Alt J

Alt J Daily updates of local- national- intl news

ద‌ళితుల్లో ఒక్క దేవుడైన లేక పాయె!============================రాముడు, కృష్ణుడూ దేవుళ్లు కారు.. వారిని మేం కొల‌వం.. మాకు బ...
16/03/2021

ద‌ళితుల్లో ఒక్క దేవుడైన లేక పాయె!
============================
రాముడు, కృష్ణుడూ దేవుళ్లు కారు..
వారిని మేం కొల‌వం.. మాకు బుద్ధుడే దైవం..
మాది బుద్ధిజం.. అని చెప్ప‌ద‌లుచుకోవ‌డం మాత్ర‌మే కాదు..
దాన్నో ప్ర‌తిజ్ఞ‌గా మార్చి.. దాన్ని స్వేరో స్కూళ్ల‌లో ప్ర‌తిజ్ఞ చేయించారు
ఈ స్కూళ్ల‌కు ఇంఛార్జ్ అయిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి..
ఇప్పుడాయ‌న హోదా కావ‌చ్చు..
ఆయ‌న బ‌హుజ‌నుడు కావ‌డం కావ‌చ్చు..
స్వేరో గురుకులాలేంటి.. స‌మాజంపై వాటి ప్ర‌భావ‌మేంటి?
ఈ గురుకులాల‌ల‌కు త‌ల్లిదండ్రుల్లో ఉన్న క్రేజ్ కావ‌చ్చు..
వాటిలో పిల్ల‌ల‌కు నేర్పిస్తున్న‌ నైతిక విలువ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ త‌దిత‌ర వ్య‌వ‌హారాలు కావ‌చ్చు..
వాట‌న్నిటినీ అలా ఉంచి..
రాముడెందుకు వ‌ద్దు కృష్ణుడెందుకు వ‌ద్దు.. బుద్ధుడు ఎందుకు కావాలి???
రాముడు దేనికి ప్ర‌తీక‌- కృష్ణుడు దేనికి ప్ర‌తీక‌- బుద్ధుడు ఎవ‌రికి ప్ర‌తీక‌
అని త‌ర‌చి చూడాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది..
మ‌న‌మిప్పుడు రాముడెవ‌రో చూస్తే..
ఆయ‌న‌కూ మ‌నువాదానికీ సంబంధ‌మేంటి?
దీనికీ బ్రాహ్మ‌ణీకానికీ సంబంధ‌మేంటో ప‌రిశీలిస్తే..
రాముడు క్ష‌త్రియుడు.. సూర్య‌వంశీకుడు..
ఇక కృష్ణుడు టెక్నిక‌ల్లీ యాద‌వుడు.. ర‌క్త సిద్ధాంతం ప్ర‌కారం చూస్తే..
ఆయ‌న కూడా ఒక క్ష‌త్రియుడు...
ఇక బుద్ధుడెవ‌రూ? అని త‌ర‌చి చూస్తే.. గౌత‌మ బుద్ధుడు కూడా క్ష‌త్రీయుడే..
సిద్ధార్ధుడి తండ్రి శుద్ధోద‌నుడు సూర్య‌వంశ రాజైన‌.. ఇక్ష్వాకుడి వార‌సుడ‌ని అంటారు..
స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. శుద్ధోద‌నుడు ఒక ఆట‌విక తెగ నాయ‌కుడ‌న్న పేరుంది..
ఒక వేళ తండ్రి ఆట‌విక తెగ‌కు చెందిన నాయ‌కుడైనా
త‌ల్లి మ‌హా మాయాదేవి.. మాత్రం కోళియ‌న్ దేశ‌పు రాకుమారి..
బుద్ధుడికి గౌత‌మ బుద్ధుడు అన్న పేరెందుకు ఉందంటే..
ఆయ‌న పుట్ట‌డానికి మాయాదేవి గ‌ర్భాన పుట్టినా..
పెరిగింది మాత్రం గౌత‌మీ అనే పెంపుడు త‌ల్లి చేతుల మీదుగా..
అందుకే ఆయ‌న‌కు ఈ పేరు వ‌చ్చింది..
త‌న‌ను ఒక చెట్టు కింద క‌న్న త‌ల్లి మాయావ‌తి.. ఐదు రోజుల‌కే మ‌ర‌ణించ‌గా..
ఆ బిడ్డ‌కు సిద్ధార్ధుడ‌నే నామ‌క‌ర‌ణం చేశారు..
ఈ కుర్రాడి భ‌విష్య‌త్ ఏమిటో జ్యోతిష్కుల‌ను అడిగి చూడ‌గా.. ఇత‌డు భ‌విష్య‌త్తులో గౌత‌మ బుద్ధుడ‌వుతాడ‌ని ఆ జ్యోతిష్కులు చెప్పడం.. అనుకున్న‌ట్టుగానే త‌న బాల్య‌, య‌వ్వ‌నాదుల‌ను అంతఃపురంలో బంధీగా గ‌డ‌ప‌టం.. 16వ ఏట‌నే య‌శోద‌తో పెళ్లి కావ‌డం.. రాహులుడ‌నే బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం.. ఇలా త‌న 29వ ఏట వ‌ర‌కూ సిద్ధార్ధుడు రాజ‌భోగాల‌ను అనుభ‌వించాడ‌న్న‌ది చ‌రిత్ర‌.
త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే..
బేసిగ్గా సిద్ధార్ధుడు.. ప్రాపంచిక సౌఖ్యాల‌ను అనుభ‌వించ‌డం మాత్ర‌మే జీవిత ప‌ర‌మార్ధం కాద‌ని గ్ర‌హించ‌డం వ‌ల్ల‌..
కాలి చెప్పుల‌కున్న విలువ కూడా.. చ‌చ్చిన మ‌నిషి శ‌వానికి ఉండ‌ద‌ని గుర్తించ‌డం వ‌ల్ల‌.. దేశాలు ప‌ట్టి తిర‌గ‌డం..
ఒక బోధి వృక్షం కింద‌.. సాలీడు ద్వారా.. అనుకున్న‌ది సాధించాలంటే సాధ‌న చేస్తూనే పోవాల‌న్న జ్ఞానం పొంద‌డం..
చివ‌రికి త‌న 35 వ ఏట కోరిక‌లే మ‌నిషి జీవితానికి తీర‌ని క‌ష్టాల‌ను కొని తెస్తున్నాయ‌న్న‌ది తెలుసుకోవ‌డం..
ఇలా నాటి అఖండ భార‌తం నేటి నేపాల్లో పుట్టిన ఒక చెట్టుకింద పుట్టి..
గ‌య‌లోని బోధి వృక్షం కింద జ్ఞానోద‌యం అయిన‌.. బుద్ధుడు త‌న త‌ర్వాతి కాలంలోతాను క‌నుగొన్న జీవ‌న సూత్రాన్ని ప్ర‌చారం చేస్తూ.. ఏషియాలోనే అత్యంత పెద్ద దైవాంశ సంభూతుడ‌య్యాడు..
ఇప్పుడు బుద్ధుడు భార‌త‌దేశంలో పుట్టినా.. శ్రీలంక‌- చైనా- జ‌పాన్ త‌దిత‌ర దేశాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌ల దైవం..
నాటి అంబేద్క‌రుడు కావ‌చ్చు..
‌నేటి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమారుడు కావ‌చ్చు..
బుద్ధుడి యొక్క భక్తాగ్రేస‌రులే..
క్రిస్టియ‌న్స్ గా మారి.. మ‌తం పుచ్చుకోడానికి ఇష్ట‌ప‌డ‌ని.. చాలా మంది స్వాభిమాన ద‌ళితుల ఆరాధ్య దైవం.. బుద్ధుడు..
బుద్ధుడు విగ్ర‌హారాధ‌న వ‌ద్దంటాడు.. కోరిక‌ల్లేని జీవ‌న‌మే గొప్ప‌ద‌ని అంటాడు..
అందులో భాగంగా..
దుఃఖం అంత‌టా ఉంటుంది..
ఈ దుఃఖం తృష్ణ వ‌ల్ల ఏర్ప‌డుతుంది
ఈ తృష్ణ అవిద్య వ‌ల్లే వ‌స్తుంది
అష్టాంగ మార్గ‌మే అవిద్య నాశ‌న‌కారి
అంటూ నాలుగు ప‌ర‌మ స‌త్యాల‌ను సూచించాడు..
అవిద్య‌ను నాశ‌నం చేసే.. అష్టాంగ మార్గాలంటే..
సమ్యక్ వచనము - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
సమ్యక్ కర్మము - హాని కలిగించే పనులు చేయకుండుట
సమ్యక్ జీవనము - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమ్యక్ సాధన - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
సమ్యక్ స్మృతి - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
సమ్యక్ సమాధి - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
సమ్యక్ దృష్టి - భ్రమ పడకుండా.. ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
సమ్యక్ సంకల్పము - ఆలోచించే విధానంలో మార్పు
అని సూచిస్తోంది బుద్ధుని అష్టాంగ మార్గం..
ఇలాంటి మంచి ల‌క్ష‌ణాల‌ను ఆచ‌రించ‌డం ద్వారా..
రాగ‌ద్వేషాల‌కు అతీతంగా
కుల‌మ‌త వ‌ర్గ వైష‌మ్యాల‌కు సంబంధం లేకుండా..
హెచ్చు త‌గ్గుల జీవ‌న స‌ర‌ళితో
అగ్ర అథ‌మ కులాల‌నే తార‌త‌మ్యాల‌ను వీడి..
