SUHAN News

SUHAN News News updates

*తండ్రి గ్యాస్ డెలివరీ బాయ్,అన్న స్వీపర్.. రింకూ సింగ్ జీవితంలో కష్టాలెన్నో!* ఐపీఎల్ తో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులో...
10/04/2023

*తండ్రి గ్యాస్ డెలివరీ బాయ్,అన్న స్వీపర్.. రింకూ సింగ్ జీవితంలో కష్టాలెన్నో!*

ఐపీఎల్ తో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. వారిలో చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో మేటి ఆటగాళ్లు అయ్యారు. మెగా లీగ్ లో ఒక్కోసారి ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. ఒక్క మ్యాచ్ విజయంతో ఎన్నో ఏళ్ల వారి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. తాజాగా ఆ జాబితాలో చేరిన యువ ఆటగాడు రింకూ సింగ్. కోల్ కతా నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన రింకూ నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టారు. ఆశలే లేని స్థితిలో కేకేఆర్ ను గెలిపించి హీరో అయిపోయాడు. కొన్నేళ్ల నుంచి కేకేఆర్ కు ఆడుతూ అడపాదడపా రాణిస్తున్నా నిన్నటి మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ అతడిని స్టార్ ను చేసింది. రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే, 25 ఏళ్ల రింకూ ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డాడు. అతను యూపీలోని అలీగఢ్ లో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి. తన పెద్ద కొడుకు సహాయంతో సైకిల్‌పై సిలిండర్లను ఇంటింటికీ వెళ్లి వాటిని డెలివరీ చేసేవాడు. భార్య వినాతో కలిసి ఖాంచంద్ ఇప్పటికీ ఓ గ్యాస్ సిలిండర్ స్టాక్‌యార్డ్‌కు సమీపంలో ఉన్న రెండు గదుల ఇంట్లోనే నివసిస్తున్నాడు. రింకూ అన్న ఇళ్లలో స్వీపర్ గా పని చేశాడు.

ఒక దశలో బతుకుదెరువు కోసం రింకూను కూడా అన్నతో కలిసి ఇళ్లు ఊడ్చే పనిలో (స్వీపర్) చేరమని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ, చిన్నప్పటి నుంచి క్రికెట పై ఆసక్తి పెంచుకున్న రింకూ.. ఆటతోనే పేదరికాన్ని జయించాలని అనుకున్నాడు. ఆటనే ప్రాణంగా భావించిన అతను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ లో చోటు సంపాదించాడు. 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 80 లక్షలతో కొనుగోలు చేయడంతో అతని రాత మారింది. దాంతో, అతని కుటుంబం కష్టాలు కూడా తీరిపోయాయి.

‘చిన్నప్పుడు నన్ను కూడా మా అన్నతో కలిసి ఓ కోచింగ్ సెంటర్ లో స్వీపర్ గా చేరాలని ఆఫర్ వచ్చింది. క్రికెటర్ కావాలనుకున్న నాకు ఆ పని ఇష్టం లేదు. నేను క్రికెట్ ఆడతానని అందరికీ చెప్పాను. అప్పటికి ఆటలో నాకు పేరేమీ రాలేదు. కానీ, ఏదో రోజు నాకు మంచి అవకాశం లభిస్తుందని, క్రికెట్టే మా జీవితాలను మారుస్తుందని నేను విశ్వసించా. నాకు వేరే మార్గం కూడా లేదు కాబట్టి క్రికెట్‌పై దృష్టి పెట్టాను. చాలా కష్టపడ్డాను. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలించాయి’ అని రింకూ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు.

రేపు వాటికన్ రాయబారి ఏలూరు రాకఏలూరు,వాటికన్ రాయబారి లియోఫోర్డ్ గేరెల్లి ఈనెల 23వ సెయింట్ జోసెఫ్ దంత కళాశాలకు విచ్చేయునున...
21/03/2023

రేపు వాటికన్ రాయబారి ఏలూరు రాక
ఏలూరు,
వాటికన్ రాయబారి లియోఫోర్డ్ గేరెల్లి ఈనెల 23వ సెయింట్ జోసెఫ్ దంత కళాశాలకు విచ్చేయు
నున్నట్లు కళాశాల కరస్పాండెంట్ , సెక్రటరీ ఫాదర్ జి మోజెస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈయన ఇటలీ దేశంలో జన్మించి, అపోస్తులిక్ నోన్ షో భారత దేశానికి నేపాల్ దేశానికి ఈయన ప్రతినిధిగా వ్యవహరిస్టున్నారు.ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు దంత కళాశాలకు విచ్చేయనున్నట్లు ఫాదర్ మోజెస్ తెలిపారు.

