JRN Journalist Ravi News
- Home
- JRN Journalist Ravi News
This is official page Journalist Ravi
(Palakollu News is the first priority)
02/06/2024
పాలకొల్లు బిఆర్ఎంవి గర్ల్స్ హైస్కూల్ విద్యార్ధిని నాగవల్లి ఊహ వెంకట లక్ష్మీ కృప పదవ తరగతి పరీక్షల్లో 543 మార్కులు సాధించింది. పాలకొల్లు శ్రీఅష్టభుజ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు గాది వెంకన్న ఆ విద్యార్ధిని కి తన సొంత ఖర్చుతో ఇంటర్మీడియట్ బుక్స్ కొని ఇచ్చారు.
02/06/2024
తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ ఈరోడ్ జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
02/06/2024
నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు నా మనవి
— కనుమూరి రఘురామకృష్ణరాజు (RRR)
ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి
02/06/2024
ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది
— వైసీపీ నేత పోతిన మహేష్
02/06/2024
02/06/2024
ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల కామెంట్స్
02/06/2024
BJP మూడోసారి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ పై రాహుల్ గాంధీ స్పందించారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు. ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందన్నారు.
02/06/2024
పాలకొల్లు మున్సిపల్ కమీషనర్ గారూ..!
ఈ సమస్యపై దృష్టి పెట్టండి సారూ..!!
— కర్నేన గౌరునాయుడు
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు
02/06/2024
02/06/2024
రాష్ట్రంలో ఈ నెల 4న చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్ కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటుపై సీఈవో పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్షించారు.
02/06/2024
సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్ తో భయపెట్టారని ఆరోపించాడు. న్యాయవాది, కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ విజయవాడ బయలుదేరాడు. ఆయనకు ఇటీవల కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
02/06/2024
యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో మరిడి మాలక్ష్మి అమ్మ వారిని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు.
02/06/2024
ఎన్నికల నిబంధనలు పాటిద్దాం.. ఊరేగింపులకు దూరంగా ఉందాం — పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు
02/06/2024
పాలకొల్లులో గుడాల గోపీ గెలుస్తారు - గుబ్బల వేణు
02/06/2024
ఏపీలో.. ఏర్పాటుకానున్న నూతన ప్రభుత్వంలో.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుంది? దానికి గల కారణాలు ఏంటి?
02/06/2024
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు ఎస్పీ వేజెండ్ల అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు.
* విజయవాడ- గుడివాడ నుంచి వచ్చే అన్ని వాహనాలు కాళ్ల మండలం పెదఅమిరం పుంతరోడ్డు మీదుగా ఉండి రోడ్డుకు చేరుకుని భీమవరంలోకి ప్రవేశిస్తాయి.
* భీమవరం నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు జువ్వలపాలెం రోడ్డులోని సర్ ఆర్థర్ పార్కు పక్క నుంచి చినఅమిరం మీదుగా కోపల్లె ఉన్నత పాఠశాల వద్ద కాళ్ల ప్రధాన రహదారి నుంచి గుడివాడ- విజయవాడ వైపు వెళ్లాలి.
* పాలకొల్లు నుంచి వచ్చే భారీ వాహనాలు బోంబే స్వీట్ కూడలి నుంచి ఉండి రోడ్డుకు వచ్చి మల్టీప్లెక్స్ మీదుగా ఉండి, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, గణపవరం, ఏలూరుకు, పెదఅమిరం పుంతరోడ్డు నుంచి కాళ్ల, గుడివాడ, విజయవాడకు వెళ్లాలి.
* తాడేపల్లిగూడెం నుంచి వచ్చే అన్ని వాహనాలు గొల్లలకోడేరు వంతెన నుంచి పాలకోడేరు, కుముదవల్లి, మార్కెట్ యార్డు మీదుగా పాలకొల్లు వైపు, భీమవరం పట్టణంలోకి, ఉండిరోడ్డుకు వెళ్లాలి.
* భీమవరం పట్టణం నుంచి తాడేపల్లిగూడెం, తణుకు వెళ్లే వాహన చోదకులు డాక్టర్ బీవీరాజు విగ్రహం నుంచి ఉండి బైపాస్ మీదుగా మార్కెట్ యార్డు, కుముదవల్లి, పాలకోడేరు మీదుగా వెళ్లాలి.
* వాహనాల నిలిపే స్థలాలు ఇవే..
వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిలిపేందుకు వేర్వేరు స్థలాలను కేటాయించారు.
• ఆచంట, తణుకు- విష్ణు విద్యాసంస్థల సమీపాన ఉన్న సంజన అపార్టుమెంట్ ప్రాంతం.
• నరసాపురం, పాలకొల్లు- కొవ్వాడ అన్నవరం మీదుగా విష్ణు క్రీడా మైదానం వైపు.
• భీమవరం, తాడేపల్లిగూడెం- నాగరాజు మాల్ సమీపాన ఉండి, తాడేపల్లిగూడెం- కాళ్ల రోడ్డులో శ్రీరామ కోల్డ్ స్టోరేజీ సమీపాన.
