Amrutha godavari-municipal magazine

Amrutha godavari-municipal magazine VISION-VOICE-VALUES

సుందరవణంగా భీమవరం..భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకుంటున్నట్లు భీమవరం మునిసిపల్ కమీషనర్ ...
03/10/2023

సుందరవణంగా భీమవరం..

భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకుంటున్నట్లు భీమవరం మునిసిపల్ కమీషనర్ M. శ్యామల అన్నారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘం నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రెటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకోవాలని సూచించారు.భీమవరం పురపాలక సంఘం అన్ని వార్డ్ లకు సంబందించిన పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని, వర్క్ ఆర్డర్ లు ఇఛ్చి పనులు ప్రారంభం కానివి వెంటనే మొదలు పెట్టాలని, అదేవిధముగా Property Tax, Water Tax బకాయిలు వసూలు చేయడం, ట్యాక్స్ “Enhancement” చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ తో పాటు ME పి.త్రినాథ్ రావు, ACP పి.గౌరు, Dyee కె. అప్పలరాజు, Dyee శ్రీనివాస్,రెహమన్, AE లు మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నగర పాలక సంస్థ కొనసాగిన సమస్యాత్మక బోర్డ్ ల తొలగింపు-కమిషనర్ కీర్తి చేకూరిగుంటూరు : రోడ్ల వెంబడి వాహనాలు, ప్రజల రాకపోకలక...
03/10/2023

నగర పాలక సంస్థ కొనసాగిన సమస్యాత్మక బోర్డ్ ల తొలగింపు-కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు : రోడ్ల వెంబడి వాహనాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్ ల తొలగింపు రెండో రోజు కొనసాగిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కూడా నగరంలో రోడ్ల వెంబడి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రకటనల బోర్డ్ లను పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ కాంగ్రెస్ నిబందనల మేరకు నగరంలో రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ప్రధాన రహదారుల వెంబడి వాహనదారులకు అసౌకర్యంగా ఉండే హోర్డింగ్స్ లను తొలగించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం పొన్నూరు రోడ్, గడ్డిపాడు చెరువు, మంగళగిరి రోడ్, కలెక్టర్ బంగ్లా రోడ్, చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్ ల వద్ద ఉన్న బోర్డ్ లను తొలగించామన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బందికరంగా ఉన్న బోర్డ్ ల తొలగింపుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ సిటి ప్లానర్లు బాబురావు, అజయ్ కుమార్, మురళి, టిపిఎస్ లు, టిపిబిఓ లు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

GMC
23/12/2022

GMC

సామర్లకోట పురపాలక సంఘానికి మినిస్టీరియల్ ఉద్యోగుల నూతన కమిటీ
23/12/2022

సామర్లకోట పురపాలక సంఘానికి మినిస్టీరియల్ ఉద్యోగుల నూతన కమిటీ

22/12/2022
యూజర్ చార్జీల వసూళ్లలో మంచి ప్రగతి*నాలుగు వారాల్లో రూ 50 లక్షల వసూలుకాకినాడ నగరపాలక సంస్థ, సచివాలయ కార్యదర్శులు, ప్రత్యే...
22/12/2022

యూజర్ చార్జీల వసూళ్లలో మంచి ప్రగతి
*నాలుగు వారాల్లో రూ 50 లక్షల వసూలు

కాకినాడ నగరపాలక సంస్థ, సచివాలయ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, వాలంటీర్ల సమిష్టి కృషి వల్ల యూజర్ చార్జీల వసూళ్ళ లో కాకినాడ రాష్ట్రంలోనే ఉత్తమ స్థానంలో నిలిచిందని కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. వారానికి ఒక్కరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టి గడచిన నాలుగు వారాల్లో రూ 50 లక్షలు వసూలు చేయగలిగామన్నారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలందించే క్రమంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 107 హూపర్ టిప్పర్ వాహనాలను సమకూర్చి, ఇంటింటికి మూడు రకాల డస్ట్ బిన్ లను కూడా అందించమన్నారు. డిమాండ్ రూ 70 లక్షల ఉన్నప్పటికీ వాహనాల నిర్వహణకు ప్రతినెల సుమారు రూ.57 లక్షల ఖర్చు అవుతుందన్నారు. నెలలో అత్యధిక రోజులు యూజర్ చార్జీల వసూళ్ల కోసం పనిచేయడం వల్ల ఇతర సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ సూచన మేరకు ప్రతి బుధవారం యూజర్ చార్జీలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించమన్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే సంబంధిత అధికారులు సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తోందన్నారు. బుధవారం చేసిన స్పెషల్ డ్రైవ్ వల్ల ఒక్కరోజులో రూ.16 లక్షల వసూలు చేయగలిగామన్నారు. రాష్ట్రంలోని మరే ఇతర నగరపాలక సంస్థల్లో లేని విధంగా చేపడుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల ఇక్కడి వాహనాల నిర్వహణకు అవసరమయ్యే సొమ్ము నాలుగు రోజుల్లో వసూలు చేయగలుగుతున్నామన్నారు. ఈ విధానం వల్ల వారంలో ఒకరోజు యూజర్ చార్జీలకు కేటాయించడం, మిగిలిన రోజుల్లో నిర్దేశించిన సేవలను కొనసాగించేందుకు వీలవుతుందన్నారు. వసూళ్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ సత్తెప్ప నాయుడు ఒక్కరోజులో అత్యధికంగా రూ రెండు లక్షలు వసూలు చేశారన్నారు.యూజర్ చార్జీలను సమర్థవంతంగా వసూలు చేయడంలో పర్యవేక్షిస్తున్న ఎమ్ హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిని ఏడిసి నాగ నరసింహారావు అభినందించారు.

