VSB Bhakthi

VSB Bhakthi VSB Bhakthi Online News...

04/12/2024
25/11/2024
22/11/2024
21/11/2024
19/11/2024
18/11/2024

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి సలహాలు
🙏🙏🙏🙏🙏
1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది '
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '
꧁గోవింద꧂ 9676434666
🚩2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

🚩3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

🚩4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

🚩5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

🚩6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

🚩7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

🚩8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

🚩9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

🚩10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

🚩11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

🚩12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసారు .

🚩13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

🚩14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

🚩15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

🚩16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

🚩17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

🚩18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

🚩19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి

🚩20 . ఆడి అన్నామలై కి దగ్గరలో ' అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగు వారి ఆశ్రమం '
అన్నపూర్ణ దేవి ఆశ్రమం ఉంది . ఇక్కడ పెట్టి భోజనం ఒక్కసారైనా కచ్చితంగా తిని తీరవలసిందే '
అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది . మన తెలుగు వారిది కదా ఆదరణ ఎక్కువ !
ఓం అరుణాచలేశ్వరాయ నమః
🙏🙏🙏

శివయ్య కోరికల ఖజానాలు ఖాళీకావు బంధాల జాతరలు ఆగిపోవు ...కన్నీటి సముద్రాలు ఎండిపోవు మాయా తెరలు తొలగిపోవు ...మరి నిన్నెలా చ...
16/11/2024

శివయ్య

కోరికల
ఖజానాలు ఖాళీకావు
బంధాల
జాతరలు ఆగిపోవు ...

కన్నీటి
సముద్రాలు ఎండిపోవు
మాయా
తెరలు తొలగిపోవు ...

మరి
నిన్నెలా చేరేది తండ్రీ ....

శివోహం శివోహం

చాగంటి కోటేశ్వర రావు గారి గురించి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పే...
16/11/2024

చాగంటి కోటేశ్వర రావు గారి గురించి
చాలామందికి తెలియని కొన్ని సంగతులు -

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు
ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు
కలిగిన ప్రవచనకారుడు
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.
గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట
మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు
అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు.
ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో ,
కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.
సునాయాసంగా బయటపడ్డారు.

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు.
ఆయన భార్య వ్యవసాయశాఖలో
ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి.
అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. ....
కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.
అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.

చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.
కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే
ఆయన తన సొంత డబ్బుతో
స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని
ప్రయాణం చేస్తారు తప్ప
నిర్వాహకులనుంచి
డబ్బు తీసుకోరు.
ఆయనకున్నది కేవలం
రెండు పడకగదుల చిన్న ఇల్లు.
ఇంతవరకు ఆయనకు కారు లేదు.
ఆఫీసుకు కూడా
మోటార్ సైకిల్ మీద వెళ్తారు.
ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు.
చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే
ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి
చాగంటి వారికి నమస్కారం చేస్తారు.
సెలవులను ఉపయోగించుకోమని,
కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని
చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను
ఎన్నడూ వినియోగించుకోలేదు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో
జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క,
ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.
తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు.
నిరుపేద కుటుంబం.
సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు
అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు.
పాఠశాల స్థాయినుంచి ఆయన
విద్యాబుద్ధులు వికసించాయి.
వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు.
అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి.
ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప
ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన
వాటిని చదవలేదని కాదు.
ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే
అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది.
ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో
వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.
తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు
బాలన్స్ లేదంటే నమ్ముతారా?

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.
ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి.
అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.
ఒకచోట చాగంటి వారిని కలిశారు.
"మీ గురించి ఎంతో విన్నాను.
మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం.
మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి.
ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం.
ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను.
ఏమైనా అడగండి. చేసిపెడతాను"
అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి
"మీకూ, నాకు ఇవ్వాల్సింది
ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు.
మీ సహృదయానికి కృతజ్ఞతలు.
నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం
రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!

చాగంటివారిని చూసి ఆయన
ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని,
లక్షలు సంపాదించి ఉంటారని
చాలామంది భావిస్తుంటారు.
ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం
ఎవరో ఒక్కరికే వస్తున్నది.
ఈ తరంలో ఆ శారదాకృప
నలుగురు పిల్లలలో
చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది.
ఆ మాత దయను తృణీకరించలేక
తనకు తెలిసిన జ్ఞానాన్ని
లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.
🙏🙏🙏
Source : 123 Swatch Politics

21/09/2024

Address


Telephone

+919502209222

Website

Alerts

Be the first to know and let us send you an email when VSB Bhakthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSB Bhakthi:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share