Educated PM : దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలుభోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)...
15/03/2023

Educated PM : దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు..

దేశానికి చదువుకున్న ప్రధాని కావాలని అన్నారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల అరెస్టును ప్రస్తావిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు. సిసోడియాను జైలుకు పంపిన రోజే విద్య ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తాను భావించినట్టు చెప్పారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు..

కాంగ్రెస్, బీజేపీకి మధ్యప్రదేశ్ ప్రజలు చాలాసార్లు అవకాశాలిచ్చారని, 30 నుంచి 45 ఏళ్ల ఆ పార్టీల ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏలాయని, ఇప్పుడు ఆప్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ, పంజాబ్‌లో అమలు చేస్తున్న విధంగానే ఇక్కడి ప్రజలకు కూడా ఉచిత విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.

*చనిపోయిన కుమారుడి కోసం రూ.10 కోట్లతో మ్యూజియం..* బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకుకు గుర్తుగా స్మారకాన్ని నిర...
14/03/2023

*చనిపోయిన కుమారుడి కోసం రూ.10 కోట్లతో మ్యూజియం..*

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకుకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించారు ఆయన తల్లి. కారు రైడర్​గా ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్​కు గుర్తుగా.. ఈ స్మారకం ఏర్పాటు చేయించారు. కర్ణాటక బెంగళూరు మహదేవపుర ప్రాంతంలో ఈ స్మారక మ్యూజియం ఉంది. 2015లో హాబీగా బైక్ రైడింగ్ ప్రారంభించిన ఆయన.. ఏకంగా 50కి పైగా దేశాలను ఆయన సందర్శించారు. 2021లో జరిగిన బెంగళూరు నుంచి కశ్మీర్​కు బైక్​పై వెళ్తుండగా.. మధ్యలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్​ జైసల్మీర్​లోని ఫతేగఢ్​కు చేరుకున్న సమయంలో ఓ ఒంటె ఆయన బైక్​కు అడ్డంగా వచ్చింది. దాన్ని ఢీకొట్టగానే ఎగిరిపడ్డ ఆయన.. తలకు తీవ్ర గాయం కావడం వల్ల కన్నుమూశారు.రిచర్డ్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడికి స్మారక మ్యూజియాన్ని నిర్మించాలని ఆయన తల్లి భావించింది. మహదేవపురలోని యరప్పనహళ్లి సమీపంలో ఈజిప్ట్ శైలిలో, థాయిలాండ్​ 3డీ పిచర్ టెక్నాలజీతో ఈ స్మారకం నిర్మించారు. ఇందులో ఆయన రెండు విగ్రహాలను నెలకొల్పారు. రిచర్డ్ వివిధ దేశాల్లో సందర్శించినప్పటి ఫొటోలు, ఆయన సాధించిన ఘనతలకు సంబంధించిన వివరాలను ప్రదర్శనకు ఉంచారు. రిచర్డ్ వాడిన బైక్​లు, వివిధ దేశాల కరెన్సీ, కాయిన్లు, అద్భుతమైన పెయింటింగ్​లు స్మారకంలో ఉంచారు. ఆయన ఘనతలకు సంబంధించిన వీడియోల ప్రదర్శనకు ఓ హోమ్ థియేటర్ ఏర్పాటు చేశారు. వీటన్నింటికి రూ.10 కోట్ల వ్యయం అయింది.వారంలో ఏడు రోజులు తెరిచే ఉండే ఈ మ్యూజియాన్ని చూసేందుకు ఎంతో మంది బైక్ రైడర్లు వస్తున్నారు. అక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ మ్యూజియం టూరిస్ట్ స్పాట్​గా మారిపోయింది. పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మార్చి 7న కింగ్ రిచర్డ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమాల నుంచి పిల్లలను ఆహ్వానించి క్రీడా పోటీలు పెడుతున్నారు. గెలిచిన వారికి బహుమతులు అందిస్తున్నారు. అంతేకాకుండా రిచర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్​ను ఏర్పాటు చేసి.. పేదలకు సాయం చేస్తున్నారు.నా భర్త ఎన్నో స్మృతులను నా వద్ద వదిలి వెళ్లారు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. సామాజిక సేవ చేసేవారు. ఆయన లేనప్పటికీ.. ఆ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాం' అని రిచర్డ్ భార్య మోనిక పేర్కొన్నారు......