సంచ‌రించ‌మంటూ సూచిస్తుంది.. బుద్ధుడి అష్టాంగ మార్గం..
ఇది అంబేద్క‌రుడితో స‌హా ద‌ళిత వ‌ర్గాల మేధావుల‌కు చాలా మందికి ఎంతో బాగా న‌చ్చిందని చెప్పాలి..
ఇక్క‌డ వీళ్లంతా గుర్తించ వ‌ల‌సిందేంటంటే..
రాముడైనా ఒక‌టే.. కృష్ణుడైనా ఒక‌టే.. బుద్ధుడైనా ఒక‌టే..
వీరి త‌ల్లిదండ్రులు కుల- ‌మ‌త- వ‌ర్గ‌- ప్రాంతాల‌ను అనుసరించి మాట్లాడితే
వీళ్లంతా ఒక‌టే.. క్ష‌త్రియ వంశ‌జులు.. నాకైతే అదే తెలిసింది..
ఒక వేళ శుద్ధోద‌నుడు ఆట‌విక తెగ నాయ‌కుడే అయినా- ఆయన క్ష‌త్రియ వంశ ల‌క్ష‌ణాల‌తోనే త‌న జీవ‌నాన్ని గ‌డిపాడు..
ఆ త‌ర్వాత ఆయ‌న‌ పుత్రుడిగా పుట్టిన‌ సిద్ధార్ధుడు సైతం త‌న 29వ ఏట వ‌ర‌కూ.. శుద్ధ క్షాత్రియుడిగానే జీవ‌నాన్ని గ‌డిపాడు..
వీరంతా క్ష‌త్రియ సుఖ భోగ‌లాల‌స‌త్వం అనుభ‌వించిన వారే..
వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే వీరు ఎవ‌ర్ని కావాల‌న్నా ఎవ‌ర్ని వ్య‌తిరేకించినా ఒక‌టే
అన్న‌ది నేను అందిస్తున్న అర్ధ తాత్ప‌ర్యం..
ఇక్క‌డ చాలా చాలా జాడ్యాలు రాజ్యం చేస్తుంటాయి..
క్ష‌త్రియుడైన మ‌నువు రాసిన ధ‌ర్మ‌శాస్త్రానికీ
బోయవాడైన వాల్మీకి రామాయణానికీ
బెస్త‌వాడైన వేద వ్యాసుడి మ‌హాభార‌తానికీ
క్ష‌త్రియుడైన రాముడికి
యాద‌వ‌\క్ష‌త్రియుడైన కృష్ణుడికీ
బ్రాహ్మ‌ణ వాదానికీ సంబంధం పెట్టి మాట్లాడేస్తుంటారు..
నిజ‌మైన బ్రాహ్మ‌ణ దైవాలు వామ‌నుడు, ప‌ర‌శురాముడు..
కానీ వీరికి ఎలాంటి భ‌క్త‌జ‌న ఆద‌ర‌ణ లేదు..
స‌గం జంతువు- స‌గం మ‌నిషిగా క‌నిపించే నార‌సింహుడికైనా
భ‌క్త‌జ‌నుల్లో త‌గిన ఆద‌ర‌ణ ఉందేమోగానీ..
బ్రాహ్మ‌ణ పుట్టుక పుట్టిన వామ‌న‌- ప‌ర‌శురాముల‌కు క‌నీసం లేదు..
చాలా మంది మాట్లాడుకుంటున్న‌ట్టు..
రావ‌ణుడు బ‌హుజ‌నుడు కాడు.. ఒక బ్రాహ్మ‌ణుడు
అందుకే రావ‌ణుడ్ని రావ‌ణ బ్ర‌హ్మ అంటారు..
వింత ఏంటంటే.. ఈ బ్రాహ్మ‌ణ జాతి మొత్తం రావ‌ణుడ్ని విల‌న్ గా చిత్రీక‌రించి..
క్ష‌త్రియుడైన రాముడే గొప్ప‌గా భావించి నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది..
న‌ర‌కాస‌రుడుతై భూదేవి- మ‌హా విష్ణువుల కొడుకు..
న‌ర‌కాసురుడ్ని కూడా.. ద‌ళిత బ‌హుజ‌నులు ఓన్ చేసుకుంటారు..
రావ‌ణ న‌ర‌కాసుర రాక్ష‌స ప్ర‌ముఖులు త‌మ ప్ర‌తీక‌లుగా చెప్పుకొస్తారు..
ఏతా వాతా చెప్పాల్సి వ‌స్తే.. బుద్ధుడంటే మ‌రెవ‌రో కాదు..
ఆయ‌న కూడా ఒక రాజే.. క్ష‌త్రియ సంజాతుడే..
కొత్త‌గా మ‌నం ఇపుడు క‌నుగొన్న ద‌ళిత దైవం లేనే లేడు..
రామ‌కృష్ణుల‌నే దైవాలు వ‌ద్ద‌న‌డానికీ- బుద్ధుడే మా దైవం అన‌డానికీ
ఎలాంటి తేడా క‌నిపించ‌డమే లేదు.. నా దృష్టిలో ఎవ‌రైనా ఒక‌టే..
రాముల‌మ్మ సినిమాలో రాసిన‌ట్టు ద‌ళితుల్లో ఒక్క దేవుడైన లేక పాయె.. అన్న‌ట్టు..
ద‌ళితుల్లో ఒక్క దేవుడు కూడా ఇంత వ‌ర‌కూ పుట్ట‌లేదు..
రాముడు- కృష్ణుడు- బుద్ధుడు అంద‌రూ అగ్ర‌వ‌ర్ణాల వారే..
కాకుంటే వీళ్ల‌లో బుద్ధుడు కాస్త బెట‌ర్.. చాతుర్వ‌ర్ణం పాటించ‌డు..
బ్రాహ్మ‌ణ క్ష‌త్రియ శూద్ర ద‌ళిత అన్న బేధాల‌ను చూప‌డు..
రాముడు శంభూక వ‌థ చేసి.. శూద్ర‌కుల హ‌త్య గావించి..
వారి వారి విద్యాబుద్ధుల‌కు తీవ్ర విఘాతం క‌లిగించి శూద్ర జ‌న ద్రోహిగా ముద్ర ప‌డ్డాడు రాముడు..
ఇక కృష్ణుడు ద‌శావ‌తారాల్లో ఒక‌డు కాబ‌ట్టి.. సాక్షాత్ ఆ మ‌హా విష్ణువు అంశ‌గా చెబుతారు కాబ‌ట్టి..
మ‌హా విష్ణువంటే ఇక బ్రాహ్మ‌ణ జ‌న ఆరాధ్య దైవం కాబ‌ట్టి.. కృష్ణుడ్ని మా దేవుడు క ఆనే కానంటున్నారు కావ‌చ్చు..
నిజానికి కృష్ణుడు నేరుగా శూద్ర‌కుల సంజాతుల‌కు చేసిన హాని ఏమీ లేదు.. పైపెచ్చు తాను కూడా ఒక శూద్ర కుల‌స్తుడిగానే జీవించాడు..
ఇక మ‌హాభార‌త యుద్ధంలో.. శూద్ర‌ క‌ర్ణుడి చావుకు ఇన్ డైరెక్టుగా కార‌కుడ‌న్న ముద్ర ప‌డ్డం వ‌ల్ల శూద్ర జ‌న వ్య‌తిరేకి అయి ఉంటాడేమో తెలీదు కానీ.. కృష్ణుడ్ని రిజెక్ట్ చేయాల్సిన అవ‌సరం అయితే క‌నిపించ‌డం లేదు..
ఇవ‌న్నీ ఒక సారి ఆలోచించుకుని.. విద్వేషం విర‌జిమ్మితే.. మేలు..
ఒక‌ర‌కంగా చెప్పాలంటే..
కులాల‌ను బ‌ట్టీ దేవుళ్ల‌ను ఆరాధించ‌డాన్ని బ‌ట్టీ చూస్తే
బ్రాహ్మ‌ణులు దైవాల్లో కులారాధ‌న చేయ‌డం లేద‌నిపిస్తుంది నాకు..
క్ష‌త్రియ- రామ, యాద‌వ- కృష్ణ‌, అర్ధ‌న‌ర‌- నార‌సింహ వంటి దేవ‌త‌ల‌కే త‌మ పూజ‌ల్లో అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంటారు..
స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాము సృష్టించిన ద‌శావ‌తారంలో కూడా బౌద్ధ అవ‌తారాన్ని జొప్పించి అక్క‌డా చేయాల్సిన బౌద్ధ‌- న్యాయం చేశారనిపిస్తుంది.. నాకు
ఇక హిందూ మ‌తానికి వ‌స్తే..
ఇదొక మ‌త విశ్వ విద్యాల‌యంగా చెప్పాలి..
జైన‌- సిక్కు- వీర‌శైవ‌- బౌద్ధ‌.. ఇలా చాలానే మ‌తాలు వేరుబ‌డి..
త‌మ‌కంటూ సొంత మ‌తాలుగా ఆవిర్భ‌వించే స్థాయికి చేర‌డం..
ప్ర‌పంచ‌మంతా తెలుసు..
కాబ‌ట్టి.. రాముడైనా ఒక‌టే- కృష్ణుడైనా ఒక‌టే- బుద్ధుడైనా ఒక‌టే..
ఏదో నా జ్ఞానం కొద్దీ నేను రాశా..
ప్ర‌వీణ్ సార్ మీ జ్ఞానం కొద్దీ మీరు కూడా స్పందించ వ‌ల‌సిందిగా ప్రార్ధ‌న‌!!!

