Beyondnews365

  • Home
  • Beyondnews365

Beyondnews365 Beyond News వార్తల వెనక దాగి ఉన్న వాస్తవాలు

01/10/2024

ఇజ్రాయెల్ పై ఈగ వాలినా అమెరికా సహించదని తెలిసి కూడా, వంద మిస్సైళ్లతో దాడి మొదలు పెట్టి ఇరాన్ పెద్ద కష్టాన్నే కొని తెచ్చుకుంది

20/03/2024
23/01/2023
31/10/2022

మోర్బీ దు:ఖ దాయిని మచ్చూ నది
గుజరాత్ లోని మోర్బీ ( మోర్వీ అని కూడా పిలుస్తారు) పట్టణం విషాదాలకు పెట్టింది పేరు. 2 లక్షల జనాభా ఉండే ఈ మున్సిపల్ పట్టణంలోని మచ్చూ నదిపైన ఉన్న వేలాడే బ్రిడ్జి కూలి 141 మంది చనిపోగా మరో 70 మంది గల్లంతయ్యారు. నాలుగు నెలల పాటు నిర్వహించిన మరమ్మతులు పూర్తి అయిన తర్వాతే ఈ దుర్ఘటన జరిగింది.
1979 లో మచ్చూ నది డ్రామ్-2 కు ఆకస్మిక వరదలు రాగా మట్టి కట్ట కొట్టుకుపోయి దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ రికార్డుల్లో మృతుల సంఖ్య 1000-20,000 మంది చనిపోయి ఉంటారని నమోదై ఉంది. మోర్వీ పట్టణం అరేబియా సముద్రానికి 35 కిలో మీటర్ల ఎగువన ఉంది. వరదతో పాటు మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోవడంతో ఇప్పటికి ఎంత మంది మరణించారో ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన లెక్కలు లేవు.
విషాద మోర్వీ

కల్తీ ఆవ నూనె చాలా కాస్ట్లీ దీపావళి పర్వదినం రోజుల్లో ప్రమిదలు వెలిగించేందుకు వాడే ఆవ నూనె (Mustard Oil) ను కూడా కల్తీ చ...
23/10/2022

కల్తీ ఆవ నూనె చాలా కాస్ట్లీ
దీపావళి పర్వదినం రోజుల్లో ప్రమిదలు వెలిగించేందుకు వాడే ఆవ నూనె (Mustard Oil) ను కూడా కల్తీ చేస్తున్నాయి వ్యాపార సంస్థలు. బ్రాండెడ్ ఆవ నూనెలను కూడా పామాయిల్, పత్తిగింజల నూనెతో కల్తీ చేస్తున్నారు. పూజలకు వాడే నూనెలు, నెయ్యిపై Food Safety and Standards Authority of India (FSSAI) నియంత్రణ లేకపోవడంతో ఇష్టా రాజ్యంగా మారింది. పెట్ బాటిల్స్ లో బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్న కంపెనీలు తెలివిగా 'పూజ కోసమే, వంటలకు వినియోగించ రాదు' అని రాసి తనిఖీల నుంచి తప్పించుకుంటున్నాయి. దేశీయ హోల్ సేల్ మార్కెట్లో ఆవ నూనె కిలో రూ.140-160 మధ్య పలుకుతోంది. పూజల కోసం మార్కెట్ చేస్తున్న ఆవనూనె లీ. 190-220 మధ్య దొరుకుతోంది. పన్నులు, డీలర్ కమిషన్, రిటెయిలర్ మార్జిన్, పెట్ బాటిల్ విలువతో కలిపితే స్వచ్చమైన ఆవనూనె కిలో 250 కు అమ్మితే తప్ప గిట్టుబాటు కాదు. ఖరీదు ఎక్కువైతే వినియోగదారులు ముందుకు రారని భావించి పోటీలు పడి ధర తగ్గించి కల్తీకి పాల్పడుతున్నారు. ఆవనూనెలో పామాయిల్, పత్తి గింజల నూనె, రంగు, చిక్కదనం కోసం హోటళ్లలో వాడి పారేసిన నూనెలను కలుపుతున్నారు.
పూజకు వాడే నెయ్యిలో పశువుల కొవ్వు, వనస్పతి కలిపి విక్రయిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా పెద్ద రాకెట్ నడుస్తోంది.
ఏం చేయాలి?
ప్రమిదలు వెలిగించేందుకు ఆవ నూనె వాడటం అనేది ఎంతో కాలంగా వస్తున్న ఆచారం. భూమిలో పండిన వేరు శనగ నూనెను వాడరాదని చెబ్తారు. అయితే కల్తీ ఆవనూనె బదులు, భూమి పైన పండే పామాయిల్, పొద్దు తిరుగుడు, సోయా, కొబ్బరి నూనెలను వాడొచ్చు. ఆవు నెయ్యిని కూడా అమూల్ లాంటి బ్రాండ్లవి వినియోగిస్తే తప్పేం లేదు.

