BRS Sainikulam

BRS Sainikulam ఊపిరి ఉన్నంతవరకు కట్టె కాలే వరకు టిఆర్ఎస్ జండా మోసే సైనికుని కేటీఆర్ గారి సేవకుడిని

26/12/2024

అల్లు అర్జున్ గారి విషయంలో అలాగే సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏకతాటిపై వచ్చి చర్చించి ఇట్టి సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషకరం అలాగే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి

మిత్రులారా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయగలరు

జై తెలంగాణ

26/12/2024

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పేరు మార్చబోతున్నారా ??మార్పు తీసుకొస్తామన్నారు ఇంత మార్పు తీసుకొస్తారని ఊహించలేదు 60 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ పేరు మార్చడం అంటే చాలా తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు

బజారున మన పరువుతెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వా...
26/12/2024

బజారున మన పరువు

తెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైగా అదే నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. తమ విధ్వంసపు ఆలోచనలతో తెలంగాణను ఒక ఫెయిల్యూర్‌ రాష్ట్రంగా చిత్రీకరించేందుకు పాకులాడుతున్నారు. వారి కోరికలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తుండటం ఆందోళనకరం.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధే ఏకైక ఎజెండాగా పనిచేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. తెలంగాణ వస్తే తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనని భయపడ్డ ఆంధ్రా ప్రజల అపోహలను తొలగించింది. ప్రత్యర్థులు చేసిన విష ప్రచారాలను పటాపంచలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ సాగిన కేసీఆర్‌ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అందుకేనేమో దేశ నలుమూలల నుంచి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. ఆ శ్రమ ఫలితంగానే 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేండ్ల తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 99 సీట్లు సాధించింది. ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ తెలంగాణను దేశంలో అభివృద్ధికి దిక్సూచిగా కేసీఆర్‌ నిలబెట్టారు.

తెలంగాణపై శీతకన్ను చూపే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌ సాక్షిగా పలుసార్లు తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని పొగిడింది. ఇట్లా విజయవంతంగా దూసుకువెళ్తున్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తం అతలాకుతలం చేసింది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డికి పాలనా పగ్గాలను కాంగ్రెస్‌ అప్పగించడంతో ఆయన తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి.

ప్రగతిభవన్‌ ముందున్న సెక్యూరిటీ కంచె తొలగింపుతో ప్రారంభమైన తెలంగాణ విధ్వం సం హైడ్రా పేరిట పేదలు రోడ్డుమీద పడుతున్నా విధ్వంసం ఆగడం లేదు. రైతులకు పంట సహా యం ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పంట కొనుగోళ్లు ఆల స్యం చేసి వారిని అరిగోస పెట్టింది. అసంఘటితరంగ కార్మికుల పొట్టకొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పింది. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలతో విద్యార్థులు మరణిస్తున్నారు. కక్షపూరిత రాజకీయ హత్యలు, దాడులు, సోషల్‌ మీడియా కేసులతో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు భయాందోళనలో బతుకుతున్నది.

తెలంగాణ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరాచికాలాడుతున్నది. ప్రభుత్వ లోగో నుంచి చార్మినార్‌, కాకతీయుల తోరణాన్ని తీసేయబోయి బొక్కాబోర్లా పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తెలంగాణ తల్లిని మార్చింది. ఆ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసింది. ప్రభుత్వ వేదికలపై బతుకమ్మ పాటలు, జానపద గేయాలు మాయమై అశ్లీల పాటలు మార్మోగుతున్నాయి. ఇదంతా చాలదన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండ్లు తాజాగా సినీ పరిశ్రమపై పడ్డాయి. ఇరువై రోజుల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. సమస్యలన్నీ పరదా చాటుకుపోయి ఒక్క అంశమే సాగుతున్నది. కోర్టులో తేలాల్సిన ఈ న్యాయపరమైన అంశాన్ని రాజకీయం చేస్తూ రోజుకో కృత్రిమ వివాదంతో తెలంగాణను బద్నాం చేస్తున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ‘తెలంగాణకు ఏమైంది, ఎం దుకీ పిచ్చి వైఖరి’ అని దుర్భాషలాడుతున్నారు.