*_చరిత్రలో...భారతీయ చరిత్రలో.._**_ప్రపంచ సినిమా చరిత్రలో.._**_ఎప్పటికీ 'నాటు నాటు'ది ప్రత్యేక స్థానం_**_'నాటు నాటు'కు ఆస...
13/03/2023

*_చరిత్రలో...భారతీయ చరిత్రలో.._*

*_ప్రపంచ సినిమా చరిత్రలో.._*

*_ఎప్పటికీ 'నాటు నాటు'ది ప్రత్యేక స్థానం_*

*_'నాటు నాటు'కు ఆస్కార్_*

*_సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'_*

*_రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా కాలర్ ఎగరేసింది. ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు, భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు' చరిత్రకు ఎక్కింది._*

*_భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందా? తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు... సినిమాలోని 'నాటు నాటు...ఆస్కార్ అందుకుంది._*

*_'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే తొలి భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది. 'నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా... రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తనకు ఎంతగానో నచ్చిందని 'టైటానిక్', 'అవతార్' చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పారు. రెండుసార్లు సినిమా చూశానని ఆయన తెలిపారు. రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా పలువురు హాలీవుడ్ దర్శకులు, రచయితలు, నిర్మాతలు సినిమా గురించి గొప్పగా చెబుతూ ట్వీట్లు చేశారు. ఆస్కార్ కంటే ముందు 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చింది. ఆ సమయంలోనే ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. ఈ అవార్డు ద్వారా దేశానికి రాజమౌళి గొప్ప గౌరవం తెచ్చారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అన్ని అవార్డులు ఒక ఎత్తు అయితే... ఆస్కార్ అవార్డు మరో ఎత్తు. దీంతో యావత్ దేశం సంబరాల్లో మునిగింది._*

*భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా*చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకోనుంది ఎయిర్ ఇండియా. త్వరలోనే సంస్థ 500కొత్త వ...
12/12/2022

*భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా*

చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకోనుంది ఎయిర్ ఇండియా. త్వరలోనే సంస్థ 500కొత్త విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకూ ఎయిర్‌బస్, బోయింగ్ ఈ డీల్ విషయంలో స్పష్టమైన సమాచారం లభించలేదు. టాటా గ్రూప్ తరపున నుంచి కూడా ఏ విధమైన ప్రకటన లేదు. కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన ఏ350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి.

Ap Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం మాండోస్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం విడుదల..ఏపీ ప్రభుత్వం (Ap Government) కీలక ...
11/12/2022

Ap Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం మాండోస్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం విడుదల..

ఏపీ ప్రభుత్వం (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. మాండోస్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఊరటనిస్తూ ఆర్ధిక సాయం విడుదల చేసింది ప్రభుత్వం.ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఒక్క కుటుంబంలో గరిష్టంగా రూ.2000 అందజేయాలని ప్రభుత్వం (Ap Government) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని బాధితులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందించాలని సర్కార్ (Ap Government) నిర్ణయించింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో బాధితులకు కొంతమేర ఊరట లభించనుంది.

*ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు*👉సుప్రీంకోర్టు మార...
02/12/2022

*ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు*

👉సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నూతన జరిమానాలు

👉సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమానా

👉మాల్స్ పైనా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫైన్ విధించే అవకాశం

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించే వారే వ్యయాన్ని కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా సరికొత్త జరిమానాలను విధించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. అదే విధంగా రెండోసారి పట్టుబడిన వారికి ఏకంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలువ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. ఆయా సంస్థలు, మాల్స్... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే.. రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధిస్తారు.

Neuralink: 6 నెలల్లో మనిషి మెదడులో చిప్.. మస్క్ కీలక ప్రకటన!కాలిఫోర్నియా: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే సాం...
01/12/2022

Neuralink: 6 నెలల్లో మనిషి మెదడులో చిప్.. మస్క్ కీలక ప్రకటన!

కాలిఫోర్నియా: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్ (Neuralink) అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు.'బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌' (బీసీఐ) సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న న్యూరాలింక్‌ (Neuralink) ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తమ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివరాలను మస్క్‌ సహా ఆయన న్యూరాలింక్‌ (Neuralink) బృందం వివరించింది. మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన అనుమతుల కోసం అమెరికా 'ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)'కు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు.
మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లో కూడా చిప్‌లను అమర్చడంపైనా న్యూరాలింక్‌ (Neuralink) పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలో మరో రెండు బీసీఐలను కూడా మస్క్‌ తాజా సమావేశంలో పరిచయం చేశారు. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్‌ను రూపొందిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. అలాగే చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటిలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రయోగాల్లో భాగంగా మెదడులో చిప్‌ అమర్చిన ఓ వానరం ఎలా వ్యవహరిస్తుందో ఈ సమావేశంలో న్యూరాలింక్‌ ప్రదర్శించింది. ఎలాంటి పరికరం లేకుండా ఓ కోతి వీడియో గేమ్‌ ఆడుతున్నట్లు వీడియోలో చూపించారు. మెదడులో అమర్చిన చిప్‌ ద్వారా అది కంప్యూటర్‌కు ఆదేశాలు ఇవ్వగలుగుతోందని తెలిపారు.ఎలాన్‌ మస్క్‌కు కృత్రిమ మేధ (ఏఐ)పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తుందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్‌ ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొంటున్నారు.

