02/10/2021
కువైట్ లో మెరిసిన తెలుగు ఆణిముత్యం సాయి హర్షిత అడివి
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన శ్రీ బాల శివ శ్రీకాంత్ అడివి & శ్రీమతి మోహిని విమలా కిరణ్ ల పెద్ద కుమార్తె అయిన హర్షిత కువైట్ లో FAIPS (DPS) యొక్క XI తరగతి విద్యార్థని భారతీయ రాయబార కార్యాలయం ఆగస్టు 13వ తేదిన నిర్వహించిన వాక్చాతుర్యం పోటీలలో మూడోవ బహుమతి సాధించింది ఈరోజు మమాత్మాగాంధీ జయంతి సంధర్భంగా ఎంబస్సీ ఆడిటోరియం లో జరిగిన వేడుకలలో భారత రాయబారి శ్రీ సిబి.జార్జ్ గారు బహుమతి ప్రధానం చేశారు.
సాయి హర్షిత ఫిబ్రవరి 2020 లో కువైట్లో రఫాల్ నాదల్ అకాడమీ నిర్వహించిన బాలికల U-16 టెన్నిస్ పోటీలో హర్షిత గెలుపొందింది. అలాగే ఈమె ఏప్రిల్ 2019 లో భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది మరియు మరో భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్లో కోర్సులు చేసింది మరియు ప్రస్తుతం "కూచిపూడి" నేర్చుకుంటుంది. ఆమె పాఠ్యేతర కార్యకలాపాలతో పాటు, పాఠశాల నుండి వరుసగా ఐదు సంవత్సరాల పాటు "స్కాలర్ బ్యాడ్జ్" మరియు రెండు "గ్రీన్ టైస్" గెలుచుకోవడం ద్వారా విద్యాలో ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ఈమెకు 97.4% మార్కులు వచ్చాయి.
ఈ సంధర్భంగా కువైట్ లోని తెలుగు ప్రముఖులు,
స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హర్షితకు అభినందనలు తెలిపారు.
పాఠశాల విజయవంతమైన మార్గంలో ఉంది మరియు ఆమె వివిధ ప్రయత్నాలను ప్రశంసించింది.