Hameed Shaik

Hameed Shaik This page is created to give awareness about social welfare schemes and exclusively meant for sharing news from all the corners of the nation.

మాజీ ఎంపీటీసీ మృతి పట్ల దిగ్భ్రాంతి * కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన భాస్కర్ రావు మిర్యాలగూడ మండలంలో  బాద...
23/09/2023

మాజీ ఎంపీటీసీ మృతి పట్ల దిగ్భ్రాంతి
* కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన భాస్కర్ రావు

మిర్యాలగూడ మండలంలో బాదలాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ ఆవిరెండ్ల మల్లయ్య (80) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం బాదలాపురంలోని మల్లయ్య నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఎమ్ఎల్ఏ వెంట రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధర్మపాల్ రెడ్డి, సర్పంచ్ పంతంగి శోభారాణి సైదులు, ఉప సర్పంచ్ నల్లమేకల వెంకులు, లింగంపల్లి రాము, గ్రామ శాఖ అధ్యక్షులు పంతంగి వెంకటేశ్వర్లు, చె లిమెండ్ల పద్మయ్య, అరుణ్ మాలి రామకిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న భాస్కర్ రావు, భార్గవ్ మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్, సుందర్ నగర్ కాలనీల్లో శనివారం నిర...
23/09/2023

గణేష్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న భాస్కర్ రావు, భార్గవ్

మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్, సుందర్ నగర్ కాలనీల్లో శనివారం నిర్వహించిన గణేష్ ఉత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. అయా మంటపాల వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన అన్నదానం కార్యక్రమాల్లో భాస్కర్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఎండీ సాదేఖా బేగం ఖాదర్, ఉదయ్ భాస్కర్, వార్డు అధ్యక్షులు గుండెబోయిన నరేష్, గంగుల భిక్షం, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.@ హమీద్ షేక్

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గురువ...
10/11/2022

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గురువారం శాసనసభ భవనంలో సభాపతి ఛాంబర్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కూసుకుంట్ల సుధాకర్ రెడ్డికి భాస్కర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో కూసుకుంట్ల సుధాకర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. 👌👍💐@హమీద్ షేక్

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పదవీ కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న  తన్నీరు హరీష్ రావు గారికి హార్ధిక అభినం...
10/11/2022

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పదవీ కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తన్నీరు హరీష్ రావు గారికి హార్ధిక అభినందనలు....🙏🌺👍✊👏@హామీద్ షేక్ & వాట్సాప్ గ్రూపు సభ్యులు

* వైద్యరంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం

* సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్యారోగ్యం

* పేదప్రజలకు వరంగా మారిన ప్రభుత్వదవాఖానాలు

03/10/2022
03/10/2022

ఉచిత వ్యాక్సినేషన్ కు అనూహ్య స్పందన * వాసంతి ఆస్పత్రిలో వైద్య సేవలు భేష్ * అర్హులంతా కరోనా నివారణ టీకా వేయించుకోవాలి * రంగా శ్రీధర్ చొరవ పట్ల వలస కార్మికుల అభినందనల వెల్లువ : హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ 👌👍💐 ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ క్లబ్ వ్యవస్థాపకులు రంగా శ్రీధర్ ప్రత్యేక చొరవతో 100మందికి కరోనా నివారణ టీకా వేయించేందుకు శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ తెలిపారు. కరోనా నివారణ టీకా తీసుకుంటున్న వలస కార్మికులు రంగా శ్రీధర్ చూపిన చొరవ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలోని వాసంతి ఆస్పత్రిలో వైద్య సేవలు చాలా బాగున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మాత్రమే ఇక్కడ కరోనా నివారణ టీకాలు వేస్తున్నారని చెప్పారు. కరోనా నివారణ టీకాల ధరలను రాష్ట్రంలోని ప్రయివేట్ ఆస్పత్రులు భారీగా పెంచాయని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని హమీద్ షేక్ తెలిపారు. వాసంతి ఆస్పత్రిలో కరోనా టీకాలను ప్రభుత్వం నిర్ధేశించిన ధరకు మాత్రమే అందిస్తూ ఉన్నతాధికారుల, ప్రజా ప్రతినిధుల మన్ననలను డాక్టర్ అశ్విన్ కుమార్ సొంతం చేసుకుంటున్నారని అన్నారు. కాగా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వైద్యురాలు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. పుట్టిన ఊరిపై ఉన్న మమకారంతో, బాల్య మిత్రుడు రంగా శ్రీధర్ నిర్వర్తిస్తున్న సేవా కార్యక్రమాల ప్రేరణతో 100మందికి రూ.50వేల విలువైన కరోనా నివారణ టీకా వేయించేందుకు ముందుకొచ్చారు. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 25మందికి కరోనా నివారణ టీకాలు వేయించారు. ముందస్తుగా పేర్లను నమోదు చేయించుకున్నవారికి ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేయిస్తున్నారు. 👌👍💐@ హమీద్ షేక్

