AB News TV

AB News TV ATVBL’s AB NEWS TV is a leading 24X7hours,365 days Telugu News Portal, that presents the complete

15/06/2022
15/10/2021
04/10/2021

జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు: TJSS

ప్రవీణ్ ఆత్మహత్యకు కారణమైన వార్త యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

ప్రవీణ్ కుటుంబానికి వార్తా యాజమాన్యం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి

మంగళవారం ఉదయం 11గంటలకు వార్త కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టు తొందర పడొద్దు మేము అండగా ఉంటాం ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, గౌటి రామకృష్ణ

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని వార్త ప్రత్రిక రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ ని వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన వత్తిడి చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు, సర్క్యులేషన్ పేరుతో స్థానిక రిపోర్టర్ల పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వారిని నలుగురిలో అవమానం చేయడంతోపాటు కించపరచడం మామూలుగా మారింది ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని ఆనంచిన్ని, రామకృష్ణ కోరుతున్నారు. అదేవిధంగా ప్రవీణ్ ఆత్మహత్యకు కారణమైన వార్త యాజమాన్యం పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫిర్యాదు చేస్తామని ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి వార్తా సంస్థ యజమాన్యం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లో ని వార్త కార్యాలయం ముందు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు హాజరై జర్నలిస్టుల ఐక్యతను చాటాలని వారి కష్టసుఖాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేవరకు ఈ పోరాటం ఆగదని ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, గౌటి రామకృష్ణ తెలిపారు. స్టాఫ్ రిపోర్టర్ తమ సంస్థ వాట్సప్ గ్రూప్ లో ఉన్న పెడింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలి అంటూ అందరి ముందు పరువును తీసున్నారని మానసిక అన్ని రకాలుగా హింసించడం ద్వారా నే తాను మృతి చెందుతున్నట్టు సూసైడ్ ఉత్తరం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు కాబట్టి వెంటనే వార్త యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని భవిష్యత్తులో జర్నలిస్టులకు సంస్థలు ఇబ్బంది పెట్టవద్దని జర్నలిస్టుకు యజమాన్యాలు ఇబ్బంది పెడితే జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడడానికి TJSS ముందుంటుందని తెలిపారు.

శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ ...
04/10/2021

శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు

04/10/2021

బతుకమ్మ చీరల డబ్బులు మన డబ్బులే

వాహన దారుల వద్ద చాలన్డ్ల పేరుతో వసూలు చేస్తు చీరలు కొంటున్న తెలంగాణ ప్రభుత్వం

పట్టపగలు నడిరోడ్డుమీద వాహనదారులను బలవంతంగా చాలండ్ల పేరుతో అప్పటికప్పుడు కట్టమని బలవంత పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్న పోలీసులు

చాలామంది వాహనదారులు కేసులు అవుతాయన్న భయానికి తన భార్య పిల్లల మెడల మీద పుస్తేల తాళ్ళు అమ్మి వాహనలు విడిపించుకొనవడం జరుగుతుంది

పోలీసులు వసూలు చేసిన డబ్బు తో బతుకమ్మ చీరల కొని ప్రజలకు పంచడం జరిగింది డబ్బులు ప్రజల సొమ్మే

చీరలు తీసుకున్న ప్రజలు కెసిఆర్ ఇస్తున్నట్లు భ్రమ పడుతున్నారు అది తప్పుఏమైనా కేసీఆర్ ఇంట్లో నుండి ఇస్తున్నాడా లేదు ప్రజలారా అది మన సొమ్మె ఒక్కొక్క వాహనానికి వేలాది రూపాయలు వసూలు చేసి లక్షల మందిని ఇబ్బంది పెట్టి వసూలు చేసిన డబ్బు తో వారు మిగిలించుకొని వాడుకున్న తర్వాత మిగిలిన డబ్బుతో ప్రజలకు నాసిరకం చీరలు కొని ఇవ్వడం జరుగుతుంది చీరల డబ్బులు మన ప్రజల డబ్బులని మీరంతా గ్రహించాలి

