19/07/2022
https://www.facebook.com/529742440542156/posts/2081563222026729/
విజయవాడ - భద్రాచలం రోడ్ రైలు పునరుద్దరణ
---------------------------------------------------------------
విజయవాడ - భద్రాచలం రోడ్ - విజయవాడ ప్యాసింజర్ ప్రత్యేక రైలు (నెంబర్ 07979 / 07278 BZA BDCR BZA) ను పునరుద్దరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
విజయవాడ నుంచి ఉదయం 7.50 గంటలకు బయలుదేరి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)కు 12.50 కు చేరుకుంటుంది.
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తిరిగి 13.45 బయలుదేరి విజయవాడ కు 18.55 కి చేరుకుంటుంది.
విజయవాడ నుంచి రాయనపాడు కొండపల్లి, చెరువు మాధవవారం, గంగినేని, ఎర్రుపాలెం, తొండల గోపవరం, మధిర, మోటమర్రి, బోనకల్లు, నాగులవంచ, చింతకాని, పందిళ్లపల్లి, ఖమ్మం, మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్ జంక్షన్, పోచారం, కారేపల్లి, గాంధీపురం, చీమలపహాడ్, తడికలపూడి, బేతంపూడి, భద్రాచలం రోడ్ వరకు వెళ్లి తిరిగి ఇదే మార్గంలో వెనక్కు వస్తుంది.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.