16/11/2021
ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో వెలిమినేడు లోని పేదల భూములు బలవంతంగా లాక్కోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ ను వెలిమినేడు భూ నిర్వాసిత రైతుల తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుదాకర్ రెడ్డి మాట్లాడుతూ తాత్కాలికంగా భూసేకరణకు సంబంధించిన గ్రామ సభ రద్దు చేయడం కాదు, అధికార పార్టీ శాసనసభ్యులు ,ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం రైతులకు అండగా చూపాలని కోరారు. లేనిపక్షంలో రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉదృతంగా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీ ను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెలిమినేడు వార్డ్ మెంబర్ మల్లం మహేష్ ైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఐతరాజు నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు , అరూరి నర్సింహ, పంది నరేష్, రైతు సంఘం నాయకులు సామ రాంరెడ్డి, మేడి రాములు, మెట్టు నర్సింహ, మేడి స్వామి, శంకరయ్య, కే.రవి ,మెట్టు శ్రీ శైలం, సింగిరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.