21/08/2021
పాపం
అనంతపురం జిల్లా శింగనమలలో విషాద ఘటన :
సింగనమల మండలం లోని గంప మల్లయ్య స్వామి కొండమీద పూజారి అప్పా పాపయ్య స్వామివారికి కొండ చివర భాగన నిలబడి ప్రత్యేక పూజలు చేశారు. కొండ చివర నిలబడి స్వామివారిని ప్రార్థించారు. సంప్రదాయ వాయిద్యాల శబ్దాల నడుమ పూజారి నృత్యం చేశారు.
వెయ్యి అడుగుల పైన ఉండే కొండ మీద నుండి కిందకు ఓ యాభై అడుగుల దాకా బాగా నూనె తో నిండి ఉన్న కొండ వాలు గుహలో ఉన్న దేవుడికి నైవేద్యం పెట్టి, ఎలాంటి సపోర్ట్ లేకుండా మళ్ళీ పైకి ఎక్కడం వందల ఏళ్లుగా జరుగుతూ ఉంటుంది.
అయితే నేటి పూజ లో భాగంగా పూజారి పొరపాటున కాలుజారి కొండపై నుంచి దొర్లుతూ లోయలో పడిపోయే దుర్మరణం చెందాడు.
కొండపైన ఉన్న భక్తులందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగింది. వెంటనే భక్తులు కొండ కిందకు వెళ్లి చూశారు.కానీ అప్పటికే పూజారి అప్ప పాపయ్య చనిపోయారు. భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసంప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆలయ పూజారి మరణం భక్తులలో తీవ్ర విషాదాన్ని నింపింది.