దోమల నివారణ, వెక్టార్ బార్న్(దోమలు కుట్టడం వల్ల వచ్చే) వ్యాధుల నివారణకు అందరూ ఆచరించగలిగిన, తక్కువ ఖర్చుతో కూడిన సలహాల క...
21/10/2022

దోమల నివారణ, వెక్టార్ బార్న్(దోమలు కుట్టడం వల్ల వచ్చే) వ్యాధుల నివారణకు అందరూ ఆచరించగలిగిన, తక్కువ ఖర్చుతో కూడిన సలహాల కోసం WHO చేసిన అభ్యర్థనకు అనేక ప్రతిపాదనలు, పరిశోధన పత్రాలు వెళ్లాయి. ఇందులో మన తెలుగువాడికి WHO బహుమతి లభించింది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

20/10/2022

తెలంగాణా బతుకమ్మ ఉత్సవంలో మహిళల కోలాహలం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం శిలార్ గూడెంలో జరిగిందీ పండుగ. కట్టా లక్ష్మీఉపేందర్ గారు విజేతలకు రూ.20 వేల విలువైన బహుమతులు అందజేసారు

14/06/2022

తొలకరి చినుకుల నీటి బిందువుల్లో ఆడుతూ మురిసిపోతున్న పక్షి. చినుకు చుక్కలను తాగుతూ వేసవి ఎండల నుంచి విముక్తి కలిగిందన్న ఉల్లాసం కనిపిస్తోంది దాని చేష్టల్లో

09/06/2022

ఉత్తర ఐర్లండ్ లో పాల్ నెల్సన్ అనే సాహసికుడు ప్యారా గ్లైడర్ పై గాలిలో శికారు చేస్తుండగా ఆకాశంలో తిరుగుతున్న నల్ల రాబందు చనువుగా వచ్చి అతని చెంత కూర్చుంది. రాబందులు సాధారణంగా మనుషుల దగ్గరకు రావడానికి ఇష్టపడవు. ఏమనిపించిందో కాసేపు చక్కర్లు కొట్టి ఎగిరి వెళ్లిపోయింది. Paul.Nelson
ఈ వీడియో క్లిప్ ను twitter లో పోస్ట్ చేయగా నెట్లో వైరల్ అయింది.

ఆమ్నేసియా, ఇన్ సోమ్నియా పబ్ కేంద్రంగా జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటన హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశ...
08/06/2022