పౌర సేవలపై అభిప్రాయాలు చెప్పండి -ర్యాంకింగ్ లో కాకినాడను అగ్రస్థానంలో నిలపండి-  కాకినాడ కమిషనర్ రమేష్ ప్రభుత్వ, నగరపాలక ...
22/12/2022

పౌర సేవలపై అభిప్రాయాలు చెప్పండి

-ర్యాంకింగ్ లో కాకినాడను అగ్రస్థానంలో నిలపండి
- కాకినాడ కమిషనర్ రమేష్

ప్రభుత్వ, నగరపాలక సంస్థ పరంగా అందిస్తున్న పౌర సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కార్పొరేషన్ కమిషనర్ కే. రమేష్ కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ అంశంపై సర్వే జరుగుతోoదన్నారు. సర్వేకు సంబంధించి కార్పొరేషన్,స్మార్ట్ సిటీ అధికారులతో ఈ అంశం పై గురువారం తన చాంబర్లో చర్చించారు. కాకినాడ నగరంలో విద్యుత్, మంచినీటి నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యా, వసతులు, ప్రజా రవాణా, ఆరోగ్య సేవలు,కాలుష్యం, ఆహ్లాదకర వాతావరణం, వంటి 17 అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం EOL2022. Org వెబ్సైట్ ద్వారా కాకినాడ ULB కోడ్ 802599 వినియోగించి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ( అత్యంత నివాసయోగ్య నగరం ) లో కాకినాడ నగరం గతంలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచిందని, ఈసారి కూడా ఉన్నత స్థానంలో నిలిచేలా ప్రజలంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఈ విషయంలో అన్ని వర్గాలకు చెందిన పౌరులు, విద్యార్థులు ముందుకు వచ్చి పౌర సేవలపై నిర్ణయాన్ని తెలియజేయాలని సూచించారు.

గుంటూరు నగరానికి కొత్త కాంతులు *పాత ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో నూతన 180 వాట్స్ సామర్ధ్యంగల లూమినర్స్ *కమిషనర్ కీర్తి చ...
22/12/2022

గుంటూరు నగరానికి కొత్త కాంతులు
*పాత ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో నూతన 180 వాట్స్ సామర్ధ్యంగల లూమినర్స్
*కమిషనర్ కీర్తి చేకూరి
నగరంలో ప్రధాన రహదారుల్లో మెరుగైన లైటింగ్ ఉండేలా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి మణిపురం వంతెన వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న 135 వాట్స్ సెంట్రల్ మీడియన్స్ ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో 180 వాట్స్ లూమినర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జనాభా దృష్ట్యా రాత్రి వేళల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించుటలో భాగంగా వీధి దీపాల సామర్ధ్యాన్ని పెంచి, మెరుగైన కాంతివంతమైన రహదారులను అందించుటకు జిఎంసి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. మహా నగరపాలక సంస్థల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధానంను జిఎంసిలో అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుతం మంచు కురవడం వలన వీధి దీపాల లైటింగ్ సరిపోక వాహనదార్లు ఇబ్బంది పడుతుండటం గమనించి, మెరుగైన లైటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అందులో భాగంగా తొలివిడతగా ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి మణిపురం వంతెన వరకు 135 వాట్స్ తో ఉన్న 26 లూమినర్స్ స్థానంలో నూతనంగా 180 వాట్స్ కెపాసిటి లూమినర్స్ ని ఏర్పాటు చేశారన్నారు. దశల వారీగా నగరంలో ప్రధాన రహదారుల్లో కూడా వీధి దీపాల లూమినర్స్ కెపాసిటి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్ణీత వ్యవధిలో ‘స్పందన’ పరిష్కారం* కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేష్‌కాకినాడ,19 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ని...
19/12/2022