04/10/2021

ఒక ఏడూ ఎనిమిదేళ్ళ క్రితం వరకూ అక్టోబర్ 2 కేవలం ఒకాయన జయంతి మాత్రమే జరిపేవారు..వీరయోద్ధ లాల్ బహద్దూర్ గారి జయంతి ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు..ఆరోజు ఏదో మొక్కుబడిగా తప్పనితద్దినంగా ( దివంగత ప్రధాని కాబట్టి ) అధికారులు విజయ్ ఘాట్ దగ్గర కాసిని పూలు చల్లి ఓ నాలుగు పాటలు పాడి వెళ్లిపోయేవారు..సైనిక ప్రధానకార్యాలయాల్లో మటుకు శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళి అర్పించేవారు..తర్వాత కాలంలో పైన వున్న వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుందో అని అది కూడా తూతూ మంత్రంగా జరిపేవారు..
సోషల్ మీడియా దేశంలో పుంజుకున్న తర్వాత..సోషల్ మీడియాలో జాతీయవాదుల పట్టు బిగిసినతర్వాత..సోషల్ మీడియాను అల్మోస్ట్ జాతీయవాదులు శాసిస్తున్న సమయం అంటే 2013 నుంచీ అక్టోబర్ 2 అంటే శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని ఈరోజును వైరల్ చేసింది జాతీయవాదుల సోషల్ మీడియా బృందం.. విజయం కూడా సాధించింది..మామూలు విజయం కాదు..అద్భుతమైన విజయం.. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మొత్తం గూగుల్ సెర్చ్ చేసి మనకి తెలియని ఆయన త్యాగమయ జీవితం..యుద్ధ రంగంలో ఆయన పాకిస్తాన్ కొమ్ములు విరిచేసిన సంగతులూ..భారత సైన్యం తన అరివీర భయంకర వీర విక్రమ పరాక్రమాలతో పాక్ లోని రాముడి కొడుకు లవుడు కట్టించిన ' లాహోర్ ' లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అపురూప క్షణాలను కూడా వెలికి తీశారు నేటి తరం..
చాలామంది యువతకు తెలియదు నాడు లాహోర్ దాకా మన భారత సైనికుల విజయయాత్ర సాగిందనీ పాక్ మనకు సాగిలపడిందనీ..
చరిత్రను నేటి యువత తవ్వుతున్నది..ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టిన నగ్నసత్యాలు వెలికితీయబడుతున్నాయి..
మహావీరుల త్యాగాలు వారి వీర గాధలు బయటపడుతున్నాయి..
మనం దేబిరిస్తే స్వతంత్రం రాలేదు..అడుక్కుంటే రాలేదు రాస్ బీహారీ బోస్ దగ్గరనుంచి అరివీర భయంకరుడు స్వతంత్ర భారత తొలిప్రధాని ఫస్ట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ / ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు శ్రీ సుబాష్ చంద్ర బోస్ లాంటి వారి జీవితాలు తృణప్రాయంగా ఎంచి భరతమాత పాదాలకు మువ్వలుగా మారిన త్యాగమయ జీవితాలవలన మనం స్వేచ్ఛగాలులు పీలుస్తున్నాం..
మహావీరులైన మనల్ని ఒక పిరికి జాతిగా మార్చడానికి చేసిన కుట్ర అహింసా పరమో ధర్మః.. మనకి ఇంతవరకే భోదించారు.. ధర్మహింసా తదైవచ ఇది చెప్పలేదు..
చరిత్రను తిరగరాద్దాం..ప్రపంచంలోనే ఒక గొప్పజాతి మనది..తిరిగి పునర్వైభవం సాదిద్దాం..ధర్మం కోసం ధనస్సు ఎక్కుపెట్టిన రాముడు మనకి ఆదర్శం..అడుక్కుంటే విజయాలు రావు..రాముడు రావణుడిని బ్రతిమిలాడలేదు..యుద్ధం చేసి గెలిచి అజేయుడయ్యాడు...మన గ్రంధాలు ధర్మం కోసం యుద్ధం చేయమన్నవే గాని..అలిగి అన్నం మానేసి బతిమిలాడమనలేదు..అలా తిన్నది వీరభోజ్యం అనరు..అడక్క తినడం అంటారు..
అర్ధం అయితే మంచిది..అర్ధం కాకపోతే మరీ మంచిది.
ఇట్లు
మీ పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు

04/10/2021

శుభోదయం-నేటి పంచాంగము🙏
శుభమస్తు

తేది : 4, అక్టోబర్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయణం

మాసం : భాద్రపదమాసం

ఋతువు : వర్ష ఋతువు

కాలము : వర్షాకాలం

వారము : సోమవారం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : త్రయోదశి
(నిన్న రాత్రి 10 గం॥ 26 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 0 ని॥ వరకు)

నక్షత్రం : పూర్వఫల్గుణి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 25 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 33 ని॥ వరకు)

యోగము : శుభము

కరణం : గరజ

వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 39 ని॥ వరకు)

అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 54 ని॥ వరకు)

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 38 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)

గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)

యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 3 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 3 ని॥ లకు

సూర్యరాశి : కన్య

చంద్రరాశి : సింహము

విశేషం
మాసశివరాత్రి

03/10/2021

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన MLA

పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు అందచేసిన స్థానిక MLA గౌరవ KMR గారు💐💐💐💐💐

03/10/2021

Dr.Sivaprasad Reddy from Kadapa
నాది కడప జిల్లా,ఇంట్లో అందరి ప్రభావంతో వైఎస్సార్ ని మహానేతగా చూసా,2009లో ప్రజారాజ్యం ని నమ్మలేదు,లోకసత్తా ఎలాగూ గెలవదు, ఓట్ ఎందుకు వృధా అని,నా చుట్టూ ఉన్న కులం, ప్రాంతం,వీటి ప్రభావం వల్లనేమో,అప్పుడు కాంగ్రెస్ కి వేసాను, తరువాత అదే ప్రభావంతో బై ఎలక్షన్స్ లో నిలబడ్డా జగన్ కి వేసాను

క్రమేణా పరిస్థితులని గమనిస్తూ,ఆలోచించగా,నాకంటూ ఒక పొలిటికల్ స్టాండ్ లేకుండా,కేవలం కులమో,ప్రాంతం చూసి ఒక నాయకుడిని సపోర్ట్ చేయటం ఏంటని అనిపించింది.

2014 లో,పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం నచ్చి జనసేన బలపరిచిన పార్టీకి ఓటు వేసాను.
మద్దతు ఇస్తున్నాం కదా,అప్పటి అధికార పార్టీ ఏం చేసినా సహిస్తారేమో అని సందేహపడ్డ ఎక్కడో,కానీ తను నమ్మిన ఆశయాల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అని నిరూపించారు ,అప్పటి ప్రభుత్వం తప్పులని ఎండగడుతూ.

2019 ఎన్నికల్లో,జగన్ కి ఓట్ వేస్తేనే ఊర్లోకి రా,లేదంటే ఓటింగ్ నాడు రావద్దు అని ఒకరకమైన వార్నింగ్ లాంటిదే ఇచ్చారు ఊరి పెద్దలు,కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వింటూ,ఆయన భావజాలం అర్థం చేసుకున్న నాకూ మా ఊర్లో ఆ పెద్దలు ముందు ధైర్యంగా చెప్పగలిగిన నేను ఎందుకు జనసేనకి ఓట్ వేస్తున్నా అని

ఆ ఎన్నికల ఓటమి తరువాత,ఎక్కడ కనపడిన బంధువులు నా మీద జోకులేసేవారు, జనసేన ఓటమి గురించి,కానీ బాధ అనిపించేది కాదు,నేను నిజాయితీకి ఓట్ వేసాను అని,కానీ ఎక్కడో భయం ఉండేది ,ఈ ఓటమి నుండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బయటకొచ్చి జనం మధ్య కి వస్తారా?

ఒక వేళ, రాకుంటే, ఇక భవిష్యత్తులో ఎవడైనా నిజాయితీగా పోరాడుతానని వచ్చినా వాళ్ళని ఎలా నమ్మాలి? అని ఒక రకమైన బాధ ,భయం. ఎందుకో ఒక్క జనసేన మాత్రమే రాజకీయంలో మార్పు తీసుకురాగలదు అని దృఢమైన నమ్మకం.కానీ ఈ పరాభవం తట్టుకుని మళ్ళ జనాసేనాని వస్తారా అన్న నా భయాన్ని పోగొడుతూ

పవన్ కల్యాణ్ గారు,ప్రజా సమస్యల గురించి జనం మధ్యలోకి వచ్చారు. ఓడిపోయాం కానీ ఆగిపోలేదు అని అర్థమైంది.చెప్పాలంటే 2019 ఓటమి తరువాతే ,జనసైనికులు ఇంకా బాధ్యతగా జనాల సమస్యల గురించి గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తూ ఆదర్శంగా నిలబడ్డారు.