ఇదంతా గమనిస్తుంటే.. సమైక్య రాష్ట్రంలోని తెలంగాణ వ్యతిరేక ఆంధ్రా నాయకుల స్వప్నం ఫలించేటట్టుగానే కన్పిస్తున్నది. పేరుకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా, చంద్రబాబు శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ నాశనానికి కంకణం కట్టుకొని మరీ కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నది.

రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సుమారు పదేండ్ల కాలంలో ఒక్కో రంగాన్ని ఎలా బలోపేతం చేసుకుంటూ వచ్చామో అదంతా, ఒక్క ఏడాదిలోనే గం గలో కలిసింది. అసత్యాలు, దుష్ప్రచారాలు నమ్మిన ప్రజలకు వారేం కోల్పోయారో నెమ్మదిగా అర్థమవుతున్నది. కానీ, ఏం లాభం? అభివృద్ధి పథం లో ముందుకుపోవాల్సిన రాష్ట్రం మరో నాలుగేండ్ల లో ఈ విధ్వంసకారుల చేతుల్లో ఎంత నలిగిపోతుందోననే భయం వెంటాడుతూనే ఉన్నది.

– పాశం రఘునందన్‌ రెడ్డి

Thank you Team Namaste Telangana

24/12/2024

సినీ పరిశ్రమకు పదేండ్ల పాలనలో లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది?

ఇది ప్రభుత్వం విఫలం కాదా?

సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం తప్పకుండా బాధ్యులను శిక్షించాల్సిందే …కానీ సీఎం గారు..1హైడ్రా వల్ల రోడ్డున పడ్డ సామాన్యుల ...
24/12/2024

సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం తప్పకుండా బాధ్యులను శిక్షించాల్సిందే …
కానీ సీఎం గారు..

1హైడ్రా వల్ల రోడ్డున పడ్డ సామాన్యుల పరిస్థితి?

2గురుకులాల్లో చనిపోయిన బిడ్డల పరిస్థితి ?

3 లగిచర్ల గిరిజన బిడ్డల అక్రమ అరెస్ట్ ??

వీటన్నిటికి ఎవరిని బాధ్యులను చేద్దాం ?..


#ఇందిరమ్మరాజ్యాం
#గుంపుమేస్త్రి

తెలంగాణా ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణా వ్యతిరేకుల స్వప్నం అదే నిజమని జనాన్ని బ్రమింపజేసేలా దరిద్రపు ఆలోచనలతో తెలంగ...
24/12/2024

తెలంగాణా ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణా వ్యతిరేకుల స్వప్నం

అదే నిజమని జనాన్ని బ్రమింపజేసేలా దరిద్రపు ఆలోచనలతో తెలంగాణను ఫేల్యూర్ స్టేట్ అని చెప్పేలా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నై

2014 లో తెలంగాణా ఏర్పాటు, తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా పనిచేసిన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ సెటిలైన వారిలోనే కాకుండా, తెలంగాణా వస్తే మన వ్యాపారాలు దెబ్బతింటాయి ఏమో అనే అపోహలున్న తెలంగాణా చిన్న పెద్ద వ్యాపార వెత్తల్లో కూడా ఒక రకమైన బయం ఉండేది.

ఉద్యమకాలం లో ఉద్యమం కోసం, తెలంగాణా సాధన కోసం మాట్లాడిన మాటలు దాన్ని వక్రీకరించి చేసిన అతి ప్రచారాలు ఈ బయాలకు కారణం, ఉదాహరణకు భూమూలు లాక్కుంటారు, ఇక్కడినుండి వెలగొడతారు, బిజినెస్సుల్లో వాటలడుగుతారు, స్టుడియోలు పడగొడతారు అని ప్రత్యర్థులు చేసిన విషప్రచారాలు చాలామందిలో భయాన్ని నెలకొల్పాయి.