01/12/2022

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) అంటే ఏమిటి ?

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే (Deep Vein Thrombosis లేదా DVT) వ్యాధి అంటే కాళ్లలో ఉన్న అంతర్నాళాల్లోని ఒక అంతర్నాళంలో రక్తం గడ్డ కట్టడం.

రక్తనాళంలో ఇలా రక్తపు గడ్డలేర్పడడంవల్ల ప్రమాదకరమైన ఈ DVT వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధి 60 సంవత్సరాలకు పైబడినవారికెవరికైనా రావచ్చు.

భారతదేశంలో ఈ వ్యాధి సంభవం రేటు 8% -20% ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి ?

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి ప్రధాన లక్షణం కాలి వాపు.

చాలా అరుదుగా, రెండు కాళ్ళలో వాపు కనిపిస్తుంది.

ఇతర లక్షణాలు:

కాలిలో నొప్పి

కాలు మీద చర్మం ఎరువు రంగుదేలుతుంది

కాలిలో వెచ్చదనం అనుభూతి

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే గడ్డకట్టిన రక్తపుగడ్డలు (blood clots) స్థానభ్రంశం చెందుతాయి,

అటుపై అవి రక్తప్రసరణతో బాటు ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరి అక్కడ అడ్డుగా తయారై

“పల్మోనరీ ఎంబోలిజం” అనే ప్రమాదకరమైన ఈ పరిస్థితిని కల్గిస్తాయి.

పల్మోనరీ ఎంబోలిజమ్ యొక్క లక్షణాలు:

ఆకస్మికంగా శ్వాసలో కష్టం ఏర్పడడం

ఘాడ శ్వాస మరియు దగ్గుతో ముడిపడి ఉన్న ఛాతీ నొప్పి

మైకము

వేగంగా కొట్టుకునే నాడి
(ఫాస్ట్ పల్స్)

దగ్గినప్పుడు రక్తం పడడం

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటి ?

నరాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకునేది ఏదైనా సరే DVT వ్యాధి లేదా అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

సిర (vein) కు గాయం

శస్త్ర చికిత్స (సర్జరీ)

క్యాన్సర్, హృదయ వ్యాధి లేదా తీవ్రమైన సంక్రమణం వంటి ప్రధాన జబ్బులు

కొన్ని మందులు

చాలా కాలంపాటు నిష్క్రియగా ఉండడం

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) అవకాశాల్ని పెంచే ప్రమాద కారకాలు:

వంశపారంపర్యంగా రక్తం గడ్డకట్టడం అనే రుగ్మత

గర్భం

గర్భనిరోధక మాత్రల వాడకం

ఊబకాయం

ధూమపానం

గుండె ఆగిపోవుట

ప్రేగు వాపు వ్యాధి (Inflammatory bowel disease)

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధిని నిర్ధారించేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి ?

రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క వైద్య చరిత్ర మరియు వ్యాధి సోకిన అంగం యొక్క శారీరక పరీక్షపై ఆధారపడుతుంది. రోగి ఔషధ చరిత్రను కూడా వైద్యులు పొందుతారు. ఇతర రోగనిర్ధారణ చర్యలు:

డి - డైమర్ పరీక్ష

అల్ట్రాసౌండ్

వేనోగ్రఫీ (Venography)

సిటి (CT) లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్లు

పల్మోనరీ ఆంజియోగ్రఫి

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) వ్యాధి యొక్క అంతర్లీన కారణాన్ని గుర్తించే పరీక్షలు:

రక్త పరీక్ష

ఛాతీ ఎక్స్-రే

ECG

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) చికిత్స లక్ష్యాలు నొప్పి మరియు వాపు నుండి రోగికి ఉపశమనం కల్గించడం. మందుల్లో ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే (ఎజెంట్లను) వాటికి ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి.

నివారణ చర్యలు:

మీరు మంచం పట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, సాధ్యమైనంత త్వరగా అటూ ఇటూ తిరగండి. ఇలా ఎంత ముందుగా మంచంపై నుండి లేచి తిరుగుతారో DVT వ్యాధి వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి.

ఎక్కువ కాలం పాటు కూర్చొని ఉండకుండా నరాలు గట్టిపడడాన్ని నిరోధించడానికి కాలు కండరాల వ్యాయామం చేయండి.