ఎందరో యువత,బయట జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలని ఉన్నా,ధైర్యం లేక,ఒక బలమైన సపోర్ట్ లేక సైలెంట్ గా ఉన్నారు,వారందరికీ జనసేనా ఒక అండగా నిలబడుతుంది.ఇదంతా మీరు ఇచ్చిన స్ఫూర్తి సార్.

2019 లో మన మీద జోకులేసుకున్న వారే,ఇప్పుడు ఆలోచనలో పడ్డారు,మీరు కరెక్టే రా అనే దాకా వచ్చారు,కానీ ఇంకా ఆ కులం అడ్డుగోడగా ఉంది,మనం ఇలానే ప్రజా సమస్యల గురించి పోరాడుతూ ,జనాలని చైతన్య వంతులు గా ,చేయగల్గితే ఆ కులం అనే అడ్డుగోడలు పగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

కులరహిత రాజకీయం అంటే,కులాల గురించి బయటకి మాట్లాడకుండా గూడు గుఠాని చేస్తూ చేసే రాజకీయం కాదు, అన్నీ కులాలు కలుపుకుంటూ సమిష్టిగా సమస్యల మీద పోరాడటమే👍అది కేవలం మీ వల్లనే అవుతుంది సార్. ఈ పోరాటంలో మేము మాకు చేతనైన రీతిలో మీకు తోడుగా ఉంటాం.మీరే మా బలం.

సీమగడ్డపై పవన్ కళ్యాణ్  సింహగర్జన AP సర్కార్ అరాచకాల్ని ఎండగడుతూ సీమగడ్డపై కూడా సింహగర్జన చేసారు జనసేనాని .ప్రజాస్వామ్య ...
03/10/2021

సీమగడ్డపై పవన్ కళ్యాణ్ సింహగర్జన

AP సర్కార్ అరాచకాల్ని ఎండగడుతూ సీమగడ్డపై కూడా సింహగర్జన చేసారు జనసేనాని .

ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగస్ఫూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తూ ప్రజల్ని అనేక కడగండ్ల పాలు చేస్తున్న దుష్టపాలనపై ధ్వజమెత్తారు .

ఇసుకవేస్తే రాలనంత జనసమూహం, జనసైనికులు, వీరమహిళలు.. అందరూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటని అత్యంత శ్రద్దగా ఆలకించారు .ఆరు గంటలు ఆలస్యమైనా సరే ఓపిగ్గా ఎదురుచూస్తూ జనసేనానికి అఖండ స్వాగతంతో జేజేలు పలికారు .

రాయలసీమ గడ్డపై కూడా తన వాణిని బలంగా వినిపించిన పవన్ కళ్యాణ్ పోరాట పటిమను కొనియాడారు .

YCP సర్కార్ కి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తూ...ప్రభుత్వం ఏ రకమైన యుద్దాన్ని కోరుకుంటుందో , అలాగే యుద్ధం చేసేందుకు సంసిద్ధమంటూ ఛాలెంజ్ చేశారాయన .

ఇన్నేళ్ళుగా అధికారం లేని వర్గాల్ని ఏకం చేస్తూ సరికొత్త వ్యూహరచనతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్న పిలునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు .

తాను కోరుకుంటుంది పదవులు కావని, విలువలతో కూడిన రాజకీయమంటూ ప్రకటించారు .

ఆయన చూపిస్తున్న శ్రద్దాశక్తులకు జనం సమ్మోహితులయ్యారు. మేమంతా మీవెంటేనంటూ సగర్వముగా తెలియజేసారు .