సారంగ‌ద‌రియా!పాట మీద ఇప్పుడు పెను దుమారమే చెల‌రేగుతోంది..ఈ పాట మీద త‌న‌కేదో హ‌క్కున్న‌ట్టుసుద్దాల అశోక్ తేజ ల‌వ్ స్టోరీ ...
08/03/2021

సారంగ‌ద‌రియా!
పాట మీద ఇప్పుడు పెను దుమారమే చెల‌రేగుతోంది..
ఈ పాట మీద త‌న‌కేదో హ‌క్కున్న‌ట్టు
సుద్దాల అశోక్ తేజ ల‌వ్ స్టోరీ అనే శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు
ఆ పాట‌ను మార్చి రాయ‌డం హేయ‌మ‌నీ..
గ‌తంలో కూడా ఇదే సుద్దాల నేను సైతం..
అంటూ శ్రీశ్రీ లైన్ కాపీ కొట్టేసి.. జాతీయ అవార్డును కొల్లగొట్టేశార‌నీ..
అద‌నీ ఇద‌నీ చాలానే ప్ర‌చారం జ‌రుగుతోంది..
కొంద‌రు తెలంగాణ వాదులు సారంగ‌ద‌రియాకేదో ద్రోహం జ‌రిగిపోయింద‌నీ..
గ‌తంలో మ‌గ‌ధీర సినిమాలో ఏం పిల్ల‌డో అప్పుడు కూడా వంగ‌పండుకు ఇలాటి సాంస్కృతిక ద్రోహం జ‌రిగింద‌నీ..
చాలానే వ్యాఖ్యానం రాశారు..
కొంద‌రు సినిమా వాళ్ల‌ నీతి- నిజాయితీల‌కూ లింకు పెట్టి మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి..
ఇక్క‌డ మ‌న‌మంతా గ్ర‌హించాల్సిందేంటంటే..
సారంగద‌రియా ఒక్క‌టే కాదు..
ఇలాంటి ఎన్నో క‌ల్చ‌ర‌ల్ రెపిలికాస్ క్రియేష‌న్ జ‌రుగుతూనే ఉంది..
ఆ మాట‌కొస్తే మాయాబ‌జార్ కాలం నాటి నుంచే ఈ సంస్కృతిక ప్ర‌తి సృజ‌న‌ ఉంది..
మాయాబ‌జార్ క‌థ నిజంగా మ‌హా భార‌తం లో లేదు..
సృష్టికి ప్ర‌తి సృష్టి ఈ నాటిది కాదు..
మ‌నిషే కోతిలోంచి పుట్టాడ‌ని అంటారు..
పాట‌న‌గా ఎంత‌?
అందులో భాగంగానే నాటి మ‌హాభార‌త పాత్ర‌ల‌ను వాడుకుని..
వాటి మ‌ధ్య ఒక కొత్త క‌థ‌ను పుట్టించి.. కేవీ రెడ్డి అంత‌టి దిగ్ ద‌ర్శ‌కుడు
ఎన్టీఆర్- సావిత్రి- ఎస్వీఆర్ లాంటి దిగ్గ‌జ న‌టుల‌తో సినిమా తీస్తే..
అది ఆల్ టైం గ్రేట్ మూవీగా చ‌రిత్ర‌కెక్కిన విష‌యం తెలిసిందే..
అంటే ఒక లైన్ లోంచి ఇంకో లైన్ అంటు గ‌ట్ట‌డం
ఒక పాట లోంచి ఇంకో పాట‌ను పుట్టించ‌డం
ఒక మాటలోంచి ఇంకో మాట‌ను సృజింప చేయ‌డం..
సృజ‌నాత్మ‌కత‌లో ఒక భాగం
ద ఫ‌స్ట్ బెస్ట్ ఎవ‌ర్ తెలుగు నాట‌కం క‌న్యాశుల్కం
అయితే ఎవ‌డిష్టానికి వాడు- వాడేసి- క‌డిగేసి- క‌ట్ చేసి
చీలిక‌లు- పేలిక‌లు చేసి నానా యాగీ సృష్టించేశారు..
ఇదంతా ఆంధ్ర క‌వుల వ్య‌వ‌హారం.. మాద‌లా ఉండ‌ద‌ని
తెలంగాణ వాదులు అన‌వ‌చ్చుగాక‌..
కానీ ఈ సృష్టికి ప్ర‌తి సృష్టి
సృజ‌న‌కు ప్ర‌తి సృజ‌న‌- ప్రాంతాల‌కు అతీత‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు..
నిజానికి శేక‌ర్ క‌మ్ముల‌కు ఫిదా నుంచి ఇలాంటి తెలంగాణ సాహిత్యం మీద మ‌న‌సు ప‌డ్డ‌ట్టుంది..
అందులో విజ‌య తేళ్ల పాట బిట్ ఒక‌టి పెట్టి.. సినిమాకు తెలంగాణ ఫ్లేవ‌ర్ అద్దే య‌త్నం చేశాడు..
అది బాగా హిట్ కావ‌డంతో.. నెక్స్ట్ మూవీకి సారంగ‌ద‌రియాను వాడే య‌త్నం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది..
ఈ పాట మొత్తం చూశాక నాక‌ర్ధ‌మైందేంటంటే..
దీన్ని కూడా సుద్దాల నేను సైతం లాగా మొద‌ట్లో సారంగ‌ద‌రియా ఒరిజిన‌ల్ లైన్లు వాడి..
త‌ర్వాత సినిమాకు అనుగుణంగా కొన్ని సొంత లైన్లు క‌లిపిన‌ట్టు తెలుస్తోంది..
రెండు సినిమా క‌థ‌ల్లోంచి కొత్త సినిమా క‌థ‌ను పుట్టించే సాంస్కృతిక వార‌స‌త్వం గ‌ల టాలీవుడ్ గ‌డ్డ మీద ఉన్నాం మ‌నం..
ఆ గ‌డ్డ మ‌రెక్క‌డో లేదు.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఫిలింన‌గ‌ర్ అనే ప్రాంతంలో..
యాభై అర‌వై ఏళ్ల క్రితం మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి ఫిలింన‌గ‌ర్ గా సెటిలైందన్న సంగ‌తీ తెలిసిందే..
మ‌న‌కు తొలి క‌థ‌లు.. రామాయ‌ణ మ‌హాభార‌తాలే ప్రేర‌ణ‌.. త‌ర్వాతే మ‌నం సాంఘీకాల‌కు వెళ్లాం..
క‌థ‌ల క‌ల్ప‌న చేశాం.. అలాగే జ‌నం క‌ష్ట‌సుఖాలు రాగ‌ద్వేషాల్లోంచే పాట‌ల‌ను పుట్టించాం..
ఇంత‌కీ సారంగ‌ద‌రియా పాటను తిర‌గ‌రాసింది మ‌రెవ‌రో కాదు ఈ గ‌డ్డ మీద పుట్టిన సుద్దాల అశోక్ తేజ‌..
అశోక్ తేజ సాంస్కృతిక వార‌స‌త్వం ఎవ‌రో ఏమిటో అంతా తెలిసిందే..
ఇక్క‌డ కూడా కులాల వారీగా జ‌నం చీలిక‌లు పేలిక‌లై పోయి..
క‌ళా వార‌స‌త్వ పోరాటాలు చేయ‌డం.. వాటికీ కులం రంగులు కుమ్మ‌రించ‌డం..
అన్న‌ది ఎబ్బెట్టుగా అనిపిస్తోంది..
ఇక్క‌డున్న కొంద‌రికి శేఖ‌ర్ క‌మ్ముల కులం- ప్రాంతం మీద అభ్యంత‌రాలుంటాయ్..
ఈ పాట‌ను రీరైట్ చేసిన సుద్దాల మీద కూడా కొన్ని లోలోప‌లి అసంతృప్తులుంటాయ్..
వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని.. మ‌నకు సారంగ‌ద‌రియా మీద నిజంగా అభిమాన‌మున్న‌ట్టు ఫీలై పోతుంటాం..
ఇదే మ‌న‌కు రంగ‌నాయ‌క‌మ్మ- రామాయ‌ణ విష వృక్ష‌మ‌ని..
రామాయ‌ణంలోంచి లేని పోని అంశాల‌ను తెర మీద‌కు తెచ్చి చిలువ‌లు ప‌లువ‌లు చేస్తే బాగా న‌చ్చేస్తుంది..
సారంగ‌ద‌రియాకు కొన్ని కొత్త లైన్లు.. అది కూడా పాజిటివ్ గా పుట్టిస్తే మాత్రం ఎక్క‌డా లేని ఉలుకు వ‌చ్చేస్తుంది..
పాట నాది
భావం నాది
గానం నాది..
నీకే సొంతం లేదు
అనేది ఏనాటికీ
అది పాట కాదు- భావం కాదు- గానం కాదు..
ఒక బోయ‌వాడైన వాల్మీకి రాసిన రామాయ‌ణం
కుల‌మ‌తాల‌కు అతీతంగా ఓన్ చేసుకున్నారు..
వేద‌వ్యాసుడి మ‌హాభార‌తం చ‌దివి హాలీవుడ్ వాసులు
ఈ ర‌చ‌యితెవ‌రు.. ఆయ‌న మాకేమైనా రాసిపెడ‌తారా?
అని అమాయ‌కంగా ఎంక్వ‌యిరీ చేసిన సంద‌ర్భాలున్నాయి..
కుక్క పిల్ల- స‌బ్బు బిళ్ల- కాదేదీ క‌విత‌కు అనర్హం అని శ్రీశ్రీ అన్న‌ట్టు..