02/06/2024
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు దూరమయ్యాడని బాధిత తల్లిదండ్రులు ప్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. మే 21న టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో 12 ఏళ్ల దాసరి సాయి వినీత్ క్రికెట్ ఆడుతుండగా పాము కాటు వేసింది. ఏదో కుట్టినట్లు అనిపించినా ముల్లు గుచ్చుకుందని తొలుత భావించారు. కానీ కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుణ్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు కూడా ముల్లు గుచ్చుకుందంటూ రెండు గంటల పాటు సమయం వృథా చేశారని మృతుడి తల్లిదండ్రులు దాసరి మురళి, నిరోష ఆరోపించారు. పరిస్థితి విషమించాక శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నారు. అక్కడకు తీసుకువెళ్తుండగా బాలుడు మార్గమధ్యలో మృతిచెందాడు. తీవ్ర ఆవేదన చెందిన మృతుడి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 'పాముకాటుకు, ముల్లుకు తేడా తెలియని వైద్య సిబ్బందికి శతకోటి వందనాలు' అంటూ జిల్లా ఆసుపత్రికి వెళ్లే కూడలిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డ మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కమిషనర్ ను అందులో వేడుకున్నారు.
01/06/2024
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా స్థానాలు గెలుచుకుంటుంది. ఫలితాల్లోనూ ఇదే వెల్లడవుతుంది.
—మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
01/06/2024
పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సతీమణి గుడాల మంగతాయారు తదితరులు పాలకొల్లు బ్రాడీపేట లోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
01/06/2024
సైబర్ నేరగాళ్లు నానాటికీ కొత్తతరహా మోసాలకు తెర తీస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల పుణెకు చెందిన ఇద్దరు సోదరులు అత్యాశకు పోయి రూ. రెండున్నర కోట్లు పోగొట్టుకున్నారు. నోయిడా లో ఓ వ్యాపారి ఏకంగా రూ.9 కోట్లు కోల్పోయి లబోదిబోమంటున్నాడు.
నోయిడాలోని సెక్టార్ 40కి చెందిన వ్యాపారి రజత్ బోథ్రా మే 1న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వాట్సప్ గ్రూప్ లో చేరాడు. అందులో కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ కు సంబంధించి పెట్టుబడి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. తొలుత రజత్ చిన్న మొత్తంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూపించి నేరగాళ్లు నమ్మించారు. దీంతో మే 27న ఆ వ్యాపారి కొన్ని షేర్లలో ఏకంగా రూ.9.09 కోట్లు పెట్టాడు. ఆ కాసేపటికే అతడి ట్రేడింగ్ అకౌంట్ నిలిచిపోయింది.
మోసపోయాయని గ్రహించిన ఆ వ్యాపారి వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బదిలీ అయిన మొత్తంలో రూ.1.62 కోట్లను విత్ డ్రా చేయడానికి వీల్లేకుండా ఫ్రీజ్ చేశారు. వ్యాపారి డబ్బులను నేరగాళ్లు చెన్నై, అస్సాం, భువనేశ్వర్, హరియాణా, రాజస్థాన్ లోని పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
01/06/2024
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్ కు సంబంధించిన 'ఫారం- 13ఏ'పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాలు చేస్తూ వైకాపా ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులున్నాయన్నారు. పోస్టల్ బ్యాలట్ పై అటెస్టేషన్ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులున్నాయన్నారు. మెమోల అమలును నిలుపుదల చేయాలని కోరారు. పిటీషనర్ వాదనలు హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించింది.
01/06/2024
బ్లూ మీడియా
ఎల్లో మీడియా
ఇలాగే.. ఎగ్జిట్ పోల్స్
(అనుకోవచ్చా.?)
01/06/2024
హనుమాన్ జయంతి సందర్భంగా పోడూరు మండలం మట్టపర్రు గ్రామం పెదపాలెం శ్రీభక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సతీమణి
గుడాల మంగతాయారు, గుబ్బల వెంకటేశ్వరావు(జి.వి.ఆర్), పెచ్చెట్టి ముత్యాలరావు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
01/06/2024
వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసిన తర్వాత మీ మైండ్ ఎలా ఫిక్స్ అయ్యింది? ఆంధ్రప్రదేశ్ పీఠం ఎవరిది.?
*YSRCP
*TDP+JSP+BJPకూటమి
01/06/2024
Address
Telephone
Website
Alerts
Be the first to know and let us send you an email when JRN Journalist Ravi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Business
Send a message to JRN Journalist Ravi News:
Videos
RRR
నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు నా మనవి — కనుమూరి రఘురామకృష్ణరాజు (RRR) ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి
పూడుకుపోయిన కోడు
పాలకొల్లు మున్సిపల్ కమీషనర్ గారూ..! ఈ సమస్యపై దృష్టి పెట్టండి సారూ..!! — కర్నేన గౌరునాయుడు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు
పాలకొల్లు పట్టణంలో డ్రైయినేజీ వ్యవస్థకు మోక్షం.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం - ఆక్రమణలు తొలగింపు
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఎన్నికల నిబంధనలు పాటిద్దాం.. ఊరేగింపులకు దూరంగా ఉందాం — పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు
"ధమ్మున్నోడు" విజయ సారధి - పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ #palakollu #Municipal #Commissioner #palakol JRN Journalist Ravi News
తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు.
Shortcuts
- Address
- Telephone
- Alerts
- Contact The Business
- Videos
- Claim ownership or report listing
-
Want your business to be the top-listed Media Company?