03/10/2022
"Visionery leaders always think of welfare of public. By their acts inspire the youth...By their great virtues lead the ...
17/05/2022

"Visionery leaders always think of welfare of public. By their acts inspire the youth...By their great virtues lead the way. "- Hameed Shaik 👍👌💐

support N.B.R.
Siddardha followers

జర్నలిజం విలువలతో కూడిన వృత్తి * ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా విలేకరులు వ్యవహరించాలి * ప్రజా సమస్యలపై నిష్ప...
03/03/2022

జర్నలిజం విలువలతో కూడిన వృత్తి
* ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా విలేకరులు వ్యవహరించాలి
* ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా కలాలకు పదునుపెట్టాలి
* 'నమస్తే' దినపత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ : మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ 👌👍💐

జర్నలిజం విలువలతో కూడిన వృత్తి అని మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ అభివర్ణించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసే జర్నలిస్టులకు సమాజంలో ఎల్లప్పుడూ సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ తో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో నమస్తే దినపత్రిక, క్యాలెండర్ ను ఆర్డీవో రోహిత్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రధాన సంధానకర్తలుగా విలేకరులు వ్యవహరించాలని కోరారు. జర్నలిస్టులు ప్రతీ క్షణం అప్డేటెడ్ గా ఉండాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి దినపత్రికల్లో ప్రచురించి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. సమాజంలో అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపై విలేకరులు నిష్పక్షపాతంగా కలాలకు పదునుపెట్టాలి కోరారు. నమస్తే దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు, కథనాలు, స్పాట్ న్యూస్ కవరేజీ బాగున్నదని అన్నారు. అనంతరం నమస్తే ఎండీ, చీఫ్ ఎడిటర్ లక్ష్మీనారాయణ, డివిజన్ రిపోర్టర్ షేక్ జానీపాషా, సిబ్బందికి ఆర్డీవో రోహిత్ సింగ్ అభినందనలు తెలిపారు. 👌👍💐@హమీద్ షేక్

ఆపద్బాంధవుడు 'మునీర్'* నిరుపేదలకు చేయూత అభినందనీయం* 10 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ * జనయేత్రి ఫౌండేషన్ సేవలు మ...
12/12/2021

ఆపద్బాంధవుడు 'మునీర్'
* నిరుపేదలకు చేయూత అభినందనీయం
* 10 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ
* జనయేత్రి ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలి : హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ 👌👍💐

మిర్యాలగూడ పట్టణానికి చెందిన సామాజికవేత్త, జనయేత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆపదలో ఉన్నవారి పాలిట ఆపద్బాంధవుడని సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. నిరుపేదలకు ఆయన అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అభినందనీయమని కొనియాడారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కోవిడ్-19 విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 కుటుంబాలకు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ బియ్యం, నిత్యావసర సరుకులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. నిరుపేదలందరికీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు, బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్నాయని అన్నారు. జనహితం కోసం జనయేత్రి ఫౌండేషన్ ను స్థాపించి ప్రజలకు తన సేవల ద్వారా మరింత చేరువ కావాలని ఆలోచిస్తున్న ఆయన దృక్పథం విశాలమైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో తమ వంతుగా సహాయసహకారాలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్కు, శానిటైజర్ ను విధిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటాం * ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు  జర్నలిస్టులకు  రూ.20వేలు ఆర్ధిక సాయం * 28మందికి ...
20/09/2021