రక్తం గడ్డ కట్టడాన్ని (clotf ormation) నిరోధించడానికి కుదింపు మేజోళ్ళు (compression stockings) ఉపయోగించండి.

ప్రసరణకు అడ్డంకుల్ని నివారించడానికి, శరీరం కదిలేందుకు వీలుగా ఉండేందుకు గాను వదులుగా ఉండే బట్టలు ధరించండి.

చురుకైన జీవనశైలిని అలవర్చుకోండి.

రక్తాన్ని పలుచబరిచే మందుల్ని మీరు సేవిస్తున్నపుడు శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతోందా అని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి.....

మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ని బెంగుళూరు యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్ పట్టా తో సన్మానిద్దామనుకుంది . దానిని అత...
25/11/2022

మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ని బెంగుళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టా తో సన్మానిద్దామనుకుంది . దానిని అతడు గౌరవంగా త్రోసి పుచ్చుతూ తాను ఆటల మీద ఏదయినా ఒకనాడు పరిశోధనా వ్యాసాలతో (Doctorate Research ) పట్టా తీసుకుంటానని కానీ ఇలా ఇచ్చే డాక్టరేట్ పట్టా వద్దు అంటూ ఇలా చెప్పాడు - తన భార్య డాక్టర్ అని , ఆమె నిద్రాహారాలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించి ఆ డిగ్రీ సంపాదించుకుంది . తన తల్లి ఆర్ట్స్ ప్రొఫెసర్, దాదాపు 50 సంవత్సరాలు వయసులో దానికోసం శ్రమించిందని కూడా తెలిపాడు . తాను క్రికెట్ ఆటల్లో కష్టపడి శ్రమించానని, కానీ వారికిమల్లే చదువు గురించి శ్రమించలేదని తెలుపుతూ తానూ ఒకనాడు డాక్టోరేట్ పట్టాకోసం Sports సబ్జెక్టు మీద అకాడమిక్ రీసెర్చ్ వ్యాసాలతో శ్రమించి సంపాదించుకుంటానని , ఇలా ఉచితంగా ఇచ్చే గౌరవ పట్టా వద్దని వారికి కృతజ్ఞలతో తెలిపాడు .
ఎంత నిరాడంబరత !

సరిగ్గా 48 సంవత్సరాల క్రితం..ఈ రోజు.. ఈ బ్రిడ్జి ని23.11.1974 ఉదయం 11 గంటలకు ,అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫ్రక్రుద్దీన్ అలీ అ...
23/11/2022

సరిగ్గా 48 సంవత్సరాల క్రితం..
ఈ రోజు.. ఈ బ్రిడ్జి ని
23.11.1974 ఉదయం 11 గంటలకు ,అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు జాతికి అంకితం చేశారు

మన గోదారమ్మకు మణిహారం

కొవ్వూరు..రాజమండ్రి కి అపురూప బంధం
ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి
ఈ అపురూప రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి....

ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే..ముఖ్యం గా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారట..
ఇండియా లో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లలో ఇది మూడవది.. మొదటిది అస్సాం లో బ్రహ్మపుత్ర నది పైన, రెండవది సొన్ పూర్ బీహార్ లోనూ... మూడవది మన రాజమండ్రి..కొవ్వూరు మధ్య నిర్మించారు....1964 లో మూడవ పంచవర్ష ప్రణాళిక లో కొవ్వూరు - రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జి ని నిర్మించాలని తీర్మానించారు.

అప్పటికి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాక పోకలు లాంచీ ల పైనే జరిగేవి. రాజమండ్రి నుండి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం ., అది ఆమోదం పొందడం చక చకా సర్వే అనుమతులు జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టు కి పూర్తి అయింది.

రైల్ మార్గం 2.8 కి.మీ రోడ్ మార్గం 4.1 కి.మీ.
అప్పటి రాష్ట్ర పతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఈ బ్రిడ్జి ని ఓపెన్ చేశారు. అన్నట్టు అప్పట్లో టివి లు లేవు ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది.. ఉషశ్రీ గారు ప్రతీ క్షణాన్నీ చక్కగా వర్ణిస్తూ..అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు..
లాంచీల ప్రయాణం ఆగింది..
కొవ్వూరు..రాజమండ్రి షటిల్ బస్ లు వేశారు..
ఉభయగోదావరి జిల్లాలు ఒకటి అయ్యాయి..
అందుకే మన గోదారోళ్లకు ఈ బ్రిడ్జి అపురూపం !.....

*విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్*తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత...
23/11/2022

*విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్*

తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్: తన సతీమణి ఊహకు విడాకులు ఇస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని సినీనటుడు శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్సైట్లలో వచ్చిన ఫేక్ న్యూస్ చూసి ఊహ ఆందోళనకు గురైంది. ఆ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై సైబరైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన వదంతులు ప్రచారం చేస్తున్న వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

రాజీవ్‌ హత్యకేసు దోషుల విడుదల.. తనకు ఇది కొత్త జీవితమన్న నళినిచెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసు(Rajiv Ga...
13/11/2022

రాజీవ్‌ హత్యకేసు దోషుల విడుదల.. తనకు ఇది కొత్త జీవితమన్న నళిని

చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసు(Rajiv Gandhi Case)లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌(Nalini Sriharan) సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు(Supreme Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నళిని, ఆమె భర్త శ్రీహరన్‌ అలియాస్‌ మురుగన్, సంథన్‌, రాబర్ట్ పాయస్, జయకుమార్‌లు శనివారం సాయంత్రం తమిళనాడులోని ఆయా జైళ్ల నుంచి అధికారికంగా విడుదలయ్యారు. మరో వ్యక్తి ఆర్పీ రవిచంద్రన్ కూడా త్వరలో విడుదల కానున్నారు.

ఇప్పటికే పెరోల్‌పై ఉన్న నళిని.. తన తప్పనిసరి హాజరు నమోదు కోసం శనివారం ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం.. వెల్లూరులోని మహిళా ప్రత్యేక జైలుకు చేరుకున్నారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక.. అక్కడినుంచి విడుదలయ్యారు. తదనంతరం సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. ఇక్కడినుంచి విడుదలైన ఆమె భర్త శ్రీహరన్, సంథన్‌కు కలుసుకున్నారు. ఈ ఇద్దరు శ్రీలంక జాతీయులు కావడంతో.. పోలీసు వాహనంలో తిరుచిరాపల్లిలోని శరణార్థి శిబిరానికి తరలించారు. మరోవైపు.. పుళల్ జైలు నుంచి రాబర్ట్ పయాస్, జయకుమార్‌లు విడుదలయ్యార

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణం దిల్లీ: సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ...
09/11/2022

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణం

దిల్లీ: సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పని చేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.

*యుక్తవయసులోనే తల్లులవుతున్న బాలికలు*--- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేభారత దేశంలో 15 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాల లోపు కిషోర బాలికలు...
07/11/2022

*యుక్తవయసులోనే తల్లులవుతున్న బాలికలు*
--- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే
భారత దేశంలో 15 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాల లోపు కిషోర బాలికలు తల్లులవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇటీవల కుటుంబ ఆరోగ్య సర్వే -5లో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. టీనేజ్ తల్లులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఏపీలో 13శాతం ఉండగా, తెలంగాణా లో 5.8 శాతం యువతులు టీనేజ్ లోనే గర్భం దాల్చుతున్నారు. అందులో 20 శాతం పిల్లలు పాఠశాల విద్యకు సైతం నోచుకోవడం లేదని, పేద కుటుంబాలలోని ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. తల్లిదండ్రుల్లో అవగాహన లేమి, అధికారుల అలసత్వానికి తోడు తెలిసితెలియని వయస్సులో ఆడ పిల్లలు ఆకర్షణలకు లోనుకావడం కూడా కారణంగా చెబుతున్నారు.

*అతిమధురము* ఒక తియ్యని వేర్లు గల మొక్క Glycyrrhiza Glabra (liqcorice) Barks & root Plantఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత త...
07/11/2022

*అతిమధురము*

ఒక తియ్యని వేర్లు గల మొక్క Glycyrrhiza Glabra (liqcorice) Barks & root Plant

ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత తీయని రుచి కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో అతి మధురం అగ్రస్థానాన్ని పొందిందంటే అతిశయోక్తి కాదు. మధుయష్టి, యష్టి మధు, మధూకలాంటి వివిధ సంస్కృత నామాలతో వ్యవహరింప బడుతూ, హిందీలో ములేటిగా ప్రాచుర్యం పొందిన ఫాబేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన మొక్క ఇది. దీని శాస్త్రీయ నామం 'గ్లయిసిరైజా గ్లాబ్రా'. ఈ మొక్కపై జరిగిన అధ్యయనాల్లో ఈ మొక్కలో గ్లయిసిరైజిక్‌ ఆమ్లం, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, యాస్పిరాజిన, ఈస్ట్రోజెన్‌, స్టిరాయిడ్‌, సుగంధిత తైలం మొదలైన అంశాలున్నట్లు వెల్లడైంది. పంజాబ్‌ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అతి మధురం, గుమ్మడి, రోజు పూలు, సోపు గింజలు మొదలైన వాటితో ఒక ఔషధాన్ని రూపొం దించి, ఎలుకలపై ప్రయోగించి పరి శోధించారు. జీర్ణా శయంలోని వ్రణాన్ని మార్చడమే కాక, ఇతర ఆధునిక ఔషధాలతోపాటు దీనిని కూడా వాడటం వల్ల ఆ వ్రణం మానే ప్రక్రియ శీఘ్రతరమైనట్లు గుర్తించారు. అలాగే ఆధునిక ఔషధాల దుష్పరిణామాలు తగ్గడాన్ని కూడా గుర్తించారు.