ఆ బయం పోగొట్టేందుకు, ఎలక్షన్ ఎజెండా ప్రకటించేందుకు ముందే కెసిఆర్ TRS ని ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి తెలంగాణా పునర్నిర్మాణమే మా ఎజెండా అని ఎన్నికలకు వెళ్ళాడు.

కానీ ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలు, ప్రత్యర్థులు ఉద్యమ నేపథ్యం పై టిఆర్ఎస్ నాయకత్వం పై చేసిన దుష్ప్రచారం ప్రజల్ని మరింత భయపెట్టి GHMC పరిధిలో TDP+BJP (TDP-10, 5 BJP - 5) అత్యదిక సీట్లు గెలిచేలా చేసింది. TRS గెలిచింది కేవలం 4 సీట్లే మేడ్చల్ , మల్కాజిగిరి, సికింద్రాబాద్ & పటాన్చెరు మాత్రమే.

అంతకు ముందు ఉద్యమం చూసిన ప్రజల్లో బయం, పరిశ్రమల అధినేతల అపోహలు, మీడియా హౌజ్ల విషప్రచారాలు పటాపంచలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ సాగిన కెసిఆర్ పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది మీ రాష్ట్రం, ఇక్కడ మీరు మేం, అందరం సమానమే, అందరం రాష్ట్రాభివృద్దికి చోదకులం అనే భరోసాతో కూడిన బాధ్యతను కల్పించడంలో కెసిఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు. అదే కాకుండా బయటనుండి పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టొచ్చు వీల్లకు లాంగ్ విజన్ డెవలప్మెంట్ ఎజెండాస్ ఉన్నాయని ప్రూవ్ చేశారు.

ఇంత శ్రమ ఫలితమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఏండ్లలో GHMC లో 99 సీట్లు సాధించడం.

తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై ఉమ్మడి రాజధాని కత్తి వేలాడుతున్నా, సెక్షన్ 8 అని ప్రతిపక్షాలు కాలు దువ్వుతున్నా, కేంద్ర ప్రభుత్వం వయా గవర్నర్ రాజకీయ ఆటలాడినా స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ, లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా నడుపుతూ ప్రజల విశ్వాసాన్ని గడిస్తూ ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ తెలంగాణాను దేశంలో అభివృద్ధికి దిక్సూచిగా మార్చింది కేసిఆర్ ప్రభుత్వం.

తెలంగాణా పై శీతకన్ను చూపే కేంద్ర ప్రభుత్వమే పలుసార్లు పార్లమెంట్ వేదికగా తెలంగాణా అభివృద్ధిని పొగిడాల్సిన అవసరం కలిపించింది అభివృద్ది డేటా, అత్యదిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మరో గీటురాయి.

ఇట్లా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న రాష్ట్రాన్ని,
హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటూ దేశం మొత్తం పొగుడుతున్న రాష్ట్రాన్ని , బిజెపి కుయుక్తులతో కాంగ్రెస్ కుమ్మక్కుతో, అసత్య దుర్మార్గ ప్రచారాల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణాను ఒక విఫలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానం రోజు రోజుకు బలపడుతోంది.

ప్రభుత్వం ఏర్పడిన రోజు మైదలైన విద్వంసం ఇంకా సాగుతూనే ఉంది

సియం అధికారిక నివాసం అయిన ప్రగతీభవన్ ముందున్న సెక్యురిటీ కంచెను తొలిగిస్తూ చేసిన ప్రచారంతో మొదలైంది విద్వంసం, నిజానికి అది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసింది సియం సెక్యురిటీ కోసం, ఇవ్వాళ ఆ ఇంట్లో రేవంత్ రెడ్డి ఉండట్లేడెందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసం ఉన్న చోట 2 కిలొమీటర్ల పరిథిలో విపరీత ఆంక్షలు ఉన్నాయని కంచెలు బారీకేడ్లు ఉన్నాయని సిగ్నల్ టీవీ శివారెడ్డి వీడియోలతో సహా చెప్తున్నాడు.