నిర్ణీత వ్యవధిలో ‘స్పందన’ పరిష్కారం
* కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేష్‌

కాకినాడ,19 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కమిషనర్‌ వినతులు స్వీకరించారు. పారిశుద్ధ్యం, వీధిలైట్లు, మంచినీరు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన, కోర్టులలో ఉన్న అంశాలు మినహా ప్రతీ ఒక్క ఆర్జీకి నాణ్యమైన పరిష్కారాన్ని అందించడమే లక్ష్యమన్నారు. స్థానికంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే లక్ష్యంతోప్రభుత్వం ప్రతీ వారం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆయా దరఖాస్తులు, ఫిర్యాదులను వేగవంగంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా విభాగాధిపతులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ కర్రిసత్యనారాయణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛత కోసం స్వచ్చందంగా పని చేద్దాంనగర మేయర్ మహమ్మద్ వసీంఅనంతపురం.18:స్వచ్ఛత కోసం స్వచ్చందంగా పని చేద్దామని నగరవాసులకు ...
18/12/2022

స్వచ్ఛత కోసం స్వచ్చందంగా పని చేద్దాం

నగర మేయర్ మహమ్మద్ వసీం

అనంతపురం.18:స్వచ్ఛత కోసం స్వచ్చందంగా పని చేద్దామని నగరవాసులకు నగర మేయర్ మహమ్మద్ వసీం పిలుపునిచ్చారు. క్లాప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని టవర్ క్లాక్ వద్ద విద్యార్థులు, ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్ రెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ అందరి సహకారంతోనే నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందనన్నారు.నగరంలో స్వచ్ఛత సాధన కోసం మహిళలు చెత్తను చెత్త బండి వచ్చినప్పుడు అందులోనే వేయాలని చెత్తను ఎక్కడపడితే వేయొద్దని సూచించారు.తడి చెత్త పొడి చెత్త ను వేరువేరు చేసి ఇంటి వద్దకే చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు సూచించారు.అందరి సహకారంతో నగరాన్ని స్వచ్ఛ అనంత గా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టవర్ క్లాక్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ నెల  18 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను భీమవం పట్టణంలో నిర్వహించుచున్నారు. పట్టణంలో 2...
18/12/2022

క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ నెల 18 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను భీమవం పట్టణంలో నిర్వహించుచున్నారు. పట్టణంలో 20వ వార్డు పరిధిలో స్పెషల్ ఆఫీసర్ కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వలంటీర్లు, ఎస్ హెచ్ జీలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చెత్తను. తడి, పొడి, ప్రమాదకర వ్యర్ధాలు గా వేరూ చేసి- మూడు రంగుల బిన్స్ లో క్లాప్ వెహికల్ కు
అందించాలని కోరారు. హోమ్ కంపోస్టింగ్,ఆన్ సైట్ వేస్ట్ ట్రీట్మెంట్ , వేస్ట్ మానేజ్మెంట్ వంటి తదితర అంశాలను
ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో
ఆమంచి కృష్ణ మోహన్ R.I , నీలిమ ,భరత , రామకృష్ణ , హోప్ ఎవాంజెలిన్ తదితరులు పాల్గొనారు.

19/03/2022

good municipall magazine

be alert about seasonal virus
03/07/2021

be alert about seasonal virus

Uncategorizedసీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి July 3, 2021July 3, 2021 - by AP సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

మరణం – మానవీయత
03/07/2021

మరణం – మానవీయత

BIG STORYమరణం – మానవీయత July 3, 2021July 3, 2021 - by AP మరణం – మానవీయత మృత్యువు నుంచి తప్పించుకునేందుకు పురాణాలలో ఎందరో బ్రహ్మాది దేవతల...

19/02/2021

CORPORATIONపర్యావరణ పరిరక్షణకి ప్లాస్టిక్ క్యారి బ్యాగుల స్థానంలో గుడ్డ, జనపనార సంచులను వినియోగించాలి-గుంటూరు నగర కమ...

Address

Jalarlaveedhi, Sp Steet
Bhimavaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrutha godavari-municipal magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Bhimavaram

Show All