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనంతపురం జిల్లా '' కొత్తచెరువు '' పర్యటనను విజయవంతం చేసిన జనసైనికులకు, జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు , ముఖ్యంగా అందరిని ఉత్తేజపరిచి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

గాంధీ జ‌యంతిని పురస్కరించుకొని దిశా యాప్‌పై రూపొందించిన పాట ఆవిష్క‌ర‌ణ‌ ఎమ్మెల్యే విడదల రజినిచిలకలూరిపేట:దేశంలో మ‌రే రాష...
03/10/2021

గాంధీ జ‌యంతిని పురస్కరించుకొని దిశా యాప్‌పై రూపొందించిన పాట ఆవిష్క‌ర‌ణ‌ ఎమ్మెల్యే విడదల రజిని

చిలకలూరిపేట:దేశంలో మ‌రే రాష్ట్ర మ‌హిళ‌కు లేని ఏపీలోని మ‌గువ‌ల‌కు మాత్ర‌మే ఉన్న గొప్ప ఆయుధం దిశా యాప్ అని శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని మ‌ద్దిన‌గ‌ర్‌లో ఉన్న 9వ స‌చివాల‌యంలో మ‌హిళా పోలీసుగా ప‌నిచేస్తున్న శ్రీరంజిని దిశా యాప్‌పై మ‌హిళ‌లంద‌రికీ అవ‌గాహ‌న పెంచేలా ఒక పాట‌ను రూపొందించారు. అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ పాట‌ను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిశా యాప్‌పై అవ‌గాహ‌న పెంచేలా శ్రీరంజిని పాట‌ను రూపొందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఓ మ‌హిళా నిదుర‌ లేచి మేలుకో.. దిశా యాప్ డౌన్ లోడు చేసుకో.. అంటూ ఈ సాగిన ఈ పాట‌కు క‌ర్త‌, క‌ర్మ, క్రియ అన్ని శ్రీరంజినీనే అని చెప్పారు. స‌చివాల‌యంలో మ‌హిళా పోలీసుగా ప‌నిచేస్తున్న ఆమె ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం గొప్ప విష‌యమ‌ని ప్ర‌శంసించారు. దిశా యాప్ లో ఉన్న అన్ని ఫీచర్లు ప్ర‌జ‌లకు తెలిసేలా ఈ పాట‌ను రూపొందించార‌ని చెప్పారు...!!

03/10/2021

గాంధీ జ‌యంతిని పురస్కరించుకొని దిశా యాప్‌పై రూపొందించిన పాట ఆవిష్క‌ర‌ణ‌ ఎమ్మెల్యే విడదల రజిని
చిలకలూరిపేట:దేశంలో మ‌రే రాష్ట్ర మ‌హిళ‌కు లేని ఏపీలోని మ‌గువ‌ల‌కు మాత్ర‌మే ఉన్న గొప్ప ఆయుధం దిశా యాప్ అని శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని మ‌ద్దిన‌గ‌ర్‌లో ఉన్న 9వ స‌చివాల‌యంలో మ‌హిళా పోలీసుగా ప‌నిచేస్తున్న శ్రీరంజిని దిశా యాప్‌పై మ‌హిళ‌లంద‌రికీ అవ‌గాహ‌న పెంచేలా ఒక పాట‌ను రూపొందించారు. అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ పాట‌ను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిశా యాప్‌పై అవ‌గాహ‌న పెంచేలా శ్రీరంజిని పాట‌ను రూపొందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఓ మ‌హిళా నిదుర‌ లేచి మేలుకో.. దిశా యాప్ డౌన్ లోడు చేసుకో.. అంటూ ఈ సాగిన ఈ పాట‌కు క‌ర్త‌, క‌ర్మ, క్రియ అన్ని శ్రీరంజినీనే అని చెప్పారు. స‌చివాల‌యంలో మ‌హిళా పోలీసుగా ప‌నిచేస్తున్న ఆమె ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం గొప్ప విష‌యమ‌ని ప్ర‌శంసించారు. దిశా యాప్ లో ఉన్న అన్ని ఫీచర్లు ప్ర‌జ‌లకు తెలిసేలా ఈ పాట‌ను రూపొందించార‌ని చెప్పారు...!!

03/10/2021
03/10/2021

Address


Alerts

Be the first to know and let us send you an email when AB News TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AB News TV:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share