలోకి దిగిన సిఐ సుబ్బానాయుడు మరియు ఎడ్లపాడు ఎస్సై బాలకృష్ణలు మరియు వారి బృందం. గంటల వ్యవధిలో కేసును చేధించిన పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎఎస్సై రోశి బాబు, హెడ్ కానిస్టేబుల్ యిర్మీయా, కొరివి మధు బాబు, సాంబ, తదితరులు కేసును చేధించిన బృందంలో ఉన్నారు.*

మార్చి 1 నుంచి ఏపిలో ఇంటర్మీడియట్  పరీక్షలు
18/02/2025

మార్చి 1 నుంచి ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షలు

*అబ్బో....అమెరికా...ఒకప్పుడు....**వామ్మో.... అమెరికా..... ఇప్ప్పుడు....*బాగా డబ్బు సంపాదించాలంటే  అమెరికా  వెళ్ళాల్సిందే...
18/02/2025

*అబ్బో....అమెరికా...ఒకప్పుడు....*

*వామ్మో.... అమెరికా..... ఇప్ప్పుడు....*

బాగా డబ్బు సంపాదించాలంటే అమెరికా వెళ్ళాల్సిందే...

కానీ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు....

వాటిని వెంట వెంటనే అమలు చేసే పద్ధతులు ఇతర దేశాల వారిని...

ముఖ్యంగా మన భారతీయుల్ని కలవరపెడుతున్నాయి...

ఇటువంటి పరిస్థితి ఏర్పడినపుడు ఐటీ చదివి, విదేశాలకు వెళ్లాలనుకునేవారికి....

ఇప్పుడు అమెరికా తర్వాత అంత మంచిగా ఉండే దేశాలు....

ఫ్రాన్స్
నార్వె
జర్మనీ
నేదర్ ల్యాండ్
స్విజర్ ల్యాండ్.....

ఇలా మరికొన్ని దేశాలు ఇప్పుడు ఇటీ నిపుణులకు స్వాగతం పాలకుతున్నాయి.

విచారించి.... నిర్ణయం తీసుకోగలరు.

రష్యాను సవాలు చెయ్యడానికి 'యూరప్ సైన్యం' కావాలని జెెలియెన్‌స్కీ ఎందుకు అంటున్నారు?అమెరికా నుంచి యూరప్ దేశాలకు అందుతున్న ...
17/02/2025

రష్యాను సవాలు చెయ్యడానికి 'యూరప్ సైన్యం' కావాలని జెెలియెన్‌స్కీ ఎందుకు అంటున్నారు?

అమెరికా నుంచి యూరప్ దేశాలకు అందుతున్న ఆర్థిక, సైనిక సాయం ఇకపై అందే అవకాశం కనిపించకపోవడంతో ‘యూరప్ సైన్యం’ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ పిలుపిచ్చారు.
యూరప్, అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ‘ముగింపు దశకు’ చేరుకుందని, ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని జెలియెన్‌స్కీ మ్యూనిచ్‌లో జరిగిన భద్రత సదస్సుల్లో గుర్తు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిసిన తర్వాత ‘మా ప్రమేయం లేకుండా మా వెనుక జరిగే ఒప్పందాలను మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తే లేదు’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

మోదీపై క్యారికేచర్: వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశారా?ప్రముఖ తమిళ మీడియా సంస్థల్లో ఒకటైన వికటన్ గ్రూప్ వెబ్‌సైట్‌ను కేంద...
17/02/2025

మోదీపై క్యారికేచర్: వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశారా?

ప్రముఖ తమిళ మీడియా సంస్థల్లో ఒకటైన వికటన్ గ్రూప్ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
వికటన్ గ్రూప్ వెబ్‌సైట్, వికటన్.కామ్‌ శనివారం రాత్రి నుంచి చాలా మంది పాఠకులకు ఓపెన్ కాలేదు. వికటన్ యాప్ కూడా చాలా ఫోన్లలో పనిచేయలేదు.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ కొన్ని రోజుల క్రితం వికటన్ ప్రచురించిన ఓ కార్టూన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై శనివారం (ఫిబ్రవరి 15) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ సాయంత్రం నుంచే సైట్ ఓపెన్ కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటీసు అందలేదని వికటన్ గ్రూప్ తెలిపింది.
అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ గురించి ఇలాంటి కార్టూన్ ప్రచురించడం సరైనది కాదని, ఇది శిక్షించాల్సిన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు.

Gold Mine: బంగారు గనిలో భారీ ప్రమాదం.. కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం!పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మరో ఘోర ప్రమాదం ...
17/02/2025

Gold Mine: బంగారు గనిలో భారీ ప్రమాదం.. కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం!

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం.

ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో మాలి ఒకటి. ఇక్కడి గనులలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గని కూలిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.

స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించగా, కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ మృతుల సంఖ్య 48గా పేర్కొంది. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి తెలిపారు.

*ఈసారి సెగలే!*ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అం...
17/02/2025

*ఈసారి సెగలే!*

ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు.

*మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే* మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్...
17/02/2025

*మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే*

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్య పానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్ (3.3%) ఉన్నాయి. గతంలో టాప్ ఉన్న ఝార్ఖండ్ (9.9%), త్రిపుర (9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనక...
17/02/2025

సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండ రైలు ఏ ప్రాంతం నుంచి.. ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచం లోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండను లాగేందుకు 6 ఇంజిన్‌లు పని చేస్తాయి. ఇంతకీ అదేంటంటే..

సూపర్ వాసుకి.. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు. ఈ రైలుకు 15-20 కాదు ఏకంగా 295 కోచ్‌లు ఉన్నాయి. ఇక ఆ కోచ్‌లను లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్లు పని చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే.. దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ సూపర్ వాసుకి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.

ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. దేవతులు, రాక్షసుల మధ్య సాగరాన్ని మథించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు, అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట.

*నేటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్*నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. టోల్జా దాటడానికి ముందు గంటసేపు ఫాస్...
17/02/2025

*నేటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్*

నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. టోల్జా దాటడానికి ముందు గంటసేపు ఫాస్టాగ్ పనిచేకపోతే, లేదా ఫాస్టార్స్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంటే టోల్ ప్లాజాలో చెల్లించిన టోల్ తిరస్కరిస్తారు. టోల్ బూత్ గుండా వెళ్లిన 10 నిమిషాల్లోపు ఫాస్టాగ్ పనిచేయకపోతే అంటే అది బ్లాక్ లిస్టులో ఉంటే లావాదేవీ తిరస్కరించబడుతుంది. ఇలా జరిగితే కస్టమ్స్ రుసుము కంటే రెట్టింపు జరిమానా విధించవచ్చని సూచించింది.

Address

Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Bapatla District News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bapatla District News:

Videos

Share