అతి మధుర చూర్ణంలో సగభాగం వచ చూర్ణం కలిపి పూటకు పావు స్పూను వంతున మూడు పూటుల తగినంత తేనెతో కలిపి తీసుకుంటే వివిధ రకాలైన దగ్గులు తగ్గుతాయి.

అతిమధురం, అశ్వగంధ, శుంఠి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, అరస్పూను నుంచి ఒక స్పూను వరకూ అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, ఒంట్లో నీరసం తగ్గి హుషారుగా ఉంటారు.
సోపు గింజల చూర్ణానికి రెట్టింపు అతి మధురం, పటికబెల్లం కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.

అతి మధుర చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూను వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో స్తన్యవృద్ధి జరుగుతుంది. బియ్యం కడుగు నీళ్లతో సేవిస్తే నోరు, ముక్కు మొదలైన భాగాలనుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి. జీర్ణాశయ, గర్భాశయ, శ్వాసకోశ వ్యాధులకు వాడే ఔషధాల్లో అతి మధురాన్ని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు.

అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పిపళ్లు, చిగుళ్లనుంచి రక్తస్రావం, నోటి పుళ్లు, నోటి దుర్వాసన తగ్గుతాయి.

అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్ష సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని, రోజూ రెండుసార్లు పూటకు పది గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గు తాయి. రుతురక్తం సక్రమంగా పద్ధతిలో, సరైన ప్రమాణంలో వెలువడుతుంది. అధిక రుతుస్రావం తగ్గు తుంది. సుఖ ప్రధమైన నిద్ర కలుగుతుంది.

అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక స్పూను వంతుగా రోజూ రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే మనో వ్యాకులత తగ్గి మనో నిబ్బరం, మానసిక ప్రశాంతత, మానసిక ఉత్తేజం కలుగుతాయి.
అతి మధుర చూర్ణాన్ని గాయాలు, వ్రణాలు, పుళ్లపై చల్లుతుంటే రక్తస్రావం తగ్గి శీఘ్రంగా మానుతాయి.

అతి మధురం, కరక, తాని, ఉసిరిక చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే నేత్ర దోషాలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది.

అతి మధురం, సరస్వతిఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావుస్పూను నుంచి స్పూను వరకూ మోతాదుగా అరకప్పు పాలతో సేవిస్తుంటే మెదడుపై ప్రభావం చూపి మతి మరుపు తగ్గి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

* దీర్గాయుష్షుకి, ముసలితనం త్వరగా రాకుండా ఉండుటకు యష్టిమధూకం చూర్ణం ఒక స్పూన్ ప్రతినిత్యం పాలతో కలిపి తాగుచుండవలెను.

* గుండె ప్రదేశములో అయినను మర్మావయవముల ప్రదేశాలలో దెబ్బలు తగిలినప్పుడు మనిషి రోజురోజుకి మనిషి క్షీణించిపోవును. అటువంటి సమయాలలో శొంఠి , యష్టిమధుకం సమానంగా తీసుకుని కషాయం చేసుకుని తాగినను, లేదా పాలతో కలిపి తాగుచున్న శరీరం క్షీణించునట ఆగిపోవును.

* గర్భిణి గర్భము నందలి శిశువు ఎదగకుండా ఉన్నచో పాలల్లో యష్టిమధుకం , నేలగుమ్మడి చూర్ణం కలకండ కలిపి తాగుచున్న శుష్కించి ఉన్న గర్బం వృద్ధినొందుతూ గర్భములోని శిశువు ఎదుగును.

* శరీరంలో వాతం పెరిగి రక్తము నందు దోషం కలుగ చేయును . ఈ విధమైన రక్తదోషం వల్ల అరచేతులు , అరికాళ్లలో నల్లటి మచ్చలు ఏర్పడి తిమ్మిరి , పోట్లు కలుగును.

* పాండురోగముతో బాధపడువారు యష్టిమధూక చూర్ణమును గాని కషాయమును గాని తేనెతో కలిపి తాగుచున్న పాండురోగం నివర్తించును.

* అంగము నుండి కాని ఆసనము నుంచి రక్తం పడుచున్నచో యష్టిమధుకం మరియు తేనె కలిపి లొపలికి ఇచ్చి వాంతి చేయించవలెను .

