హైదరాబాద్ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు
ఇండియాలో మొట్టమొదటి సోలార్ ప్రూఫ్ సైకిల్ ట్రాక్ గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఆ సైకిల్ ట్రాక్ తొలగిస్తున్న అధికారులు...
*ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షను అర్థరాత్రి భగ్నం చేసి అక్రమంగా DSP నాయకులను అరెస్టు చేసి (DCM, వాహనంలో) వనపర్తి పట్టణ పోలీసులు తరలించారు*
అసెంబ్లీలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, చెన్నూరు ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాల పెంపునకు అతి త్వరలో బస్ డిపో పనులు పూర్తి చేయాలని, అలాగే చెన్నూరు నుండి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి విన్నవించారు.
చెన్నూరు పరిసర ప్రాంతాలు ఎక్కువగా అటవీ ప్రాంతాలు కావడంతో రోడ్డు సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసి బస్సులను వేయాలని ఆయన పునరుద్ఘాటించారు. అసిఫాబాద్ డిపో బస్సులు తప్పకుండా మందమర్రి బస్టాండ్ డిపోలో నిలవాలని కూడా మంత్రిని కోరారు. మంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ప్రకటించారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ, "10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మటుమాయం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్
కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీతభత్యాలు అందించే జీ.ఓ.22 ను అమలుచేయాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్..
||:: దారుణం.. అత్యంత అమానవీయ ఘటన ::||
తెలంగాణ ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కొరికి మంచాన పడ్డ విద్యార్దిని
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న లక్ష్మీ భవాని కీర్తి
అనే విద్యార్థినిని 15 సార్లు ఎలుకలు కొరికాయి
అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించకపోవడంతో తీవ్ర అనారోగ్యం పాలై అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చుపడిపోయి మంచాన పట్టింది...
||:: శబరి సన్నిధానంలో అయ్యప్ప భక్తుడి ఆత్మహత్య?
ఈ సీజన్లో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడు తోన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సన్నిధానం వద్ద ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం రాత్రి నెయ్యాభిషేకం టిక్కెట్ కౌంటర్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి దూకి భక్తుడు మృతి చెందాడు. అతడ్ని కర్ణాటకకు చెందిన కుమార స్వామి (40)గా గుర్తిం చారు. ఫ్లైఓవర్పై నుంచి దూకడంతో కుమార స్వామి కి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో అతడికి సన్నిధానం వద్ద ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొట్టయాం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గంమధ్యలో కుమారస్వామి మృతిచెంది నట్టు అధికారులు తెలిపారు.
తీవ్రగాయాలు కావడంతో గుండెపోటుకు గురైనట్టు చెప్పారు. అయితే, కుమారస్వామి మానసిక సమస్యతో బ
తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు
Dec 12, 2024,
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుక్కోటై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూర్, రాణిపేట్, తిరువళ్లూరులోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్లో పాల దందా..
1 లీటర్ కెమికల్తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ
20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్న వ్యాపారి అజయ్ అగర్వాల్
కెమికల్స్తో స్వయంగా పాలను తయారు చేసిన అధికారులు
ఇన్ని రోజులు ఆ పాలు తాగిన వారి పరిస్థితి?
మోహన్ బాబు దాడి సమయంలో గేటు వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్లో ఇరుక్కుపోయిన ఎన్టీవీ రిపోర్టర్ కాలు
*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి....*
*కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు మీడియా తో మాట్లాడుతూ ....*
బంజారాహిల్స్ పోలీస్ లు కౌశిక్ రెడ్డి నీ కోర్టు సమయం ముగియడంతో కొత్తపేట లోని న్యాయమూర్తి నివాసం లో ప్రవేశపెట్టిన పోలీసులు....
కౌశిక్ రెడ్డి నీ అరెస్ట్ చేసిన విది విధానాలు తప్పుగా ఉన్నాయని న్యాయమూర్తి ముందు తమ వాదనలు వినిపించిన కౌశిక్ రెడ్డి తరుపు న్యాయవాదులు ....
అరెస్ట్ చేసిన ప్రొసీజర్ సరిగ్గా లేదని ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది....
రేపు 5 వేల రూపాయల చొప్పున రెండు షురిటీలు కోర్టులో సమర్పించాలని ఆదేశాలు....
ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి....
పోలీస్ కేసులకు సంబంధించిన వాటికలో ఇన్వాల్వ్ కావొదన్న న్యాయమూర్తి....
ఇటువంటి కేసులు మళ్లీ రిపీట్
తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ముందు SFI నేతల ధర్నా
నిన్న తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్
*తల్లి కొడుకు ఆత్మహత్యాయత్నం.. కొడుకు మృతి (వీడియో)*
సూర్యాపేట జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం లకారం గ్రామానికి చెందిన మమత అనే మహిళ, తన కొడుకు అయాన్తో కలిసి బుధవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో మమత క్షేమంగా ఉండగా కొడుకు మాత్రం మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.