జ‌నం ఓన్ చేసుకునేదే గానం- క‌వ‌నం- అస‌లు సిస‌లైన జాన‌ప‌దం
జ‌నం వాళ్లిష్టానికి కొన్నిటిని ఓన్ చేసేసుకుంటారు..
అందుకు వార‌ధులుగా మారుతుంటారు సుద్దాల వంటి సాంస్కృతిక సృజ‌న‌శీలులు..
వారి ద్వారా అయినా ఆ పాట మ‌రింత జ‌నాల్లోకి వెళ్లింద‌ని సంతోషించాలి త‌ప్ప‌..
వంక‌లు పెట్ట‌డం వ‌ల్ల ఒరిగేదేమైనా ఉందా?
మ‌న రాజ్యాంగ‌మే.. వంద రాజ్యాంగాల‌కు కాపీ పేస్ట్ గా పేరుంది..
మ‌రి దాన్నే మ‌నం మ‌హ‌త్త‌రంగా భావించి.. దేశ‌మంతా అమ‌లు ప‌రుస్తున్నాం..
వాటిలో ఫ‌లానా ఆర్టిక‌ల్ ద్వారా స‌వ‌ర‌ణ‌లు సైతం చేయ‌వ‌చ్చ‌ని.. దానికో నెంబ‌ర్ అంటించి మ‌రీ
పెట్టుకున్నాం.. వాటి ద్వారా.. ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సార్లు స‌వ‌ర‌ణ‌లు జ‌రిగిందీ విధిత‌మే..
ఈ ప‌రిస్థితుల్లో ఒక పాట ఆ సినిమాకు అనుగుణంగా మార్పు చేర్పుల‌కు లోన‌వ‌డం ఎందుకు త‌ప్ప‌వుతుంది???
ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్య‌వ‌హార‌మిది..
అంటే ఏదో ఒక‌టి ఇత‌రుల‌ను త‌ప్పు ప‌ట్టాలి కాబ‌ట్టి ప‌ట్ట‌డం..
వారిపై మ‌న కుల అసంతృప్తుల‌ను కుమ్మ‌రించ‌డం..
త‌మ‌కు తాము మాత్ర‌మే పెద్ద గొప్ప‌గా ఊహించుకోవ‌డం..
ముందు వెన‌క‌లు స‌రిగా అవ‌గాహ‌న లేక పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన తంటా..
నీ కుడీ భుజం మీద క‌డ‌వ‌- అంటూ రాసిన ఇదే సుద్దాల‌ అశోక్ తేజ‌..
క‌డవ మీద క‌డ‌వ పెట్టి ఒసే రాముల‌మ్మ‌.. అంటూ ఓ ద‌ళిత ఆడ‌ప‌డుచు పాత్ర‌కు కూడా
అద్దం ప‌ట్టాడు.. ఆ పాత్ర‌ను ఆకాశానికెత్తేసే య‌త్నం చేశాడు..
కాబ‌ట్టి.. సారంగ‌ద‌రియా అంద‌రిదీ అని సుద్దాల శేఖ‌ర్ క‌మ్ముల భావించార‌నుకుందాం..
వాళ్ల ప్ర‌య‌త్నాన్ని స్వాగ‌తిద్దాం..
స‌ర్వే సినీ జ‌నా సుఖినోభ‌వంతూ
ఓం శాంతి శాంతి శాంతి!!!

ప్రైవేటీక‌ర‌ణ‌ప్రైవేటీక‌ర‌ణప్రైవేటీక‌ర‌ణ‌‌ఎల్ఐసీ నుంచి బ్యాంకులు- రైల్వేలు- ప్ర‌స్తుతం ఇదిగో విశాఖ త‌ర‌హా ఉక్కు క‌ర్మాగా...
07/02/2021

ప్రైవేటీక‌ర‌ణ‌
ప్రైవేటీక‌ర‌ణ
ప్రైవేటీక‌ర‌ణ‌‌
ఎల్ఐసీ నుంచి బ్యాంకులు- రైల్వేలు- ప్ర‌స్తుతం ఇదిగో విశాఖ త‌ర‌హా ఉక్కు క‌ర్మాగారాలు..
ఎందుకిలాంటి ప‌రిస్థితి?
స్వాతంత్ర్యం వ‌చ్చ‌న డెబ్భై ఏళ్లు పైబ‌డ్డ ఇన్నేళ్ల‌లో
మ‌నం సాధించిన ప్ర‌గ‌తి ఏమిటి?
సాధించ‌బోతున్న‌దేంటి?
భార‌త‌దేశానికి ఇది వ‌ర‌మా శాప‌మా?
అంటే ఒక ర‌కంగా శాప‌మే..
భార‌త‌దేశం అంటే
సుమారు 140 కోట్ల జ‌నాభా
ఈ జ‌నాభా మొత్తం కూడు- గుడ్డ‌- నీడ‌ల‌తో అల‌రారాలంటే..
క‌త్తి మీద సాము అన్న మాట చాలా చాలా చిన్న‌దై పోతుంది..
ఇవ‌న్నీ అలా ఉంచండి ప్ర‌స్తుతం
ఈ సంస్థ‌ల‌న్నీ న‌ష్టాల బాట ప‌ట్ట‌డ‌మేంటి?
ఇదెలా సాధ్య‌మైంది..
నిజానికి న‌ష్టం అంటే ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కే వ‌స్తాయా? ప‌్రైవేటు రంగ సంస్థ‌ల‌కు రావా?
అని చూస్తే.. ప్రైవేటు రంగ సంస్థ‌లు కూడా చాలానే దెబ్బ తిన్నాయి... ఒక్క రిల‌య‌న్స్ ను చూసి ప్రైవేటు రంగం మొత్తం
బ్ర‌హ్మాండంగా ఉంటుంద‌నుకోవ‌డానికి వీల్లేదు.. ఇద్ద‌రు అంబానీ సోద‌రుల్లో ఒక్క అంబానీ ముఖేష్ మాత్ర‌మే క‌ళ‌క‌ళ‌లాడుతున్నాడు.. మ‌రో అంబానీ అనిల్ వెల‌వెల పోతున్నాడు..
ఒకే కుటుంబానికి చెందిన వ్యాపార సోద‌రుల్లోని ఇంత వ్య‌త్యాస‌ముంటే.. మిగిలిన ప్రైవేటు సంస్థ‌ల ప‌రిస్థితి ఏమిటో ఒక సారి వెనుదిరిగి చూసుకోవాలి..
నిజ్జానికి.. వ్యాపార‌మంటేనే న‌ష్టాల్లో అంట‌కాగ‌డం..
ఈ ప‌రిస్తితుల్లో దీనికి ప్ర‌త్యామ్నయం ఏంటి?
అస‌లు మ‌న‌కూ పారిశ్రామిక‌త‌కూ సూట‌వుతుందా అంటే సూటు కాదు..
నిజానికి మ‌న మూలాల్లోకి వెళ్తే..
మ‌న‌మంతా మొద‌ట కార్మిక‌- క‌ర్ష‌క వాదుల‌మే..
మ‌ట్టి- మ‌సి మ‌నుషుల‌మే..
కానీ ఆ మ‌ట్టిలోంచి మ‌నం మేలి ముసుగుల‌ వైపు అడుగు వేశాం..
మ‌సి పూసుకోవ‌డం నుంచి పౌడ‌ర్ ను రాసుకోవ‌డం వేపు ప‌రుగులుదీశాం..
కొడ‌వ‌ళ్లు చేప‌ట్ట‌డం నుంచి పిడికిళ్లు బిగించాం
ప‌నిముట్లు ప‌ట్ట‌డం వ‌దిలి.. విప్ల‌వ శంఖాలు పూరించ‌డం మొద‌లు పెట్టాం..
అదే చైనా ఇప్ప‌టికీ అలాగే చెక్కుచెద‌ర‌ని ఉక్కు సంక‌ల్పంలా ఉందంటే
అందుకు కార‌ణం.. అక్క‌డి మ‌నుషుల్లో ఇప్ప‌టిక అలాగే చెక్కు చెద‌ర‌కుండా ఉన్న కార్మిక‌త‌- క‌ర్ష‌క‌త‌- శ్రామిక‌త‌ల‌ నిబ‌ద్ధ‌త‌
చైనీ కార్మికులు ఎంత క‌ఠిన ప‌రిస్థితులు ఎదురైనా స‌రే నిలిచి గెలుస్తారు..
సిటిజ‌న్ క‌న్నా కంట్రీ ఫ‌స్ట్ అన్న భావ‌న‌లో నాటికీ నేటికీ ఏనాటికైనా అలాగే ఉంటారు
ఈ భావ‌న‌ మ‌న భార‌త‌దేశంలో లేదు..
జాతి మొత్తం కుల‌మ‌తాలుగా చీలి ముక్క‌లు చెక్క‌లై..
ఎవ‌రికి వారే ఎమునా తీరే అన్న‌ధోర‌ణిలో ప‌డిపోవ‌టం..
దేశ సౌభాగ్యం క‌న్నా స్వీయ ప్ర‌యోజ‌నం ముఖ్యం అన్న ఆలోచ‌న‌ల‌కు అల‌వ‌డ్డం
దీంతో.. ఇదిగో నేడీ స్థితికి చేరాం..
ఇవాళ్టి రోజున‌
ఒక రైతు త‌న కొడుకు కూడా రైతు కావాల‌ని కోరుకోవ‌డం లేదు..
నేను మ‌ట్టి పిసుక్కుంటున్నా నా కొడుకు కూడానా..