ఆమ్నేసియా, ఇన్ సోమ్నియా పబ్ కేంద్రంగా జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటన హైదరాబాద్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. విదేశీయురాలైన 17 మైనర్ బాలికను పబ్ లోకి ఎలా అనుమతించారు, మిగిలిన నిందితులు పార్టీ జరుపుకోవాల్సివస్తే పబ్ ను ఎందుకు ఎంచుకున్నారు. మద్యం ఎలా సేవించగలిగారు. ఇలాంటి అనేక సందేహాలు యుక్త వయసు పిల్లలున్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్దమ్మ గుడి ఆర్చి పక్కనే ఉన్న ఈ పబ్ ను మూసివేయించాలని చుట్టు పక్కన నివాసాలుండేవారు గతంలో హైకోర్టు తలుపు తట్టారు. కొన్ని కండిషన్లతో పబ్ నడపడానికి అనుమతి దొరికినా పద్ధతి మార్చుకోలేదిని తెలుస్తోంది. డబ్బు సంపాదన కోసం పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే మైనర్ కుమారుడు కూడా ఉండటంతో కేసును సరిగా హ్యాండిల్ చేయడంలేదని పోలీసుల పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. బాలికతో కారులో యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం ఈ ఇన్సిడెంటుకు సంబంధించి కొన్ని సందేహాలకు జవాబు దొరకడం లేదు
1) రొమేనియా బాలికపై అత్యాచారం జరిగింది మే 28 నాడు అయితే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది 31 రాత్రి 9 గంటలకు. ఈ మూడు రోజుల్లో ఏం జరిగింది. నిందితుల బంధువులు కొందరు కేసు పెట్టకుండా బేరసారాలకు దిగింది నిజమేనా? స్మిమ్మింగ్ పూల్స్, ఫాం హౌజులు, లగ్జరీ విల్లాలను డిజైన్ చేసే వృత్తిలో బాధితురాలి తండ్రి తమ కూతురు వెంటనే చెప్పక పోవడం వల్లే ఫిర్యాదు చేయడం ఆలస్యమైనట్టు పోలీసులకు వివరణ ఇచ్చారు.
2) బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది, ఆమె మెడపై పంటి గాట్లు బయటకు కనిపించేలా ఉన్నా కుటుంబ సభ్యులు ఎందుకు ఆందోళన చెందలేదనేది అర్థంకావడం లేదు.
3) మొత్తం ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నా అతను అత్యాచారం చేయలేదని పోలీసులు చెబ్తున్నారు. తీవ్ర షాక్ కు గురవడం వల్ల బాధితురాలు అందరినీ గుర్తించలేకపోయింది. ఇది నిందితులకు కలిసొస్తుందా?
4) సిసి కెమెరా ఫుటేజి, ఫోరెన్సిక్ ఆధారాలు నిందితులకు శిక్ష పడేలా చేస్తాయా అనేది అనుమానమే.
5) బాలిక కుటుంబం స్వదేశానికి వెళ్లిపోతే కేసు బలహీనమయ్యే ఆస్కారం ఉంది. నిందితుల తరపున ఇప్పటికే కొందరు రంగంలోకి దిగినట్టు సమాచారం. పోలీసులు పెట్టిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశమున్నా కేసు చివరివరకు నిలుస్తుందా అనేది చూడాలి.
6) ఎంఎల్ ఏ పేరు బయటకు చెప్పకపోవడానికి కారణం... నిందితుడిగా ఉన్న మైనర్ తల్లిదండ్రుల పేర్లను వెల్లడించడం నేరమవుతుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు ఉటంకిస్తున్నాయి.

08/06/2022

యాచకులుగా మారిన కళాకారులు

తెలుగు సంస్కృతిలో ఉత్కృష్ట కళగా ఆదరణ పొందిన గంగిరెద్దుల ఆటలో గంగిరెద్దులు మిస్ అవుతున్నాయి. వృషభాలు కొనుక్కోవాల్సి రావడం, పోషణ ఖర్చులు భరించే పరిస్థితులు లేకపోవడంతో వాటిని నమ్ముకుని బతికే కుటుంబాలు ఇలా వీధుల్లో యాచన చేస్తున్నాయి. సన్నాయి మోగిస్తూ అడుక్కునే దృశ్యాలు అంతటా కనిపిస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఈ కళాకారులు అక్కడ ఆదరణ లేక పట్టణాలకు తరలి వస్తున్నారు.

పరుగులు పెట్టనున్న చీతాలుఅంతరించిన ఏషియాటిక్ చీతాల స్థానంలో ఆఫ్రికన్ చీతాలను (Acinonyx jubatus)  ప్రవేశపెట్టేందుకు కేంద్...
07/06/2022

పరుగులు పెట్టనున్న చీతాలు

అంతరించిన ఏషియాటిక్ చీతాల స్థానంలో ఆఫ్రికన్ చీతాలను (Acinonyx jubatus) ప్రవేశపెట్టేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. 2009 లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదన అనేక సవాళ్లను దాటుకుని అన్ని క్లియరెన్సులు పొందింది. వచ్చే ఆగస్టులో మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కు (Kuno national park) లో పది చీతాలను వదిలిపెడతారు. దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి ఎటువంటి జన్యులోపాలు లేని పూర్తి ఆరోగ్యంగా ఉన్న పది చీతాలను తరలించనున్నారు. ఐదేళ్లలో మరో 40 తీసుకొచ్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. కూనో నేషనల్ పార్కులో చీతాలు బాగా ఇష్టపడే చితాల్, సంబార్, అడవి పందులు పెద్ద సంఖ్యలో ఉండటటంతో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసారు. మధ్యప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్ ఘడ్)లోని కొరియా, సుర్గుజా మహారాజు రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ ఆఖరి 3 చీతాలను 1948 లో తుపాకీతో వేటాడి హతమార్చాడని చరిత్రకారులు చెబ్తారు.
ఇరాన్ లో ఏషియాటిక్ చీతాలున్నప్పటికీ వాటిని తరలించడానికి అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల వీలుకావడం లేదు. దానితో ప్రస్తుతానికి ఆఫ్రికన్ చీతాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
Photo Courtesy: PIB

