
03/10/2023
సుందరవణంగా భీమవరం..
భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకుంటున్నట్లు భీమవరం మునిసిపల్ కమీషనర్ M. శ్యామల అన్నారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘం నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రెటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణాన్ని సుందరికారణ పట్టణంగా తీర్చిదిద్దేల చర్యలు తీసుకోవాలని సూచించారు.భీమవరం పురపాలక సంఘం అన్ని వార్డ్ లకు సంబందించిన పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని, వర్క్ ఆర్డర్ లు ఇఛ్చి పనులు ప్రారంభం కానివి వెంటనే మొదలు పెట్టాలని, అదేవిధముగా Property Tax, Water Tax బకాయిలు వసూలు చేయడం, ట్యాక్స్ “Enhancement” చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ తో పాటు ME పి.త్రినాథ్ రావు, ACP పి.గౌరు, Dyee కె. అప్పలరాజు, Dyee శ్రీనివాస్,రెహమన్, AE లు మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.