అంటూ ఆ రైతు క‌న్నీళ్లు కార్చుతుంటే.. నిజమే క‌దాని మ‌న‌కు మ‌నం
అత‌డి క‌న్నీళ్ల‌లో న్యాయాన్ని వెతుక్కుంటున్నాం..
కాకీ చొక్కా వేస్కుని ఫ్యాక్ట‌రీకి వెళ్లే కార్మిక పుత్ర‌ర‌త్నాన్ని రెండు క‌ళ్ల‌తో చూసుకోవ‌డం క‌న్నా
వాడు తెల్ల చొక్కా, తెల్ల ఫ్యాంటూ వేసుకుని టై క‌ట్టి కార్లో ఊరేగ‌డాన్ని ఇష్ట ప‌డుతున్నాం..
అంటే ఉత్ప‌త్తిలో ప‌ని చేయ‌డంక‌న్నా ఉత్తుత్తి అడ్మిన్ లో ప‌ని చేయ‌డానికి ఎక్కువ మ‌క్కువ చూపుతున్నాం..
ఇక్క‌డా అదే థియ‌రీ.. ఒక కార్మికుడు త‌న కొడుకును కూడా కార్మికుడు చేయాల‌ని చూడ్డంలా.. త‌నలాంటి కార్మికుల‌ను మేనేజ్ చేసే మేనేజ‌ర్ స్థాయిలో అత‌డ్ని చూసుకుంటున్నాడు.. క‌ల‌లు కంటున్నాడు.. ‌దీంతో వ‌స్తోంది అస‌లు తంటా..
మ‌న డీఎన్ఏ క‌ష్ట‌ప‌డే త‌త్త్వం నుంచి క‌ళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల‌ను ఆస్వాదించ‌డంలోకి త‌ర్జుమా అవుతోంది.
లేకుంటే చూడండీ..
ఈ జాతి ప్రేమికులు
ఈ ద‌ళిత బ‌హుజ‌న బాంధ‌వులు
ఈ కార్మిక క‌ర్ష‌క ప్రియులు..
వీళ్ల స్లోగ‌న‌రీ చూస్తే అద్భుత‌మ‌నిపిస్తుంది..
కానీ వీళ్ల దైనందిన జీవ‌నం లోకి వెళ్లి చూస్తే ఆశ్చ‌ర్య‌మేస్తుంది..
నిజానికి వీళ్ల‌లో వంద‌కు 90 శాతం మంది ప్ర‌భుత్వ రంగ సంస్థ ఉండాల‌ని కోరుకునేవాళ్లే క‌దా?
వీళ్ల‌లో ఎంద‌రు త‌మ పిల్ల‌ల్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు పంపుతుంటారో లెక్క బ‌య‌ట‌కు తీయాలి
వీళ్ల‌లో ఎంద‌రు ప్ర‌భుత్వ బస్సుల్లో ఎక్కుతారో గ‌ణాంకాల‌ను వెలుగులోకి తేవాలి
వీళ్ల‌లో ఎంద‌రు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో ప్రీమియం క‌డుతున్నారో తేలాలి
వీళ్ల‌లో ఎంద‌రు ప్ర‌భుత్వ టెలికాం అయిన బీఎస్ఎన్ఎల్ వాడుతున్నారో లిస్టు వెలికి తీయాలి..
వీళ్ల‌లో ఎంద‌రు ఖ‌ద్ద‌రు క‌డుతున్నారో
వీళ్ల‌లో ఎంద‌రు డాల‌ర్ క‌న్నా రూపాయే మిన్న అనుకుంటున్నారో
వీళ్ల‌లో ఎంద‌రు యూఎస్ క‌న్నా భార‌తే మిన్న అన్న భావ‌న‌లో ఉన్నారో తేలాలి..
ఏముండ‌దు..
నాకు తెలిసి..
ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లే ఉండాలి.. మాలాంటి వారికి ఉద్యోగాలు అందులో నిల‌వాల‌ని తెగ ఫీల‌య్యి..
ఈ పోస్టు చూసి కామెంట్ చేసే స‌ద‌రు
ద‌ళిత‌- యువ‌జ‌న- కార్మిక- క‌ర్ష‌క- ప్రియ‌త‌మ- యువ‌నాయ‌కుడు
తాను బెస్ఎన్ఎల్ బ‌దులు ఏ ఎయిర్ టెల్లో లేకుంటే ఐడియానో మ‌రీ కాద‌నుకుంటే చీప్ అండ్ బెస్ట్ జియోనో వాడుతూ
ఈ కామెంట్లు రాస్తుంటాడు..
ఇన్ బిల్ట్ నీలో పెంచి పోషించాల్సిన జాతీయ‌తను వ‌దిలి... ఏదో ర‌గ‌డ చేయాలి కాబ‌ట్టి ర‌గ‌డ చేయ‌టం..
ఇవాళ ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తోంది మ‌న ప్ర‌భుత్వం- దాన్ని ఆపాలి మొర్రో అంటూ.. ర‌చ్చ కీడ్చ‌‌టం..
ఏ వ్య‌భిచారి మాత్రం ఒప్పుకుంటుంది చెప్పండీ..
మ‌న‌మేమో టీచ‌రుద్యోగం చేయాలి.. మ‌న పిల్లాడు కాన్వెంట్ స్టూడెంట్ కావాలి
మ‌న‌కేమో ఆర్టీసీ, రైల్వే జాబులు రావాలి.. ఎమ‌ర్జెన్సీకి ప్రైవేటు బ‌స్సును ప‌ట్టుకుని పోవాలి
మ‌న‌మేమో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయి కావాలి.. మ‌న వాళ్ల‌కేమో ఎయిర్ టెల్- ఐడియా- జియో నెట్ వ‌ర్కుల‌ను కొనివ్వాలి..
అరే బాబూ.. ఇక్క‌డ త‌యారు చేసిన కంపెనీ అంటే ఒక్క‌డు ఒక్క‌డు వీళ్ల‌లో ఆ వ‌స్తువు కొనేవాడున్నాడా?
అరే మామా శాంసంగ్ రా- వీవో- అపోరా..
అంటూ ఓ తెగ నీల్గేస్తుంటారు..
ల‌క్ష రూపాయ‌ల‌కు నానో తెచ్చం వాడండ్రా అంటే
ఒక్క‌డైనా అటు వైపు క‌న్నేశాడా?
పైపెచ్చు అది రోడ్డు మీద వెళ్తుంటే ఆటో సౌండు..
అదీ ఇద‌నీ చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కావు..
ఇప్పుడు చూడండీ.. ఆ ప్లాంటూ ఆ మోడ‌లే మూతేసేసే ప‌రిస్థితి
మ‌న‌కి ఫ్యాక్ట‌రీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డంక‌న్నా..
మ‌న కార్మిక సుఖ‌భోగ‌లాల‌స‌త్వం అత్య‌వ‌స‌రం క‌దా..
స్వీయ ప‌రిజ్ఞానంక‌న్నా ప‌రాయి ప‌రిజ్ఞానం మీద మోజెక్కువ క‌దా..
అదే మ‌నం గుండెలు చించేసుకునే చైనాలో..
కార్మిక‌త్వ‌మా కాక‌ర‌కాయా?
మేం చూడ‌ట్లా..
త‌డ శివారులోని అపాచీలో..
రెండు కిలోమీట‌ర్ల దూరంలో పెడ్తాడు నీళ్ల కుండ‌
డ్యూటీకి వ‌చ్చేట‌పుడే ఒక గ్లాసు ఎక్కువ తాగామా..
తిరిగి డ్యూటీకి వెళ్లే ముందు ఇంకో గ్లాసు ఎక్సట్రా తాగామా.. ద‌ట్సాల్
చైనీయుల ఇంటింటా కుటీర ప‌రిశ్ర‌మ‌లే..
వాటిలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత నాణ్య‌తా ప్ర‌మాణాలు.
ఇంట్లో ఆడ మ‌గ తేడా లేదు.. పైపెచ్చు ఆడ‌వాళ్లే ఒకింత‌ ఎక్కువ‌గా.. ప‌ని చేస్తారు..
ఇక జ‌పాన్ సంగ‌తి స‌రే స‌రి..
అక్క‌డ కంపెనీ మీద కోపం వ‌స్తే రాళ్లు విసిరేయ‌రు..
మ‌రో గంట ప‌ని ఎక్కువ చేస్తార‌న్న పేరు..
శ్రామిక‌త‌
కార్మిక‌త‌
క‌ర్ష‌క‌త‌ను మ‌నం మ‌న ఒంట్లోంచి వేరు చేసేస్తూ..
మ‌నింట్లోంచి దాన్ని దూరం పెట్టేస్తూ..
త‌ళుకు బెళుకుల‌కు ద‌గ్గ‌ర‌వుతూ వ‌చ్చే కొద్దీ..
ఇదిగో మ‌న ఉక్కు బంధాలు ఇలాగే వీగిపోతాయ్..
ఇదిగో మ‌న‌వైన ప‌భుత్వ రంగ సంస్థ‌లు ఒక్కొక్క‌టిగా తెర‌మ‌రుగై పోతాయ్..
రిజ‌ర్వేష‌న్ల‌నీ- బ్రాహ్మ‌ణ- క్ష‌త్రియ- రెడ్డి- నాయుడు- వైశ్య- ద‌ళిత- ముస్లిం- క్రిస్టియ‌న్- మైనార్టీలుగా మ‌నం
విడిపోయి కొట్టుకు ఛ‌స్తుంటే..
అస‌లు ప‌ని మాని కొస‌రు ప‌నిలో త‌ల‌మున‌క‌లై పోతుంటే..
