Kamareddy News

  • Home
  • Kamareddy News

Kamareddy News Kamareddy News is a Latest page where you get all the Latest news from Kamareddy District. Kamareddy news, Kamareddy latest news

Kamareddy Corona News, Corona Cases in Kamareddy, Kamareddy Corona cases details.

05/11/2023

2019లో తెలంగాణాలో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఏ మీడియా చెప్పలేదు,గ్రేటర్లో కూడా,ప్రజలు గెలిపించారు, ప్రజలను నమ్మండి...

మధ్యలో వచ్చి వెళ్లిన కోమటిరెడ్డి, వివేక్ ఇతర నాయకులు గెలిపించలేదు బీజేపీకి 4 ఎంపీ స్థానాలను, గ్రేటర్ విజయాన్ని... ప్రజలు నమ్మి గెలిపించారు...

మధ్యలో వచ్చిన mlc ఎన్నికల్లో బీజేపీ గెలిచింది పార్టీ కార్యకర్తలు అభిమానుల వలన, అవకాశం కోసం వలస వచ్చి వెళ్లిన నాయకుల వలన కాదు...

2019 ఎన్నికల్లో, గ్రేటర్లో, ఉప ఎన్నికల్లో, mlc ఎన్నికల్లో బీజేపీని చూసారు, నమ్మారు, అప్పుడు కూడా కార్యకర్తలు అభిమానులు గెలిపించారు...

అక్కడ ఉన్నది కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల అన్నది కాదు...అక్కడ ఉన్నది బీజేపీ పార్టీ,కమలం గుర్తు, ఆ గుర్తుకు ఓటేశారు ప్రజలు...

ప్రజలను నమ్మండి ప్రజలు గెలిపిస్తారు, దొంగ మీడియాలను, కుహనా మేథావులను కాదు...

విజయానికి కృషి చేయకుండా కార్యకర్తలు, అభిమానులు పేరుతో నెగటివ్ పోస్టులు విశ్లేషణలు చేసేవారిని దూరం పెట్టండి..

మీరు ఇతరుల ట్రాపులో పడకుండా బీజేపీ పార్టీ ఎజెండాలో నడవండి, పార్టీని నమ్మండి, ప్రజలను నమ్మండి,ప్రజలే గెలిపిస్తారు...

03/11/2023

👉రేషన్ కార్డు ఇవ్వలేనోడు, సన్నబియ్యం ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు 5000 ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు అందరికీ ఇల్లు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది,
👉నాలుగున్నర సంవత్సరాల క్రితం ఋణమాఫీ చేస్తా అన్నోడు,ఇప్పటికీ పూర్తిగా చేయలేనోడు, వడ్డీ భారం రైతులపై వేసినోడు మళ్ళీ చేస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉ఎరువుల ధరలు పెంచినోడు, ఉచితంగా ఎరువులు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసినోడు,నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నోడు,కొత్త ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది
👉ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేనోడు, PRC,DA ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది...
👉గ్యాస్ సిలిండర్ ధర తగ్గించండి రా అంటే అది కేంద్రం పరిధిలోనిది అంటారు.. ఇప్పుడు 500 లకే గ్యాస్ ఇస్తాం అంటే ఎవర్రా నమ్మేది
........ మోసపోకు - గోసపడకు.....

01/11/2023

ప్రైవేటు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ జీతం కోసమో, ప్రమోషన్ కోసమో కంపెనీలు మారినట్లు, రాజకీయ నాయకులు కూడా పదవుల కోసం, పైసల కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారుతున్నారు.

నేటి రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడటం, లక్ష్యాల కోసం పనిచేయడం, నీతినిజాయితీలు కలిగి ఉండటం అనేవి ఒట్టి పనికిమాలిన ముచ్చట్లు.

ప్రస్తుత రాజకీయాలు కేవలం వ్యాపారం. రిస్క్ తీసుకునే దమ్మున్నవాడు, పెట్టుబడి పెట్టగల సత్తా ఉన్నవాడు ఓట్లు కొనుక్కుంటాడు. డబ్బులు లేనివాడు ఓటు అమ్ముకుంటారు. బాకీ సబ్ బక్వాస్.

