MS8NEWS

MS8NEWS RAISE UR HAND TO CHANGE THE SOCIETY

27/12/2024
బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నంతెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో ...
18/12/2024

బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం

తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు.

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ రోజు ‘రాహుల్ గాంధీ-అదానీ బాయ్ బాయ్’ అని వారిద్దరి బొమ్మలు ముద్రించిన టీ షర్ట్స్ వేసుకొని శాసనసభకు రాబోతే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

లగచర్ల రైతు హీర్యా నాయక్‌ బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్ళడాన్ని నిరసిస్తూ, మంగళవారం అందరూ నల్ల దుస్తులు, చేతులకు బేడీలు ధరించి శాసనసభకు వచ్చారు.

ఇవాళ్ళ ఆటో డ్రైవర్ల యూనిఫారం (కాకీ చొక్కాలు) ధరించి ఆటోలలో శాసనసభకు చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ స్వయంగా ఓ ఆటో రిక్షాని నడిపిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు చేరుకున్నారు.

వారందరూ ప్లకార్డులు పట్టుకొని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ శాసనసభలోకి ప్రవేశించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ సమావేశలంటే చాలా చులకనగా భావిస్తున్నట్లున్నారు. అందుకే రోజుకో వేషం వేసుకొని వచ్చి శాసనసభలో డ్రామాలు ఆడుతున్నారు.

బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంది. ఏనాడైనా ఆర్టీసీ కార్మికుల, ఆటో డ్రైవర్ల గోడు విందా? కనీసం వారి సమస్యలేమిటో బిఆర్ఎస్ పార్టీకి తెలుసా?అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఎక్కువగా ఉండటం వలననే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12,000 ఇవ్వలేకపోయాము. కానీ వచ్చే ఏడాది తప్పకుండా ఇస్తాము,” అని చెప్పారు.

== అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ==ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 మ్యాచుల సిరీస్ లో మూడవ ...
18/12/2024

== అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ==

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 మ్యాచుల సిరీస్ లో మూడవ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.

ఎవరు ఊహించని విధంగా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం అయితే ఈ సిరీస్ లో వచ్చే రెండు మ్యాచుల్లో తన సేవలు అవసరం లేదని విలేఖర్ల సమావేశంలో అనడం విస్మయం కలిగించింది.

అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో 106 మ్యాచులు ఆడి 537 వికెట్లు, వన్డే క్రికెట్లో 116 మ్యాచుల్లో 152 వికెట్లు, టీ ట్వంటీలో 65 మ్యాచుల్లో 72 వికెట్లు, మొత్తం మీద 765 వికెట్లు పడగొట్టాడు.

థాంక్యూ రవిచంద్రన్ అశ్విన్ 💐

*శ్రీ ఆంజనేయ ఓదెల మండల్  మినీ వ్యాన్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం*                                             వ్య...
18/12/2024

*శ్రీ ఆంజనేయ ఓదెల మండల్ మినీ వ్యాన్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం*

వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు బీరం స్వామి గారి ఆధ్వర్యంలో ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ కొమిరే మాజీ సర్పంచ్ మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఓదెల మండల్ సీనియర్ నాయకులు చీకట్ల మొండయ్య ఓదెల మాజీ ఎంపీటీసీలు. బోడకుంట శంకర్,బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ అల్ల సుమన్ రెడ్డి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది*

*ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్ పోత్కపల్లి సింగల్ విండో డైరెక్టర్ చింతం స్వామి, ఓదె ల మల్లికార్జున దేవస్థానం మాజీ డైరెక్టర్ డాక్టర్ కనికి రెడ్డి సతీష్ ఓదెల సీనియర్ నాయకులు పెండం సమ్మయ్య పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ వార్డ్ మెంబర్స్ మీనుగు సంతోష్,అల్లం సతీష్, వంగ తిరుమల రాయమల్లు, నాయకులు రాపల్లి రాజయ్య, గోలి చంద్రమౌళి, నాగపురి పైడి, బీరంరవి, అల్లం మొండయ్య, వకీల్ రామచంద్రం తదితరులతో పాల

*‘త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు.. కానీ’.. వేణు స్వామి సంచలన కామెంట్స్..* వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్...
18/12/2024

*‘త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు.. కానీ’.. వేణు స్వామి సంచలన కామెంట్స్..*

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పుడూ సినీ సెలెబ్రిస్ పై వివాదాస్పద జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఈయన.