ఇవిగో ఇట్లాగే
అవి కూడా.. ఆవిరై
ఆఖ‌రున హ‌క్కులు ముక్క‌లు చెక్క‌లై స‌ర్వ‌నాశ‌న‌మే అయిపోతుంటాయ్..
కాబ‌ట్టి..
స్లోగ‌న‌రీని క‌ట్టిపెట్టి..
ఏం చేయాలో అది చేయ్
నీలోని లేని నిజాయితీని తీసుకెళ్లి.. నీ నినాదాల‌కు అద్ద‌కు
మొద‌ట బీఎస్ఎన్ఎల్ వాడి..
మొద‌ట ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివి
మొద‌ట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికెళ్లి వైద్యం చేయించుకుని
మొద‌ట ప్ర‌భుత్వ ర‌వాణా వాడి
మొద‌ట ప్ర‌భుత్వ రంగానికే అధిక ప్ర‌యారిటీ ఇచ్చి
ఒక వేళ వాటి సేవ‌లు స‌రిగా లేకుంటే.. స‌రిచేయించుకుని..
త‌ర్వాత నీ స్లోగ‌న‌రీకి సౌండ్ పెంచు
అంత వ‌ర‌కూ నీకిదే శిక్ష‌
ఇది స‌ర్వ‌శిక్షా అభియాన్..
నీ నైతిక‌త‌కూ
నీ నిజాయితీలేమికీ
నీ నిబద్ధ‌తా శూన్య‌త‌కూ
ల‌భించే బ‌హుమాన‌మిదే..
త‌ప్ప‌దు త‌ప్ప‌దంతే భ‌రించి తీరాల్సిందే!!!

ప‌ద్మ‌జానాయుడు- పిచ్చి భ‌క్తికే ప‌రాకాష్ట‌!!!ట్రాన్స్ లు చాలా ర‌కాలు..గ‌డ్డ క‌ట్టే చ‌లిలో కూడా చ‌న్నీళ్ల స్నానం చేసే ట్ర...
27/01/2021

ప‌ద్మ‌జానాయుడు- పిచ్చి భ‌క్తికే ప‌రాకాష్ట‌!!!

ట్రాన్స్ లు చాలా ర‌కాలు..
గ‌డ్డ క‌ట్టే చ‌లిలో కూడా చ‌న్నీళ్ల స్నానం చేసే ట్రాన్స్
న‌ల‌భై రోజుల పాటు అలాగే చ‌న్నీటి స్నానం క‌ఠిన నియ‌మానుసారం అనుస‌రించే ట్రాన్స్
అంతెందుకూ ఎంత‌టి కొండ‌కోన‌లైనా.. ఎన్నేసి కిలోమీట‌ర్లైనా నెత్తి మీద ఇరుముడి పెట్టుకుని న‌డిచేంత ట్రాన్స్
ఇక ఊళ్ల‌లో నిప్పుల గుండం తొక్కే ట్రాన్స్
నాలిక‌కు సుబ్ర‌హ్మ‌ణ్య శూలాల‌ను గుచ్చుకునేంత ట్రాన్స్
వీపున‌కు క‌త్తుల‌తో గాయాలు చేసుకునేంత ట్రాన్స్
ఒక్క వేటుకు దున్న పోతును న‌రికి బ‌లి ఇవ్వ‌డానికి కావ‌ల్సిన బ‌లాన్నిచ్చే ట్రాన్స్..
పూన‌కాలు తెచ్చేసుకుని భ‌విష్య ద‌ర్శ‌నాలు చేసేంత ట్రాన్స్ లూ ఉన్నాయ్..
మాములు మ‌నిషిగా సాధ్యం కాని అతీత శ‌క్తి ఏదో ఉంద‌నిపించేంత‌ ట్రాన్స్..
ఇలా చెప్పుకుంటూ పోతే భ‌క్తిలో చాలా చాలా ట్రాన్స్ లున్నాయి..
కానీ ఒక త‌ల్లి.. త‌న కూతురి నోట్లో రాగి చెంబు కుక్కి మ‌రీ డంబెల్ తో కొట్టి చంపేంత ట్రాన్స్ భ‌క్తికి సంబంధించిన‌దేనా?
ఇంత చ‌దువు చ‌దివి.. ఇన్నేసి గోల్డ్ మెడ‌ల్స్ సాధించి.. ప్రిన్సిపాల్ వంటి ఉద్యోగాలు చేస్తూ కూడా ఒక ఫ్యామిలీ.. అది కూడా తల్లిదండ్రీ ఇద్ద‌రూ కూడా..
ముక్కు ప‌చ్చ‌లార‌ని..
అన్నెం పున్నెం ఎరుగ‌ని
అమాయ‌క చూడ‌ముచ్చ‌టైన‌..
బిడ్డల‌ను అది కూడా ఆడ‌బిడ్డ‌ల‌ను ఇలా చేజేతులా చంపుకునేంత‌..
ట్రాన్స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో అలాంటి ట్రాన్స్.. ఫార్మ‌ర్ల‌ను మ‌నం ఏం చేయాల‌న్న‌ది కూడా అర్ధం కావ‌డం లేదు..
దీనంత‌టికీ ఇత‌రుల‌ను నిందించ‌డం క‌న్నా.. ఆయా వ్య‌క్తుల మాన‌సిక స్థితి గ‌తుల‌నే త‌ప్పు ప‌ట్టాల్సి ఉంటుంది..
భ‌క్తిలో ఉన్న‌వారు చ‌దువులేని వారైతే.. ఒక విధం..
చ‌దువుకున్న వారైతే ఒక విధం ఉంటుంది..
చ‌దువుకున్న వారు ప్ర‌తి దాన్నీ.. ప్రాక్టిక‌ల్ థింకింగ్ చేసి..
అనుభ‌వంలోకి తెచ్చుకుని మ‌రీ ఆయా భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను న‌మ్మ‌కాల‌నూ విశ్వాసాల‌ను అనుస‌రిస్తుంటారు..
భ‌గ‌వంతుడు- భ‌క్తుడు త‌ర‌త‌రాల నుంచి ఈ భూమ్మీద అవినాభావ సంబంధం సాగిస్తూ వ‌స్తున్నారు.. కానీ..
ఇంత‌టి పిచ్చి భ‌క్తి ఇటీవ‌లి కాలంలో ఇదే..
ఇక్క‌డ మ‌నం డిస్క‌స్ చేయాల్సిందేంటంటే..
మ‌న‌లోని ఎడ్యుకేటెడ్.. ప్ర‌తి సంప్ర‌దాయాన్ని చీల్చి చండాడి.. దాని సాధ్యాసాధ్యాలు దాని వెన‌క లోతు పాతులు.. క్షుణ్ణంగా చ‌ర్చించి..
అది స‌రైన‌దైతే ఆచ‌రించ‌డం.. లేదంటే విడిచి పెట్ట‌డం.. స‌హ‌జంగా చ‌దువుకున్న వాళ్లు చేసే ప‌ని..
కానీ ఇక్క‌డ ప‌ద్మ‌జానాయుడు భ‌క్తిలో ఇంత లోతుల‌కు ఎలా వెళ్లి పోయారో అర్ధం కావ‌డం లేదు..
మెహ‌ర్ బాబా కావ‌చ్చు.. మ‌న్నాంగ‌డ్డి బాబా కావ‌చ్చు..
త‌మ భ‌క్తులు అడిగే అడ్డ‌గోలు, చొప్ప‌దంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు అంత తేలిగ్గా ఇవ్వ‌లేరు..
కార‌ణం.. వాటికంటూ ఇప్పుడు వారి ద‌గ్గ‌ర ప‌క్కా ఆన్స‌ర్లుండ‌వు..
దీంతో వాళ్లేం చేస్తారంటే.. యుగాల్లోకి వెళ్లి పోతుంటారు..
స‌త్య‌యుగం- త్రేతాయుగం- ద్వాప‌ర‌యుగం- క‌లియుగ‌మంటూ నాలుగు యుగాలున్నాయ‌నీ..
మ‌నం చివ‌రాఖ‌రిదైన క‌లియుగంలో ఉన్నామ‌నీ..
స‌త్య‌యుగంలో దేవుడు పిలిస్తే ప‌లుకుతాడ‌నీ..
అదే క‌లియుగం లో అలాక్కాద‌నీ.. దైవ లీల‌లు.. ఈ యుగంలో ప‌నిచేయ‌వ‌నీ..
మ‌న‌దైన దైవ లీల తిరిగి సాధ్యం కావాలంటే.. స‌త్య యుగం తిరిగి రావ‌ల్సిందేన‌నీ..
అది త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంద‌నీ.. చెబుతుంటారు..
మ‌నం ఇదే అంశాన్ని క్రైస్త‌వంలోనూ చూస్తుంటాం.. రెండో రాక‌డ మూడో రాక‌డ‌లో క్రీస్తు తిరిగి ఈ భూమ్మీద‌కు వ‌చ్చేస్తుంటాడ‌ని చెబుతుంటారు..
ఇక వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌లోనూ ఇలాగే ఉంటుంది.. క‌లి అంత‌మవుతుంద‌ని చెప్ప‌డానికి చిహ్నం.. వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు తిరిగి రావ‌డ‌మే గుర్తుగా చెప్పుకొస్తుంటారు..
అంతెందుకూ
మెరుగైన స‌మాజం కోస‌మ‌నీ..