* రక్తముతో కూడిన వాంతులు అవుచున్న యష్టిమధుకం , మంచిగంధం పాలతో మెత్తగా నూరి ఆ ముద్ద పాలతో కలిపి లోపలికి ఇచ్చిన రక్తవాంతి కట్టును .

*🌴 మన ఆరోగ్యం 🌴*
*ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నాకు 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*

*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & గ్రూప్స్ లో షేర్ చెయ్యండి , మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*

* నరికినప్పుడు ఏర్పడే దెబ్బ తగిలినప్పుడు యష్టిమధుకం యొక్క కషాయంతో దెబ్బని కడిగి వేడి నేతితో యష్టిమధుకం చూర్ణమును మెత్తగా ఉడికించి దెబ్బపై కట్టవలెను.

* మూత్రం బంధించినప్పుడు యష్టిమధుకం , ద్రాక్షాపండ్లు కలిపి నూరి పాలతో కలిపి తాగించిన వాతం కిందికి ప్రసరించి మూత్రాన్ని జారిచేయును .

* గొంతులో కఫం అడ్డుపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుచున్నప్పుడు యష్టిమధుకం నోట్లో వేసుకొని చప్పరించుచూ రసం మింగుచున్న కఫం కరిగి ద్రవరూపంలో మారును . ఊపిరి అందని శ్వాసరోగమున శ్వాస మార్గమును మెత్తపరిచి శ్వాస సరిగ్గా ఆడునట్లు చేయును .

* కడుపులో అల్సర్లు వల్ల కడుపులో మంట వస్తున్నచో యష్టిమధూకం చూర్ణం పొడిని మూడు గ్రాములు నీటిలో కలిపి రెండుపూటలా సేవించుచున్న కడుపులో మంట తగ్గును.

* దగ్గు విపరీతంగా వస్తున్నపుడు యష్టిమధూకం చూర్ణం , తేనె కలిపి ఉండలుగా చేసి నోటి యందు ఉంచుకుని కొద్దికొద్దిగా రసాన్ని మింగుచున్న ఎటువంటి దగ్గులు అయినా తగ్గును. పొగ తాగడం వలన వచ్చే దగ్గుకి అద్భుతంగా పనిచేయును .

* జ్వరం వచ్చు సమయంలో అతిమధుర చూర్ణం పాలతో గాని తేనెతో గాని సేవించుచున్న అన్ని రకాల జ్వరాలు నివారణ అగును.

* ఎక్కిళ్లు ఆగకుండా వచ్చు సమయంలో అతిమధురం చూర్ణం రెండు టీస్పూనులు , అర స్పూన్ తేనె కలిపి సేవించుచున్న ఎలాంటి ఎక్కిళ్లు అయినా తగ్గిపోవును .

* వేడి శరీరం కలవారికి ఈ అతిమధుర చూర్ణం వాడటం వలన చలవ చేసి వేడివలన వచ్చు సమస్యలు నివారణ అగును.

యష్టిమధుకం మొక్కలో ప్రధానంగా వేరుని ఔషధాల కొరకు ఉపయోగిస్తారు .

*🌴 మన ఆరోగ్యం 🌴*
*ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నాకు 9849894906 SMS చెయ్యండి. ఆయుర్వేద వైద్యుల ద్వారా సలహాలు సూచనలు ఫోన్ & SMS ద్వారా గాని తెలియ పరుస్తాను,మీ వివరాలు గోప్యముగా ఉంచడం మా విధి*

*ఈ ఆయుర్వేద సమాచారం మీ స్నేహితులకు & గ్రూప్స్ లో షేర్ చెయ్యండి , మీ వంతుగా అనేకమందికి మేలు చేసినవారౌతారు.*

AP News:పునఃప్రారంభమైన పాపికొండల విహారయాత్ర..అల్లూరి సీతారామరాజు జిల్లా: వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల...
06/11/2022

AP News:పునఃప్రారంభమైన పాపికొండల విహారయాత్ర..

అల్లూరి సీతారామరాజు జిల్లా: వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఆదివారం తిరిగి పునఃప్రారంభమైంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా: వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఆదివారం తిరిగి పునఃప్రారంభమైంది. అధికారులు అనుమతి ఇచ్చారని ఏపీ టూరిజం టోటింగ్ అసిస్టెంట్ మేనేజర్ గంగబాబు ఈ మేరకు తెలిపారు. గండిపోశమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పర్యాటక బోట్లలో 106 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. గోదావరి నదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి కలుగుతుంది..

Address

Eluru

Telephone

+919985787184

Website

Alerts

Be the first to know and let us send you an email when SUHAN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share