ఒక సెక్యురిటీ కంచెను తొలగిస్తూ చేసిన ప్రజల సొమ్ము నాశనం చేస్తూ మొదలైన విద్వంస పాలన

హైడ్రా పేరిట పేదలను భయభ్రాంతులను చేస్తూ ఇండ్లు కూలగొడుతూ 2 ఆత్మహత్యలకు దారి తీసింది.

మూసీ పేరీట అన్ని అనుమతులున్నవారిని కబ్జాదారులు గా ఏడిపించింది.

రైతులకు పంటసహాయం ఎగ్గొట్టి, పంటకొనుగోల్లు ఆలస్యం చేసి రైతులగోసపుచ్చుకుని

అసంఘటిత రంగ కార్మికుల పొట్ట కొడుతూ ముందుచూపు లేకుండా ఉపాధిపై నీలి నీడలు కుమ్మి ఆత్మహత్యలవైపు పురికొల్పింది. అందులో ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, రైతులు ఉన్నారు.

గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో, విధ్యార్ధుల మరణాలతో , తల్లిదండ్రుల బయాందోళనతో గురుకుల పాఠశాలు నిర్వీర్యం దిశగా సాగుతోంది కాంగ్రెస్ పాలన

రాజకీయ హత్యలతో (శ్రీధర్ రెడ్డి ,గురువా రెడ్డి,సాయిరెడ్డి ), కక్షపూరిత రాజకీయ దాడులతో , సోషల్ మిడియా కేసులతో పూర్తిగా భయాందోళన రాజకీయ వాతావరణం కలుషితం చేసేలా సాగుతోంది కాంగ్రెస పాలన

ఆరు గ్యారెంటీలు అటకెక్కించి, రాష్ట్ర అప్పుల పై దుష్ప్రచారం చేస్తూ, రాష్ట్రాన్ని ఒక దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే భాగూండే అనేలా దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంపై బురద జల్లే లా సాగుతుంది కాంగ్రెస్ పాలన

ఉద్యమ ప్రతీకలను అవమానిస్తు, తెలంగాణా సంస్కృతిని కించపరుస్తూ బతుకమ్మను తీసేసి , అశ్లీల పాటలకు ప్రభుత్వ వేదికలిచ్చి, తెలంగాణ అస్థిత్వాలను అసహజంగా మార్చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుపై దాడి చేస్తూ తెలంగాణాను అవమానించేలా సాగుతుంది కాంగ్రెస్ పాలన

తెలంగాణా నీటి వనరులపై హక్కులను కేంద్రానికప్పగిస్తూ, గోదావరిలో , కృష్ణాలో ప్రాజెక్టులపై కుట్ర కోణంతో అనుమతులు రద్దైయ్యేలా నివేదికలిస్తూ తమాషా చూస్తూ తెలంగాణా గొంతెండబెట్టేలా సాగుతుంది కాంగ్రెస్ పాలన

తాజాగా సినీ ఇండస్ట్రీ పై కోర్టులో తేవాల్సిన , న్యాయపరమైన అంశాన్ని రాజకీయం చేస్తూ రోజు కొక కృత్రిమ వివాదంతో జాతియస్థాయిలో తెలంగాణాకూ ఏమైంది ఎందుకీ పిచ్చి వైఖరి అనేలా సాగూతుంది కాంగ్రెస్ పాలన

చూస్తుంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణా వ్యతిరేక ఆంద్రా నాయకులు,జాతియ నాయకుల మాటల నిజం చేయాలన్న దృడసంకల్పంతో కాంగ్రెస్ పార్టీ & చంద్రబాబు శిష్యుడు తెలంగాణా నాశనానికి విపరీతంగా కష్టనడుతున్నట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ పాలన