బాబాల‌నూ స్వామీజీల‌నూ అనుక్ష‌ణం ఆడిపోసుకునే టీవీ నైన్ కూడా.. 2012లో యుగాంత‌మై పోతుంద‌నీ.. అద‌నీ ఇద‌నీ
క‌థ‌నాల‌ను వండి వార్చిన ఉదంతాలు చాలానే..
ఈ కోవ‌లోనే ప‌ద్మ‌జానాయుడి ఆరాధ్య‌దైవం ఓ క‌ట్టు క‌థ అల్లేస్తే.. ఆ క‌థ‌ను ఆమె ఆమె భ‌ర్త చాలా చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు..
అక్క‌డితో ఆగ‌క త‌మ పిల్ల‌ల‌కు కూడా ఈ పిచ్చి అల‌వ‌ర్చారు.. అందుకేగా.. ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక యువ‌తి.. శివా ఈజ్ క‌మింగ్ అంటూ..
పాట పాడింది..
ఈ ఆట‌- పాట‌లు ఆత్మానందం కోస‌మైతే వ‌చ్చే ఇబ్బందేం లేదు.. కానీ దాన్ని ఓవ‌ర్ సీరియ‌స్ గా తీసుకోవ‌డంతోనే అస‌లు స‌మస్యంతా..
ఇక పోతే ప‌ద్మ‌జానాయుడు చెప్పే మ‌రో పిచ్చి మాట‌.. మా ఇంట్లో కొన్ని రోజుల క్రితం.. మ‌హిమ‌లేవో జ‌రిగాయ‌నీ..
ఈ భ‌క్తిలో ఉండ‌గా జ‌రిగే మ‌రో అడ్డ‌గోలు వ్య‌వ‌హార‌మేంటంటే.. ఈ మ‌హిమ‌ల గుర్తింపు..
అయిన దానికీ కాని దానికీ.. దేవుడికి ఆ ఘ‌ట‌న‌ను ఆపాదించి.. అక్క‌డెలాంటి సంబంధం లేకున్నా ముడి పెట్టేసి.. త‌ద్వారా..
ఆయా ఘ‌ట‌న‌ల‌కూ దేవుడికీ సంబంధం అంట‌గ‌ట్టేస్తాం..
ఇది కొంత మేర‌కు ఓకే కానీ.. పూర్తిగా అదే ప‌నిలో ఉండ‌టమే ప‌ద్మ‌జా నాయుడు ప‌ని ప‌ట్టేసింది..
మ‌బ్బుల్లో, దీపాల్లో, అగ్ని జ్వాల‌ల్లో రాళ్ల‌ల్లో ర‌ప్ప‌ల్లో.. మ‌న‌కు కావ‌ల్సిన ఆకృతుల‌ను వెతుక్కుని వాటికంటూ దైవ లీల‌లు ఆపాదించ‌డం ఎలాగో ఇదీ అలాంటిదే..
కానీ ఈ మ్యాజిక్ ను అక్క‌డితో ఆస్వాదించి వ‌దిలేయాలి.. కానీ.. మ‌రీ ఇంత మూఢ‌న‌మ్మ‌కంగా మాత్రం కాదు..
బేసిగ్గా చ‌దువుకున్న వాళ్లు స్ప‌ష్టంగా మాట్లాడే మాట ఏంటంటే..
ఆఖ‌రున క‌మ్యూనిజం కూడా.. న‌మ్మ‌కం ఉండాల్సిందే.. కానీ మూఢ న‌మ్మ‌కం ప‌నికి రాదు.. ప్రాణాలు తీసుకునేంత మూఢ న‌మ్మ‌కం అస్స‌లు మంచిది కాదు..
ఇది ముమ్మాటికీ త‌ప్పే..
న‌మ్మ‌కాలు ఎంత వ‌ర‌కూ ఉండాలో అంత వ‌ర‌కూ ఉండాలి..
కానీ వాటిని మ‌న జీవితాల్లోకి తెచ్చేసుకుని వాటి తో మ‌నకు మ‌న‌మే ప్రాణాపాయం కొని తెచ్చేసుకునేంత ప‌ని చేస్తే.
ఆ న‌మ్మ‌కానికున్న న‌మ్మ‌కాలే పోతాయ్,,
ప‌ద్మ‌జా నాయుడు దంప‌తులు స‌రిగ్గా ఇలాంటి ప‌నే చేశారు..
వారు న‌మ్మ‌కాల‌నే ఊబిలోకి దిగేసి ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లి పోయారంటే.. ఇక తిరిగి గ‌ట్టు మీద‌కు రాలేనంత‌..
మ‌న‌మెంత ఆధ్యాత్మిక ఊబిలో కూరుకుపోయినా.. మ‌న‌కంటూ ఒక ఆలోచ‌నాత్మ‌క‌ తాడు ఉండాలి.. దాని సాయంతో ఆ మొత్తం ఊబి లోంచి బ‌య‌ట‌కొచ్చేంత సోయ ఉండాలి..
ఇది చిన్న‌నాటి నుంచే అల‌వ‌డుతుంది..
ఆ అల‌వాటు.. ప‌ద్మ‌జానాయుడుకు లేకుంటే పోయింది.. ఆఖ‌రున ఆమె పిల్ల‌ల‌కు కూడా అల‌వ‌డ‌క పోవ‌డం విచార‌క‌రం..
మా ఇంట్లో పిల్ల‌లు చాలా చాలా లాజిక‌ల్ గా మాట్లాడుతుంటారు.. నీ పిచ్చిగానీ.. అది జ‌రిగేనా.. ఇది సాద్య‌మేనా? ఇలా జ‌రిగితే అలా ఎందుకుజ‌ర‌గ‌లేదంటూ.. టూ లాజిక‌ల్ పాయింట్స్ లాగి న‌న్ను ఇరుకున పెట్టేస్తుంటారు..
అలాంటిదేదీ ప‌ద్మ‌జా నాయుడు యొక్క బిడ్డ‌ల్లో క‌నిపించ‌క పోవ‌డం దుర‌దృష్ట‌‌క‌రం..
ఏది ఏమైనా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ద్మ‌జా నాయుడు ఇంట్లో జ‌రిగింది.. కోలుకోలేనంత పెద్ద త‌ప్ప‌.. ఈ స‌మాజమే తిరిగి తీర్చిదిద్ద‌లేనంత ముప్పు.
ఇది బాబాల‌నూ వారి చుట్టూ అల్లుకుని క‌నిపించే సిద్ధాంతాలను పూర్తిగా త‌ప్పు పట్టేంత ఘోర‌మైన ఘ‌ట‌న‌..
ఇలాంటి పిచ్చి పిచ్చి బాబాలు వారి సిద్ధాంతాల‌ను న‌మ్మ వ‌ద్ద‌ని.. భ‌గ‌వంతుడికీ భ‌క్తుడికీ మ‌ధ్య ఇలాంటి అగాధాల‌ను సృష్టించుకోవ‌డ‌మే మ‌నిషి చేసే అతి పెద్ద త‌ప్పిద‌మ‌నీ.. ఈ ఘ‌ట‌న నిరూపించింది.. కాబ‌ట్టి అవి- భ‌క్త జ‌నులు గుర్తించ‌వ‌ల‌సిందిగా ప్రార్ధ‌న‌!!!

కేటీఆర్ సీఎం కావాలంటున్న వాళ్లుఒక్క సారి ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న రెడ్డిని చూసైనా కాస్త‌ బుద్ధి తెచ్చుకో...
22/01/2021

కేటీఆర్ సీఎం కావాలంటున్న వాళ్లు
ఒక్క సారి ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న రెడ్డిని చూసైనా కాస్త‌ బుద్ధి తెచ్చుకోవాలి. లేదంటే..
అట్ లీస్ట్ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా అయినా చూడాలి..
ఏంటో ఈ సినీ- రాజ‌కీయ సంబంధం.. అన్న‌ది ఇప్పుడు చూద్దాం..
కేటీఆర్.. జ‌గ‌న్ ను చూసి ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి అంటే..
జ‌గ‌న్ తండ్రి బ‌తికి ఉన్నంత సేపు అసలు రాజ‌కీయాల్లోకే రాలేదు..
ఇది పాయింట్ నెంబ‌ర్ వ‌న్..
కేటీఆర్ అలాక్కాదు.. తండ్రి వెన‌కే త‌న రాజ‌కీయ రాచ‌మార్గాన్ని ప‌రుచుకుంటూ వ‌స్తున్నారు..
ఇక్క‌డి వ‌ర‌కూ ఓకే.. లోకేష్ లాంటి వారిక‌న్నా వెయ్యి రెట్లు మెరుగ‌న్న పేరు సాధిస్తూ.. భేష్ అనిపించారు..
ఇదొక గొప్ప విష‌యం.
కేటీఆర్ ప్రెజంట్ సిట్యువేష‌న్ చూస్తుంటే.. ఆయ‌న లోకేష్ కు ఎక్కువ- జ‌గ‌న్ కన్నా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నారు..
ఎందుకు? అంటే జ‌గ‌న్ లా ఆయ‌న ఓన్ గా సీఎం కాలేదు..
అట్ లీస్ట్.. ఒక దుబ్బాక‌- మ‌రో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను ఒంటి చేత్తో గెలిపించ‌లేక పోయారు..
దుబ్బాక కేటీఆర్ బాధ్య‌త ఎందుక‌వుతుందీ? అని అడ‌గొచ్చు..
ఈ ఓట‌మి హ‌రీష్ రావ్ ఖాతాలో క‌దా క‌లిసేద‌నే మాట వినిపించ‌వ‌చ్చు..