07/06/2022

ప్రమాదకర బలప్రదర్శన...

ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లాలోని మా వూరు 'సాగర్ తిరుమలగిరి'లో పందెం గుండు ఎత్తే పోటీలు జరుగుతాయి. 100-120 కిలోల బరువు తూగెే నల్ల రాయిని ఎత్తి భుజం మీద నుంచి వెనకకు జారవిడచాలి. 50 ఏళ్లుగా క్రమం తప్పకుండా నవమి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పోటీలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతాయి. 5 నిమిషాల్లో పోటీదారులు ఎన్నిసార్లు ఎత్తి వేస్తారనే దానిపై విజేతలను నిర్ణయిస్తారు. నగదు బహుమతి ఉంటుంది. మొన్నటి ఏప్రిల్ లో జరిగిన పోటీల్లో మాచెర్లకు చెందిన వీరాంజి 17 సార్లు లిఫ్ట్ చేసి ప్రథమ విజేతగా నిల్చారు. ఈ వీడియోలో అతను లేడు. నల్ల కట్ బనియన్లో ఉన్న యువకుడు రెండో బహుమతి గెల్చిన మారెపల్లి అలేక్య స్థానికుడు. జడ్జిగా కటికర్ల మల్లయ్య వ్యవహరించారు. 30-40 ఏళ్ల క్రితం తయారు చేయించిన ఈ నల్ల రాయి బరువు అప్పట్లో 120 కిలోలు ఉండేదని చెబ్తారు. అరిగిపోవడం వల్ల కొంత బరువు కోల్పోయి ఉండవచ్చు.
Video Credit: JV Prashanth

మిలటరీ యూనిఫాంలో కనిపిస్తున్న ఈ యువతి ప్రిన్సెస్ ఎలిజెబెత్. ఇప్పటి క్వీన్ ఎలిజెబెతే అప్పటి 19 ఏళ్ల ప్రిన్సెస్. 1945 లో ర...
06/06/2022

మిలటరీ యూనిఫాంలో కనిపిస్తున్న ఈ యువతి ప్రిన్సెస్ ఎలిజెబెత్. ఇప్పటి క్వీన్ ఎలిజెబెతే అప్పటి 19 ఏళ్ల ప్రిన్సెస్. 1945 లో రెండో ప్రపంచ యుద్థంలో యాంబులెన్స్ డ్రైవర్ గా, మెకానిక్ గా సేవలందించారు. ఆర్మీలో చేరినప్పుడు ఆమె 2nd Subaltern కాగా ఆరు నెలల్లోనే జూనియర్ కమాండర్ గా ప్రమోట్ చేసారు. ఇటీవలే క్వీన్ ఎలిజెబెత్ సింహాసనం అధిష్టించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
Photo Courtesy: Imperial War Museum, London

Sweetest Fruit on the Earth ప్రపంచంలోనే అత్యంత తియ్యని పండు ఫిలిప్పీన్స్ లో దొరికే కరబావో మ్యాంగో (carabao mango). తీయదన...
06/06/2022

Sweetest Fruit on the Earth

ప్రపంచంలోనే అత్యంత తియ్యని పండు ఫిలిప్పీన్స్ లో దొరికే కరబావో మ్యాంగో (carabao mango). తీయదనంలో దీనికి మరే ఫలం పోటీరాదని గెన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా తేల్చింది. ఈ పళ్లలో ఉండే ఫ్రక్టోజ్ (సుగర్) వల్ల దీనికా అద్భుత రుచి వచ్చింది. కరబావో మ్యాంగో విత్తనాలు, అంటు మొక్కలు ఆన్ లైన్ నర్సరీల్లో దొరుకుతాయి.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Beyondnews365 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share