ఇక సోషల్ మీడియాలో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నార్మల్ జనం నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఈయన్ని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాల మంది సినీ హీరోయిన్స్ ఆయన దగ్గర కొన్ని పూజలు కూడా చేశారు.

అయితే సమంత, నాగచైతన్య విడాకుల వార్తల దగ్గర నుండి మొదలైన ఈయన ప్రయాణం ఇప్పుడు అల్లు అర్జున్ వరకు చేరింది. ఎన్నో వివాదాస్పద జాతకాలు చెప్పిన ఈయన తాజాగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా జైలుకి వెళ్లి వచ్చిన విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన వాళ్లందరూ ముఖ్యమంత్రులు అయ్యారు.. కాబట్టి, అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతాడు. ఇప్పటికే అలా జైలుకు వెళ్లిన జగన్ సీఎం అయ్యారు.. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లి వచ్చాక సీఎం అయ్యాడు. ఇప్పుడు కూడా అదే విధంగా బన్నీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు వేణు స్వామి. ఇప్పుడున్న దానికంటే 100 రెట్లు ఫైర్ తో అల్లు అర్జున్ సీఎం అవుతాడు. కచ్చితంగా ఎప్పుడు అవుతాడు, ఏ రాష్ట్రానికి అవుతాడు అన్నది నేను చెప్పను.. మీరే చూడండి” అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.

*కేటీఆర్,కౌశిక్ రెడ్డికి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్*అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు న...
18/12/2024

*కేటీఆర్,కౌశిక్ రెడ్డికి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్*

అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు నిర్వహించే గడ్డం ప్రసాద్ బుధవారం నేటి సమావేశాల సందర్భంగా ఆగ్రహావేశాలను లోనయ్యారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదంచిన సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది.

ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి.వివేకా నంద, పాడి కౌశిక్ రెడ్ది, కేటీఆర్, లు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల చేశారు. వివేకానంద వ్యాఖ్యల పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేయగా, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు.

ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని స్పీకర్ హెచ్చరించారు. సభ నిబంధన ప్రకారం నడుచు కోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ కు స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెళ్లి ఎవరి స్థానంలో వాళ్లు కూర్చో వాలని కూర్చోక పోతే సభ నుండి సస్పెండ్ చేస్తానని, ఇద్దరిని గట్టిగానే అరుసుకున్నడు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు త...
18/12/2024

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!

సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర పోస్టులపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మరియు ఇతర రాజకీయ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా, అల్లు అర్జున్ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా దూషణలకు దిగడంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు . సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఉపయోగించి పెట్టిన పోస్టులపై కూడా నిఘా పెంచినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కొందరు పోస్టులు చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని పోలీసులు తెలిపారు.ఇలాంటి పోస్ట్‌లు సమాజంలో కలహాలను రెచ్చగొడతాయని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలను తమ భావాలను తెలియజేయడానికి ఉపయోగిస్తున్నామే కానీ దాన్ని తప్పుగా చెప్పడం తగదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. తమకు కూడా మాట స్వేచ్ఛ ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.

18/12/2024

హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు

ఇండియాలో మొట్టమొదటి సోలార్ ప్రూఫ్ సైకిల్ ట్రాక్ గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్‌ తొలగిస్తున్న అధికారులు...

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు నమోదు ఆదిలాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్...
18/12/2024

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు నమోదు

ఆదిలాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతలగాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

*సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు.*  *పందెపు కోళ్లపెంపకం వృత...
18/12/2024

*సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు.*

*పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు.*

*రూ.లక్షల్లో పందెం కాచేవారు ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు వెళ్లి మేలు జాతి పుంజులను తెచ్చుకుంటారు.*

కొందరు ఔత్సాహికులు విదేశీ పుంజులను సైతం పందేలకు సిద్దం చేస్తున్నారు ‌

*పల్లెటూర్లలో ఒక్కో పుంజు రూ.10-20వేలు, ప్రత్యేక శిక్షణ, పోషణ పొందిన పందెపుకోళ్లు ఒక్కొక్కటి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి.*

*తిరుమల - తిరుపతి :**తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.**స్వామివారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్...
18/12/2024

*తిరుమల - తిరుపతి :*

*తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.*

*స్వామివారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.*

*ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.*

*నిన్న 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు*

*20,102 మంది తలనీలాలుసమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.*

*కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.*

ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం.. ఖాకీ దుస్తుల్లో ఆటో నడుపుతూ అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలురాష్ట్రంలో ...
18/12/2024

ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం.. ఖాకీ దుస్తుల్లో ఆటో నడుపుతూ అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

రాష్ట్రంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి స్వయంగా ఆటో నడుపుతూ ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

*త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు*టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయను న్నట్లు మంత్రి ...
18/12/2024

*త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు*

టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయను న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు.

అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్,పాల్వాయి హరీష్,అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... జిల్లా కేంద్రాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకు న్నామని, తెలిపారు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు సంతోషంగా ఉచిత ప్రయాణం చేస్తు న్నారని, దీంతో బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు. అందువల్ల రాష్ట్రంలో కొత్త రూట్లను కూడా పెంచుతా మన్నారు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాల ను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం సమ యంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామ న్నారు.

*నేడు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్*తెలంగాణలో రెండు ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ కాంగ్రెస్ నేడు టీపీసీస...
18/12/2024

*నేడు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్*

తెలంగాణలో రెండు ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ కాంగ్రెస్ నేడు టీపీసీసీ ఆధ్వ ర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది.

పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానికి సంబంధించిన ఆరోపణలపై మరియు హింసతో అతులకుతుల మైన మణిపూర్ లో ఇప్పటివరకు పర్యటించని ప్రధాని నరేంద్ర మోడీ యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు గళం విప్పనున్నారు.

ఈ నిరసనల్లో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నా రు.ఇందిరా పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.

అదానీ, మణిపూర్‌ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరి కాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తు న్నారు.

అవినీతి, మోసం, మనీలాం డరింగ్, మార్కెట్ మానిప్యు లేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బ తీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నేడు నిరస నల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా.. ఉద యం 11 గంటలకు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఈ సంద ర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్‌ చేసింది.

నిరసనల్లో భాగంగా కాంగ్రెస్‌ నేతలు.. ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లనున్నా రు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

*గర్రెపల్లి విండోలో జరిగిన అవినీతిపై విచారణ*సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో భవనం కోసం స్థలం కొనుగోలు పేరిట ప...
18/12/2024

*గర్రెపల్లి విండోలో జరిగిన అవినీతిపై విచారణ*
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో భవనం కోసం స్థలం కొనుగోలు పేరిట పాలకవర్గం అవినీతికి పాల్పడ్డ వైనంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించారు. చైర్మన్, పాలకవర్గం రూ.39 లక్షలకు మూడున్నర గుంటల భూమి కొనుగోలు చేసి రూ.44 లక్షలకు కొన్నట్లు పత్రాలు సృష్టించి రూ.5లక్షల విండో సొమ్మును కాజేయడమే కాకుండా భూమి విక్రయించిన సందెవేని శ్రీనివాస్ ను బెదిరించి మరో రూ.2లక్షలు తీసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. విచారణకు డీసీవో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఈ మేరకు విచారణాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం గర్రెపల్లి విండో కార్యాలయంలో విచారణ చేపట్టారు. భూమి విక్రయించిన సందెవేని శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరించి ఆధారాలతో వాంగ్మూలం తీసుకున్నారు. సీఈవో నబియొద్దీన్ రూ.2లక్షలు సందెవేని శ్రీనివాస్ వద్ద తీసుకుని చైర్మన్ సందీప్ రావుకు ఇచ్చినట్లు విచారణలో అంగీకరించాడు. అలాగే బాధితుడు శ్రీనివాస్ నుంచి చైర్మన్ సందీప్ రావు తన గుమస్తా అయిన నర్సయ్యపల్లికి చెందిన అమ్ముల శ్రీనివాస్ ద్వారా తీసుకున్న రూ.5లక్షల విషయమై మరుసటిరోజు విచారణలో తెలుస్తానని విచారణాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, ఈ వ్యవహారంపై బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తంగళ్లపల్లి రాజ్ కుమార్ ఇటీవల సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.

18/12/2024

*ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షను అర్థరాత్రి భగ్నం చేసి అక్రమంగా DSP నాయకులను అరెస్టు చేసి (DCM, వాహనంలో) వనపర్తి పట్టణ పోలీసులు తరలించారు*

*లోన్ యా ప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య**మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విషాదం**లోన్ యాప్ ద్వారా రూ.3 లక్షలు ...
18/12/2024

*లోన్ యా ప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య*

*మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విషాదం*

*లోన్ యాప్ ద్వారా రూ.3 లక్షలు తీసుకున్న మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ (28)*

*ఈఎంఐలు సక్రమంగా చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు*

*మనస్తాపంతో పురుగు మందు తాగి గంగాధర్ ఆత్మహత్య*

Address


Alerts

Be the first to know and let us send you an email when MS8NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MS8NEWS:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share