గత పదేళ్ళుగా ఒక్కోరంగాన్ని ఎలా బలోపేతం చేసుకున్నమమో గత సంవత్సరకాలంగా ఒక్కో రంగాన్ని అలా విద్వంసం చేస్తూ సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన

అసత్యాలు, దుష్ప్రచారాలు నమ్మిన ప్రజలేంకోల్పోతున్నారో ఒక్కొక్క వర్గానికి అర్థమైతుంది, వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారో ఏమో కానీ ఈలోపు అభివృద్ది పథంలో ముందుకు పోవాల్సిన రాష్ట్రం ఈ విద్వంసకారుల చేతుల్లో ఏమైపోతదో?

23/12/2024

తెలంగాణాకు ఉపయోగపడే ఏ చిన్న విషయాన్నైనా పెద్దమనసుతో ఆలోచించిన ప్రభుత్వం కెసిఆర్ ది

ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్

మన భాషను, మన యాసను వాడక పోతే కనెక్ట్ కాలేమనే పరిస్థితులు వచ్చినయ్

మన జానపదాలు మేజర్ సినిమాల్లో ఎక్కుతున్నై

మన నేపథ్యమే సెంట్రిక్ గా సినిమాలు వస్తున్నై

నగరానికి , రాష్ట్రానికి ఆదాయాన్ని కాంట్రిబ్యూట్ చేసే ఏ రంగం తక్కువ కాదు.

అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేసింది రేవంత్ రెడ్డి అనుచరులేనా..?
23/12/2024

అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేసింది రేవంత్ రెడ్డి అనుచరులేనా..?



23/12/2024

ప్రస్తుతానికి మన ‌తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే తీన్మార్ మల్లన్న గారు ఇద్దరు కలిసి తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రకు తరలించేదాకా వదిలేటట్లు లేరు అని చర్చించుకుంటున్నారట మీరేమంటారు మిత్రులారా???

23/12/2024

అల్లు అర్జున్ ఇంటి పై దాడి కేసులో ఆరుగురి నిందితులకు బెయిల్ మంజూరు చేసిన జడ్జి..

ఒక సినిమా రిలీజ్ కి ముందు బెనిఫిట్ షో కోసం   టికెట్ కి 3000/- పెట్టి కొని మొత్తం 12000/- ఖర్చు పెట్టి అత్యంత రద్దీ లో   ...
23/12/2024

ఒక సినిమా రిలీజ్ కి ముందు బెనిఫిట్ షో కోసం

టికెట్ కి 3000/- పెట్టి కొని మొత్తం 12000/- ఖర్చు పెట్టి

అత్యంత రద్దీ లో

భార్య
9 ఏండ్ల బాబు
బాబుకన్నా చిన్న పాప
వీల్లతో ఈ బాధ్యతాయుతమైన మనిషి సినిమా కోసం వెల్లాడట

నెలకు 30 వేలు సంపాదించే సాధారణ మధ్యతరగతి కుటుంబమట వీల్లది.

గవర్నమెంట్ ఫిక్స్ చేసిన బెనిఫిట్ షో రేట్ 1500 కి మించి లేదు

అయినా టికెట్ కి 3000 పెట్టి కొన్నడాంటే బ్లాక్ లో బాద్యతాయుతంగా కొన్నాడా?