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటాం
* ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు జర్నలిస్టులకు రూ.20వేలు ఆర్ధిక సాయం
* 28మందికి రూ.2,80,000 ఆర్ధిక చేయూతను అందించి దాతృత్వాన్ని చాటుకున్న నల్లమోతు సిద్దార్ధ 👌👍💐

#జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. కరోనా బారినపడి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 26 మంది జర్నలిస్టులకు గత మూడు నెలల్లో ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2,60,000 వేలు ఆర్ధిక సాయాన్ని యువనేత అందజేశారు. నల్లమోతు సిద్దార్ధ నిర్ధేశానుసారం కోవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులను, కుటుంబసభ్యులను హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హామీద్ షేక్ పరామర్శించారు. అనంతరం సిద్దార్ధ పంపిన ఆర్ధిక సాయాన్ని అందజేశారు. తాజాగా,కోవిడ్ బారినపడిన ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చక్ర టీవీ జర్నలిస్ట్ భాస్కర్ కు, కేఎస్ఎన్ ఛానెల్ జర్నలిస్ట్ సైదులు కు ఒక్కొకరికీ రూ.10వేలు చొప్పున రూ.20వేలు ఆర్ధిక సాయాన్ని హమీద్ షేక్ చేతుల మీదుగా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం అందజేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఆర్థికసాయం అందజేస్తూ సిద్దార్ధ మనోధైర్యం కల్పించడం అనిర్వచనీయమని హమీద్ షేక్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో కోవిడ్ బారినపడి కోలుకున్నప్పటికీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 28 మంది జర్నలిస్టులకు ఆర్ధిక సాయం అందించి యువనేత సిద్దార్ధ గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడారు. కాగా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన నల్లమోతు సిద్దార్ధకు జర్నలిస్టులు భాస్కర్, సైదులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 👍👌💐@ హమీద్ షేక్

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటాం * ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఆర్ న్యూస్ జర్నలిస్ట్ కు  రూ.10వేలు ఆర్ధిక సాయం * 26...
30/08/2021

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటాం
* ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఆర్ న్యూస్ జర్నలిస్ట్ కు రూ.10వేలు ఆర్ధిక సాయం
* 26మందికి రూ.2,60,000 ఆర్ధిక చేయూతను అందించి దాతృత్వాన్ని చాటుకున్న నల్లమోతు సిద్దార్ధ 👌👍💐

#జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. కరోనా బారినపడి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 25 మంది జర్నలిస్టులకు గత రెండు నెలల్లో ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2,50,000 వేలు ఆర్ధిక సాయాన్ని యువనేత అందజేశారు. నల్లమోతు సిద్దార్ధ నిర్ధేశానుసారం కోవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులను, కుటుంబసభ్యులను హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హామీద్ షేక్ పరామర్శించారు. అనంతరం సిద్దార్ధ పంపిన ఆర్ధిక సాయాన్ని అందజేశారు. తాజాగా,కోవిడ్ బారినపడి గతవారం కోలుకున్న సీవీఆర్ న్యూస్ జర్నలిస్ట్ అశోక్ కు రూ.10వేలు ఆర్ధిక సాయాన్ని హమీద్ షేక్ చేతుల మీదుగా మిర్యాలగూడ బస్ స్టాండ్ లో సోమవారం అందజేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఆర్థికసాయం అందజేస్తూ సిద్దార్ధ మనోధైర్యం కల్పించడం అనిర్వచనీయమని హమీద్ షేక్ తెలిపారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన నల్లమోతు సిద్దార్ధకు అశోక్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 👍👌💐@ హమీద్ షేక్

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Hameed Shaik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hameed Shaik:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share