ప్రజలకు సేవ చేస్తాను అని నాయకులు యెందుకు అంతగా పరితపించి పోతున్నారు అంటే ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎన్నికల కోసం పెట్టిన పెట్టుబడి ఒక్క సంవత్సరంలో వాపసు వస్తుంది. మిగతా సంవత్సరాల్లో సంపాదించేది బోనస్. ఈ సంపాదనకు తోడు పదవితో పాటు లభించే హోదా, గౌరవ మర్యాదలు, సన్మానాలు, అధికారుల సెల్యూట్ లు అదనం. అబ్బో ఆ కిక్కే వేరు..

14/10/2023

ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ లో లైబ్రరీలో నిశబ్దంగా చుకుంటున్న నిరుద్యోగి నీ అడుగు ఇ పదేళ్ల కాలంలో TRS / BRS ఎం చేసింది తెలంగాణకి, 100 % మీకు వాస్తవాలు తెలుస్తాయి

13/10/2023
19/07/2023

ఒకరు కష్టపడి డబ్బులు సంపాదించేవారైతే.....మరొకరు కష్టపడకుండానే ఆస్తులు సంపాదించేవారు.... మొత్తం కలిసి బంగారు తెలంగాణ.... ఇదే

నిజం చెప్పాలంటే...        ఈ ₹2000 రూపాయల నోటు వచ్చీ రాగానే, గంపగుత్తగా మొత్తం లంచగొండి రాజకీయ నాయకుల మరియు దొంగ వ్యాపారం...
20/05/2023

నిజం చెప్పాలంటే...
ఈ ₹2000 రూపాయల నోటు వచ్చీ రాగానే, గంపగుత్తగా మొత్తం లంచగొండి రాజకీయ నాయకుల మరియు దొంగ వ్యాపారం చేసే వారి చీకటి గదుల్లోకి పోవడంతో అసలు చలామణిలో కనబడ్డమే లేదు. కనుక నిజానికి సామాన్యుడికి అసలు ఇబ్బందినే లేదు.

ఇకలాగే నిజాయితీపరుడికి కూడా అస్సలు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బందల్లా అవినీతి పందికొక్కులకే, ఇకిప్పుడు అరిచి గోల చేసేది కూడా వాళ్ళే. ఆఁ "నల్లడబ్బు బకాసురులు"నే ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తారు... అలాగే ఫేక్ నోట్లగాళ్ళు కూడా....
అప్పట్లో 2016లో ₹500 & ₹1000 రద్దు చేయడంతో మన దేశంలోకి పెద్దెత్తున ఫేక్ నోట్లు పంపే పాకిస్తాన్ నడ్డి విరిగితే, ఇకిప్పుడు మరెవరి మాడు పగులనుందో !! Chowkidar Naresh Reddy Raj Kumar Reddy

19/05/2023

2014కి ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతి, స్కాములు, వాటి అసమర్థ పాలన, వెనుకబడిన అభివృద్ధి అంశాలుగా బీజేపీ పోరాడింది...

2014 తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ 9ఏళ్ల పాలనలో ఒక్కస్కామూ కూడా లేకుండా పాలన చేస్తూ టాటా, బిర్లా లాంటి వంటి పారిశ్రామికవేత్తలు నుండి సైతం ఎన్నో సార్లు ప్రశంసలు అందుకున్నారు అవినీతి లేని, మధ్యవర్తుల లేని పాలన చూస్తున్నాము అని...

విద్య,వైద్య,రక్షణ,పారిశ్రామిక,దేశ అంతర్గత భద్రత ఏ రంగం తీసుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది...