కానీ ఒక కాబోయే సీఎం అనిపించుకోవాల‌నుకునే వ్య‌క్తి.. అందుకూ త‌గిన ద‌శా దిశా నిర్దేశం చేయ గ‌ల‌గాలి..
స‌రిగ్గా ఇక్క‌డే కేటీఆర్ నాయ‌క‌త్వ ప్ర‌తిభ తేలిపోయింది..
ఇక జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ఎంత ప్రిస్టేజియస్ అంటే..
మున్సిప‌ల్ మంత్రి నుంచి ముఖ్య‌మంత్రికి ప్రొమోట్ కావాలంటే
జీహెచ్ఎంసీ ఎలెక్ష‌న్స్ లో సెంచురీ ఫీట్ షురూ చేయాల్సి ఉండే.. కానీ చేయ‌లేక పోయారు...
తండ్రి ద్వారా అయాచితంగా పొందిన‌దేదీ.. ఆయ‌న సొంతం కాదు..
ఆయ‌న‌కంటూ నిజ‌మైన విజేత ల‌క్ష‌ణం ఉన్న‌ప్పుడే ఆయ‌న ధృవ‌తార కాగ‌ల‌రు..
అదే జ‌గ‌న్ మోహ‌న రెడ్డి చూడండీ..
తండ్రి వెళ్లాకే పూర్తి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారా?
అది కూడా తండ్రి పార్టీని విడిచి.. సొంత పార్టీ పెట్టారా?
అక్క‌డ మొద‌టి సారి ప్ర‌తిప‌క్ష హోదాకు ప‌రిమిత‌మ‌య్యారా?
తిరిగి పాద‌యాత్ర చేసి.. రెండో సారి అఖండ విజ‌యం సాధించారా?
ఇలాంటి క‌ష్ట‌త‌ర‌మైన విన్యాస‌మేదీ కేటీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానంలో లేదు..
అంతా తండ్రి చేత- తండ్రి కొర‌కు- తండ్రి ద్వారా- వ‌చ్చిన అయాచిత ల‌బ్ధే..
దానికి తోడు.. ఫామ్ హౌసులు, ఇత‌ర ఆస్తిపాస్తుల పెంపుద‌ల వంటి చెడ్డ‌ పేరు ఇందుకు అద‌నం..
అంటే తండ్రి తెలంగాణ అనే అతి పెద్ద జ్వాలాగ్ని ర‌గిల్చితే..
ఆయ‌న చేసిన త్యాగ‌మ‌ల్లా ఒక‌టే.. ఓ కార్పొరేట్ జాబ్ వ‌దిలి రావ‌డం..
ఆ మాత్రానికే.. కేటీఆర్ పొందిన భోగ‌భాగ్యాలు ఇటు మంత్రి కావ‌డం అటు కోట్లాది రూపాయ‌ల సంపాద‌న మ‌ధ్య మ‌ధ్య చిల‌క్కొట్టుడు వ‌గైరా వ‌గైరా.. చాలానే!
ఇదేమి వీరోచిత విన్యాస‌మ‌ని..
ఇప్పుడ‌న‌గా కేటీఆర్ సీఎం కావాలో కావాలో అంటూ ఊద‌రొట్టేస్తున్నారు మంత్రులు ఇత‌ర గులాబీ వ‌ర్గాల వారు..
అదే హ‌రీష్ రావ్ ను చూడండీ.. సైలెంట్ గా త‌న ప‌ని తాను ఎలా చేసుకుంటూ వెళ్తున్నారో..
ఇప్ప‌టికే కేడ‌రంటే హ‌రీష్ రావే అన్న పేరు సాధించేశారు..
నిన్న‌టికి నిన్న త‌న సొంత ఆస్తి త‌న‌ఖా పెట్టి.. ఆటో డ్రైవ‌ర్ల ప‌ర‌ప‌తి సంఘంలో 45 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేసి.. ఇది క‌దా రియ‌ల్ లీడ‌ర్ షిప్ అంటే.. ఇది క‌దా రియ‌ల్ కేడ‌ర్ షిప్ ను కాపాడుకోవ‌డం అంటే అనిపించేసుకున్నారు..
ఈ ల‌క్ష‌ణాలేవీ మ‌న యువ‌రాజావారిలో ఇసుమంతైనా క‌నిపించ‌క పోవ‌డం విచార‌క‌రం.. కార‌ణం..
ఒక ధైర్యం- ఒక మ‌గ‌త‌నం- ఞ‌క రోగ‌నిరోధ‌క శ‌క్తి- ఒక నాయ‌క‌త్వం త‌యారు చేయ‌లేం..
దానంత‌ట అది ఆ త‌త్త్వం ఆ మ‌నిషిలో నిగూఢంగా దాగి ఉండి అవ‌స‌రమైన‌ప్పుడ‌ల్లా బ‌య‌ట ప‌డుతుండాలి..
ఒక హ‌రీష్ లో మ‌రో జ‌గ‌న్ లాంటి వారిలో బ‌య‌ట ప‌డ్డ‌ట్టు..
అఖిలేష్ యాద‌వ్ లా తండ్రి చాటు కొడుకుగా ఉండి..
తండ్రి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి సాధించి పెట్టిన అధికార‌పు అంద‌లాన్ని అయాచితంగా పొంద‌డం సిగ్గు చేటు..
ఈ విష‌యం కేటీఆర్ గ్ర‌హించారో లేదో తెలీదు కానీ..
కేటీఆర్ సీఎం కావాల‌నుకుంటున్న వారు మాత్రం ఖ‌చ్చితంగా గుర్తించాలి..
ఎందుకంటే.. మా వోడు.. ఓన్ గా గెలిచి తొడ గొట్టి సీఎం కుర్చీ ఎక్కుతాడు..
ఇలాంటి దాన‌- ధ‌ర్మం, జాలీ- ద‌య‌ల‌తో కూడిన కూడు కుడ‌వ‌డు.. అన్న‌ది అభిమానుల నుంచే రావాలి..
అప్పుడే కేటీఆర్ కు నిజ‌మైన గెలుపేదో అధికార‌మేదో అర్ధ‌మ‌వుతుంది..
అందుకే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చూడ‌మంటున్న‌ది..
ఈ సినిమాలో హీరో పౌరుషం నాకెంత‌గానో న‌చ్చింది.. చాలా మందికి కూడా న‌చ్చింది.. న‌చ్చుతుంది కూడా..
అరే బాబూ పెళ్లి చేస్కో అంటే తాను పెట్టిన హోట‌ల్ హిట్ అయితేనే అంటాడు హీరో.. ఇది క‌దా మ‌గ‌త‌నం అంటే..
అత‌డెప్పుడు త‌న పెళ్లికి ప్రియురాలికి ప‌చ్చ జెండా ఊపుతాడంటే..
గుంటూరులో టిఫినెక్క‌డ బాగుంటుంద‌ని త‌న ఫ్రెండ్ చేత ఎంక్వ‌యిరీ చేయించి..
అందులో భాగంగా.. త‌న హోట‌ల్ అడ్రెస్ వాళ్లూ వీళ్ల చేత చెప్పించుకుని..
త‌న స్నేహితుడి ముందు కాల‌రెగ‌రేసి.. క‌ళ్ల‌ల్లో ఒకింత గ‌ర్వం నింపుకున్నాక‌గానీ..
అత‌డు త‌న పెళ్లికి ఓకే అన‌డు..
అదీ మ‌గ‌త‌నం అంటే
అదీ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం అంటే
అదీ ద ఒరిజిన‌ల్ గ‌ట్స్ అంటే..
అదేం లేకుండా కేటీఆర్ సీఎం కావాలీ సీఎం కావాల‌ని ఊద‌ర‌గొట్ట‌కండి..
మీకంటూ క‌నీస ఇంగిత జ్ఞానం లేద‌నీ..
మ‌గ‌త‌నం గురించి..
నిజ నాయ‌క‌త్వం గురించి తెలియ‌క పోవ‌డ‌మే అవుతుంది..
ఇక్క‌డ కొంద‌రొక మాట అంటున్నారు.. అది కూడా ప్ర‌స్తావించాలి..
రేప‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడి పోతే..
ఆ ఓటమి లెక్క తండ్రి కేసీఆర్ ఖాతాలో క‌ల‌వ‌కుండా ఉండాలంటే ఇదే బెట‌ర్ అంటున్నారు కొంద‌రు..
ఎప్పుడైతే ఓట‌మి గ్యారంటీ అని తెలిసి పోయిందో.. సుబ్బ‌రంగా గెలుపు దారి గుర్తెర‌గ‌వ‌చ్చు..
పోయిన సారి.. మోదీ స‌రిగ్గా ఇలాంటి దుస్థితే ఎదుర్కున్నారు..
అంతే త‌న అమ్ముల పొదిలోని అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ అనే ఆయుధాన్ని తెర‌పైకి తెచ్చారు..
దీంతో దిమ్మ తిరిగే విజ‌యాన్ని న‌మోదు చేయ‌గ‌లిగారు..
ఇవ‌న్నీ తెలియాలంటే కేటీఆర్ మొద‌ట తండ్రి ఆరాలోంచి బ‌య‌ట‌కు రావాలి..
అయాచిత కూడు కుడ‌వ‌రాద‌న్న క‌నీస ఇంగిత జ్ఞానం పొందాలి..
ఆ త‌ర్వాత‌గానీ.. ఇవ‌న్నీ అర్ధం కావు..
అప్ప‌టి వ‌ర‌కూ అత‌డో రాజ‌కీయ కూన‌గానే భావించాల్సి ఉంటుంది
ఏమంటారు!!!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Alt J posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share