అభం శుభం తెలియని పిల్లలను అంత రద్దీలోకి చాలా బాధ్యతాయుతంగా తీసుకెల్లిన పెద్దాయన

ఇంతటి బాధ్యతాయుతమైన వ్యక్తి చేసిన పని వల్ల జరిగిన విషాదం కోసం

అంతకు మించిన బాధ్యతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చిస్తే

అంతకు మించిన బాధ్యతతో వీలైనంత ఎక్కువ సింపతీ కన్నీళ్ళు కారుస్తున్న గొప్ప మేథావులందరికీ

హృదయపూర్వక బాధ్యత తో కూడిన అభినంధనలు

ఇట్లాగే బైక్ లతో స్టంట్లు చేస్తూ గాయపడిన అమాయకపు చక్రవర్తుల విషయంలో కూడా ఇట్లాంటి బాధ్యతనే చూపిస్తూ

బాధ్యతాయుతంగా ఉండాలని బాధ్యతతో కోరుకుంటున్నా

Copy From Pasham Raghunandan Reddy

22/12/2024

Paapam ra 🤣🤣😂😂😭

22/12/2024

ఒక ఆక్సిడెంటల్ గా జరిగిన సంఘటనను పట్టుకొని, బన్నీని కార్నర్ చేసి చాలా టీడీపీ సపోర్టర్స్ అండ్ జనసేన సపోర్టర్స్ తిడుతున్నారు.

క్రింది వాటికి సమాధానం చెప్పండి.

గోదావరి పుష్కరాలలో 27 మంది చనిపోతే, మీలో ఎంత మంది మీ నాయకుడిని నిలదీసారో స్క్రీన్షాట్ పెట్టండి

కందుకూరులో 8 మంది చనిపోతే మీలో ఎంత మంది మీ నాయకుడిని నిలదీసారో స్క్రీన్షాట్ పెట్టండి.

వారాహి యాత్ర మొదలు సమయంలో, యాదగిరిగుట్ట నుండి వస్తున్నపుడు ఒక కుర్రాడు బైక్ మీ వాహనం కింద పడి చనిపోతే మీలో ఎంత మంది మీ నాయకుడిని నిలదీసారో స్క్రీన్షాట్ పెట్టండి.

మీ నాయకుడి ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు యువకులు చనిపోతే మీలో ఎంత మంది మీ నాయకుడిని నిలదీసారో స్క్రీన్షాట్ పెట్టండి.

ఆ పైన చనిపోయిన వాళ్ళ అందరికి ఫామిలీస్ లేవా? కానీ ఇక్కడ బన్నీ మేటర్ తెలిసాక బాధతో ఆ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేస్తా అన్నాడు.

మీ నాయకులు ఆ పైన విషయాల్లో ఎంత సాయం చేసారో చెప్పండి.

22/12/2024
22/12/2024

ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి పై జరిగిన దాడికి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నదాన్ని మళ్లీ చర్చించి ప్రజలను రెచ్చగొట్టడం తప్పకుండా ‌ ముమ్మాటికి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టడం

అంతే కదా అంతే కదా????
22/12/2024

అంతే కదా అంతే కదా????

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న....?రేవతి గారు చనిపోవడం చాలా బాధాకరం దీనికి విచారిస్తున్నాము ...
22/12/2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న....?

రేవతి గారు చనిపోవడం చాలా బాధాకరం దీనికి విచారిస్తున్నాము ప్రభుత్వం పరంగా మీరు బాధ్యత తీసుకోవడం ఇది చాలా గర్వకారణం.

అలాగే కొండారెడ్డి పల్లెలో మాజీ సర్పంచ్ గారు సూసైడ్ నోట్ రాసి చనిపోయారు మరి ఎవరి పైన చర్యలు తీసుకున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలకి చెప్పాలి????

గురుకుల పాఠశాలలో ఎంతో మందికి పాముకాటు బలయ్యారు ఎంతో మంది చనిపోయారు ప్రభుత్వంలో ఎవరిని అరెస్టు చేయాలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అలాగే విద్యాశాఖ మంత్రి గారిని అరెస్ట్ చేయాలా లేదా అనేది ప్రజలు చెప్పాలి????

22/12/2024

ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆదాయం పెరిగింది ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు..

Address

Rajanna Siricilla
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when BRS Sainikulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BRS Sainikulam:

Share