దేశ అభివృద్ధితో, దేశ రక్షణ, హిందూత్వం అనేవి మన బీజేపీ మూల సిద్ధాంతం...కానీ సోషియల్ మీడియాలో మనవాళ్ళు అభివృద్ధి ఇతర అంశాలు మరిచిపోయారు అనిపిస్తోంది... కర్ణాటకలో కూడా ఇలాగే ట్రాప్ చేసి ఒక వర్గం ఓట్లు గుంపగుత్తుగా వేయించుకున్నారు...
అభివృద్ధి అనే అంశం ఎన్నికల ప్రచారంలో వినబడితే గొప్ప... ప్రచారం అంతా కాంగ్రెస్ అజెండా సెట్ చేసిన లింగాయత్, pfi, భజరంగ్ దళ్ మధ్యలోనే జరిగింది,బీజేపీ కూడా అత్యుత్సాహంతో అదే మాట్లాడేలా ట్రాప్ చేసింది అనిపించింది...

ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో మరియు దేశ ఎన్నికల్లో కూడా ఇలాగే చేస్తారేమో... సోషియల్ మీడియాలో కూడా మనవాళ్ళు చేస్తున్న అభివృద్ధిని, గత కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చేసిన అవినీతిని, దేశ అంతర్గత, సరిహద్దు రక్షణ విషయంలో కాంగ్రెస్ చూపిన ఉదాసీనతను నిర్లక్ష్యతను మరిచిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు...

బీజేపీ వ్యతిరేక శక్తుల ట్రాప్లో మనమందరం పడ్డాము

14/05/2023

== ఎన్నికల్లో ఓటు ప్రాధాన్యత ==

ఎన్నికలు అంటే జస్ట్ ఓట్లు, సీట్ల నెంబర్ గేమ్. అవినీతి రహిత పరిపాలన, ఉచిత పథకాలు, నాయకుల చరిష్మా వంటివే కాకుండా ఎన్నికల్లో ఈ నెంబర్ల ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఏ పక్షానికైనా ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నిన్న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల నెంబర్ గేమ్ లో ఎలాంటి ప్రభావం చూపాయి చూద్దాం.

కర్ణాటక విధానసభలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. అధికారం సాధించడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 113 కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 38.04 శాతం ఓట్లతో 80 స్థానాలు,
బీజేపీ 36.22 శాతం ఓట్లతో 104 స్థానాలు,
జేడీఎస్ 18.36 శాతం ఓట్లతో 37 స్థానాలు,
ఇతరులు 7.38 శాతం ఓట్లతో 3 స్థానాలు కైవసం చేసుకున్నారు.

ప్రస్తుత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ 42.88 శాతం ఓట్లతో 135 స్థానాలు,
బీజేపీ 36 శాతం ఓట్లతో 66 స్థానాలు,
జేడీఎస్ 13.29 శాతం ఓట్లతో 19 స్థానాలు,
ఇతరులు 8.1 శాతం ఓట్లతో 4 స్థానాలు గెలుపొందారు.

పైన చెప్పిన ఓట్లు సీట్ల డేటాను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కన్నా 4.84 శాతం ఎక్కువ ఓట్లను సాధించింది. దీంతో ఏకంగా 57 స్థానాలు అధికంగా కైవసం చేసుకోగలిగింది. అదేసమయంలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కేవలం 0.22 శాతం ఓట్లను మాత్రమే కోల్పోయింది కాని ఇది 38 సీట్లు కోల్పోవడానికి కారణం అయ్యింది. జేడీఎస్ గత ఎన్నికలతో పోలిస్తే 5.07 శాతం ఓట్లను పోగొట్టుకోవడం వలన 37 స్థానాల నుంచి 19 స్థానాలకు పడిపోయింది. ఇతరులు 0.74 శాతం ఓట్లను పెంచుకోవడంతో ఒక సీటు అధికంగా గెలిచారు.

కీలక అంశాలు ఏమిటంటే

• 40% కమిషన్ సర్కారు అని తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికి బీజేపీ ఓట్ల శాతం అతు స్వల్పంగా మాత్రమే తగ్గింది. అంటే సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది.
• వెయ్యి, రెండు వేల ఓట్లు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 4.84 శాతం అధిక ఓట్లు సాధించడం వలనే భారీ మెజారిటీ సాధించగలిగింది.
• కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లన్నీ జేడీఎస్ నుండి బదిలీ అయినవే అని గమనించవచ్చు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kamareddy News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share